గత ప్రభుత్వంలో కాకినాడ సీ పోర్టు.. సెజ్ చేతులు మారిన సంగతి తెలిసిందే. అయితే.. తన నుంచి బలవంతంగా పోర్టును సొంతం చేసుకున్నారని.. వందల కోట్లు విలువైన ఆస్తుల్ని కారుచౌకగా కొట్టేశారంటూ అప్పట్లో ఆయన చేసిన ఫిర్యాదు పెను దుమారంగా మారటం తెలిసిందే. ఈ సీ పోర్టు.. సెజ్ వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ఫ్యామిలీకి చెందిన అరబిందో సొంతం చేసుకోవటం రాజకీయ రగడకు కారణమైంది. ఇదిలా ఉంటే..తాజాగా నెలకొన్న రాజకీయ పరిణామాలతో పాటు.. ఈడీ.. సీఐడీ పుణ్యమా అని కేవీ రావుతో ఇష్యూను సెటిల్ చేసుకోవటానికి రంగం సిద్ధమైనట్లుగా తెలుస్తోంది.
ఏపీలో అధికార బదిలీ నేపథ్యంలో చోటు చేసుకున్న రాజకీయ సమీకరణాలతో ఈ ఇష్యూ కొత్త మలుపు తీసుకున్నట్లుగా చెబుతుననారు. కర్నాటి వెంకటేవ్వరరావు నుంచి బలవంతంగా లాక్కున్నట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వేళ.. కాకినాడ సీపోర్టుతో పాటు సెజ్ ను కూడా కేవీ రావుకు తిరిగి ఇచ్చేసేందుకు వీలుగా ప్రయత్నాలు జరుగుతున్నట్లు చెబుతున్నారు. దీనికి సంబంధించిన ఒక డీల్ ఫైనల్ అయినట్లుగా తెలుస్తోంది.
కేవీ రావు ఆరోపణల ప్రకారం చూస్తే.. తనను బెదిరించి.. కేసులు పెట్టి.. జైలుకు పంపుతామంటూ ఒత్తిడి చేసి రూ.2500 కోట్ల విలువైన వాటాలను రూ.494కోట్లకు.. కాకినాడ సెజ్ లోని రూ.1109 కోట్ల విలువైన వాటాల్ని రూ.12 కోట్లకు బలవంతంగా లాక్కున్నారని.. దానిని అరబిందోకు బదలాయించారని పేర్కొన్నారు. దీనికి సంబంధించి వై విక్రాంత్ రెరడ్డి.. విజయసాయిరెడ్డి.. పి.శరత్ చంద్రారెడ్డి.. పీకేఎప్ శ్రీధర్.. సంతానం ఎల్ ఎల్పీ..అరబిందో రియాలిటీ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో పాటు డైరెక్టర్లు తదితరులు ఉన్నారు.
ఈ వ్యవహారం అంతకంతకూ ముదిరి.. చివరకు అరబిందోకు ఇబ్బందిగా మారిందన్న మాట వినిపిస్తోంది. దీంతో.. ఇరు వర్గాల మధ్య రాజీ ఒప్పందం జరిగినట్లుగా తెలుస్తోంది. తాము సొంతం చేసుకున్న సీ పోర్టు.. సెజ్ లను కేవీ రావుకు ఇచ్చేయటం.. అందుకు బదులుగా గతంలో వారు చెల్లించిన మొత్తానికి వడ్డీతో కలిపి ఇచ్చేందుకు ఒప్పుకున్నట్లుగా చెబుతున్నారు.
This post was last modified on January 22, 2025 10:49 am
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…