గత ప్రభుత్వంలో కాకినాడ సీ పోర్టు.. సెజ్ చేతులు మారిన సంగతి తెలిసిందే. అయితే.. తన నుంచి బలవంతంగా పోర్టును సొంతం చేసుకున్నారని.. వందల కోట్లు విలువైన ఆస్తుల్ని కారుచౌకగా కొట్టేశారంటూ అప్పట్లో ఆయన చేసిన ఫిర్యాదు పెను దుమారంగా మారటం తెలిసిందే. ఈ సీ పోర్టు.. సెజ్ వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ఫ్యామిలీకి చెందిన అరబిందో సొంతం చేసుకోవటం రాజకీయ రగడకు కారణమైంది. ఇదిలా ఉంటే..తాజాగా నెలకొన్న రాజకీయ పరిణామాలతో పాటు.. ఈడీ.. సీఐడీ పుణ్యమా అని కేవీ రావుతో ఇష్యూను సెటిల్ చేసుకోవటానికి రంగం సిద్ధమైనట్లుగా తెలుస్తోంది.
ఏపీలో అధికార బదిలీ నేపథ్యంలో చోటు చేసుకున్న రాజకీయ సమీకరణాలతో ఈ ఇష్యూ కొత్త మలుపు తీసుకున్నట్లుగా చెబుతుననారు. కర్నాటి వెంకటేవ్వరరావు నుంచి బలవంతంగా లాక్కున్నట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వేళ.. కాకినాడ సీపోర్టుతో పాటు సెజ్ ను కూడా కేవీ రావుకు తిరిగి ఇచ్చేసేందుకు వీలుగా ప్రయత్నాలు జరుగుతున్నట్లు చెబుతున్నారు. దీనికి సంబంధించిన ఒక డీల్ ఫైనల్ అయినట్లుగా తెలుస్తోంది.
కేవీ రావు ఆరోపణల ప్రకారం చూస్తే.. తనను బెదిరించి.. కేసులు పెట్టి.. జైలుకు పంపుతామంటూ ఒత్తిడి చేసి రూ.2500 కోట్ల విలువైన వాటాలను రూ.494కోట్లకు.. కాకినాడ సెజ్ లోని రూ.1109 కోట్ల విలువైన వాటాల్ని రూ.12 కోట్లకు బలవంతంగా లాక్కున్నారని.. దానిని అరబిందోకు బదలాయించారని పేర్కొన్నారు. దీనికి సంబంధించి వై విక్రాంత్ రెరడ్డి.. విజయసాయిరెడ్డి.. పి.శరత్ చంద్రారెడ్డి.. పీకేఎప్ శ్రీధర్.. సంతానం ఎల్ ఎల్పీ..అరబిందో రియాలిటీ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో పాటు డైరెక్టర్లు తదితరులు ఉన్నారు.
ఈ వ్యవహారం అంతకంతకూ ముదిరి.. చివరకు అరబిందోకు ఇబ్బందిగా మారిందన్న మాట వినిపిస్తోంది. దీంతో.. ఇరు వర్గాల మధ్య రాజీ ఒప్పందం జరిగినట్లుగా తెలుస్తోంది. తాము సొంతం చేసుకున్న సీ పోర్టు.. సెజ్ లను కేవీ రావుకు ఇచ్చేయటం.. అందుకు బదులుగా గతంలో వారు చెల్లించిన మొత్తానికి వడ్డీతో కలిపి ఇచ్చేందుకు ఒప్పుకున్నట్లుగా చెబుతున్నారు.
ఈ ఏడాది వేసవికి సరైన గమ్యస్థానంగా శ్రీనగర్ నిలిచింది. పెద్దగా ప్రచారం జరగనప్పటికి.. ఈసారి వేసవిలో చల్లదనాన్ని అస్వాదించేందుకు శ్రీనగర్…
నేటి యువత ప్రభుత్వాలపై తమ ఆగ్రహాన్ని పలు రకాలుగా వ్యక్తం చేస్తున్నారు. "మాకు కార్పొరేటర్ అయినా ఒకటే, సీఎం అయినా…
ఈ రోజుల్లో చెప్పిన డేటుకు సినిమాను రిలీజ్ చేసే ఫిలిం మేకర్స్ అరుదైపోయారు. ఒకప్పుడు ఎంత భారీ చిత్రాలనైనా మూడు…
గత రెండు మాసాలకు పైగా ఇంధన, గ్యాస్ సమస్యలతో ప్రపంచ దేశాలు ఉక్కిరి బిక్కిరికి గురవుతున్నాయి. చమురు ధరలు పెరిగిపోవడమే…
తెలంగాణపై మరోసారి ఏపీ డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధినేత కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో సోమవారం చేపట్టిన జాతీయ…
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో బీజేపీని మరింత బలోపేతం చేసుకునేందుకు ఆ పార్టీ అగ్ర నేతలు ప్రయత్నం చేస్తున్నారా? ప్రాంతీయ పార్టీల…