Political News

కాకినాడ పోర్టు మళ్లీ కేవీ రావు చేతికి.. డీల్ కు అరబిందో రెఢీ

గత ప్రభుత్వంలో కాకినాడ సీ పోర్టు.. సెజ్ చేతులు మారిన సంగతి తెలిసిందే. అయితే.. తన నుంచి బలవంతంగా పోర్టును సొంతం చేసుకున్నారని.. వందల కోట్లు విలువైన ఆస్తుల్ని కారుచౌకగా కొట్టేశారంటూ అప్పట్లో ఆయన చేసిన ఫిర్యాదు పెను దుమారంగా మారటం తెలిసిందే. ఈ సీ పోర్టు.. సెజ్ వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ఫ్యామిలీకి చెందిన అరబిందో సొంతం చేసుకోవటం రాజకీయ రగడకు కారణమైంది. ఇదిలా ఉంటే..తాజాగా నెలకొన్న రాజకీయ పరిణామాలతో పాటు.. ఈడీ.. సీఐడీ పుణ్యమా అని కేవీ రావుతో ఇష్యూను సెటిల్ చేసుకోవటానికి రంగం సిద్ధమైనట్లుగా తెలుస్తోంది.

ఏపీలో అధికార బదిలీ నేపథ్యంలో చోటు చేసుకున్న రాజకీయ సమీకరణాలతో ఈ ఇష్యూ కొత్త మలుపు తీసుకున్నట్లుగా చెబుతుననారు. కర్నాటి వెంకటేవ్వరరావు నుంచి బలవంతంగా లాక్కున్నట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వేళ.. కాకినాడ సీపోర్టుతో పాటు సెజ్ ను కూడా కేవీ రావుకు తిరిగి ఇచ్చేసేందుకు వీలుగా ప్రయత్నాలు జరుగుతున్నట్లు చెబుతున్నారు. దీనికి సంబంధించిన ఒక డీల్ ఫైనల్ అయినట్లుగా తెలుస్తోంది.

కేవీ రావు ఆరోపణల ప్రకారం చూస్తే.. తనను బెదిరించి.. కేసులు పెట్టి.. జైలుకు పంపుతామంటూ ఒత్తిడి చేసి రూ.2500 కోట్ల విలువైన వాటాలను రూ.494కోట్లకు.. కాకినాడ సెజ్ లోని రూ.1109 కోట్ల విలువైన వాటాల్ని రూ.12 కోట్లకు బలవంతంగా లాక్కున్నారని.. దానిని అరబిందోకు బదలాయించారని పేర్కొన్నారు. దీనికి సంబంధించి వై విక్రాంత్ రెరడ్డి.. విజయసాయిరెడ్డి.. పి.శరత్ చంద్రారెడ్డి.. పీకేఎప్ శ్రీధర్.. సంతానం ఎల్ ఎల్పీ..అరబిందో రియాలిటీ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో పాటు డైరెక్టర్లు తదితరులు ఉన్నారు.

ఈ వ్యవహారం అంతకంతకూ ముదిరి.. చివరకు అరబిందోకు ఇబ్బందిగా మారిందన్న మాట వినిపిస్తోంది. దీంతో.. ఇరు వర్గాల మధ్య రాజీ ఒప్పందం జరిగినట్లుగా తెలుస్తోంది. తాము సొంతం చేసుకున్న సీ పోర్టు.. సెజ్ లను కేవీ రావుకు ఇచ్చేయటం.. అందుకు బదులుగా గతంలో వారు చెల్లించిన మొత్తానికి వడ్డీతో కలిపి ఇచ్చేందుకు ఒప్పుకున్నట్లుగా చెబుతున్నారు.

This post was last modified on January 22, 2025 10:49 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

బీజేపీ కూటమితో విజ‌య్ క‌లుస్తారా?.. ఏం జ‌రుగుతుంది?

త‌మిళ‌నాడు ఎన్నిక‌ల్లో భారీ విజ‌యం న‌మోదు చేసుకున్న విజ‌య్ పార్టీ టీవీకే 110 స్థానాల్లో ఆధిక్యం సంపాయించింది. అయితే.. అధికారంలోకి…

13 seconds ago

‘టైగర్ తమ్ముళ్ల’ ఆశలు మళ్లీ చిగురించాయి

లోకనాయకుడు కమల్ హాసన్ తమిళనాట రాజకీయాల్లో అడుగు పెట్టి ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయారు. సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయ పార్టీ…

4 minutes ago

JD చక్రవర్తిని ఇలాగేనా వాడుకోవడం

శివలో సైడ్ విలన్ గా పరిచయమై తక్కువ టైంలో ఎక్కువ గుర్తింపు తెచ్చుకుని గులాబీ, సత్యతో సోలో హీరోగా మంచి…

11 minutes ago

విజ‌య్‌ను క‌ట్ట‌డి చేయ‌డ‌మే వాళ్ళ కొంప ముంచిందా?

త‌మిళ‌నాట జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ద‌ళ‌ప‌తి విజ‌య్ విజ‌య‌దుందుభి మోగించారు. ఏక‌ప‌క్షంగా 110 స్థానాల్లో ఆయ‌న విజ‌యం ద‌క్కించుకునే దిశ‌గా…

22 minutes ago

జాక్ పాట్ కొట్టిన జన నాయకుడు

నాలుగు నెలల క్రితం జన నాయకుడు వాయిదా పడినప్పుడు అభిమానులు తెగ కలవరపడ్డారు. సెన్సార్ వివాదాల వల్ల ఎప్పుడు వస్తుందో…

48 minutes ago

రాకెట్ లా దూసుకుపోతున్న దళపతి పార్టీ

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సోమవారం ఉదయం ప్రారంభమైంది. ఓట్ల లెక్కింపు ప్రారంభమైన తొలి గంటలో ఆసక్తికర…

1 hour ago