గత ప్రభుత్వంలో కాకినాడ సీ పోర్టు.. సెజ్ చేతులు మారిన సంగతి తెలిసిందే. అయితే.. తన నుంచి బలవంతంగా పోర్టును సొంతం చేసుకున్నారని.. వందల కోట్లు విలువైన ఆస్తుల్ని కారుచౌకగా కొట్టేశారంటూ అప్పట్లో ఆయన చేసిన ఫిర్యాదు పెను దుమారంగా మారటం తెలిసిందే. ఈ సీ పోర్టు.. సెజ్ వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ఫ్యామిలీకి చెందిన అరబిందో సొంతం చేసుకోవటం రాజకీయ రగడకు కారణమైంది. ఇదిలా ఉంటే..తాజాగా నెలకొన్న రాజకీయ పరిణామాలతో పాటు.. ఈడీ.. సీఐడీ పుణ్యమా అని కేవీ రావుతో ఇష్యూను సెటిల్ చేసుకోవటానికి రంగం సిద్ధమైనట్లుగా తెలుస్తోంది.
ఏపీలో అధికార బదిలీ నేపథ్యంలో చోటు చేసుకున్న రాజకీయ సమీకరణాలతో ఈ ఇష్యూ కొత్త మలుపు తీసుకున్నట్లుగా చెబుతుననారు. కర్నాటి వెంకటేవ్వరరావు నుంచి బలవంతంగా లాక్కున్నట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వేళ.. కాకినాడ సీపోర్టుతో పాటు సెజ్ ను కూడా కేవీ రావుకు తిరిగి ఇచ్చేసేందుకు వీలుగా ప్రయత్నాలు జరుగుతున్నట్లు చెబుతున్నారు. దీనికి సంబంధించిన ఒక డీల్ ఫైనల్ అయినట్లుగా తెలుస్తోంది.
కేవీ రావు ఆరోపణల ప్రకారం చూస్తే.. తనను బెదిరించి.. కేసులు పెట్టి.. జైలుకు పంపుతామంటూ ఒత్తిడి చేసి రూ.2500 కోట్ల విలువైన వాటాలను రూ.494కోట్లకు.. కాకినాడ సెజ్ లోని రూ.1109 కోట్ల విలువైన వాటాల్ని రూ.12 కోట్లకు బలవంతంగా లాక్కున్నారని.. దానిని అరబిందోకు బదలాయించారని పేర్కొన్నారు. దీనికి సంబంధించి వై విక్రాంత్ రెరడ్డి.. విజయసాయిరెడ్డి.. పి.శరత్ చంద్రారెడ్డి.. పీకేఎప్ శ్రీధర్.. సంతానం ఎల్ ఎల్పీ..అరబిందో రియాలిటీ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో పాటు డైరెక్టర్లు తదితరులు ఉన్నారు.
ఈ వ్యవహారం అంతకంతకూ ముదిరి.. చివరకు అరబిందోకు ఇబ్బందిగా మారిందన్న మాట వినిపిస్తోంది. దీంతో.. ఇరు వర్గాల మధ్య రాజీ ఒప్పందం జరిగినట్లుగా తెలుస్తోంది. తాము సొంతం చేసుకున్న సీ పోర్టు.. సెజ్ లను కేవీ రావుకు ఇచ్చేయటం.. అందుకు బదులుగా గతంలో వారు చెల్లించిన మొత్తానికి వడ్డీతో కలిపి ఇచ్చేందుకు ఒప్పుకున్నట్లుగా చెబుతున్నారు.
This post was last modified on January 22, 2025 10:49 am
భయపడినట్టే జరిగింది. దురంధర్ ది రివెంజ్ తెలుగు ప్రీమియర్లు క్యాన్సిలయ్యాయని ట్రేడ్ టాక్. పివిఆర్ ఐనాక్స్ లాంటి మల్టీప్లెక్సులు ఇప్పటికే…
ఓజితో పోలిస్తే ఆ స్థాయిలో బజ్ లేదు. చివరి నిమిషంలో దేవిశ్రీ ప్రసాద్ స్థానంలో తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్…
మూవీ లవర్స్ కౌంట్ డౌన్ టైమర్ పెట్టేసుకున్నారు. సాయంత్రం అయిదు గంటలు ఎప్పుడెప్పుడు అవుతుందా, దురంధర్ ది రివెంజ్ ప్రీమియర్లు…
'మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ' కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ నేత, తాండూరు మాజీ ఎమ్మె ల్యే రోహిత్రెడ్డి విషయం మాజీ…
వైసీపీ అధినేత జగన్ మరోసారి చిక్కుల్లో పడ్డారు. రాష్ట్రంలో కంటే కూడా ఉప్పుడు కేంద్రంలో ఆయనకు పెద్ద చిక్కు వచ్చింది.…
స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ ఇప్పుడంత మంచి ఫాంలో లేడు. ఆయన చివరి సినిమా ‘మిస్టర్ బచ్చన్’ పెద్ద డిజాస్టర్…