Political News

చేతులు కలిపిన ప్రత్యర్ధులు..జగన్ లెక్క సెట్టవుతుందా ?

జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ప్రత్యర్ధులిద్దరు చేతులు కలపటం బాగానే ఉంది. కానీ క్షేత్రస్ధాయిలో ఈ కలయిక వర్కవుటవుతుందా ? ఇదే ఇపుడు గన్నవరం నియోజవకర్గంలో అందరినీ తొలిచేస్తున్న ప్రశ్న. మొన్నటి జగన్ పర్యటన తర్వాత ప్రత్యర్ధులిద్దరు మళ్ళీ ఎక్కడా కలవలేదని సమాచారం.

మొన్నటి ఎన్నికల తర్వాత టీడీపీ ఎంఎల్ఏ వల్లభనేని వంశీ పార్టీ అధినేత చంద్రబాబునాయుడుపై తిరుగుబాటు లేవదీశారు. తర్వాత పార్టీకి దూరమైపోయి వైసీపీకి దగ్గరయ్యారు. నియోజకవర్గంలో సమస్యంతా ఇక్కడే మొదలైంది. ఎందుకంటే వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇన్చార్జిగా వంశీపై ఓడిపోయిన యార్లగడ్డ వెంకట్రావే చెలామణి అవుతున్నారు. ఈయన కాకుండా మరో సీనియర్ నేత దుట్టా రామచంద్రరావు కూడా ఉన్నారు.

ఎప్పుడైతే వంశీ వైసీపీకి దగ్గరగా మెలుగుతున్నారో అప్పటి నుండే యార్లగడ్డకు సమస్యలు మొదలయ్యాయి. దాంతో నియోజకవర్గంలో పెత్తనం వంశీదా లేకపోతే యార్లగడ్డదా అనే సమస్య పెరిగిపోయింది. ఈ సమయంలోనే యార్లగడ్డను జగన్ తన దగ్గరకు పిలిపించుకుని మాట్లాడారు. యార్లగడ్డకు జిల్లా సెంట్రల్ బ్యాంకు ఛైర్మన్ పదవి ఇచ్చారు. దాంతో యార్లగడ్డ సైలెంట్ అయిపోవటంతో వంశీయే వైసిపి ఎంఎల్ఏగా చెలామణి అయ్యారు.

అయితే ఊహించని రీతిలో మరో సీనియర్ నేత దుట్టా రామచంద్రరావు యాక్టివ్ అయ్యారు. దాంతో మళ్ళీ వంశీ-దుట్టా వర్గాల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఇంతలో ఏమయ్యిందో ఏమో మళ్ళీ యార్లగడ్డ కూడా వంశీకి వ్యతిరేకంగా రాజకీయాలు మొదలుపెట్టేశారు. దాంతో ఎంఎల్ఏకి ఇటు యార్లగడ్డ అటు దుట్టా వర్గాలతో సమస్యలు పెరిగిపోయాయి. వీళ్ళ ముగ్గురు వర్గాల మధ్య వివాదాలతో నియోజకవర్గంలోని పార్టీ క్యాడర్లో అయోమయం పెరిగిపోయింది. ఈ సమయంలోనే జగనన్న విద్యాకానుక కార్యక్రమంలో పాల్గొనేందుకు గన్నవరంకు సిఎ వచ్చారు. కార్యక్రమంలో హాజరైన వంశీ-యార్లగడ్డకు జగన్ దగ్గరుండి మరీ చేతులు కలిపారు. తర్వాత వంశీనే నియోజకవర్గం ఇన్చార్జిగా ప్రకటించటమే కాకుండా వంశీతో కలిసి పనిచేయాలని యార్లగడ్డ+దుట్టాకు అందరిముందు చెప్పారు.

జగన్ చేసిన సయోధ్యతో నేతలంతా ఒకటిగా పనిచేస్తారని అందరు అనుకున్నారు. అయితే జగన్ పర్యటన తర్వాత ఇదంత సులభం కాదనే విషయం అర్ధమైపోయింది. ఎందుకంటే వంశీ, యార్లగడ్డలు కలిసి పనిచేయాలంటే ఇద్దరికీ షేక్ హ్యాండ్ ఇప్పించినంత సులభం కాదు. ప్రాధమికంగా ఉన్న సమస్యేమిటంటే వంశీ, యార్లగడ్డకు ఒకరంటే ఒకరికి పడదు. మొదట్లో ఇద్దరు సన్నిహితులే అయినా తర్వాత ప్రత్యర్ధులైపోయారు. పైగా నియోజకవర్గంలోనే బలమైన మూడో నేత దుట్టా ఉండనే ఉన్నారు.

పైగా వంశీకి వ్యతిరేకంగా దుట్టా తన రాజకీయాన్ని మరింతగా స్పీడు చేయబోతున్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది. అంటే దుట్టాకు పరోక్షంగా యార్లగడ్డ సహకారం కూడా అందుతోందా ? అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఇదే నిజమైతే నియోజకవర్గంలో ఏకఛత్రాధిపత్యం వంశీ కష్టమే. సాధారణ ఎన్నికలు ఎప్పుడు జరిగినా, లేదా ఉపఎన్నికలు వచ్చినా వంశీనే వైసీపీ అభ్యర్ధి జగన్ ప్రకటించటం వరకు ఓకేనే. కానీ అందుకు నేతలంతా అంగీకరించాలి కదా. ఒకవేళ నేతలంతా అంగీకరించకపోతే మాత్రం గొడవలు అవుతునే ఉంటాయి. నియోజకవర్గంలో ఎవరి కెపాసిటి ఏమిటో, పార్టీలో ఉండేదెవరో, వెళ్ళిపోయేదెవరో తేలిపోవాలంటే ఉపఎన్నికలు రావాల్సిందే.

This post was last modified on October 16, 2020 6:17 pm

Share

Recent Posts

ప్యారడైజ్ దుస్తులకు ఖరీదు ఎక్కువే

సెప్టెంబర్ 24 విడుదల కాబోతున్న ప్యారడైజ్ కోసం అభిమానుల ఎదురు చూపుల గురించి ఎంత చెప్పినా తక్కువే. నాని కెరీర్…

1 hour ago

దర్శకుడిని దాచి పెడుతున్న దేవరాయ

ఒకపక్క టాక్సిక్ పుణ్యమాని తెలుగు, కన్నడ మూవీ లవర్స్ సోషల్ మీడియా వేదికగా ఒకరిమీద మరొకరు కామెంట్లు, ట్రోల్స్ చేసుకోవడం…

2 hours ago

అర్జున్ రెడ్డిపై వంగది ఏ రేంజ్ కాన్ఫిడెన్స్ అంటే…?

ఎలాంటి బ్యాగ్రౌండ్ లేని, రెండు మూడు చిన్న సినిమాల అనుభవం ఉన్న హీరోను పెట్టి.. ఒక డెబ్యూ డైరెక్టర్ రూ.3-4…

3 hours ago

జైలర్ వస్తున్నాడు… మరి ఆదర్శం మాటేమిటి

అక్టోబర్ 2 నుంచి ఆదర్శ కుటుంబం ఏకె ఫార్టీ సెవెన్ తప్పుకున్నాక మళ్ళీ కొత్త డేట్ ప్రకటించలేదు. ఒకవేళ జైలర్…

3 hours ago

పంజా మీద ఇంత ప్రేమ దాచుకున్నారా

ఏంటో జెన్ జీ ఆడియన్స్ మహా విచిత్రంగా ఉన్నారు. కొన్ని కొత్త సినిమాలను అస్సలు పట్టించుకోరు. కొన్ని రీ రిలీజులకేమో…

4 hours ago

పవన్ కళ్యాణ్ – ఒక జన సేవకుడి ప్రస్థానం

సినిమా నటులు ఎందరో రాజకీయ నాయకులయ్యారు. అయితే ప్రజల మనసులో బలమైన ముద్ర వేసిన వాళ్ళు మాత్రం కొందరే ఉంటారు.…

6 hours ago