వైసీపీ హయాంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిపై స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అంటూ కేసు నమోదైన సంగతి తెలిసిందే. అయితే, ఆ కేసులో చంద్రబాబు రెగ్యులర్ బెయిల్ పై బయటకు వచ్చారు. కేవలం రాజకీయ కక్షతోనే చంద్రబాబుపై కేసులు పెట్టారని టీడీపీ నేతలు ఆరోపించారు. అయితే, చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలంటూ అప్పట్లో వైసీపీ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలోనే తాజాగా ఆ పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీం కోర్టు చంద్రబాబుకు భారీ ఊరటనిచ్చింది.
చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్ ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. అంతేకాదు, పిటిషనర్ పై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసులో ఇప్పటికే చార్జిషీటు దాఖలు చేశారని, కాబట్టి బెయిల్ రద్దు పిటిషన్ లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం తేల్చి చెప్పింది. అయితే, అవసరమైన సందర్భంలో విచారణకు చంద్రబాబు సహకరించాలని ఆదేశించింది. తాజాగా సుప్రీం కోర్టు తీర్పుతో చంద్రబాబుకు భారీ ఊరట లభించినట్లయింది.
2023 నవంబరులో ఈ కేసులో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే, ఆ బెయిల్ రద్దు చేయాలంటూ అప్పటి వైసీపీ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. చంద్రబాబుపై జగన్ కక్షపూరితంగా అక్రమ కేసు పెట్టారని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత బెయిల్ పై విడుదలైన చంద్రబాబు ప్రజల మద్దతుతో అఖండ విజయం సాధించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
This post was last modified on January 16, 2025 10:13 am
గత ఏడాది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అతి పెద్ద సర్ప్రైజ్ అంటే.. ‘మహావతార నరసింహా’నే. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన…
రాష్ట్రంలో కారుణ్య నియామకాల అమలు విధానంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. నియంత్రణ లేకుండా పెరుగుతున్న ఈ…
తెలుగు సినీ పరిశ్రమలో సుదీర్ఘ కాలంగా నిర్మాతగా ఉన్నారు చదలవాడ శ్రీనివాసరావు. 90వ దశకంలోనే దివంగత నటుడు శోభన్ బాబు…
ఒక స్టార్ హీరో సినిమా ప్రారంభోత్సవం జరుగుతుంటేనో లేదా ప్రి రిలీజ్ ఈవెంట్ ఏర్పాాటు చేస్తేనో.. ఇంకో స్టార్ హీరో…
తమిళనాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమిళ భాషలో మాట్లాడి అక్కడి ప్రజలను ఆకట్టుకున్నారు. కోయంబత్తూరులో…
పెద్ద బ్యాగ్రౌండ్ లేకపోయినా.. చాలా కష్టపడి స్టార్గా ఎదిగిన నటుడు ధనుష్. అతణ్ని చూడగానే సాధారణ మధ్యతరగతి మనిషిలానే అనిపిస్తుంది…