వైసీపీ హయాంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిపై స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అంటూ కేసు నమోదైన సంగతి తెలిసిందే. అయితే, ఆ కేసులో చంద్రబాబు రెగ్యులర్ బెయిల్ పై బయటకు వచ్చారు. కేవలం రాజకీయ కక్షతోనే చంద్రబాబుపై కేసులు పెట్టారని టీడీపీ నేతలు ఆరోపించారు. అయితే, చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలంటూ అప్పట్లో వైసీపీ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలోనే తాజాగా ఆ పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీం కోర్టు చంద్రబాబుకు భారీ ఊరటనిచ్చింది.
చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్ ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. అంతేకాదు, పిటిషనర్ పై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసులో ఇప్పటికే చార్జిషీటు దాఖలు చేశారని, కాబట్టి బెయిల్ రద్దు పిటిషన్ లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం తేల్చి చెప్పింది. అయితే, అవసరమైన సందర్భంలో విచారణకు చంద్రబాబు సహకరించాలని ఆదేశించింది. తాజాగా సుప్రీం కోర్టు తీర్పుతో చంద్రబాబుకు భారీ ఊరట లభించినట్లయింది.
2023 నవంబరులో ఈ కేసులో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే, ఆ బెయిల్ రద్దు చేయాలంటూ అప్పటి వైసీపీ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. చంద్రబాబుపై జగన్ కక్షపూరితంగా అక్రమ కేసు పెట్టారని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత బెయిల్ పై విడుదలైన చంద్రబాబు ప్రజల మద్దతుతో అఖండ విజయం సాధించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
ఇటీవల సోషల్ మీడియాలో కాక్రోచ్ జనతా పార్టీ సృష్టించిన ప్రభంజనం అందరికీ తెలిసిందే. బొద్దింకల పార్టీగా ప్రారంభమై.. ఒక వైపు…
మెగా వేలంలో ఎవరూ కొనని ఒక ఆటగాడు, ఏకంగా ఒక ఫ్రాంచైజీ తలరాతనే మారుస్తాడని బహుశా ఎవరూ ఊహించి ఉండరు.…
వారణాసి విడుదల ఇంకో ఏడాది టైం ఉందని, పదే పదే మహేష్ బాబు రీ రిలీజులను క్యూ కట్టడం ఎంత…
అనుకున్నట్లే ఐపీఎల్ 2026 విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మళ్ళీ కొట్టేసింది. ఆ జట్టుకు పోటీగా ఈ సీజన్…
మాములుగా ప్రీ రిలీజ్ ఈవెంట్ల సమయంలో నిర్వాహకులు హీరోలతో పాటు దర్శక నిర్మాతల కటవుట్లు పెట్టడం కొత్త కాదు. అందరూ…
మొన్నటిదాకా టాప్ ప్రొడక్షన్ హౌస్ గా వెలిగిపోయిన యువి క్రియేషన్స్ ఇప్పుడు బయటికి చెప్పుకోలేని ఇబ్బందులతో సతమతమవుతోందట. చిన్న బడ్జెట్…