వైసీపీ హయాంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిపై స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అంటూ కేసు నమోదైన సంగతి తెలిసిందే. అయితే, ఆ కేసులో చంద్రబాబు రెగ్యులర్ బెయిల్ పై బయటకు వచ్చారు. కేవలం రాజకీయ కక్షతోనే చంద్రబాబుపై కేసులు పెట్టారని టీడీపీ నేతలు ఆరోపించారు. అయితే, చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలంటూ అప్పట్లో వైసీపీ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలోనే తాజాగా ఆ పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీం కోర్టు చంద్రబాబుకు భారీ ఊరటనిచ్చింది.
చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్ ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. అంతేకాదు, పిటిషనర్ పై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసులో ఇప్పటికే చార్జిషీటు దాఖలు చేశారని, కాబట్టి బెయిల్ రద్దు పిటిషన్ లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం తేల్చి చెప్పింది. అయితే, అవసరమైన సందర్భంలో విచారణకు చంద్రబాబు సహకరించాలని ఆదేశించింది. తాజాగా సుప్రీం కోర్టు తీర్పుతో చంద్రబాబుకు భారీ ఊరట లభించినట్లయింది.
2023 నవంబరులో ఈ కేసులో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే, ఆ బెయిల్ రద్దు చేయాలంటూ అప్పటి వైసీపీ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. చంద్రబాబుపై జగన్ కక్షపూరితంగా అక్రమ కేసు పెట్టారని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత బెయిల్ పై విడుదలైన చంద్రబాబు ప్రజల మద్దతుతో అఖండ విజయం సాధించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
This post was last modified on January 16, 2025 10:13 am
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…