వైసీపీ హయాంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిపై స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అంటూ కేసు నమోదైన సంగతి తెలిసిందే. అయితే, ఆ కేసులో చంద్రబాబు రెగ్యులర్ బెయిల్ పై బయటకు వచ్చారు. కేవలం రాజకీయ కక్షతోనే చంద్రబాబుపై కేసులు పెట్టారని టీడీపీ నేతలు ఆరోపించారు. అయితే, చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలంటూ అప్పట్లో వైసీపీ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలోనే తాజాగా ఆ పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీం కోర్టు చంద్రబాబుకు భారీ ఊరటనిచ్చింది.
చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్ ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. అంతేకాదు, పిటిషనర్ పై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసులో ఇప్పటికే చార్జిషీటు దాఖలు చేశారని, కాబట్టి బెయిల్ రద్దు పిటిషన్ లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం తేల్చి చెప్పింది. అయితే, అవసరమైన సందర్భంలో విచారణకు చంద్రబాబు సహకరించాలని ఆదేశించింది. తాజాగా సుప్రీం కోర్టు తీర్పుతో చంద్రబాబుకు భారీ ఊరట లభించినట్లయింది.
2023 నవంబరులో ఈ కేసులో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే, ఆ బెయిల్ రద్దు చేయాలంటూ అప్పటి వైసీపీ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. చంద్రబాబుపై జగన్ కక్షపూరితంగా అక్రమ కేసు పెట్టారని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత బెయిల్ పై విడుదలైన చంద్రబాబు ప్రజల మద్దతుతో అఖండ విజయం సాధించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
This post was last modified on January 16, 2025 10:13 am
నందమూరి బాలకృష్ణ, దర్శకుడు కొరటాల శివ కలయికలో తెరకెక్కబోతున్న సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. విశ్వసనీయ సమాచారం మేరకు…
పశ్చిమ బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం కొలువు తీరింది. ఉదయం 11 గంటలకు బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్లో బెంగాల్ సీఎంగా సువేందు…
ఇప్పటికే పలు వాయిదాల్లో నలిగిపోయిన సూర్య వీరభద్రుడు మే 14 విడుదల కానుంది. మొన్నటిదాకా వాయిదా పడుతుందనే ప్రచారం చెన్నై…
జనసేనాని పవన్ కళ్యాణ్ మీద గత రెండు మూడు రోజులుగా వైసీపీ మద్దతుదారులు. అనుకూల మీడియా పెడుతున్న సోషల్ మీడియా…
మేం ఫేమస్ చిత్రంతో టాలీవుడ్లోకి దూసుకొచ్చాడు యువ నటుడు సుమంత్ ప్రభాస్. షార్ట్ ఫిలిమ్స్ నేపథ్యం నుంచి వచ్చిన ఈ…
సూర్యకుమార్ యాదవ్ ఎందుకు ఉన్నాడు? శ్రేయస్ అయ్యర్ ఎందుకు లేడు? భారత టీ20 జట్టు విషయంలో చాలా రోజులుగా అభిమానులను…