Political News

అమ‌రావ‌తి రైతుల‌కు చంద్ర‌బాబు భారీ కానుక‌!

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి రైతుల‌కు సీఎం చంద్ర‌బాబు పండ‌గ పూట భారీ కానుక అందించారు. గ‌త ఏడాదిన్న‌ర‌గా నిలిచి పోయిన కౌలు సొమ్ముల‌ను వారి ఖాతాల్లో జ‌మ చేశారు. రాజ‌ధాని కోసం భూములు ఇచ్చిన రైతుల‌కు సీఆర్ డీఏ ప‌రిధిలో వాణిజ్య‌, నివాస స్థ‌లాలు ఇవ్వ‌డంతోపాటు.. రాజ‌ధాని న‌గ‌రం పూర్త‌య్యే వ‌రకు వారికి కౌలు సొమ్ము ఇస్తామ‌ని ఒప్పందం చేసుకున్నారు. ఈ నేప‌థ్యంలో 2016 నుంచి కూడా ఇక్క‌డి రైతులు కౌలు సొమ్ము అందుకుంటున్నారు.

వైసీపీ హ‌యాంలో అమ‌రావ‌తిని అట‌కెక్కించారు. ఇదేస‌మ‌యంలో ఇక్క‌డి రైతుల‌కు కూడా కౌలు నిలిపి వేశారు. అయితే.. అనేక న్యాయ పోరాటాల త‌ర్వాత‌.. హైకోర్టు ఆదేశాల‌తో అప్ప‌టి ప్ర‌భుత్వం కౌలు సొమ్ముల‌ను విడ‌త‌ల వారీగా జ‌మ చేస్తూ వ‌చ్చింది. అయితే ఎన్నిక‌ల‌కు ఏడాది ముందు నుంచి మ‌ళ్లీ మారం చేసింది.

ఇస్తాం.. చూస్తాం.. అంటూ కాలం గ‌డిపేసింది. ఇంత‌లో ఎన్నిక‌లు రావ‌డం.. కూట‌మి స‌ర్కారు కొలువు దీర‌డం తెలిసిందే. దీంతో రైతుల‌కు ఇవ్వాల్సిన బ‌కాయి కౌలు సొమ్ములపై క‌స‌ర‌త్తు చేసింది.

తాజాగా పెండింగులో ఉన్న ఏడాదిన్న‌ర కౌలు సొమ్మును మొత్తాన్ని ప్రభుత్వం చెల్లించడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పండుగ ముందు కౌలు సొమ్ముల రాక‌తో రైతులు పండ‌గ చేసుకుంటున్నారు. మ‌రోవైపు వైసీపీ హ‌యాంలో మాస్టర్ ప్లాన్‌కు విరుద్ధంగా ఆర్-5 జోన్ ఏర్పాటు చేసి.. వివిధ ప్రాంతాల్లోని వారికి ఇక్క‌డ భూములు కేటాయించారు. దీనిని కూడా అప్ప‌ట్లోనే రైతులు వ్య‌తిరేకించారు. ఇది కూడా కోర్టుల వ‌ర‌కు వెళ్లింది. దీనిపై కోర్టులు ఏమీ తేల్చ‌లేదు.

తాజాగా ఈ భూముల వ్య‌వ‌హారంపైనా కూట‌మి స‌ర్కారు నిర్ణ‌యం తీసుకుంది. ఆయా భూముల‌ను ర‌ద్దు చేస్తూ.. వాటిని తిరిగి సీఆర్ డీఏకు అప్ప‌గించింది. అదే స‌మ‌యంలో ఇక్క‌డ భూములు పొందిన పేద‌ల‌కు టిడ్కో నివాసాల‌ను కేటాయించాల‌ని నిర్ణ‌యించింది.

ఇది కూడా రాజ‌ధాని రైతుల‌కు ఆనందం క‌లిగిస్తోంది. మొత్తంగా సంక్రాంతి స‌మ‌యంలో కూట‌మి ప్ర‌భుత్వం రాజ‌ధాని రైతుల‌కు అటు సొమ్ములు, ఇటు భూముల రూపంలో కానుక‌లు అందించింద‌న్న టాక్ వినిపిస్తోంది.

This post was last modified on January 15, 2025 1:17 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

11న అసెంబ్లీ… ఆ 11 మంది వస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…

36 minutes ago

తిరుమల లడ్డు వ్యవహారం… టీటీడీ ఈవో బదిలీ?

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…

1 hour ago

నేనే ‘కింగ్’ అంటున్న దళపతి విజయ్

నిన్నటివరకు టీవీకే అధ్యక్షుడు, దళపతి విజయ్ ఎవరితో పొత్తు పెట్టుకుంటారని కేవలం తమిళనాట ప్రజలు మాత్రమే కాదు, దక్షిణ భారత…

3 hours ago

ఈ తరంలో చిరుకు నచ్చిన యంగ్ హీరో

మెగాస్టార్ చిరంజీవి అభినందన అంటే యువ నటీనటులకు ఒక సర్టిఫికెట్ లాంటిదే. ఐతే ఏదైనా ఈవెంట్లకు వచ్చినపుడు అక్కడున్న వారిని…

5 hours ago

‘అమ్మాయిలను అనుభవించడానికే సినిమాలు తీస్తున్నారు’

సినీ ప‌రిశ్ర‌మ‌లో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్ప‌లేమ‌ని సీనియ‌ర్ ద‌ర్శ‌క నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ స్ప‌ష్టం చేశారు. ఇటీవ‌ల…

11 hours ago

డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ సతీమణి

బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…

13 hours ago