బండారు సత్యనారాయణ మూర్తి..టీడీపీ సీనియర్ నాయకుడు, ఫైర్ బ్రాండ్. పైగా తూర్పుగోదావరి జిల్లాలో పేరున్న నేత. టీడీపీలో నేతలను కలుపుకొని పోయే నాయకుడిగా కూడా ఆయనకు పేరుంది. ఇటీవల టీడీపీ పార్లమెంటరీ జిల్లాల ఇంచార్జ్లను నియమించినప్పుడు.. అత్యంత కీలకమైన కాకినాడ పార్లమెంటు ఇంచార్జ్ పోస్టును బండారు కు అప్పగించింది. నిజానికి ఆయన కోరుకున్నది ఇంతకన్నా మెరుగైన పోస్టే.. అయినా.. ప్రస్తుతానికి సర్దుకుపోతున్నారు. ఇక, కాకినాడలో టీడీపీ విషయానికి వస్తే.. కేడర్ బలంగా ఉంది. ఇప్పటి వరకు మొత్తం 5 ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించింది.
టీడీపీ ఆవిర్భవించిన కొత్తలో 1984లో తొలిసారి ఇక్కడ కాంగ్రెస్ హవాకు చెక్ పెట్టి విజయం సాధించింది. ఇక, ఆ తర్వాత 1991, 1996, 1999 ఎన్నికల్లోనూ టీడీపీ ఘన విజయం సాధించింది. 2004, 2009 ఎన్నికల్లో మాత్రం వైఎస్ రాజశేఖరరెడ్డి హవాతో కాంగ్రెస్ వరుసవిజయాలు దక్కించుకుంది. తర్వాత 2014లో మరోసారి టీడీపీ విజయం దక్కించుకుంది. ఆ ఎన్నికల్లో తోట నరసింహం విజయం సాధించారు. టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా కూడా వ్యవహరించారు. అయితే, ఈయన పార్టీ కోసం పనిచేయలేదని, కేవలం పదవుల కోసమే పనిచేశారని స్థానిక టీడీపీ నేతల వాదన. పైగాఆయనకు పార్లమెంటరీ నియోజకవర్గంపై కన్నా అసెంబ్లీ రాజకీయాలంటేనే ఇష్టమని ఇక్కడ ప్రచారంలో ఉంది. గత ఏడాది ఎన్నికలకు ముందు పెద్దాపురం అసెంబ్లీ టికెట్ కోసం పట్టుబట్టి.. దక్కకపోవడంతో ఆయన వైసీపీలోకి వెళ్లిపోయారు.
ఇక, దీంతో కాకినాడ లో టీడీపీ పరిస్థితి దారుణంగా తయారైంది. గత ఎన్నికల్లో చెలమలశెట్టి సునీల్కు టికెట్ ఇచ్చినా.. ఆయన ఓడిపోయారు. ఇక, ఆ తర్వాత నుంచి ఆయన ఐపు లేకుండా పోయారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో పార్టీని పటిష్టం చేసేందుకు చంద్రబాబు వ్యూహాత్మకంగా బండారుకు ఇక్కడ బాధ్యతలు అప్పగించారు. ఈయన ఎంపికపై ఎలాంటి విమర్శలు, వివాదాలు రాలేదు. పైగా ఆయన వల్ల పార్టీ బలపడడం ఖాయమని సీనియర్లు కూడా భావిస్తున్నారు.
తాజాగా బండారు సత్యనారాయణ మూర్తి.. కాకినాడ నియోజకవర్గంపై మీటింగ్ ఏర్పాటు చేసి భవిష్యత్తును నిర్దేశించారు. రాబోయే రోజుల్లో కమిటీలు వేసి.. పార్టీని మరింత పటిష్టం చేసేలా ముందుకు సాగనున్నట్టు చెప్పారు. మొత్తానికి కాకినాడలో కేడర్ను నిలబెట్టుకునే క్రమంలో చంద్రబాబు చేసిన ప్రయోగం ఫలితాన్ని ఇస్తుందని అంటున్నారు సీనియర్లు.
This post was last modified on October 15, 2020 11:12 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…