వైకుంఠ ఏకాదశి రోజు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు టోకెన్ తీసుకోవాలని వచ్చి.. తిరుపతిలో జరిగిన తొక్కిస లాటలో ప్రాణాలు కోల్పోయిన వారిని దేవస్థానం పాలకమండలి ఆదుకుంది. ఈ ఘటనకు సంబంధించి అన్ని వైపుల నుంచి బోర్డుపై ఒత్తిళ్లు వచ్చిన విషయం తెలిసిందే.
సర్కారు తరఫున ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా క్షమాపణలు చెప్పాలని పలు మార్లు డిమాండ్ చేశారు. ఇక, సీఎం చంద్రబాబు కూడా.. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోవడం పాలక మండలి క్షమాపణలు చెప్పేందుకు, నగదు రూపంలో ఆర్థికంగా ఆదుకునేందుకు ముందుకు వచ్చింది.
శుక్రవారమే దీనిపై పాలక మండలి కొన్ని నిర్ణయాలు తీసుకుంది. ఈ క్రమంలో తాజాగా శనివారం.. కొందరు బాధితులకు టీటీడీ పాలక మండలి చైర్మన్ బీఆర్ నాయుడు పరిహారం చెక్కులు అందించారు. తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడిన తిమ్మక్క, ఈశ్వరమ్మలకు 5లక్షలను అందించారు.
వారికి సంబంధించిన పరిహారం డిమాండ్ డ్రాఫ్ట్(డీడీ)లను చైర్మన్ నాయుడు తిరుపతిలోనే స్వయంగా వారికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన “స్వల్పంగా గాయపడిన నరసమ్మ, రఘు, వెంకటేష్, గణేష్, చిన్నపాపయ్యలకు 2లక్షల రూపాయల పరిహారం అందిస్తున్నాం“ అని పేర్కొన్నారు.
సిఎం ఆదేశాల మేరకు తొక్కిసలాట ఘటన బాధితులకు పరిహారం ఇస్తున్నట్టు నాయుడు తెలిపారు. ఇక, మృతుల కుటుంబాలకు 25లక్షల రూపాయల పరిహారాన్ని టిటిడి పాలకమండలి సభ్యులు అందజేస్తారని, రెండు బృందాలుగా ఏర్పడి టిటిడి పాలకమండలి సభ్యులు మృతుల స్వస్థలాలకు వెళ్ళి డిడిలను అందజేస్తారని తెలిపారు. ఆదివారం ఉదయం బాధితుల ఇళ్లకు వెళ్లి.. ఆయా కుటుంబాలకు పరిహారం అందిస్తారు.
సర్కారు ప్రకటించిన నష్టపరిహారాన్ని చెక్కు/డీడీల రూపంలో అందిస్తారు. ఆ వెంటనే మృతి చెందిన వారి కుటుంబాల్లోని అర్హులకు కాంట్రాక్టు ప్రాతిపదికన ఉద్యోగం కల్పించే హామీ పత్రాన్ని కూడా అందిస్తారని తెలిసింది. పాలక మండలి సభ్యులు రెండు బృందాలుగా ఏర్పడి విశాఖ, నర్సీపట్నం వంటి ప్రాంతాలకు కూడా వెళ్లి ఆయా కుటుంబాలకు సాయంతో అందించనున్నారు.
నరాల్లో హార్పిక్ ఏంటి అని ఆలోచిస్తున్నారా? మీరు విన్నది నిజమే. బర్తను అకారణంగా చంపేస్తున్న భార్యల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.…
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్.. ఉరఫ్ PK .. ఈ నెల 30న జరగనున్న అసెంబ్లీ ఉప ఎన్నికలో ప్రత్యక్ష…
తమిళంలో చాలా ఏళ్ల నుంచి మంచి మంచి సినిమాలు చేస్తున్నప్పటికీ.. తెలుగమ్మాయి గుత్తా జ్వాలను పెళ్లి చేసుకోవడం ద్వారానే ఎక్కువగా తెలుగు వాళ్ల దృష్టిని ఆకర్షించాడు…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్పై కర్నూలుకు చెందిన సుగాలి ప్రీతి తల్లి పార్వతీదేవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయనపై…
వరసగా మూడు సూపర్ హిట్స్ లవ్ టుడే, డ్రాగన్, డ్యూడ్ సాధించి హ్యాట్రిక్ హీరో అనిపించుకున్న ప్రదీప్ రంగనాథన్ కి…
116 ఏళ్ల వయసులోనూ తన ఇష్ట దైవం తిరుమల శ్రేవేంకటేశ్వర స్వామి దర్శనానికి కాలి నడకన వచ్చిన వృద్ధురాలికి తిరుమల…