Political News

తిరుప‌తి తొక్కిస‌లాట: బాధితుల‌కు ప‌రిహారం అందించిన చైర్మన్

వైకుంఠ ఏకాద‌శి రోజు తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకునేందుకు టోకెన్ తీసుకోవాల‌ని వ‌చ్చి.. తిరుప‌తిలో జ‌రిగిన తొక్కిస లాట‌లో ప్రాణాలు కోల్పోయిన వారిని దేవ‌స్థానం పాల‌క‌మండ‌లి ఆదుకుంది. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి అన్ని వైపుల నుంచి బోర్డుపై ఒత్తిళ్లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే.

స‌ర్కారు త‌ర‌ఫున ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని ప‌లు మార్లు డిమాండ్ చేశారు. ఇక‌, సీఎం చంద్ర‌బాబు కూడా.. ఈ విష‌యాన్ని సీరియ‌స్‌గా తీసుకోవ‌డం పాల‌క మండ‌లి క్ష‌మాప‌ణ‌లు చెప్పేందుకు, న‌గ‌దు రూపంలో ఆర్థికంగా ఆదుకునేందుకు ముందుకు వ‌చ్చింది.

శుక్ర‌వార‌మే దీనిపై పాల‌క మండ‌లి కొన్ని నిర్ణ‌యాలు తీసుకుంది. ఈ క్ర‌మంలో తాజాగా శ‌నివారం.. కొంద‌రు బాధితుల‌కు టీటీడీ పాల‌క మండ‌లి చైర్మ‌న్ బీఆర్ నాయుడు ప‌రిహారం చెక్కులు అందించారు. తొక్కిస‌లాట‌లో తీవ్రంగా గాయపడిన తిమ్మక్క, ఈశ్వరమ్మలకు 5లక్షలను అందించారు.

వారికి సంబంధించిన ప‌రిహారం డిమాండ్ డ్రాఫ్ట్‌(డీడీ)ల‌ను చైర్మ‌న్ నాయుడు తిరుపతిలోనే స్వ‌యంగా వారికి అందజేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న “స్వల్పంగా గాయపడిన నరసమ్మ, రఘు, వెంకటేష్, గణేష్, చిన్నపాపయ్యలకు 2లక్షల రూపాయల పరిహారం అందిస్తున్నాం“ అని పేర్కొన్నారు.

సిఎం ఆదేశాల మేరకు తొక్కిసలాట ఘటన బాధితులకు పరిహారం ఇస్తున్నట్టు నాయుడు తెలిపారు. ఇక‌, మృతుల కుటుంబాలకు 25లక్షల రూపాయల పరిహారాన్ని టిటిడి పాలకమండలి సభ్యులు అందజేస్తారని, రెండు బృందాలుగా ఏర్పడి టిటిడి పాలకమండలి సభ్యులు మృతుల స్వస్థలాలకు వెళ్ళి డిడిలను అందజేస్తారని తెలిపారు. ఆదివారం ఉద‌యం బాధితుల ఇళ్ల‌కు వెళ్లి.. ఆయా కుటుంబాల‌కు ప‌రిహారం అందిస్తారు.

స‌ర్కారు ప్ర‌క‌టించిన న‌ష్ట‌ప‌రిహారాన్ని చెక్కు/డీడీల‌ రూపంలో అందిస్తారు. ఆ వెంట‌నే మృతి చెందిన వారి కుటుంబాల్లోని అర్హుల‌కు కాంట్రాక్టు ప్రాతిప‌దిక‌న ఉద్యోగం క‌ల్పించే హామీ ప‌త్రాన్ని కూడా అందిస్తారని తెలిసింది. పాల‌క మండ‌లి స‌భ్యులు రెండు బృందాలుగా ఏర్ప‌డి విశాఖ‌, న‌ర్సీప‌ట్నం వంటి ప్రాంతాల‌కు కూడా వెళ్లి ఆయా కుటుంబాల‌కు సాయంతో అందించ‌నున్నారు.

Kumar

Recent Posts

సింగ్ గీతం… జస్ట్ ఒక్క రోజు ఆలస్యం

ఈ మధ్య రిలీజ్ డేట్ ప్రకటించాక ఎంత ప్లాన్డ్ గా పనులు చేసినా చివరి నిమిషం వరకు వాయిదా ఉండదన్న…

4 hours ago

మంచి పని చేసిన దృశ్యం 3

మలయాళంలో బ్లాక్ బస్టర్ అవ్వొచ్చేమో కానీ తెలుగులో మాత్రం దృశ్యం 3ని ఫ్లాప్ గానే పరిగణించాలి. తక్కువ బిజినెస్ చేయడం…

4 hours ago

డిప్యూటీ సీఎం నోట ఫార్మ్ హౌస్ మాట

మీలాగా మేం ఫామ్ హౌస్‌లో ప‌డుకోవ‌ట్లే - అంటూ తెలంగాణ ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌.. బీఆర్ఎస్ పార్టీపై ఓ…

5 hours ago

అమ‌ర్నాథా… ఇప్పుడు కూడా రాజ‌కీయ‌మేంట‌య్యా!

స్వ‌తంత్ర దేశంలో చావు కూడా పెళ్లిలాంటిదే అన్న‌ట్టుగా వైసీపీ నాయ‌కుల‌కు ఎక్క‌డ ఎలా వ్య‌వ‌హరించాలో తెలియ‌డం లేద‌న్న విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.…

5 hours ago

మీనాక్షికి షాకిచ్చిన ఈసీ… ఏం జరిగింది?

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ కు నిజంగానే షాక్…

6 hours ago

ప‌వ‌న్‌-లోకేష్‌… బాధ్య‌త పంచుకున్నారు!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌, మంత్రి నారా లోకేష్‌లు.. కూట‌మి ప్ర‌భుత్వంలో కీల‌క రోల్ పోషిస్తున్న విష‌యం తెలిసిందే.…

7 hours ago