వైకుంఠ ఏకాదశి రోజు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు టోకెన్ తీసుకోవాలని వచ్చి.. తిరుపతిలో జరిగిన తొక్కిస లాటలో ప్రాణాలు కోల్పోయిన వారిని దేవస్థానం పాలకమండలి ఆదుకుంది. ఈ ఘటనకు సంబంధించి అన్ని వైపుల నుంచి బోర్డుపై ఒత్తిళ్లు వచ్చిన విషయం తెలిసిందే.
సర్కారు తరఫున ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా క్షమాపణలు చెప్పాలని పలు మార్లు డిమాండ్ చేశారు. ఇక, సీఎం చంద్రబాబు కూడా.. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోవడం పాలక మండలి క్షమాపణలు చెప్పేందుకు, నగదు రూపంలో ఆర్థికంగా ఆదుకునేందుకు ముందుకు వచ్చింది.
శుక్రవారమే దీనిపై పాలక మండలి కొన్ని నిర్ణయాలు తీసుకుంది. ఈ క్రమంలో తాజాగా శనివారం.. కొందరు బాధితులకు టీటీడీ పాలక మండలి చైర్మన్ బీఆర్ నాయుడు పరిహారం చెక్కులు అందించారు. తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడిన తిమ్మక్క, ఈశ్వరమ్మలకు 5లక్షలను అందించారు.
వారికి సంబంధించిన పరిహారం డిమాండ్ డ్రాఫ్ట్(డీడీ)లను చైర్మన్ నాయుడు తిరుపతిలోనే స్వయంగా వారికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన “స్వల్పంగా గాయపడిన నరసమ్మ, రఘు, వెంకటేష్, గణేష్, చిన్నపాపయ్యలకు 2లక్షల రూపాయల పరిహారం అందిస్తున్నాం“ అని పేర్కొన్నారు.
సిఎం ఆదేశాల మేరకు తొక్కిసలాట ఘటన బాధితులకు పరిహారం ఇస్తున్నట్టు నాయుడు తెలిపారు. ఇక, మృతుల కుటుంబాలకు 25లక్షల రూపాయల పరిహారాన్ని టిటిడి పాలకమండలి సభ్యులు అందజేస్తారని, రెండు బృందాలుగా ఏర్పడి టిటిడి పాలకమండలి సభ్యులు మృతుల స్వస్థలాలకు వెళ్ళి డిడిలను అందజేస్తారని తెలిపారు. ఆదివారం ఉదయం బాధితుల ఇళ్లకు వెళ్లి.. ఆయా కుటుంబాలకు పరిహారం అందిస్తారు.
సర్కారు ప్రకటించిన నష్టపరిహారాన్ని చెక్కు/డీడీల రూపంలో అందిస్తారు. ఆ వెంటనే మృతి చెందిన వారి కుటుంబాల్లోని అర్హులకు కాంట్రాక్టు ప్రాతిపదికన ఉద్యోగం కల్పించే హామీ పత్రాన్ని కూడా అందిస్తారని తెలిసింది. పాలక మండలి సభ్యులు రెండు బృందాలుగా ఏర్పడి విశాఖ, నర్సీపట్నం వంటి ప్రాంతాలకు కూడా వెళ్లి ఆయా కుటుంబాలకు సాయంతో అందించనున్నారు.
This post was last modified on January 12, 2025 11:49 am
సమస్య చిన్నదయినా, పెద్దదయినా తన దృష్టికి వస్తే పరిష్కారం కావాల్సిందేనని నిత్యం నిరూపిస్తూనే ఉన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్…
మెగా ఫ్యాన్స్ జోష్ మాములుగా లేదు. మొన్నటిదాకా తమ హీరోలు వరస డిజాస్టర్లతో సతమతమవుతున్నప్పుడు వాళ్ళు పడిన బాధ అంతా…
ఏపీ ప్రభుత్వం చేపట్టాలని భావిస్తున్న పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తున్న విషయం…
సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వందల కోట్లతో తీసిన రాజా సాబ్ కు మిశ్రమ స్పందన…
నిన్న రాత్రి నుంచి మెగాస్టార్ చిరంజీవి అభిమానుల ఉత్సాహం మామూలుగా లేదు. చిరు కొత్త సినిమా ‘మన శంకర వరప్రసాద్…
పోలవరం అత్యత్భుతమైన ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు పూర్తి అయితే దక్షిణ భారత్లో ఏ రాష్ట్రమూ మనతో పోటీ పడలేదు.. అని…