Political News

తిరుప‌తి తొక్కిస‌లాట: బాధితుల‌కు ప‌రిహారం అందించిన చైర్మన్

వైకుంఠ ఏకాద‌శి రోజు తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకునేందుకు టోకెన్ తీసుకోవాల‌ని వ‌చ్చి.. తిరుప‌తిలో జ‌రిగిన తొక్కిస లాట‌లో ప్రాణాలు కోల్పోయిన వారిని దేవ‌స్థానం పాల‌క‌మండ‌లి ఆదుకుంది. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి అన్ని వైపుల నుంచి బోర్డుపై ఒత్తిళ్లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే.

స‌ర్కారు త‌ర‌ఫున ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని ప‌లు మార్లు డిమాండ్ చేశారు. ఇక‌, సీఎం చంద్ర‌బాబు కూడా.. ఈ విష‌యాన్ని సీరియ‌స్‌గా తీసుకోవ‌డం పాల‌క మండ‌లి క్ష‌మాప‌ణ‌లు చెప్పేందుకు, న‌గ‌దు రూపంలో ఆర్థికంగా ఆదుకునేందుకు ముందుకు వ‌చ్చింది.

శుక్ర‌వార‌మే దీనిపై పాల‌క మండ‌లి కొన్ని నిర్ణ‌యాలు తీసుకుంది. ఈ క్ర‌మంలో తాజాగా శ‌నివారం.. కొంద‌రు బాధితుల‌కు టీటీడీ పాల‌క మండ‌లి చైర్మ‌న్ బీఆర్ నాయుడు ప‌రిహారం చెక్కులు అందించారు. తొక్కిస‌లాట‌లో తీవ్రంగా గాయపడిన తిమ్మక్క, ఈశ్వరమ్మలకు 5లక్షలను అందించారు.

వారికి సంబంధించిన ప‌రిహారం డిమాండ్ డ్రాఫ్ట్‌(డీడీ)ల‌ను చైర్మ‌న్ నాయుడు తిరుపతిలోనే స్వ‌యంగా వారికి అందజేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న “స్వల్పంగా గాయపడిన నరసమ్మ, రఘు, వెంకటేష్, గణేష్, చిన్నపాపయ్యలకు 2లక్షల రూపాయల పరిహారం అందిస్తున్నాం“ అని పేర్కొన్నారు.

సిఎం ఆదేశాల మేరకు తొక్కిసలాట ఘటన బాధితులకు పరిహారం ఇస్తున్నట్టు నాయుడు తెలిపారు. ఇక‌, మృతుల కుటుంబాలకు 25లక్షల రూపాయల పరిహారాన్ని టిటిడి పాలకమండలి సభ్యులు అందజేస్తారని, రెండు బృందాలుగా ఏర్పడి టిటిడి పాలకమండలి సభ్యులు మృతుల స్వస్థలాలకు వెళ్ళి డిడిలను అందజేస్తారని తెలిపారు. ఆదివారం ఉద‌యం బాధితుల ఇళ్ల‌కు వెళ్లి.. ఆయా కుటుంబాల‌కు ప‌రిహారం అందిస్తారు.

స‌ర్కారు ప్ర‌క‌టించిన న‌ష్ట‌ప‌రిహారాన్ని చెక్కు/డీడీల‌ రూపంలో అందిస్తారు. ఆ వెంట‌నే మృతి చెందిన వారి కుటుంబాల్లోని అర్హుల‌కు కాంట్రాక్టు ప్రాతిప‌దిక‌న ఉద్యోగం క‌ల్పించే హామీ ప‌త్రాన్ని కూడా అందిస్తారని తెలిసింది. పాల‌క మండ‌లి స‌భ్యులు రెండు బృందాలుగా ఏర్ప‌డి విశాఖ‌, న‌ర్సీప‌ట్నం వంటి ప్రాంతాల‌కు కూడా వెళ్లి ఆయా కుటుంబాల‌కు సాయంతో అందించ‌నున్నారు.

This post was last modified on January 12, 2025 11:49 am

Share

Recent Posts

పూర్ణ డాన్సులో రజినీకాంత్ కనిపించట్లేదు

ఎలా కనుక్కున్నారో కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ గుంటూరు కారం సినిమాలో కుర్చీ మడతపెట్టి పాట కోసం క్యారెక్టర్ ఆర్టిస్టు పూర్ణతో కొన్ని…

23 minutes ago

క‌ళ్లు చెదిరే ధ‌ర‌… రాయ‌దుర్గంలో ఎక‌రా 264 కోట్లు!

హైద‌రాబాద్ న‌గ‌రంలోని రాయ‌దుర్గం భూముల్లో కొంత భాగాన్ని ప్ర‌భుత్వం వేలం వేసింది. అయితే.. మునుపెన్న‌డూ లేని విధంగా క‌ళ్లు చెదిరే…

31 minutes ago

ఆ వివాదాస్పద ఐపీఎస్ ఇంట పెళ్లికి జగన్

హైదరాబాద్‌లో జరిగిన ఓ వివాహ వేడుకకు వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్ హాజరయ్యారు. సీనియర్ ఐపీఎస్ అధికారి…

43 minutes ago

ఆ ఒక్కటి అడగొద్దంటే ఎలా విశ్వంభరా

ప్రతి సంవత్సరం లాగే మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు ఆయన అభిమానులు హైదరాబాద్ లో ఘనంగా జరుపుకున్నారు. దీనికి మెగా…

47 minutes ago

వైసీపీ ఎంపీ అవినాష్ ఇంట్లో భారీగా డ‌బ్బు స్వాధీనం

వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు సోద‌రుడి వ‌రుస‌య్యే క‌డ‌ప ఎంపీ.. వైఎస్ అవినాష్ రెడ్డి నివాసం నుంచి ఎన్ ఫోర్స్ మెంటు…

2 hours ago

అల వైకుంఠపురములో కాదు అనంతపురములో… వైరల్

‘‘ఏమ్మా నాన్నగారు ఉన్నారా? నాన్న గారు….ఇంట్లో లేరని చెప్పమన్నారండీ….నాన్న గారు లేరని చెప్పమన్నారేంట్రా…చెయ్యి పట్టుకొని ఇక్కడికే తీసుకురాలేకపోయావా…కన్ఫ్యూజన్ లేకుండా……’’అల వైకుంఠపురములో…

3 hours ago