Political News

తప్పు జరిగిపోయింది.. ఇకపై జరగనివ్వం: బీఆర్ నాయుడు

తిరుమల తొక్కిసలాట ఘటనపై శుక్రవారం సాయంత్రం టీటీడీ అత్యవసరంగా భేటీ అయి సమీక్షించింది. ఈ సమావేశంలో భాగంగా మృతుల కుటుంబాలకు సీఎం చంద్రబాబు ప్రకటించిన పరిహారం అందజేతకు బోర్డు సూత్రప్రాయంగా ఆమోద ముద్ర వేసింది. అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేసిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తొక్కిసలాటలో చనిపోయిన వారి పేర్లను ప్రకటించిన నాయుడు…వారి కుటుంబాలకు రూ.25లక్షల చొప్పున పరిహారం అందిస్తాని తెలిపారు.

ఇక వైకుంఠ ద్వార దర్శనాలకు గతంలో మాదిరే 10 రోజుల పాటు కొనసాగిస్తారా?… లేదంటే రెండు రోజులకే పరిమితం చేస్తారా? అంటూ మీడియా ప్రతినిధులు బోర్డును ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు స్పందించిన నాయుడు… ప్రస్తుతం 10 రోజుల దర్శనాలకు సంబంధించిన ఏర్పాట్లను చేశామని… భక్తులు కూడా ఆ మేరకే ప్రణాళికలు చేసుకున్నారని తెలిపారు. ఫలితంగా ఈ ఏడాది 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలను కొనసాగిస్తామన్నారు. వచ్చే ఏడాదికి సంబందించి ఆలోగా దానిపై సమగ్రంగా సమీక్ష జరిపి… నిపుణుల అభిప్రాయాలు తీసుకుని నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు.

ఇక బోర్డు చైర్మన్ సహా మొత్తం సభ్యులంతా భక్త కోటికి క్షమాపణలు చెప్పాల్సిందేనని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా మీడియా గుర్తు చేసింది. ఈ విషయంపై నాయుడు తనదైన శైలిలో స్పందించారు. ప్రమాదం జరిగిన నేపథ్యంలో క్షమాపణలు చెప్పడంలో తప్పు లేదని పేర్కొన్న ఆయన… క్షమాపణ చెబితే పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా? అంటూ ఎదురు ప్రశ్నించారు. ఎవరో ఏదో అంటే… దానిపై స్పందించాల్సిన అవసరం తనకు లేదని కూడా ఆయన అన్నారు. ఈ దఫా తప్పు జరిగిపోయిందని… ఇకపై అలాంటి తప్పు జరగనివ్వబోమని ఆయన చెప్పారు. అంతేకాకుండా ఈ ఘటనకు బాధ్యులుగా తేలిన వారిపై మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని నాయుడు తెలిపారు.

This post was last modified on January 10, 2025 7:27 pm

Share
Show comments
Published by
Satya
Tags: BR NaiduTTD

Recent Posts

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

13 minutes ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

3 hours ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

8 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

8 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

10 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

10 hours ago