తిరుమల తొక్కిసలాట ఘటనపై శుక్రవారం సాయంత్రం టీటీడీ అత్యవసరంగా భేటీ అయి సమీక్షించింది. ఈ సమావేశంలో భాగంగా మృతుల కుటుంబాలకు సీఎం చంద్రబాబు ప్రకటించిన పరిహారం అందజేతకు బోర్డు సూత్రప్రాయంగా ఆమోద ముద్ర వేసింది. అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేసిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తొక్కిసలాటలో చనిపోయిన వారి పేర్లను ప్రకటించిన నాయుడు…వారి కుటుంబాలకు రూ.25లక్షల చొప్పున పరిహారం అందిస్తాని తెలిపారు.
ఇక వైకుంఠ ద్వార దర్శనాలకు గతంలో మాదిరే 10 రోజుల పాటు కొనసాగిస్తారా?… లేదంటే రెండు రోజులకే పరిమితం చేస్తారా? అంటూ మీడియా ప్రతినిధులు బోర్డును ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు స్పందించిన నాయుడు… ప్రస్తుతం 10 రోజుల దర్శనాలకు సంబంధించిన ఏర్పాట్లను చేశామని… భక్తులు కూడా ఆ మేరకే ప్రణాళికలు చేసుకున్నారని తెలిపారు. ఫలితంగా ఈ ఏడాది 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలను కొనసాగిస్తామన్నారు. వచ్చే ఏడాదికి సంబందించి ఆలోగా దానిపై సమగ్రంగా సమీక్ష జరిపి… నిపుణుల అభిప్రాయాలు తీసుకుని నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు.
ఇక బోర్డు చైర్మన్ సహా మొత్తం సభ్యులంతా భక్త కోటికి క్షమాపణలు చెప్పాల్సిందేనని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా మీడియా గుర్తు చేసింది. ఈ విషయంపై నాయుడు తనదైన శైలిలో స్పందించారు. ప్రమాదం జరిగిన నేపథ్యంలో క్షమాపణలు చెప్పడంలో తప్పు లేదని పేర్కొన్న ఆయన… క్షమాపణ చెబితే పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా? అంటూ ఎదురు ప్రశ్నించారు. ఎవరో ఏదో అంటే… దానిపై స్పందించాల్సిన అవసరం తనకు లేదని కూడా ఆయన అన్నారు. ఈ దఫా తప్పు జరిగిపోయిందని… ఇకపై అలాంటి తప్పు జరగనివ్వబోమని ఆయన చెప్పారు. అంతేకాకుండా ఈ ఘటనకు బాధ్యులుగా తేలిన వారిపై మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని నాయుడు తెలిపారు.
This post was last modified on January 10, 2025 7:27 pm
అనిల్ రావిపూడి సినిమాలో ఛాన్స్ అంటే తెలుగులో అంతకుమించిన బంపరాఫర్ లేదన్నట్లే. హిట్ మెషీన్గా పేరు తెచ్చుకున్న అనిల్.. ఇప్పటిదాకా…
ఏఐని వాడుకుని ఇప్పుడు హీరోయిన్ల మార్ఫింగ్ ఫొటోలు, వీడియోలతో సోషల్ మీడియా జనాలు ఎలా రెచ్చిపోతున్నారో.. ఇంటర్నెట్ ఎంత విశృంఖలంగా తయారైందో చూస్తూనే…
ఏపీకి సంబంధించి అందరూ ఎదురుచూస్తున్న ప్రాజెక్టుల్లో ఒకటి భోగాపురం ఎయిర్ పోర్టు. భారీగా చేపట్టిన ఈ విమానాశ్రయం అందుబాటులోకి వస్తే..…
ఎంత గ్యాప్ వచ్చినా పర్లేదు క్వాలిటీనే ముఖ్యమనే హీరో అడివి శేష్ కొత్త సినిమా డెకాయిట్ ఈ శుక్రవారం ఏప్రిల్…
మొన్న శుక్రవారం రిలీజైన బైకర్, రాకాస మొదటి వీకెండ్ పూర్తి చేసుకున్నాయి. నిన్న ఐపీఎల్ లో సన్ రైజర్స్, సూపర్…
ఒక పవన్ కళ్యాణ్ సినిమా ఇంత వేగంగా ఫేడవుట్ అవ్వడం ఉస్తాద్ భగత్ సింగ్ విషయంలోనే జరిగిందని చెప్పాలి. గతంలో…