తిరుమల తొక్కిసలాట ఘటనపై శుక్రవారం సాయంత్రం టీటీడీ అత్యవసరంగా భేటీ అయి సమీక్షించింది. ఈ సమావేశంలో భాగంగా మృతుల కుటుంబాలకు సీఎం చంద్రబాబు ప్రకటించిన పరిహారం అందజేతకు బోర్డు సూత్రప్రాయంగా ఆమోద ముద్ర వేసింది. అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేసిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తొక్కిసలాటలో చనిపోయిన వారి పేర్లను ప్రకటించిన నాయుడు…వారి కుటుంబాలకు రూ.25లక్షల చొప్పున పరిహారం అందిస్తాని తెలిపారు.
ఇక వైకుంఠ ద్వార దర్శనాలకు గతంలో మాదిరే 10 రోజుల పాటు కొనసాగిస్తారా?… లేదంటే రెండు రోజులకే పరిమితం చేస్తారా? అంటూ మీడియా ప్రతినిధులు బోర్డును ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు స్పందించిన నాయుడు… ప్రస్తుతం 10 రోజుల దర్శనాలకు సంబంధించిన ఏర్పాట్లను చేశామని… భక్తులు కూడా ఆ మేరకే ప్రణాళికలు చేసుకున్నారని తెలిపారు. ఫలితంగా ఈ ఏడాది 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలను కొనసాగిస్తామన్నారు. వచ్చే ఏడాదికి సంబందించి ఆలోగా దానిపై సమగ్రంగా సమీక్ష జరిపి… నిపుణుల అభిప్రాయాలు తీసుకుని నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు.
ఇక బోర్డు చైర్మన్ సహా మొత్తం సభ్యులంతా భక్త కోటికి క్షమాపణలు చెప్పాల్సిందేనని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా మీడియా గుర్తు చేసింది. ఈ విషయంపై నాయుడు తనదైన శైలిలో స్పందించారు. ప్రమాదం జరిగిన నేపథ్యంలో క్షమాపణలు చెప్పడంలో తప్పు లేదని పేర్కొన్న ఆయన… క్షమాపణ చెబితే పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా? అంటూ ఎదురు ప్రశ్నించారు. ఎవరో ఏదో అంటే… దానిపై స్పందించాల్సిన అవసరం తనకు లేదని కూడా ఆయన అన్నారు. ఈ దఫా తప్పు జరిగిపోయిందని… ఇకపై అలాంటి తప్పు జరగనివ్వబోమని ఆయన చెప్పారు. అంతేకాకుండా ఈ ఘటనకు బాధ్యులుగా తేలిన వారిపై మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని నాయుడు తెలిపారు.
This post was last modified on January 10, 2025 7:27 pm
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…