Political News

‘దొనకొండ‘ బంగారు కొండ కానుందా?

రాష్ట్రంలోని వెనుకబడ్డ ప్రాంతాల్లో ఒకటైన పల్నాడు ప్రాంతంలోని దొనకొండ పేరు కొద్ది సంవత్సరాల క్రితం వార్తల్లో ప్రముఖంగా వినిపించింది. ప్రభుత్వ భూములు, అటవీ భూములు కలిపి…దాదాపు 50 వేల ఎకరాలు భూములున్న ఈ ప్రాంతంలో నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని ఏర్పాటు కాబోతోందని గత ప్రభుత్వం హయాంలో విపరీతమైన ప్రచారం జరిగింది.

దీంతో, దొనకొండ పరిసర ప్రాంతాల్లో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. ప్రకాశం జిల్లాలో విస్తారంగా అటవీ, ప్రభుత్వ భూములు ఉన్న ఈ ప్రాంతం రాజధాని అవుతుందనుకొని భూములు కొన్నవారు….ఆ తర్వాత రాజధాని అమరావతికి తరలిపోవడంతో అందినకాడికి కొన్న భూములను అమ్ముకున్నారు. ఇక మూడు రాజధానుల నేపథ్యంలో దొనకొండ పేరు కనుమరుగైంది.

ఈ నేపథ్యంలో ఆ పేరు మరోసారి తెరపైకి వచ్చింది. రాజధానిగా ప్రచారం జరిగిన దొనకొండ….పారిశ్రామిక కారిడార్ గా రూపుదిద్దుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందులో భాగంగానే దొనకొండలో నేవీ, డిఫెన్స్, సోలార్‌ ప్రాజెక్టుల ఏర్పాటుకు జగన్ సర్కార్ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

వాస్తవానికి గత ప్రభుత్వ హయాంలోనే పారిశ్రామిక కారిడార్‌ ఏర్పాటుకు చర్చలు జరిగినా కార్యరూపం దాల్చలేదు. అయితే, ప్రస్తుతం దొనకొండలో నేవీ, డిఫెన్స్‌ కేంద్రాల ఏర్పాటు, సోలార్‌ ప్రాజెక్టుకు వైసీపీ ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. దీంతోపాటు జాతీయస్థాయి పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు జగన్ సర్కార్ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందని తెలుస్తోంది.

రైతులకు ఉచిత విద్యుత్‌ అందించేందుకు దొనకొండలో 1000 మెగా వాట్ల సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఇందు కోసం సుమారు 5 వేల ఎకరాల భూమిని సర్వేచేసి నివేదికను కూడా అధికారులు తయారుచేసినట్టు తెలుస్తోంది. దొనకొండలోని రుద్రసముద్రం, భూమనపల్లి, మంగినపూడి ప్రాంతాల్లోని పలు సర్వే నంబర్లకు సంబంధించిన భూమిని గుర్తించినట్లు తెలుస్తోంది. 4 వేల కోట్లతో ఈ ప్రాజెక్టు ఏడాదిలోనే పూర్తి చేసి మరో ఏడాది నాటికి విద్యుదుత్పత్తి చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే 10 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు లభించనుండడంతో దొనకొండ ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

This post was last modified on October 14, 2020 1:50 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఒక్క ఎపిసోడుతో హాట్ టాపిక్ అయ్యింది

ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…

19 minutes ago

బిర్యానీ రేంజులో ‘ప్యారడైజ్’ పాట

న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…

60 minutes ago

తిరుమల జీవోలపై చంద్రబాబు క్లారిటీ

తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన…

2 hours ago

శ్రీ విష్ణుకు సన్నాఫ్ సత్యమూర్తి ఇచ్చిన షాక్

చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్‌లో మంచి క్రేజ్‌తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…

3 hours ago

రాజమౌళి, మహేష్ కొట్టుకోవడమేంటయ్యా

దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కలిసి సినిమా చేయాలని వాళ్లిద్దరి అభిమానులు ఎన్నో ఏళ్ల ముందు…

3 hours ago

మున్నా మంచి స్ట్రాటజీ వాడుతున్నాడు

మాములుగా రీ రిలీజులు ఏవి ఆడతాయో ఏవి ఆడవో అంత ఈజీగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. గత ఏడాది ఖలేజాని…

4 hours ago