Political News

భ‌క్తుల‌కు చేరువ‌గా చైర్మ‌న్‌.. టీటీడీ ప్ర‌క్షాళ‌న!

తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానంలో ప్ర‌క్షాళ‌న కొన‌సాగుతూనే ఉంది. అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. భ‌క్తుల‌కు-భ‌గ‌వంతుడికి మ‌ధ్య టీటీడీ బోర్డు ఉంటుంది. ఈ విష‌యం అంద‌రికీ తెలిసిందే. అయితే.. బోర్డు చైర్మ‌న్‌గా ఉన్న వ్య‌క్తి భ‌క్తుల‌కు క‌నిపించ‌డం చాలా చాలా అరుదు.

ఏదైనా ఉత్స‌వాల స‌మ‌యంలో మాత్ర‌మే ఆయ‌న బ‌య‌ట‌కు వ‌చ్చి.. వాహ‌న‌సేవ‌లో పాల్గొని అలా వెళ్లిపోతారు. సాధార‌ణ భ‌క్తులకు క‌నిపించ‌డం కూడా చాలా క‌ష్టం. వారు వీరు అని తేడా లేదు. ఎవ‌రు ప్ర‌భుత్వంలో ఉన్నా.. టీటీడీ చైర్మ‌న్ అంటే.. శ్రీవారి కంటే గోప్యంగా వ్య‌వ‌హ‌రించ‌డం తెలిసిందే.

అలాంటిది తాజాగా నెల‌కురెండు సార్లు సాధార‌ణ భ‌క్తుల‌కు చేరువ కావాల‌న్న ల‌క్ష్యంతో ప్ర‌స్తుత టీటీడీ బోర్డు చైర్మ‌న్ బీఆర్ నాయుడు కీల‌క నిర్ణ‌యాలు అమ‌లు చేస్తున్నారు. దీనిలో భాగంగా ప్రతి నెల 5, 20 తేదీల్లో ఆయ‌న సాధార‌ణ భ‌క్తుల‌కు చేరువ అవుతున్నారు. వారి స‌మ‌స్య‌లు వింటున్నారు. వారితో నేరుగా మ‌మేకం అవుతున్నారు.

అదేస‌మ‌యంలో సాధార‌ణ భ‌క్తుల క్యూలైన్ల‌ను కూడా ప‌రిశీలిస్తున్నారు. వారికి అందుతున్న సౌక‌ర్యాలు, స‌మ‌స్య‌ల‌పై అధికారుల నుంచి కూడా వివ‌రాలు తీసుకుని.. వాటిలో కొన్ని మార్పులు, చేర్పులు కూడా చేస్తున్నారు. దీంతో టీటీడీ.. సాధార‌ణ‌ భ‌క్తుల‌కు మ‌రింత చేరువ అయింది.

ఆదివారం ఉద‌యం నుంచి సాయంత్రం వ‌ర‌కు టీటీడీ బోర్డు చైర్మ‌న్ బీఆర్ నాయుడు సాధార‌ణ భ‌క్తుల‌కు చేరువ‌గా ఉన్నారు. అఖిలాండం నుంచి సంగీత సాంస్కృతిక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించే `నాద నీరాజ‌నం`వేదిక దాకా క‌లియదిరిగారు. సాధార‌ణ భ‌క్తుల‌ను క‌లుసుకున్నారు.

అక్క‌డే కూర్చున్నారు. వారితో పిచ్చాపాటి సంభాషించారు. మెరుగైన సేవ‌ల‌పై అభిప్రాయాలు తెలుసుకున్నారు. ప‌విత్ర ల‌డ్డూ ప్ర‌సాద నాణ్య‌త‌ను, రూంలు అందుబాటులో ఉన్న వైనాన్ని..టికెట్లు ల‌భిస్తున్న తీరును ఇలా.. అనేక విష‌యాల‌ను బీఆర్ నాయుడు తెలుసుకున్నారు. మెజారిటీ సంఖ్య‌లో భ‌క్తుల‌ను ఆయ‌న క‌లుసుకోవ‌డం విశేషం.

ఇదేస‌మ‌యంలో సాధార‌ణ భ‌క్తులు ప్ర‌స్తావించిన స‌మ‌స్య‌ల‌ను ఆయ‌న అదికారుల‌కు అప్ప‌టిక‌ప్పుడే డిక్టేట్ చేసి.. న‌మోదు చేయించారు. వాటిని సాధ్య‌మైనంత వేగంగా ప‌రిష్క‌రించాల‌ని సూచించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక లడ్డూ, అన్నప్రాదాలు నాణ్యంగా రుచికరంగా ఉన్నాయని.. పరిశుభ్రత పెరిగిందని ప‌లువురు సాధార‌ణ‌ భక్తులు చైర్మ‌న్‌కు వెల్ల‌డించారు.

సేవ‌ల ప‌ట్ల సంతోషం వ్య‌క్తం చేశారు. అయితే.. శ్రీవారి ద‌ర్శ‌నం స‌మ‌యంలో త‌మ‌ను భ‌ద్ర‌తా సిబ్బంది వేగంగా లాగేస్తున్నార‌ని.. ఎన్నో క‌ష్టాల‌కు ఓర్చుకుని వ‌చ్చే త‌మ‌కు క‌నీసం ద‌ర్శ‌నం మ‌న‌స్పూర్తిగా అయ్యేలా చూడాల‌ని క‌ర్ణాట‌క‌కు చెందిన భ‌క్తులు విన్న‌వించారు.

This post was last modified on January 5, 2025 10:28 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

హిట్ ఫార్ములా నే మరో సారి నమ్ముకున్న జగన్

2029 సార్వత్రిక ఎన్నికలకు ఇంకా నాలుగేళ్లకు పైగానే సమయం ఉంది. ఆ ఎన్నికల్లో వైసీపీ గెలిస్తే తప్పించి… ఆ పార్టీ…

1 minute ago

వైసీపీలో ఒకే ఒక్క ‘కుర్రోడు’ ..!

వైసీపీలో నాయ‌కులు బ‌య‌ట‌కు రావ‌డం లేదు. ఎన్నిక‌లు పూర్త‌యి ఏడాది అయినా పెద్ద‌గా ఎవ‌రూ ముందుకు రావ‌డం లేదు. నోరు…

50 minutes ago

విజయమ్మ లాజిక్ తో జగన్ కు కఫ్టమే

వైైసీపీ అదినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆయన కన్న తల్లి విజయమ్మ నుంచే భారీ…

2 hours ago

రెడ్ బుక్ వ‌ద‌ల‌: మ‌రోసారి లోకేష్ స్ప‌ష్టం

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్‌.. రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం ప‌నిచేస్తోంద‌ని ఆరోపించిన కొన్ని గంట‌ల వ్య‌వ‌ధిలోనే టీడీపీ యువ‌నాయ‌కుడు,…

3 hours ago

క్రేజీ దర్శకుడు హీరో అయితే ఎలా

సౌత్ దర్శకుల్లో రాజమౌళి, సుకుమార్, త్రివిక్రమ్ తర్వాత అంతకన్నా తక్కువో ఎక్కువో స్టార్ డం తెచ్చుకున్న వాళ్లలో లోకేష్ కనగరాజ్…

7 hours ago

కబుర్లన్నీ చెప్పి ఇదేంటి అమీర్ సాబ్

ఇటీవలే జరిగిన ఒక ఈవెంట్ లో అమీర్ ఖాన్ మాట్లాడుతూ థియేటర్ ఓటిటి మధ్య ఇప్పుడున్న గ్యాప్ సరిపోదని నాలుగు…

10 hours ago