ఫార్ములా ఈ-రేస్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ కేసు క్వాష్ చేయాలంటూ కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించగా..ఆయనను అరెస్టు చేయవద్దని కోర్టు ఆదేశించింది. అయితే, విచారణ జరపవచ్చని ఏసీబీ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే ఈ నెల 6వ తేదీన విచారణకు హాజరు కావాలని కేటీఆర్ ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేశారు.
కేటీఆర్ పాటు హెచ్ఎండీఏ విశ్రాంత చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డి, సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ లకూ నోటీసులు జారీ అయ్యాయి. కేటీఆర్ విచారణ పూర్తయిన తర్వాత వారిని విచారణ జరపబోతున్నారని తెలుస్తోంది.
మరోవైపు, ఈ నెల 7న విచారణకు రావాలని కేటీఆర్ కు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. బీఎల్ఎన్ రెడ్డి, అరవింద్ కుమార్ లను జనవరి 2,3 తేదీల్లో విచారణకు రావాలని ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఫార్ములా-ఈ రేస్ నిర్వహణకు మంత్రి మండలి ఆమోదం లేకుండానే ఆర్బీఐ అనుమతి తీసుకోకుండానే నిధులు మళ్లించారని ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే వారిపై ఏసీబీ కేసు నమోదు చేసింది.
ఏసీబీ ఎఫ్ ఐఆర్ ఆధారంగా పీఎమ్ఎల్ చట్టం కింద ఈడీ విచారణ చేపట్టింది. బీఆర్ఎస్ హయాంలో ఫెమా నిబంధనలు ఉల్లంఘించి ఎఫ్ఈవోకు 55 కోట్లు నగదు బదిలీ అయిందని ఈడీ గుర్తించింది. ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహణలో ఆర్థికపరమైన అవకతవలు జరిగాయని ఈడీ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
This post was last modified on January 3, 2025 7:09 pm
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…