ఫార్ములా ఈ-రేస్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ కేసు క్వాష్ చేయాలంటూ కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించగా..ఆయనను అరెస్టు చేయవద్దని కోర్టు ఆదేశించింది. అయితే, విచారణ జరపవచ్చని ఏసీబీ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే ఈ నెల 6వ తేదీన విచారణకు హాజరు కావాలని కేటీఆర్ ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేశారు.
కేటీఆర్ పాటు హెచ్ఎండీఏ విశ్రాంత చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డి, సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ లకూ నోటీసులు జారీ అయ్యాయి. కేటీఆర్ విచారణ పూర్తయిన తర్వాత వారిని విచారణ జరపబోతున్నారని తెలుస్తోంది.
మరోవైపు, ఈ నెల 7న విచారణకు రావాలని కేటీఆర్ కు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. బీఎల్ఎన్ రెడ్డి, అరవింద్ కుమార్ లను జనవరి 2,3 తేదీల్లో విచారణకు రావాలని ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఫార్ములా-ఈ రేస్ నిర్వహణకు మంత్రి మండలి ఆమోదం లేకుండానే ఆర్బీఐ అనుమతి తీసుకోకుండానే నిధులు మళ్లించారని ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే వారిపై ఏసీబీ కేసు నమోదు చేసింది.
ఏసీబీ ఎఫ్ ఐఆర్ ఆధారంగా పీఎమ్ఎల్ చట్టం కింద ఈడీ విచారణ చేపట్టింది. బీఆర్ఎస్ హయాంలో ఫెమా నిబంధనలు ఉల్లంఘించి ఎఫ్ఈవోకు 55 కోట్లు నగదు బదిలీ అయిందని ఈడీ గుర్తించింది. ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహణలో ఆర్థికపరమైన అవకతవలు జరిగాయని ఈడీ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
This post was last modified on January 3, 2025 7:09 pm
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల్లో ఒకరైన కొడాలి నానికి తెలుగుదేశం అన్నా, జనసేన అన్నా ఎంత కోపమో ప్రత్యేకంగా…
హైడ్రా కూల్చివేతలపై చాలామంది ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. మరికొంత మంది మాత్రం నాలాలపై, చెరువలు…
మాస్ రాజా రవితేజ కొత్త సినిమా ఇరుముడి తెలుగు రాష్ట్రాలతో పాటు తెలుగు వాళ్లుండే ప్రతి చోటా ఇరగాడేస్తోంది. తెలుగులో…
బాక్సాఫీస్ వద్ద వీర విహారం చేస్తున్న ఇరుముడి ఎక్కడికి వెళ్తుందో ఎవరికి అంతు చిక్కడం లేదు. పాజిటివ్ టాక్ రావడంలో…
అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ కొత్త సినిమా ‘రాకా’ మొదలైనపుడే అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. సన్ పిక్చర్స్ ప్రొడక్షన్లో…
విశాఖపట్నంలో విద్యార్థులు చెలరేగిపోయారు. ప్రేమ వ్యవహారంలో రెండు గ్రూపులుగా విడిపోయి కర్రలు, రాడ్లు పట్టుకొని రోడ్డెక్కారు. సినిమా తరహాలో నడి…