Political News

ఏపిలో రాష్ట్రపతి పాలన ?

రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయా ? అవుననే అంటున్నారు వైసీపీ తిరుగుబాటు ఎంపి కనుమూరు రఘరామ కృష్ణంరాజు. మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం అనుసరిస్తున్న రాజ్యాంగ, చట్ట వ్యతిరేక విధానాలను చూస్తుంటే తనకు ఏపిలో రాష్ట్రపతి పలన విధించే అవకాశాలు దగ్గరలోనే ఉన్నట్లు అనుమానంగా ఉందన్నారు. రాష్ట్రప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగా శాసన, కార్యనిర్వహక వ్యవస్ధలను భ్రష్టుపట్టిస్తోందంటూ మండిపోయారు.

తనపై ఉన్న కేసుల నుండి తనను తాను రక్షించేకునే ప్రయత్నంలో జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నట్లు ఎంపి ఆరోపించారు. ముఖ్యమంత్రి కారణంగా రాష్ట్రంలో ఏర్పడిన పరిస్ధితులను చక్కదిద్దాలంటే ఆర్టికల్ 356 పెట్టే పరిస్దితులు దాపురిస్తున్నట్లు మండిపడ్డారు. సరే ఎంపి వ్యాఖ్యలు, ఆరోపణలను పక్కనపెట్టేస్తే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే జగన్ అంటే తిరుగుబాటు ఎంపి మండిపోతున్నారు. తనపై అనర్హత వేటు వేయాలంటూ వైసీపీలోక్ సభ స్పీకర్ కు అనర్హత పిటీషన్ ఇచ్చినప్పటి నుండి ఎంపిలో సిఎం ని విమర్శించే ఏ అంశం దొరికినా వదలడం లేదు.

ప్రతిరోజు ఏదో ఒక ప్రజా సమస్యతో తెరపైకి వచ్చి జగన్ ని నిలదీస్తున్నారు. లోక్ సభ స్పీకర్ గనుక తనపై అనర్హత వేటు వేస్తే రాజకీయంగా తనకు ఇబ్బందులు తప్పవనే ఎంపి జగన్ను టార్గెట్ గా పెట్టుకున్నట్లు వైసీపీ నేతలు ఎప్పటి నుండో ఎదురుదాడులు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగమే ఏపిలో రాష్ట్రపతి పాలనంటూ కొత్త పల్లవి అందుకున్నారంటూ వైసీపీ నేతలు కొట్టిపారేస్తున్నారు.

This post was last modified on October 13, 2020 11:11 am

Share
Show comments
Published by
Satya
Tags: JaganRRR

Recent Posts

సంక్రాంతి ఎఫెక్ట్: హైదరాబాద్ నిల్లు… విజయవాడ ఫుల్లు

సంక్రాంతి పండుగ హడావుడి మొదలవడంతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఖాళీ అవుతోంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ జాతీయ రహదారి…

1 hour ago

దెబ్బతిన్న హీరోలు vs రావిపూడి

టాలీవుడ్‌లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…

1 hour ago

తెలంగాణ జనసేన టార్గెట్ ఫిక్స్… పొత్తు ఉంటుందా పవన్ సార్?

తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్‌చార్జ్‌ శంకర్‌గౌడ్‌…

2 hours ago

లెజెండరీ ప్లేయర్లను దాటేసిన హిట్ మ్యాన్

వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…

3 hours ago

తొమ్మిదేళ్ల విక్రమ్ సినిమాకు మోక్షం ?

క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…

3 hours ago

‘అప్పుడు మహ్మద్ గజిని… ఇప్పుడు వైఎస్ జగన్’

అప్పుడు మహ్మద్‌ గజని… ఇప్పుడు వైఎస్‌ జగన్‌ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…

3 hours ago