Political News

షెల్ట‌ర్ కోస‌మే వైసీపీ నేత‌లు: చంద్ర‌బాబు

గ‌త ఏడాది జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోయిన విష‌యం తెలిసిందే. కేవ‌లం 11 స్థానాల‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మైంది. ఈ నేప‌థ్యంలో ఆ పార్టీ నుంచి ప‌లువురు నాయ‌కులు కాదు.. ఎక్కువ సంఖ్య‌లోనే నాయ‌కులు ప‌క్క‌దారి ప‌డుతున్నారు. వారి వారి రాజ‌కీయాల‌కు అనుకూలంగా నిర్ణ‌యాలు తీసుకుని.. కూట‌మి పార్టీల్లోకి చేరుతున్నారు. అయితే.. ఈ చేరిక‌ల వ్య‌వ‌హారం.. కూట‌మి పార్టీలుగా ఉన్న టీడీపీ-బీజేపీ-జ‌న‌సేన నేత‌ల మ‌ధ్య అంత‌ర్గ‌త చ‌ర్చ‌లు పెంచుతోంది. నిన్న మొన్నటి వ‌ర‌కు టీడీపీని తిట్టిపోసిన వారిని.. జ‌న‌సేన తీసుకుంటోంద‌ని ప‌లువురు వ్యాఖ్యానిస్తున్నారు.

ఇక‌, బీజేపీ కూడా వైసీపీ నేత‌లను తీసుకుంటోంద‌ని.. ఇది స‌రికాద‌ని.. టీడీపీ కీల‌క నాయ‌కుడి కుమారుడు ఇటీవ‌ల హాట్ కామెంట్లు చేశారు. ఇలాంటివారిని చేర్చుకోవాల‌ని తాము కూడా అనుకుంటే.. బీజేపీ నేత‌లు ఇబ్బందులు ప‌డ‌తార‌ని కూడా ఆ యువ నేత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అదేస‌మ‌యంలో టీడీపీలో చేరేవారిపై జ‌న‌సేన‌, జ‌న‌సేన‌లో చేరేవారిపై టీడీపీ నాయ‌కులు అంత‌ర్గ‌తంగా చిన్న‌పాటి విమ‌ర్శ‌లు చేసుకుంటున్నారు. ఈ ప‌రిణామాల‌పై తాజాగా సీఎం చంద్ర‌బాబు స్పందించారు. వైసీపీ నేత‌ల చేరిక‌ల‌పై ఆయ‌న మాట్లాడుతూ.. వారంతా “షెల్ట‌ర్” కోస‌మే పార్టీలు మారుతున్నార‌ని చెప్పారు.

వైసీపీలో ఉన్నవారు షెల్టర్ తీసుకోవడానికి ఈ మూడు పార్టీల్లోకి వస్తున్నారని చంద్ర‌బాబు అన్నారు. అయితే.. పార్టీల్లోనూ ఈ చేరిక‌ల‌పై చ‌ర్చ సాగుతోంద‌ని తెలిపారు. ఈ విష‌యంపై మూడు పార్టీలలో చర్చ జరుగుతుందని.. కూట‌మిగా ఉన్నప్పుడు ఇటు వంటివి జరుగుతుంటాయని పేర్కొన్నారు. అయితే.. చేరిక‌ల విష‌యంలో ఎవ‌రి ఇష్టం వారిదేన‌న్నారు. అయితే.. చేర్చుకునే ముందు క‌లిసి చ‌ర్చించుకుంటే బాగుంటుంద‌ని వ్యాఖ్యానించారు. కొంద‌రు షెల్ట‌ర్ కోసం వ‌స్తుంటే.. మ‌రికొంద‌రు కేసుల నుంచి త‌ప్పించుకునేందు కూడా జంప్ చేస్తున్నార‌ని తెలిపారు. ఈ విష‌యంలో కూట‌మి పార్టీలుగా తాము క‌లిసి చ‌ర్చించుకుంటామన్నారు.

కాగా.. మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో ఇటీవ‌ల వైసీపీ నేత‌లు పార్టీ మారి.. జ‌న‌సేన‌లోకి చేరారు. ముఖ్యంగా గ‌తంలో టీడీపీలోనే ఉన్న గంజి చిరంజీవి.. స‌తీమ‌ణితో క‌లిసి.. పార్టీ మారారు. ఈ వ్య‌వ‌హారం.. టీడీపీలో చర్చ‌నీయాంశం అయింది. మంత్రి నారా లోకేష్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న నియోజ‌క‌వ‌ర్గం కావ‌డం.. ఆయ‌న‌పైనే గ‌తంలో గంజి చిరంజీవి విమ‌ర్శ‌లు చేయ‌డం వంటి ప‌రిణామాల రీత్యా.. టీడీపీ నేత‌లు గుస్సాగా ఉన్నారు. ఈ ప‌రిణామాల క్ర‌మంలోనే చంద్ర‌బాబు ఈ వ్యాఖ్య‌లు చేయ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on January 2, 2025 9:26 am

Share

Recent Posts

అప్పుడు కుటుంబ పేర్లు… ఇప్పుడు వీరుల పేర్లు

భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. ఈ విమానాశ్రయాన్ని జాతికి…

29 minutes ago

హాలీవుడ్ సినిమాలకు మళ్ళీ మంచి రోజులు

ఒకప్పుడు ఇంగ్లీష్ సినిమాలకు మన దేశంలో తెగ క్రేజ్ ఉండేది. జురాసిక్ పార్క్ నుంచి ఇది విపరీతంగా పెరిగిపోయింది. దానికి…

3 hours ago

గండాన్ని దాటిన చెన్నై లవ్ స్టోరీ

గత వారం విడుదలైన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ఫుల్ పాజిటివ్ టాకేమీ తెచ్చుకోలేదు. ప్రిమియర్స్ నుంచే డివైడ్ టాక్ మొదలైంది.…

3 hours ago

మోదీ కాళ్లు కడిగి ఆ నీళ్లు తాగాలని ఉంది: నటుడు

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విష్ణుమూర్తి అవతారంగా ప్రముఖ బాలివుడ్ నటుడు సుదేష్ బెర్రీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో…

3 hours ago

కనకరాజు సీమలో కొరియన్ దెయ్యం

బలమైన కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆశలన్నీ కొరియన్ కనకరాజు మీదే ఉన్నాయి. ఆగస్ట్…

4 hours ago

“కొబ్బరికాయ కొట్టాం… గుమ్మడి కాయ కట్టాం”

ఏపీ దశ దిశలను మార్చేసే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం శనివారం ఉదయం లాంఛనంగా ప్రారంబమైంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ అల్లూరి సీతారామరాజు…

4 hours ago