తిరుమల తిరుపతి శ్రీవారి దర్శనానికి సంబంధించి ఇటీవల కాలంలో తెలంగాణ నేతల నుంచి ప్రధాన డిమాండ్ వినిపిస్తోంది. మంత్రుల నుంచి ఎమ్మెల్యేల వరకు కూడా.. అందరూ తమ సిఫార్సు లేఖలను అనుమతించాలని కోరుతున్నారు. తిరుమలకు వచ్చే తెలంగాణ భక్తులకు సౌకర్యాల కల్పనలోనూ ప్రాధాన్యం ఇవ్వాలని పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి కొండా సురేఖ సహా. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా సిఫార్సు లేఖల వ్యవహారంపై తరచుగా కామెంట్లు చేస్తున్నారు.
దీనిపై తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ ప్రజాప్రతినిధులైన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మంత్రుల నుంచి వచ్చే సిఫార్సు లేఖలను అనుమతించాలని సీఎం ఆదేశించారు. అయితే.. ఎవరి నుంచి వచ్చినా.. ఎన్ని వచ్చినా.. వారానికి నాలుగు సిఫార్సు లేఖల మేరకే దర్శనాలు కల్పించాలని తేల్చిచెప్పారు. వీటిలోనూ రెండు బ్రేక్ దర్శనాలు, రెండు రూ.300 ప్రత్యేక దర్శనాలకు పరిమితం కావాలని చంద్రబాబు సూచించారు.
ఈ మేరకు టీటీడీ పాలకమండలి చైర్మన్ బీఆర్ నాయుడుకు చంద్రబాబు స్పష్టం చేశారు. అమరావతి సచివాలయంలో ఉన్న సీఎం చంద్రబాబును బీఆర్ నాయుడు సోమవారం మధ్యాహ్నం కలుసుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ నేతల సిఫార్సు లేఖలపై ఆయనతో చర్చించారు. వారానికి నాలుగు లేఖలను మాత్రమే అనుమతించాలని ఈ సందర్భంగా సీఎం తేల్చి చెప్పారు. అదేసమయంలో మాజీ ప్రతినిధులు ఇచ్చే సిఫార్సు లేఖలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. దీంతో తెలంగాణ ప్రజాప్రతినిధుల డిమాండ్ నెరవేరినట్టయింది.
This post was last modified on December 30, 2024 3:52 pm
జనసేన పార్టీ నాయకులకు ఆ పార్టీ సీనియర్ నేత, మంత్రి నాదెండ్ల మనోహర్.. కీలక విషయాన్ని తేల్చి చెప్పారు. నేరుగా…
త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు కీలక కసరత్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…
ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…
న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…
తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన…