భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) కన్నుమూశారు. శ్వాస కోస సంబంధిత సమస్యలతో తీవ్ర అస్వస్థతకు గురైన మన్మోహన్ సింగ్ ను గురువారం సాయంత్రం చికిత్స కోసం ఢిల్లీలోని ఎయిమ్స్ కు తరలిం చారు. ఇంటెన్సివ్ కేర్ లో చికిత్స పొందుతూ ఆయన మరణించారు. మన్మోహన్ మృతి పట్ల పలువురు రాజకీయ, వ్యాపార, సినీ, క్రీడా ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. భారత దేశంలో ఆర్థిక సంస్కరణలకు తెర తీసిన గొప్ప ఆర్థిక వేత్తగా మన్మోహన్ సింగ్ కు ఖ్యాతి గడించారు.
దివంగ ప్రధాని పీవీ నరసింహారావుతో కలిసి దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపిరి పోసిన గొప్ప ఎకనమిస్ట్ మన్మోహన్ సింగ్. మన్మోహన్ సింగ్ 2004 నుంచి 2014 వరకు యూపీఏ హయాంలో భారత ప్రధానిగా పనిచేశారు. 2024లో రాజ్యసభ నుంచి పదవీ విరమణ చేశారు.
1932 సెప్టెంబర్ 26న పంజాబ్లోని (ఇప్పటి పాకిస్తాన్) గాహ్ గ్రామంలో మన్మోహన్ జన్మించారు. ఐఎంఎఫ్, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ వంటి అంతర్జాతీయ స్థాయి బాధ్యతలను నిర్వహించిన అనుభవం ఆయనకు ఉంది. ఆ తర్వాత కేంద్ర ఆర్థిక మంత్రిగా పీవీ హయాంలో పనిచేశారు.
This post was last modified on December 26, 2024 10:59 pm
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి కేవలం ఎనిమిది నెలల్లో మూడో సినిమా రాబోతోంది. గత ఏడాది రెండు నెలల…
కాదేది బూతుకు అనర్హం అన్నారో సినీ కవి. కొందరు దీన్ని నిజం చేసే పనిలో ఉన్నారు. ఇటీవలే కన్నడ ప్యాన్…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆ పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. దీనిపై ఇటీవలి…
తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు జిఓ కోసం ఎదురు చూసిన మైత్రి సంస్థకు చివరికి అది జరిగే సూచనలు లేకపోవడంతో…
'ద హండ్రెడ్' వేలంలో పాకిస్థాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ను సన్రైజర్స్ లీడ్స్ కొనుగోలు చేయడం ఊహించని వివాదానికి దారితీస్తోంది. ఈ…
రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ స్థాయిలో కూడా సంచలనంగా మారిన మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ పార్టీ వ్యవహారం…