ఫ్ఫార్ములా ఈ-రేస్ వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్పై ఏసీబీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. తనపై దాఖలైన ఏసీబీ కేసు క్వాష్ చేయాలంటూ తెలంగాణ హైకోర్టును కేటీఆర్ ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ కు హైకోర్టు భారీ ఊరటనిచ్చింది. ఈ నెల 30 వరకు కేటీఆర్ ను అరెస్ట్ చేయొద్దని ఏసీబీని ఆదేశించింది. వారం వరకు కేటీఆర్ను అరెస్ట్ చేయొద్దని హైకోర్టు తీర్పు ఇచ్చింది.
ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయాలని ఏసీబీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే, విచారణ కొనసాగించవచ్చని ఏసీబీ అధికారులకు హైకోర్టు తెలిపింది. తదుపరి విచారణ ఈనెల 27కు వాయిదా వేసింది. అంతకుముందు, ఈ కేసు విచారణ సందర్భంగా ప్రభుత్వం తరఫున న్యాయవాదులకు, కేటీఆర్ తరపున న్యాయవాదులకు వాడీవేడీ వాదనలు జరిగాయి.
ఇది అత్యవసర పిటిషన్ విచారణ కాదని, ఇందులో కేటీఆర్కు ఎలాంటి లబ్ధి చేకూరింది అని ఏజీని ప్రశ్నించిన న్యాయమూర్తి. ఎఫ్ ఈవోకు డబ్బుల చెల్లింపులో అక్రమాలు జరిగాయని ఏజీ వాదించారు.పూర్తి స్థాయిలో ఏసీబీ విచారణ జరిగితే ఎవరెవరికి ఎలాంటి లబ్ధి చేకూరిందనేది తేలుతుందని చెప్పారు.
This post was last modified on December 20, 2024 5:49 pm
మూడు రోజుల క్రితం విడుదలైన చెన్నై లవ్ స్టోరీ మొదటి వీకెండ్ ఘనంగా ముగిసింది. ఊహించిన దానికన్నా వసూళ్లు ఎక్కువే…
ఆ నలుగురు అంటే ఏదో రాజేంద్ర ప్రసాద్ సినిమా అనుకునేరు. ఇది దాని గురించి కాదు. ఇప్పుడు ఇండస్ట్రీలో కొత్త…
మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సగటు తెలుగు సినీ ప్రియులంతా ఎదురు చూస్తున్న క్రేజీ మూవీ వారణాసి. ఆర్ఆర్ఆర్…
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నుంచి వచ్చిన చివరి చిత్రం జననాయగన్ మీద అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఆ…
ఇండస్ట్రీలో ఇబ్బందులు, సమస్యలు కేవలం చిన్న నిర్మాతలకే వస్తాయనుకుంటే పొరపాటే. ఎంత చెట్టుకు అంత గాలి తరహాలో ఎవరి కష్టాలు…
నేషనల్ అవార్డుల మీద గత రెండేళ్లుగా ఎంత చర్చ జరుగుతోందో చూస్తున్నాం. ఒకప్పుడు కళాత్మక విలువలున్న సినిమాలకే ఈ పురస్కారం…