ఫ్ఫార్ములా ఈ-రేస్ వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్పై ఏసీబీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. తనపై దాఖలైన ఏసీబీ కేసు క్వాష్ చేయాలంటూ తెలంగాణ హైకోర్టును కేటీఆర్ ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ కు హైకోర్టు భారీ ఊరటనిచ్చింది. ఈ నెల 30 వరకు కేటీఆర్ ను అరెస్ట్ చేయొద్దని ఏసీబీని ఆదేశించింది. వారం వరకు కేటీఆర్ను అరెస్ట్ చేయొద్దని హైకోర్టు తీర్పు ఇచ్చింది.
ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయాలని ఏసీబీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే, విచారణ కొనసాగించవచ్చని ఏసీబీ అధికారులకు హైకోర్టు తెలిపింది. తదుపరి విచారణ ఈనెల 27కు వాయిదా వేసింది. అంతకుముందు, ఈ కేసు విచారణ సందర్భంగా ప్రభుత్వం తరఫున న్యాయవాదులకు, కేటీఆర్ తరపున న్యాయవాదులకు వాడీవేడీ వాదనలు జరిగాయి.
ఇది అత్యవసర పిటిషన్ విచారణ కాదని, ఇందులో కేటీఆర్కు ఎలాంటి లబ్ధి చేకూరింది అని ఏజీని ప్రశ్నించిన న్యాయమూర్తి. ఎఫ్ ఈవోకు డబ్బుల చెల్లింపులో అక్రమాలు జరిగాయని ఏజీ వాదించారు.పూర్తి స్థాయిలో ఏసీబీ విచారణ జరిగితే ఎవరెవరికి ఎలాంటి లబ్ధి చేకూరిందనేది తేలుతుందని చెప్పారు.
This post was last modified on December 20, 2024 5:49 pm
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…
మెగాస్టార్ చిరంజీవి.. పోస్టర్ మీద ఈ పేరు చూస్తే చాలు.. కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవాళ్లు ఒకప్పుడు. ఆయన ఫ్లాప్…