ఫ్ఫార్ములా ఈ-రేస్ వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్పై ఏసీబీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. తనపై దాఖలైన ఏసీబీ కేసు క్వాష్ చేయాలంటూ తెలంగాణ హైకోర్టును కేటీఆర్ ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ కు హైకోర్టు భారీ ఊరటనిచ్చింది. ఈ నెల 30 వరకు కేటీఆర్ ను అరెస్ట్ చేయొద్దని ఏసీబీని ఆదేశించింది. వారం వరకు కేటీఆర్ను అరెస్ట్ చేయొద్దని హైకోర్టు తీర్పు ఇచ్చింది.
ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయాలని ఏసీబీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే, విచారణ కొనసాగించవచ్చని ఏసీబీ అధికారులకు హైకోర్టు తెలిపింది. తదుపరి విచారణ ఈనెల 27కు వాయిదా వేసింది. అంతకుముందు, ఈ కేసు విచారణ సందర్భంగా ప్రభుత్వం తరఫున న్యాయవాదులకు, కేటీఆర్ తరపున న్యాయవాదులకు వాడీవేడీ వాదనలు జరిగాయి.
ఇది అత్యవసర పిటిషన్ విచారణ కాదని, ఇందులో కేటీఆర్కు ఎలాంటి లబ్ధి చేకూరింది అని ఏజీని ప్రశ్నించిన న్యాయమూర్తి. ఎఫ్ ఈవోకు డబ్బుల చెల్లింపులో అక్రమాలు జరిగాయని ఏజీ వాదించారు.పూర్తి స్థాయిలో ఏసీబీ విచారణ జరిగితే ఎవరెవరికి ఎలాంటి లబ్ధి చేకూరిందనేది తేలుతుందని చెప్పారు.
This post was last modified on December 20, 2024 5:49 pm
జాంబీ సినిమాలో వైరస్ లాగా ఏఐ వాడకం క్రమంగా టెకీస్ నుంచి సామాన్యుల చేతుల్లోకి వెళ్ళిపోతోంది. ఒకరేమో వారణాసిలో మహేష్…
లోక నాయకుడు కమల్ హాసన్, లెజెండరీ దర్శకుడు శంకర్ కాంబోలో వచ్చిన ఇండియన్ 2 / భారతీయుడు 2 డిజాస్టర్…
ఎన్నికల సమయంలో ఉచిత పథకాలు ప్రకటించే దేశం ఏది అని అడిగితే.. ఠక్కున చెప్పే పేరు భారత్. రాష్ట్రాల అసెంబ్లీల…
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…
మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…
సాధారణంగా అభిమాన సంఘాలంటే కొత్త సినిమాల విడుదల, సంబరాలు, పుట్టినరోజు వేడుకలకే పరిమితమవుతుంటాయి. అయితే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్…