ఫ్ఫార్ములా ఈ-రేస్ వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్పై ఏసీబీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. తనపై దాఖలైన ఏసీబీ కేసు క్వాష్ చేయాలంటూ తెలంగాణ హైకోర్టును కేటీఆర్ ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ కు హైకోర్టు భారీ ఊరటనిచ్చింది. ఈ నెల 30 వరకు కేటీఆర్ ను అరెస్ట్ చేయొద్దని ఏసీబీని ఆదేశించింది. వారం వరకు కేటీఆర్ను అరెస్ట్ చేయొద్దని హైకోర్టు తీర్పు ఇచ్చింది.
ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయాలని ఏసీబీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే, విచారణ కొనసాగించవచ్చని ఏసీబీ అధికారులకు హైకోర్టు తెలిపింది. తదుపరి విచారణ ఈనెల 27కు వాయిదా వేసింది. అంతకుముందు, ఈ కేసు విచారణ సందర్భంగా ప్రభుత్వం తరఫున న్యాయవాదులకు, కేటీఆర్ తరపున న్యాయవాదులకు వాడీవేడీ వాదనలు జరిగాయి.
ఇది అత్యవసర పిటిషన్ విచారణ కాదని, ఇందులో కేటీఆర్కు ఎలాంటి లబ్ధి చేకూరింది అని ఏజీని ప్రశ్నించిన న్యాయమూర్తి. ఎఫ్ ఈవోకు డబ్బుల చెల్లింపులో అక్రమాలు జరిగాయని ఏజీ వాదించారు.పూర్తి స్థాయిలో ఏసీబీ విచారణ జరిగితే ఎవరెవరికి ఎలాంటి లబ్ధి చేకూరిందనేది తేలుతుందని చెప్పారు.
This post was last modified on December 20, 2024 5:49 pm
కొత్త ఏడాదిలో అయిదో నెల వచ్చేసింది. సంక్రాంతి తర్వాత మళ్ళీ సరైన ఊపు కోసం ఎదురు చూస్తున్న బాక్సాఫీస్ కు…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార పార్టీ డీఎంకే, ప్రతిపక్ష పార్టీ ఏఐడీఎంకేలకు టీవీకే పెద్ద షాకిచ్చిన సంగతి తెలిసిందే.…
తమిళనాడు ఎన్నికల కౌంటింగ్ ట్రెండ్స్లో 105 స్థానాల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ముందంజలో ఉండటం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయితే…
తమిళనాట అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి. అందుక్కారణం నటుడు విజయ్ పార్టీ టీవీకే మ్యాజిక్ మార్కు దిశగా…
తమిళనాడు ఎన్నికల ఫలితాల్లో విజయ్ టీవీకే పార్టీ ముందంజలో ఉండటం చూస్తుంటే, అందరికీ సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయ ప్రయాణం…
కాంగ్రెస్ పార్టీ..దేశంలోనే అతి పురాతన రాజకీయ పార్టీ… అదే ఆ పార్టీకి పెద్ద మైనస్. పాత పార్టీ… పాత పాట……