ఆర్థిక నేరస్తుడు.. ప్రస్తుతం బ్రిటన్లో తలదాచుకున్న ప్రముఖ వ్యాపారవేత్త.. కింగ్ ఫిషర్ వ్యవస్థాపకుడు.. విజయ్ మాల్యా ఆస్తులు అమ్మేసినట్టు కేంద్ర ప్రభుత్వం తాజాగా సంచలన ప్రకటన చేసింది. బుధవారం లోక్సభలో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. విజయ్ మాల్యా.. ఆర్థిక నేరాలపై పెద్ద ఎత్తున కేసులు నమోదయ్యాయని తెలిపారు. వివిధ బ్యాంకులకు ఆయన ఎగవేసిన విషయం వాస్తవమేనని తెలిపారు.
ఈ నేపథ్యంలో విజయ్ మాల్యా ఆస్తులను అమ్మేసి.. కొంత మేరకు ఆయా బ్యాంకులకు అప్పులు తీర్చినట్టు నిర్మలా సీతారామన్ తెలిపారు. మొత్తంగా ఈ ఏడాది 14 వేల కోట్ల రూపాయలను విజయ్ మాల్యా అప్పుల కింద బ్యాంకులకు జమ చేసినట్టు వివరించారు. అదేవిధంగా మరో ఆర్థిక మోసగాడు, వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ ఆస్తులను కూడా అమ్మేసినట్టు తెలిపారు. ఆయన నుంచి కూడా 1000 కోట్ల రూపాలను రాబట్టి.. బ్యాంకులకు జమ చేశామన్నారు.
ఇతర వర్గాలకు చెందిన ఎగవేత దారుల(చౌక్సీతదితరులు) కు చెందిన ఆస్తులను కూడా అమ్మేసినట్టు మంత్రి చెప్పారు. ఆ సొమ్మును మొత్తంగా 22 వేల కోట్ల పైచిలుకు మొత్తాన్ని బ్యాంకులకు జమ చేశామన్నారు. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), బ్యాంకులు సంయుక్తంగా ముంబైలోని స్పెషల్ కోర్టును ఆశ్రయించాయని, ఈడీ అటాచ్ చేసిన ఆస్తులను కోర్టుల అనుమతితో విక్రయించినట్టు మంత్రి వివరించారు. అయితే.. సభలో సభ్యులు ప్రశ్నించే వరకు కేంద్రం ఈ వివరాలను వెల్లడించకపోవడం గమనార్హం.
This post was last modified on December 18, 2024 2:07 pm
కొన్ని కార్యక్రమాల వేళ.. కొన్ని అంశాలకు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల సందర్భంగా భారీ…
తెలుగుదేశం పార్టీ నేతలకు సీఎం, పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ప్రజలు మీ…
గత వారం రోజులకు పైగా తిరుగుతున్న లీకులకు అధికారిక ముద్ర పడిపోయింది. టాక్సిక్ జూన్ 4 నుంచి వాయిదా వేస్తున్నట్టు…
నవ్యాంద్రప్రదేశ్ లో అధికార కూటమి రథ సారథి తెలుగు దేశం పార్టీ (టీడీపీ)లో బుదవారం నుంచి నవ శకం మొదలు…
లెనిన్ గురించి అప్డేట్స్ లేక అసహనానికి గురవుతున్న అభిమానులకు ఊరట కలిగిస్తూ నాగార్జున ట్వీట్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్…
ఈ శుక్రవారం మంచి అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వస్తోంది ‘గాయపడ్డ సింహం’. డైరెక్టర్ టర్న్డ్ యాక్టర్ తరుణ్ భాస్కర్…