Political News

విజ‌య్ మాల్యా ఆస్తులు అమ్మేశాం: కేంద్రం

ఆర్థిక నేర‌స్తుడు.. ప్ర‌స్తుతం బ్రిట‌న్‌లో త‌ల‌దాచుకున్న ప్ర‌ముఖ వ్యాపారవేత్త‌.. కింగ్ ఫిష‌ర్ వ్య‌వ‌స్థాప‌కుడు.. విజ‌య్ మాల్యా ఆస్తులు అమ్మేసిన‌ట్టు కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. బుధ‌వారం లోక్‌స‌భ‌లో ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ మాట్లాడుతూ.. విజ‌య్ మాల్యా.. ఆర్థిక నేరాల‌పై పెద్ద ఎత్తున కేసులు న‌మోద‌య్యాయ‌ని తెలిపారు. వివిధ బ్యాంకుల‌కు ఆయ‌న ఎగ‌వేసిన విష‌యం వాస్త‌వ‌మేన‌ని తెలిపారు.

ఈ నేప‌థ్యంలో విజ‌య్ మాల్యా ఆస్తుల‌ను అమ్మేసి.. కొంత మేర‌కు ఆయా బ్యాంకుల‌కు అప్పులు తీర్చినట్టు నిర్మ‌లా సీతారామ‌న్ తెలిపారు. మొత్తంగా ఈ ఏడాది 14 వేల కోట్ల రూపాయ‌ల‌ను విజ‌య్ మాల్యా అప్పుల కింద బ్యాంకుల‌కు జ‌మ చేసిన‌ట్టు వివ‌రించారు. అదేవిధంగా మ‌రో ఆర్థిక మోస‌గాడు, వ‌జ్రాల వ్యాపారి నీర‌వ్ మోదీ ఆస్తుల‌ను కూడా అమ్మేసిన‌ట్టు తెలిపారు. ఆయ‌న నుంచి కూడా 1000 కోట్ల రూపాల‌ను రాబ‌ట్టి.. బ్యాంకుల‌కు జ‌మ చేశామ‌న్నారు.

ఇత‌ర వ‌ర్గాల‌కు చెందిన ఎగ‌వేత దారుల(చౌక్సీత‌దిత‌రులు) కు చెందిన ఆస్తుల‌ను కూడా అమ్మేసిన‌ట్టు మంత్రి చెప్పారు. ఆ సొమ్మును మొత్తంగా 22 వేల కోట్ల పైచిలుకు మొత్తాన్ని బ్యాంకుల‌కు జ‌మ చేశామ‌న్నారు. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), బ్యాంకులు సంయుక్తంగా ముంబైలోని స్పెషల్ కోర్టును ఆశ్రయించాయని, ఈడీ అటాచ్ చేసిన ఆస్తులను కోర్టుల అనుమ‌తితో విక్రయించిన‌ట్టు మంత్రి వివ‌రించారు. అయితే.. స‌భ‌లో స‌భ్యులు ప్ర‌శ్నించే వ‌ర‌కు కేంద్రం ఈ వివ‌రాల‌ను వెల్ల‌డించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on December 18, 2024 2:07 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

37 minutes ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

44 minutes ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

1 hour ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

2 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

4 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

5 hours ago