ఆర్థిక నేరస్తుడు.. ప్రస్తుతం బ్రిటన్లో తలదాచుకున్న ప్రముఖ వ్యాపారవేత్త.. కింగ్ ఫిషర్ వ్యవస్థాపకుడు.. విజయ్ మాల్యా ఆస్తులు అమ్మేసినట్టు కేంద్ర ప్రభుత్వం తాజాగా సంచలన ప్రకటన చేసింది. బుధవారం లోక్సభలో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. విజయ్ మాల్యా.. ఆర్థిక నేరాలపై పెద్ద ఎత్తున కేసులు నమోదయ్యాయని తెలిపారు. వివిధ బ్యాంకులకు ఆయన ఎగవేసిన విషయం వాస్తవమేనని తెలిపారు.
ఈ నేపథ్యంలో విజయ్ మాల్యా ఆస్తులను అమ్మేసి.. కొంత మేరకు ఆయా బ్యాంకులకు అప్పులు తీర్చినట్టు నిర్మలా సీతారామన్ తెలిపారు. మొత్తంగా ఈ ఏడాది 14 వేల కోట్ల రూపాయలను విజయ్ మాల్యా అప్పుల కింద బ్యాంకులకు జమ చేసినట్టు వివరించారు. అదేవిధంగా మరో ఆర్థిక మోసగాడు, వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ ఆస్తులను కూడా అమ్మేసినట్టు తెలిపారు. ఆయన నుంచి కూడా 1000 కోట్ల రూపాలను రాబట్టి.. బ్యాంకులకు జమ చేశామన్నారు.
ఇతర వర్గాలకు చెందిన ఎగవేత దారుల(చౌక్సీతదితరులు) కు చెందిన ఆస్తులను కూడా అమ్మేసినట్టు మంత్రి చెప్పారు. ఆ సొమ్మును మొత్తంగా 22 వేల కోట్ల పైచిలుకు మొత్తాన్ని బ్యాంకులకు జమ చేశామన్నారు. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), బ్యాంకులు సంయుక్తంగా ముంబైలోని స్పెషల్ కోర్టును ఆశ్రయించాయని, ఈడీ అటాచ్ చేసిన ఆస్తులను కోర్టుల అనుమతితో విక్రయించినట్టు మంత్రి వివరించారు. అయితే.. సభలో సభ్యులు ప్రశ్నించే వరకు కేంద్రం ఈ వివరాలను వెల్లడించకపోవడం గమనార్హం.
This post was last modified on December 18, 2024 2:07 pm
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…
సరైన భద్రత ఏర్పాట్లు చేయకుండా సినిమా, రాజకీయ ఈవెంట్లు పెడితే ఏం జరుగుతుందో.. ఎప్పటికప్పుడు ఉదాహరణలు చూస్తూనే ఉన్నాం. అయినా…
నటుడు శ్రీకాంత్ వారసుడిగా పెళ్లి సందడితో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రోషన్ మేక తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు. మధ్యలో…
స్టార్ హీరోలు ఏడాదికి ఒక్క సినిమా అయినా చేయాలని.. అప్పుడే ఇండస్ట్రీ బాగుంటుందనే అభిప్రాయం ఎప్పట్నుంచో ఉన్నదే. పెద్ద స్టార్లు మాత్రమే…