ఆర్థిక నేరస్తుడు.. ప్రస్తుతం బ్రిటన్లో తలదాచుకున్న ప్రముఖ వ్యాపారవేత్త.. కింగ్ ఫిషర్ వ్యవస్థాపకుడు.. విజయ్ మాల్యా ఆస్తులు అమ్మేసినట్టు కేంద్ర ప్రభుత్వం తాజాగా సంచలన ప్రకటన చేసింది. బుధవారం లోక్సభలో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. విజయ్ మాల్యా.. ఆర్థిక నేరాలపై పెద్ద ఎత్తున కేసులు నమోదయ్యాయని తెలిపారు. వివిధ బ్యాంకులకు ఆయన ఎగవేసిన విషయం వాస్తవమేనని తెలిపారు.
ఈ నేపథ్యంలో విజయ్ మాల్యా ఆస్తులను అమ్మేసి.. కొంత మేరకు ఆయా బ్యాంకులకు అప్పులు తీర్చినట్టు నిర్మలా సీతారామన్ తెలిపారు. మొత్తంగా ఈ ఏడాది 14 వేల కోట్ల రూపాయలను విజయ్ మాల్యా అప్పుల కింద బ్యాంకులకు జమ చేసినట్టు వివరించారు. అదేవిధంగా మరో ఆర్థిక మోసగాడు, వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ ఆస్తులను కూడా అమ్మేసినట్టు తెలిపారు. ఆయన నుంచి కూడా 1000 కోట్ల రూపాలను రాబట్టి.. బ్యాంకులకు జమ చేశామన్నారు.
ఇతర వర్గాలకు చెందిన ఎగవేత దారుల(చౌక్సీతదితరులు) కు చెందిన ఆస్తులను కూడా అమ్మేసినట్టు మంత్రి చెప్పారు. ఆ సొమ్మును మొత్తంగా 22 వేల కోట్ల పైచిలుకు మొత్తాన్ని బ్యాంకులకు జమ చేశామన్నారు. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), బ్యాంకులు సంయుక్తంగా ముంబైలోని స్పెషల్ కోర్టును ఆశ్రయించాయని, ఈడీ అటాచ్ చేసిన ఆస్తులను కోర్టుల అనుమతితో విక్రయించినట్టు మంత్రి వివరించారు. అయితే.. సభలో సభ్యులు ప్రశ్నించే వరకు కేంద్రం ఈ వివరాలను వెల్లడించకపోవడం గమనార్హం.
This post was last modified on December 18, 2024 2:07 pm
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…
ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…