Political News

విజ‌య్ మాల్యా ఆస్తులు అమ్మేశాం: కేంద్రం

ఆర్థిక నేర‌స్తుడు.. ప్ర‌స్తుతం బ్రిట‌న్‌లో త‌ల‌దాచుకున్న ప్ర‌ముఖ వ్యాపారవేత్త‌.. కింగ్ ఫిష‌ర్ వ్య‌వ‌స్థాప‌కుడు.. విజ‌య్ మాల్యా ఆస్తులు అమ్మేసిన‌ట్టు కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. బుధ‌వారం లోక్‌స‌భ‌లో ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ మాట్లాడుతూ.. విజ‌య్ మాల్యా.. ఆర్థిక నేరాల‌పై పెద్ద ఎత్తున కేసులు న‌మోద‌య్యాయ‌ని తెలిపారు. వివిధ బ్యాంకుల‌కు ఆయ‌న ఎగ‌వేసిన విష‌యం వాస్త‌వ‌మేన‌ని తెలిపారు.

ఈ నేప‌థ్యంలో విజ‌య్ మాల్యా ఆస్తుల‌ను అమ్మేసి.. కొంత మేర‌కు ఆయా బ్యాంకుల‌కు అప్పులు తీర్చినట్టు నిర్మ‌లా సీతారామ‌న్ తెలిపారు. మొత్తంగా ఈ ఏడాది 14 వేల కోట్ల రూపాయ‌ల‌ను విజ‌య్ మాల్యా అప్పుల కింద బ్యాంకుల‌కు జ‌మ చేసిన‌ట్టు వివ‌రించారు. అదేవిధంగా మ‌రో ఆర్థిక మోస‌గాడు, వ‌జ్రాల వ్యాపారి నీర‌వ్ మోదీ ఆస్తుల‌ను కూడా అమ్మేసిన‌ట్టు తెలిపారు. ఆయ‌న నుంచి కూడా 1000 కోట్ల రూపాల‌ను రాబ‌ట్టి.. బ్యాంకుల‌కు జ‌మ చేశామ‌న్నారు.

ఇత‌ర వ‌ర్గాల‌కు చెందిన ఎగ‌వేత దారుల(చౌక్సీత‌దిత‌రులు) కు చెందిన ఆస్తుల‌ను కూడా అమ్మేసిన‌ట్టు మంత్రి చెప్పారు. ఆ సొమ్మును మొత్తంగా 22 వేల కోట్ల పైచిలుకు మొత్తాన్ని బ్యాంకుల‌కు జ‌మ చేశామ‌న్నారు. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), బ్యాంకులు సంయుక్తంగా ముంబైలోని స్పెషల్ కోర్టును ఆశ్రయించాయని, ఈడీ అటాచ్ చేసిన ఆస్తులను కోర్టుల అనుమ‌తితో విక్రయించిన‌ట్టు మంత్రి వివ‌రించారు. అయితే.. స‌భ‌లో స‌భ్యులు ప్ర‌శ్నించే వ‌ర‌కు కేంద్రం ఈ వివ‌రాల‌ను వెల్ల‌డించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on December 18, 2024 2:07 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ర‌జినీ కూతురికే నచ్చని కూలీ

విప‌రీత‌మైన ప్రి రిలీజ్ హైప్ వ‌ల్ల వ‌సూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాత‌కు లాభం అందించి ఉండ‌చ్చు.…

2 hours ago

మ‌ళ్లీ అవే బెదిరింపులు… జ‌గ‌న్ స్ట్రాట‌జీ ఇంతేనా?

వైసీపీ అధినేత జ‌గ‌న్ లో పెద్దగా మార్పు రాలేదా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. అధికారంలో ఉండ‌గా వైసీపీ నాయ‌కులు…

3 hours ago

ఓజీ భామ కొరియా యాత్ర

కోలీవుడ్ భామ ప్రియాంక మోహన్ నటిస్తున్న లేటేస్ట్ మూవీ మేడిన్ కొరియా. ఆర్ కార్తీక్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ…

3 hours ago

నిందితులను నడిపిస్తున్నారా.. ఏపీ హైకోర్టు ఏమందంటే!

ఏపీలో పోలీసుల అత్యుత్సాహం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. వివిధ నేరాల్లో నిందితులను నడిరోడ్డుపై కొట్టడం, వారిని రోడ్డుపైనే నడిపించుకుంటూ వెళ్లడం,…

3 hours ago

ఒక‌ప్పుడు నాస్తికం.. ఇప్పుడు స‌నాత‌నం: నాగ‌బాబుపై ట్రోలింగ్

జ‌న‌సేన పార్టీ కీల‌క నాయ‌కుడు, ఎమ్మెల్సీ నాగ‌బాబు.. బుధ‌వారం చేసిన వ్యాఖ్య‌లు, దీనికి ముందు కొన్నాళ్ల కింద‌ట ఆయ‌న ఓ…

4 hours ago

అంబటి రాంబాబు కాపు టైగర్ – జగన్

అంబటి రాంబాబు కాపు కులంలో ఒక టైగర్‌లాంటి వ్యక్తి అని, ప్రాణభయంతోనే ఆయన ఆ మాటలు మాట్లాడాల్సి వచ్చిందని వైఎస్సార్‌సీపీ…

5 hours ago