ఏపీ సీఎం చంద్రబాబు తాజాగా సంచలన ప్రకటన చేశారు. ప్రతి నెలా వచ్చే మూడవ శనివారం నాడు స్వచ్ఛాంద ప్రదేశ్ దినోత్సవంగా నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రతి మూడవ శనివారం రోజు.. రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు చెప్పారు. తాజాగా అమరావతిలోని సచివాలయంలో నిర్వహిస్తున్న కలెక్టర్ల సదస్సు రెండో రోజు ప్రారంభ సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ఈ ప్రకటన చేయడం గమనార్హం.
ప్రతి నెలా మూడవ శనివారం విధిగా అందరూ స్వఛ్చాంధ్ర ప్రదేశ్ దినోత్సవంలో పాల్గొనాలని కలెక్టర్లకు ఆయన సూచించారు. ప్రతి ఒక్కరూ చెత్తను తొలగించడంతోపాటు కాల్వలలో మురికిని తొలగించడంతో పాటు పలు కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలని సూచించారు. దీనికి సంబంధించిన పూర్తి ప్రణాళికను త్వరలోనే విడుదల చేయనున్నట్టు ముఖ్యమంత్రి తెలిపారు. దీనిని ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవా లని సూచించారు.
మరోవైపు.. సీఎం చంద్రబాబు గతంలోనూ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించడం విశేషం. అప్పట్లో ప్రతి సోమవారం ‘స్వచ్ఛ ఏపీ’ పేరుతో కార్యక్రమాలను నిర్వహించారు. వైసీపీ హయాంలో ఈ కార్యక్రమానికి మంగళం పాడారు. ఇప్పుడు మరోసారి చంద్రబాబు.. వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
This post was last modified on December 12, 2024 1:19 pm
తెలుగు సినీ చరిత్రలోనే అత్యంత హైప్ మధ్య విడుదలైన చిత్రాల్లో.. దేవిపుత్రుడు ఒకటి. 2001 సంక్రాంతికి మృగరాజు, నరసింహనాయుడు లాంటి…
రీ రిలీజ్ ట్రెండ్ ఎక్కడికి వెళ్తుందో అర్థం కావడం లేదు. ఒక నోస్టాల్జియా ఫీలింగ్ ఇవ్వడం కోసం మొదలైన ఈ…
ఈ వారం విడుదల కాబోతున్న వీరభద్రుడుకి హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారు. దర్శకుడు ఆర్జె బాలాజీ కొన్ని…
సినిమా వాళ్లకు రాజకీయ ఆసక్తులు, అభిమానాలు ఉండడం కొత్త కాదు. అందులో తప్పు కూడా లేదు. ఐతే ఎప్పుడూ రాజకీయాల…
మొన్నటి దాకా జన నాయకుడు విడుదల మీద సవాలక్ష సందేహాలు. రెండు వారాల క్రితం ఏకంగా హెచ్డి ప్రింటుతో పైరసీ…
ఈ నెల 18 పెద్ది ట్రైలర్ విడుదల కానుంది. ముందు భోపాల్ అనుకున్నారు కానీ ఇప్పుడు ఈవెంట్ వేదికని ముంబైకి…