ఏపీ సీఎం చంద్రబాబు తాజాగా సంచలన ప్రకటన చేశారు. ప్రతి నెలా వచ్చే మూడవ శనివారం నాడు స్వచ్ఛాంద ప్రదేశ్ దినోత్సవంగా నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రతి మూడవ శనివారం రోజు.. రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు చెప్పారు. తాజాగా అమరావతిలోని సచివాలయంలో నిర్వహిస్తున్న కలెక్టర్ల సదస్సు రెండో రోజు ప్రారంభ సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ఈ ప్రకటన చేయడం గమనార్హం.
ప్రతి నెలా మూడవ శనివారం విధిగా అందరూ స్వఛ్చాంధ్ర ప్రదేశ్ దినోత్సవంలో పాల్గొనాలని కలెక్టర్లకు ఆయన సూచించారు. ప్రతి ఒక్కరూ చెత్తను తొలగించడంతోపాటు కాల్వలలో మురికిని తొలగించడంతో పాటు పలు కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలని సూచించారు. దీనికి సంబంధించిన పూర్తి ప్రణాళికను త్వరలోనే విడుదల చేయనున్నట్టు ముఖ్యమంత్రి తెలిపారు. దీనిని ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవా లని సూచించారు.
మరోవైపు.. సీఎం చంద్రబాబు గతంలోనూ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించడం విశేషం. అప్పట్లో ప్రతి సోమవారం ‘స్వచ్ఛ ఏపీ’ పేరుతో కార్యక్రమాలను నిర్వహించారు. వైసీపీ హయాంలో ఈ కార్యక్రమానికి మంగళం పాడారు. ఇప్పుడు మరోసారి చంద్రబాబు.. వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
This post was last modified on December 12, 2024 1:19 pm
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…