ఏపీ సీఎం చంద్రబాబు తాజాగా సంచలన ప్రకటన చేశారు. ప్రతి నెలా వచ్చే మూడవ శనివారం నాడు స్వచ్ఛాంద ప్రదేశ్ దినోత్సవంగా నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రతి మూడవ శనివారం రోజు.. రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు చెప్పారు. తాజాగా అమరావతిలోని సచివాలయంలో నిర్వహిస్తున్న కలెక్టర్ల సదస్సు రెండో రోజు ప్రారంభ సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ఈ ప్రకటన చేయడం గమనార్హం.
ప్రతి నెలా మూడవ శనివారం విధిగా అందరూ స్వఛ్చాంధ్ర ప్రదేశ్ దినోత్సవంలో పాల్గొనాలని కలెక్టర్లకు ఆయన సూచించారు. ప్రతి ఒక్కరూ చెత్తను తొలగించడంతోపాటు కాల్వలలో మురికిని తొలగించడంతో పాటు పలు కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలని సూచించారు. దీనికి సంబంధించిన పూర్తి ప్రణాళికను త్వరలోనే విడుదల చేయనున్నట్టు ముఖ్యమంత్రి తెలిపారు. దీనిని ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవా లని సూచించారు.
మరోవైపు.. సీఎం చంద్రబాబు గతంలోనూ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించడం విశేషం. అప్పట్లో ప్రతి సోమవారం ‘స్వచ్ఛ ఏపీ’ పేరుతో కార్యక్రమాలను నిర్వహించారు. వైసీపీ హయాంలో ఈ కార్యక్రమానికి మంగళం పాడారు. ఇప్పుడు మరోసారి చంద్రబాబు.. వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
This post was last modified on December 12, 2024 1:19 pm
సుప్రీంకోర్టులో రోజు వారీగా అనేక కేసులు విచారణకు వస్తాయి. న్యాయశాస్త్రంలో లబ్ధప్రతిష్టులైన అనేక మంది న్యాయవాదులు వాదనలు వినిపిస్తారు. ఇది…
రేపు కొత్త శుక్రవారం వచ్చేస్తోంది. సంక్రాంతి సినిమాల హడావిడి పూర్తిగా అయిపోవడంతో ఇప్పుడు మూవీ లవర్స్ దృష్టి వీటివైపు వెళ్లాల్సి…
బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కి విపరీతమైన ఫ్రీ పబ్లిసిటీ జరుగుతుంది. అదేంటో ఆమె సినిమాల వల్ల వచ్చిన పాపులారిటీ…
ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…
తెలుగు సినిమాలో పరిగెత్తడంలోనూ ప్రత్యేక స్టాండర్డ్ సెట్ చేసిన ఏకైక హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. అతని రన్నింగ్…
ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా అవతరించిన దురంధర్ తాజాగా ఓటిటిలో వచ్చాక కొత్త డిబేట్ మొదలయ్యింది. ఇంతకన్నా…