Political News

మొదలైన జగన్ కేసులపై రోజువారీ విచారణ..మొత్తం 16 కేసులు

జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల విచారణను శుక్రవారం సీబీఐ ప్రత్యేక కోర్టు విచారణ మొదలుపెట్టింది. ప్రజాప్రతినిధులపై నమోదైన కేసుల విచారణను స్పీడు చేయాలని, వీలైనంత తొందరలో పరిష్కరించాలన్నసుప్రింకోర్టు ఆదేశాల కారణంగానే హైకోర్టు దానికి తగ్గ ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగానే ఇఫ్పటికే సీబీఐ, ఈడి చర్టుల్లో ఉన్న జగన్ కేసుల విచారణ కూడా వేగవంతమైంది. జగన్ పై నమోదైన 11 కేసులను సీబీఐ కోర్టు, ఈడి కోర్టులో ఉన్న మరో 5 కేసులను ఇక నుండి రోజువారి విచారణ జరుపుతామని న్యాయమూర్తి స్పష్టం చేశారు.

తాజా విచారణలో జగన్ తరపు లాయర్ మాట్లాడుతూ కరోనా వైరస్ కారణంగా రానున్న దసరా పండుగ తర్వాత రోజు వారి విచారణ చేయాలని అప్పటి వరకు వాయిదా వేయాలని అభ్యర్ధించారు. అదే సమయంలో విచారణను భౌతికంగా కాకుండా ఆన్ లైన్లో విచారణ చేయాలన్నారు. సీబీఐ కోర్టు హాలు చాలా చిన్నదని లాయర్లు, సాక్ష్యులు, ఇతర జనాలు ఇంతమంది కోర్టు హాలులో పట్టరు కాబట్టే తాము ఆన్ లైన్లో విచారణ జరపాలని అడుగుతున్నట్లు చెప్పారు. అయితే దసరా తర్వాత విచారణ సాధ్యం కాదని కొట్టేశారు. ఇక ఆన్ లైన్లో విచారణ విషయాన్ని పరిశీలిస్తామని మాత్రం చెప్పారు.

మొత్తం మీద ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఏదో ఓ కారణంగా విచారణను మరికొద్ది రోజులు వాయిదా వేయిద్దామని జగన్ తరపు లాయర్ చేసిన ప్రయత్నాన్ని కోర్టు అడ్డుకుంది. ఎంపిలు, ఎంఎల్ఏలపై నమోదైన కేసులను రోజువారి విచారణ చేపట్టాలని సుప్రింకోర్టు ఎక్కడా ఉత్తర్వులు ఇవ్వలేదని లాయర్ చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది. ప్రజాప్రతినిధులపై నమోదైన కేసులను రోజు వారి విచారణ చేయాలని సుప్రింకోర్టు పదే పదే ఆదేశించిన విషయం అందరికీ తెలిసిందే. చట్టసభల్లో నేరచరితులు ఉండకూడదన్న ఏకైక లక్ష్యంతోనే సుప్రింకోర్టు ఉత్తర్వులను జారీ చేసింది.

ప్రజా ప్రతినిధులపై ఏపిలో సుమారు 150 మందిపై కేసులున్నాయి. ఇందులో తాజా, మాజీ ఎంఎల్ఏల, ఎంపిలున్నారు. వీరిలో అత్యధికులపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన ఆందోళనల కేసులు కూడా ఉన్నాయి. వీటిని కోర్టు తన విచారణలో ఎలాగూ కొట్టేస్తుంది. అయితే జగన్, చంద్రబాబునాయుడు, సుజనా చౌదరి, రఘురామకృష్ణంరాజు, సీఎం రమేష్, అచ్చెన్నాయుడు లాంటి కొందరిపైన మాత్రం అవినీతి, అక్రమాస్తుల సంపాదన లాంటి పెద్ద కేసులున్నాయి. సుప్రింకోర్టు చెప్పినట్లుగా రోజువారి విచారణ జరిగి కేసులను తేల్చేస్తే రాష్ట్ర రాజకీయాలు కీలక మలుపులు తిరగటం ఖాయమనే అనిపిస్తోంది.

This post was last modified on October 10, 2020 11:05 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

నేనే ‘కింగ్’ అంటున్న దళపతి విజయ్

నిన్నటివరకు టీవీకే అధ్యక్షుడు, దళపతి విజయ్ ఎవరితో పొత్తు పెట్టుకుంటారని కేవలం తమిళనాట ప్రజలు మాత్రమే కాదు, దక్షిణ భారత…

19 minutes ago

‘అమ్మాయిలను అనుభవించడానికే సినిమాలు తీస్తున్నారు’

సినీ ప‌రిశ్ర‌మ‌లో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్ప‌లేమ‌ని సీనియ‌ర్ ద‌ర్శ‌క నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ స్ప‌ష్టం చేశారు. ఇటీవ‌ల…

9 hours ago

డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ సతీమణి

బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…

11 hours ago

చంద్రబాబు ప్రయోగశాలగా మారిన కుప్పం

త‌న సొంత నియోజ‌కవ‌ర్గం కుప్పాన్ని ప్ర‌యోగ‌శాల‌గా మార్చ‌నున్న‌ట్టు సీఎం చంద్ర‌బాబు తెలిపారు. తాజాగా శుక్ర‌వారం రాత్రి త‌న నియోజ‌క‌వర్గానికి వ‌చ్చిన…

11 hours ago

కేసీఆర్ చెప్పిన‌ట్లు కుద‌ర‌దు

ఫోన్ ట్యాపింగ్ కేసు విచార‌ణ విష‌యంలో తెలంగాణ‌ మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ పంతం నెగ్గ‌లేదు. త‌న‌ను ఎర్ర‌వెల్లిలోని త‌న ఫామ్…

12 hours ago

చరణ్ కోసం అఖిల్ త్యాగం చేస్తాడా?

రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…

12 hours ago