Political News

లోకేష్ సార్‌… ఇటు చూడ‌రూ!!

టీడీపీ ఆశ‌ల వార‌ధి.. భావి అధ్య‌క్షుడిగా ప్ర‌చారంలో ఉన్న నారా లోకేష్‌పై.. ఆయ‌న పోటీ చేసి ఓడిపోయిన మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో స‌టైర్లు పేలుతున్నాయి. అయ్యా.. సారూ.. అప్పుడే మ‌రిచిపోయారా? అంటూ ఇక్క‌డి యువ‌త వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. నిజ‌మే.. లోకేష్ వ్య‌వ‌హార శైలిని చూస్తే.. ఎవ‌రైనా ఇలాంటి వ్యాఖ్య‌లే అంటుండ‌డం గ‌మ‌నార్హం. గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో తొలిసారి రంగంలోకి దిగిన లోకేష్‌.. బీసీలు ఎక్కువ‌గా ఉన్న మంగ‌ళ‌గిరి నుంచి పోటీ చేశారు. బీసీలే ఆయ‌న‌ను గెలిపిస్తార‌ని అనుకున్నారు. అంతేకాదు, బీసీలేకాకుండా రాజ‌ధాని నిర్మాణం కూడా ఉన్న నేప‌థ్యంలో ఈ ఎఫెక్ట్ కూడా లోకేష్‌కు అనుకూలంగా మారుతుంద‌ని అంచ‌నాలు వేసుకున్నారు.

అయితే, లోకేష్ ప‌రాజ‌యం పాల‌య్యారు. చిత్రం ఏంటంటే.. 2014లో టీడీపీ నుంచి పోటీ చేసిన గంజి చిరంజీవి.. వైసీపీ అభ్య‌ర్థి ఆళ్ల రామ‌కృష్ణారెడ్డికి గ‌ట్టి పోటీ ఇచ్చారు. కేవ‌లం 12 ఓట్ల తేడాతో ఓడిపోయి.. రికార్డు సృష్టించారు. కానీ, గ‌త ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో లోకేష్‌.. గ‌ట్టి పోటీ ఇచ్చినా.. 5 వేల పైచిలుకు ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయితే.. ఈ ఓట‌మి లోకేష్‌కు తీవ్ర ఇబ్బంది క‌లిగించింద‌ని, వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఆయ‌న వేరే నియోజ‌క‌వ‌ర్గం వెతుక్కుంటార‌ని అనేక విశ్లేష‌ణ‌లు వ‌చ్చాయి. కానీ, లోకేష్ మాత్రం ఈ ఓట‌మి బ‌లాన్ని ఇచ్చింద‌ని, వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ మంగ‌ళ‌గిరి నుంచే పోటీ చేస్తాన‌ని చెప్పారు. మంచిదే.. నియోజ‌క‌వ‌ర్గంపై ప‌ట్టు పెంచుకుని గెలుపుకోసం ఆయ‌న ప్ర‌య‌త్నించ‌డాన్ని ఎవ‌రూ త‌ప్పుప‌ట్ట‌రు.

కానీ, రాష్ట్రంలో ఎన్నిక‌లు ముగిసిన త‌ర్వాత‌.. ఇప్ప‌టి వ‌ర‌కు నియోజక‌వ‌ర్గం వైపు లోకేష్ క‌న్నెత్తి చూడ‌లే ద‌ని, ప్ర‌జ‌ల‌ను, త‌నకు ఎన్నిక‌ల్లో స‌హ‌క‌రించిన వారిని ప‌న్నెత్తి ప‌ల‌క‌రించ‌లేద‌ని అంటున్నారు ప‌రిశీలకులు. ఇటీవ‌ల క‌రోనా నేప‌థ్యంలో త‌న నియోజ‌క‌వ‌ర్గంలోని మీడియా మిత్రుల‌కు బీమా చేయించాన‌ని లోకేష్ చెప్పుకొచ్చారు. ఇది మంచిప‌రిణామ‌మే అయినా.. నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌జ‌ల‌ను కూడా ఆయ‌న ప‌ట్టించుకోవాలి క‌దా? ఇప్ప‌టి నుంచి ప్ర‌య‌త్నిస్తేనే క‌దా.. నియోజ‌క‌వ‌ర్గంపై ప‌ట్టు చిక్కుతుంది? అంటున్నారు. కానీ, లోకేష్ మాత్రం హైద‌రాబాద్‌కే ప‌రిమిత‌మై.. పిట్ట‌(ట్విట్ట‌ర్‌) క‌బుర్లు చెబుతున్నార‌ని విమ‌ర్శ‌లు సంధిస్తున్నారు. మ‌రి లోకేష్ ఈ కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గంపై ప‌ట్టు పెంచుకునేందుకు వ్యూహాత్మ‌కంగా రంగంలోకిదిగాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. మ‌రి ఏం చేస్తారో చూడాలి.

This post was last modified on October 11, 2020 4:16 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

1 hour ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

1 hour ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

2 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

3 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

4 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

6 hours ago