Political News

ఏ ఎండ‌కు ఆ గొడుగు.. కృష్ణ కృష్ణా.. కృష్ణ‌య్య‌!

‘ఒక ఉద్య‌మం కోసం పోరాడిన వాళ్లు ఆ ఉద్య‌మానికే క‌ట్టుబ‌డాలి. అప్పుడే ప్ర‌జ‌ల్లో విశ్వాసం ఉంటుంది’- లోక్‌పాల్ కోసం.. ఉద్య‌మించిన స‌మ‌యంలో ప్ర‌ముఖ సంఘ సంస్క‌ర్త‌.. ఉద్య‌మ మేధావి అన్నా హ‌జారే చేసిన వ్యాఖ్య‌లు ఇవి. ఇవేవో ఎప్పుడో చేసిన వ్యాఖ్య‌లు కావు. మోడీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత చేసిన వ్యాఖ్య‌లే. కానీ, ఇప్పుడు ఈ వ్యాఖ్యలు.. అలాంటి నాయ‌కులు క‌నుమ‌రుగు అవుతున్నారు. బీసీల హ‌క్కుల కోసం పోరాటం చేసిన ఆర్.కృష్ణ‌య్య ఇప్పుడు.. ప్లేటు మార్చారు.

మ‌రో మాట చెప్పాలంటే.. ఏ ఎండ‌కు ఆ గొడుగు ప‌డుతున్నార‌న్న వ్యాఖ్య‌లు కూడా వినిపిస్తున్నాయి. “బీజేపీ నాకు పిలిచి టికెట్ ఇచ్చింది” అని తాజాగా మంగ‌ళ‌వారం ఆయ‌న చాలా గొప్ప‌గా చెప్పుకొచ్చారు. కానీ, ఇక్క‌డే ఓ విష‌యాన్ని ఆయ‌న మ‌రిచిపోయినా.. బీసీల చెవుల్లో వినిపిస్తున్న‌దేంటంటే.. 2022-23 మ‌ధ్య కాలంలో ఇదే కృష్ణ‌య్య‌కు వైసీపీ తొలిసారి పిలిచి మ‌రీ రాజ్య‌స‌భ‌కు పంపించిన‌ప్పుడు ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు. “నా ప్రాణం పోయే వ‌ర‌కు.. వైసీపీలోనే ఉంటా. నేను పండుకుంటే.. లేపి మ‌రీ పంపించారు” అని వ్యాఖ్యానించారు.

కానీ, ఇప్పుడు త‌ను ప‌ద‌విని తానే వ‌దులుకుని.. బీజేపీ పిలిచి ఇచ్చింద‌ని చెప్ప‌డం కృష్ణ‌య్య‌కే చెల్లిందని బీసీ సంఘాల నాయ‌కులు చెబుతున్నారు. ఒక‌ప్పుడు బీసీల కోసం ఉద్య‌మాలు అవ‌స‌రం. కానీ, ఇప్పుడు బీసీల‌కు ప్ర‌భుత్వాలే అడ‌గ‌కుండా అన్నీ చేస్తున్న ప‌రిస్థితి స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. రిజ‌ర్వేష‌న్ల నుంచి ప‌థ‌కాల వ‌ర‌కు కూడా.. వారికి అన్ని విధాలా ప‌నులు జ‌రుగుతున్నాయి. ఇలాంటి స‌మ‌యంలో త‌న రాజ‌కీయ దారి తాను చూసుకున్నార‌నేది కృష్ణ‌య్య‌పై వ‌స్తున్న ప్ర‌ధాన విమ‌ర్శ‌లు.

ఇక‌, మంగ‌ళ‌వారం ఆర్‌. కృష్ణ‌య్య రాజ్య‌స‌భ‌కు నామినేష‌న్ వేశారు. ఈయ‌న విజ‌యం ద‌క్కించుకోవ‌డం స‌మ‌స్య‌కాదు. కూట‌మి ప్ర‌భుత్వానికి చాలి నంత మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబ‌ట్టి..ఆయ‌న పెద్ద‌ల స‌భ‌లో దిగ్విజ‌యంగా అడుగు పెట్ట‌నున్నారు. అయితే.. బీసీ ఉద్య‌మ నాయ‌కుడిగా చూస్తే.. మాత్రం ఆయ‌న ప్ర‌తిభ‌కు.. ప్రాభ‌వానికి కూడా మ‌చ్చ‌లు ఏర్ప‌డ్డాయ‌న్న‌ది ఉద్య‌మ నేత‌లు అంటున్న మాట‌. ఏదేమైనా.. ఇవ‌న్నీ.. ప‌ట్టించుకునే ప‌రిస్థితిలో కృష్ణ‌య్య లేరు క‌దా!!

This post was last modified on December 10, 2024 4:02 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

`పీపీపీ`కి కేంద్రం అండ‌… బాబుకు భ‌రోసా… !

ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్ షిప్(పీపీపీ) ద్వారా రాష్ట్రంలో మెడికల్ కాలేజీలతో పాటు పర్యాటక ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయాలని సీఎం…

34 minutes ago

మిథున్ రెడ్డి ఆస్తులు ఎలా పెరిగాయ్.. హాట్ టాపిక్..!

వైసీపీ పార్లమెంట్ సభ్యుడు, సీనియర్ నేత మిథున్ రెడ్డి ఆస్తులు భారీగా పెరిగాయని పేర్కొంటూ ఏడిఆర్ సర్వే తాజాగా వెల్లడించింది.…

1 hour ago

లేడీ డైరెక్టర్ వేసిన డేరింగ్ స్టెప్

టాక్సిక్ టీజర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా కారులో రొమాన్స్ పెట్టి దాని ద్వారా స్మశానంలో…

4 hours ago

ఎవరెస్ట్ బరువు మోస్తున్న మారుతీ సాబ్

ఇంకొద్ది గంటల్లో రాజా సాబ్ ప్రీమియర్లు ప్రారంభం కాబోతున్నాయి. జీవో త్వరగా రావడంతో ఆంధ్రప్రదేశ్ బుకింగ్స్ వేగంగా ఉండగా తెలంగాణది…

5 hours ago

రవితేజ వారి ‘మంచు’ పంచ్ చూశారా?

ఈ సంక్రాంతికి ‘మాస్ రాజా’ ట్యాగ్ తీసేసి.. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు…

5 hours ago

సినిమా వాయిదా… 60 కోట్ల రీఫండ్

అంతా అనుకున్న ప్రకారం జరిగితే తమిళనాడు థియేటర్ల దగ్గర ఈపాటికి పండుగ వాతావరణం ఉండేది. రేపటి ఉదయం ‘జననాయగన్’ రిలీజ్…

6 hours ago