‘ఒక ఉద్యమం కోసం పోరాడిన వాళ్లు ఆ ఉద్యమానికే కట్టుబడాలి. అప్పుడే ప్రజల్లో విశ్వాసం ఉంటుంది’- లోక్పాల్ కోసం.. ఉద్యమించిన సమయంలో ప్రముఖ సంఘ సంస్కర్త.. ఉద్యమ మేధావి అన్నా హజారే చేసిన వ్యాఖ్యలు ఇవి. ఇవేవో ఎప్పుడో చేసిన వ్యాఖ్యలు కావు. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన వ్యాఖ్యలే. కానీ, ఇప్పుడు ఈ వ్యాఖ్యలు.. అలాంటి నాయకులు కనుమరుగు అవుతున్నారు. బీసీల హక్కుల కోసం పోరాటం చేసిన ఆర్.కృష్ణయ్య ఇప్పుడు.. ప్లేటు మార్చారు.
మరో మాట చెప్పాలంటే.. ఏ ఎండకు ఆ గొడుగు పడుతున్నారన్న వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. “బీజేపీ నాకు పిలిచి టికెట్ ఇచ్చింది” అని తాజాగా మంగళవారం ఆయన చాలా గొప్పగా చెప్పుకొచ్చారు. కానీ, ఇక్కడే ఓ విషయాన్ని ఆయన మరిచిపోయినా.. బీసీల చెవుల్లో వినిపిస్తున్నదేంటంటే.. 2022-23 మధ్య కాలంలో ఇదే కృష్ణయ్యకు వైసీపీ తొలిసారి పిలిచి మరీ రాజ్యసభకు పంపించినప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు. “నా ప్రాణం పోయే వరకు.. వైసీపీలోనే ఉంటా. నేను పండుకుంటే.. లేపి మరీ పంపించారు” అని వ్యాఖ్యానించారు.
కానీ, ఇప్పుడు తను పదవిని తానే వదులుకుని.. బీజేపీ పిలిచి ఇచ్చిందని చెప్పడం కృష్ణయ్యకే చెల్లిందని బీసీ సంఘాల నాయకులు చెబుతున్నారు. ఒకప్పుడు బీసీల కోసం ఉద్యమాలు అవసరం. కానీ, ఇప్పుడు బీసీలకు ప్రభుత్వాలే అడగకుండా అన్నీ చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. రిజర్వేషన్ల నుంచి పథకాల వరకు కూడా.. వారికి అన్ని విధాలా పనులు జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో తన రాజకీయ దారి తాను చూసుకున్నారనేది కృష్ణయ్యపై వస్తున్న ప్రధాన విమర్శలు.
ఇక, మంగళవారం ఆర్. కృష్ణయ్య రాజ్యసభకు నామినేషన్ వేశారు. ఈయన విజయం దక్కించుకోవడం సమస్యకాదు. కూటమి ప్రభుత్వానికి చాలి నంత మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి..ఆయన పెద్దల సభలో దిగ్విజయంగా అడుగు పెట్టనున్నారు. అయితే.. బీసీ ఉద్యమ నాయకుడిగా చూస్తే.. మాత్రం ఆయన ప్రతిభకు.. ప్రాభవానికి కూడా మచ్చలు ఏర్పడ్డాయన్నది ఉద్యమ నేతలు అంటున్న మాట. ఏదేమైనా.. ఇవన్నీ.. పట్టించుకునే పరిస్థితిలో కృష్ణయ్య లేరు కదా!!
This post was last modified on December 10, 2024 4:02 pm
అంబటి రాంబాబు కాపు కులంలో ఒక టైగర్లాంటి వ్యక్తి అని, ప్రాణభయంతోనే ఆయన ఆ మాటలు మాట్లాడాల్సి వచ్చిందని వైఎస్సార్సీపీ…
సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్కు ఇప్పుడు ఒక కొత్త టెన్షన్ మొదలైంది. ఆరెంజ్ ఆర్మీని గతేడాది ఫైనల్ వరకు తీసుకెళ్లిన ప్యాట్…
రెండు పెద్ద సినిమాల విడుదల తేదీ విషయంలో క్లారిటీ వచ్చేసింది. ముందు నుంచి ప్రచారం జరిగినట్టు పెద్ది వదిలేసుకున్న మార్చి…
నాలుగేళ్ల క్రితం తమిళ హీరోగా మనకూ పరిచయమైన శరవణన్ 'ది లెజెండ్'తో డెబ్యూ చేసి తెరంగేట్రంతోనే ట్రోలింగ్ చవి చూడాల్సి…
ఘజియాబాద్లోని భారత్ సిటీ సొసైటీలో గుండెలు పిండేసే విషాదం చోటుచేసుకుంది. ఆన్లైన్ గేమింగ్కు బానిసలైన ముగ్గురు మైనర్ అక్కాచెల్లెళ్లు.. తల్లిదండ్రులు…
అల్లరి నరేష్ కొత్త సినిమా ఆల్కహాల్ టీజర్ వచ్చి అయిదు నెలలు దాటేసింది. దాంట్లో ప్రకటించిన విడుదల తేదీ జనవరి…