‘ఒక ఉద్యమం కోసం పోరాడిన వాళ్లు ఆ ఉద్యమానికే కట్టుబడాలి. అప్పుడే ప్రజల్లో విశ్వాసం ఉంటుంది’- లోక్పాల్ కోసం.. ఉద్యమించిన సమయంలో ప్రముఖ సంఘ సంస్కర్త.. ఉద్యమ మేధావి అన్నా హజారే చేసిన వ్యాఖ్యలు ఇవి. ఇవేవో ఎప్పుడో చేసిన వ్యాఖ్యలు కావు. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన వ్యాఖ్యలే. కానీ, ఇప్పుడు ఈ వ్యాఖ్యలు.. అలాంటి నాయకులు కనుమరుగు అవుతున్నారు. బీసీల హక్కుల కోసం పోరాటం చేసిన ఆర్.కృష్ణయ్య ఇప్పుడు.. ప్లేటు మార్చారు.
మరో మాట చెప్పాలంటే.. ఏ ఎండకు ఆ గొడుగు పడుతున్నారన్న వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. “బీజేపీ నాకు పిలిచి టికెట్ ఇచ్చింది” అని తాజాగా మంగళవారం ఆయన చాలా గొప్పగా చెప్పుకొచ్చారు. కానీ, ఇక్కడే ఓ విషయాన్ని ఆయన మరిచిపోయినా.. బీసీల చెవుల్లో వినిపిస్తున్నదేంటంటే.. 2022-23 మధ్య కాలంలో ఇదే కృష్ణయ్యకు వైసీపీ తొలిసారి పిలిచి మరీ రాజ్యసభకు పంపించినప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు. “నా ప్రాణం పోయే వరకు.. వైసీపీలోనే ఉంటా. నేను పండుకుంటే.. లేపి మరీ పంపించారు” అని వ్యాఖ్యానించారు.
కానీ, ఇప్పుడు తను పదవిని తానే వదులుకుని.. బీజేపీ పిలిచి ఇచ్చిందని చెప్పడం కృష్ణయ్యకే చెల్లిందని బీసీ సంఘాల నాయకులు చెబుతున్నారు. ఒకప్పుడు బీసీల కోసం ఉద్యమాలు అవసరం. కానీ, ఇప్పుడు బీసీలకు ప్రభుత్వాలే అడగకుండా అన్నీ చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. రిజర్వేషన్ల నుంచి పథకాల వరకు కూడా.. వారికి అన్ని విధాలా పనులు జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో తన రాజకీయ దారి తాను చూసుకున్నారనేది కృష్ణయ్యపై వస్తున్న ప్రధాన విమర్శలు.
ఇక, మంగళవారం ఆర్. కృష్ణయ్య రాజ్యసభకు నామినేషన్ వేశారు. ఈయన విజయం దక్కించుకోవడం సమస్యకాదు. కూటమి ప్రభుత్వానికి చాలి నంత మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి..ఆయన పెద్దల సభలో దిగ్విజయంగా అడుగు పెట్టనున్నారు. అయితే.. బీసీ ఉద్యమ నాయకుడిగా చూస్తే.. మాత్రం ఆయన ప్రతిభకు.. ప్రాభవానికి కూడా మచ్చలు ఏర్పడ్డాయన్నది ఉద్యమ నేతలు అంటున్న మాట. ఏదేమైనా.. ఇవన్నీ.. పట్టించుకునే పరిస్థితిలో కృష్ణయ్య లేరు కదా!!
This post was last modified on December 10, 2024 4:02 pm
త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు కీలక కసరత్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…
ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…
న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…
తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన…
చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్లో మంచి క్రేజ్తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…