Political News

అప్పుడు.. ఇప్పుడు.. క‌రణం దెబ్బ‌కు.. గ‌ర‌ట‌య్య విల‌విల‌!

రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో చెప్ప‌లేం. నిన్న‌టి మిత్రుడు నేడు శ‌త్రువు కావొచ్చు. నేటి శ‌త్రువు రేప‌టికి మిత్రుడూ కావొచ్చు. కానీ, ఎటొచ్చీ.. ప్ర‌కాశం జిల్లాలో అద్దంకి నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన సీనియ‌ర్ మోస్ట్ నాయ‌కుడు, మాజీ ఎమ్మెల్యే డాక్ట‌ర్‌ బాచిన‌ చెంచు గ‌ర‌ట‌య్య కుటుంబం విష‌యంలో మాత్రం క‌ర‌ణం బ‌ల‌రామ‌కృష్ణ‌మూర్తి.. ఎప్ప‌టిక‌ప్పుడు చిచ్చు పెడుతున్నార‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. గ‌తంలో అంటే టీడీపీ ప్రారంభించిన స‌మ‌యంలో గ‌ర‌ట‌య్య‌.. టీడీపీలో చేరి.. అద్దంకి నుంచి ప్రాతినిధ్యం వ‌హించారు. 1983, 1985 ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌ఫున అద్దంకిలో విజ‌యం సాధించారు.

1994, 1999లోనూ గ‌ర‌ట‌య్య అద్దంకిలో విజ‌యం సాధించారు. ప్ర‌జా నేత‌గా ఆయ‌న గుర్తింపు కూడా పొందారు. అప్ప‌టికి క‌ర‌ణం బ‌ల‌రాం.. కాంగ్రెస్‌లో ఉన్నారు. ఎంపీగా గెలిచారు. బ‌ల‌మైన నాయ‌క‌త్వం కూడా ఉంది. క‌మ్మ సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కుడు కావ‌డం.. కేడ‌ర్ బ‌లంగా ఉండ‌డంతో ఆయ‌న అన్ని పార్టీలూ ప్రాధాన్యం ఇచ్చేవి. త‌ర్వాత ఆయ‌న టీడీపీలోకి వ‌చ్చి.. అద్దంకి టికెట్ కోసం ప‌ట్టుబ‌ట్ట‌డంతో.. చంద్ర‌బాబు గ‌ర‌ట‌య్య‌ను త‌ప్పించి క‌ర‌ణంకు అవ‌కాశం ఇచ్చారు. దీంతో 2004లో క‌ర‌ణం విజ‌యం సాధించారు. ఇక‌, ఆ త‌ర్వాత‌.. గ‌ర‌ట‌య్య ప‌రిస్థితి ఎవ‌రూ ప‌ట్టించుకునేలా క‌నిపించ‌లేదు.

ఈ నేప‌థ్యంలో ఆయ‌నకు టీడీపీలో ప్రాధాన్యం త‌గ్గింది. ఇక‌, వైసీపీలో మారిన ప‌రిస్థితుల నేప‌థ్యంలో గ‌త 2014 ఎన్నిక‌ల‌కు ముందు నుంచి ఆయ‌న వైసీపీలో ఉన్నారు. అయితే, అప్ప‌ట్లో గొట్టిపాటి ర‌వి పోటీకి రావ‌డంతో గ‌ర‌ట‌య్య‌కు జ‌గ‌న్ అవ‌కాశం ఇవ్వ‌లేక‌పోయారు. అయినా ఆయ‌న పార్టీలో ఉన్నారు. గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో గ‌ర‌ట‌య్య‌కు జ‌గ‌న్ ఛాన్స్ ఇచ్చారు. అయితే, రాష్ట్ర వ్యాప్తంగా జ‌గ‌న్ సునామీ ప్ర‌భావం క‌నిపించినా.. అద్దంకిలో గ‌ర‌ట‌య్య గెలుపుగుర్రం ఎక్క‌లేక పోయారు. వ‌యో వృద్ధుడు కావ‌డం, గొట్టిపాటి ప్ర‌బావం ఎక్కువ‌గా ఉండ‌డంతో ఆయ‌న గెల‌వ‌లేక పోయారు. అయితే, వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న కుమారుడు కృష్ణ‌చైత‌న్య‌ను రంగంలోకి దించేందుకు గ‌ర‌ట‌య్య పావులు క‌దుపుతున్నారు.

అద్దంకిలో వైసీపీకి ఇప్పుడు కృష్ణ‌చైత‌న్య యాక్టివ్‌గా ఉన్నారు. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లోత‌న‌కే టికెట్ ఖాయ‌మ‌ని ఆయ‌న అనుకున్నారు. అయితే.. ఇప్పుడు మ‌ళ్లీ క‌ర‌ణం అడ్డుపుల్ల వేశారు. ఆయ‌న గ‌త ఎన్నిక‌ల్లో చీరాల నుంచి టీడీపీ త‌ర‌ఫున గెలిచి కూడా వైసీపీలోకి చేరి.. త‌న కుమారుడికి అద్దంకి సీటు ఇవ్వాల‌ని ఒత్తిడి చేయ‌డంతో జ‌గ‌న్ కూడా ఓకే చెప్పారు. దీంతో నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఈ సీటు త‌మ‌దే అనుకున్న గ‌ర‌ట‌య్య కుమారుడు కృష్ణ చైత‌న్య క‌ర‌ణం ఎఫెక్ట్‌తో ఏం చేయాలో తెలియ‌క‌.. ఇబ్బంది ప‌డుతున్నారు.

మ‌రి జ‌గ‌నే త‌మను ఆదుకోవాల‌ని ఇటీవ‌ల గ‌ర‌ట‌య్య‌.. సీఎం కు లేఖ రాసిన‌ట్టు నియోజ‌క‌వ‌ర్గంలో చ‌ర్చ న‌డుస్తోంది. మంచి నాయ‌కుడు, పేద‌ల డాక్ట‌ర్‌గా పేరున్న గ‌ర‌ట‌య్య కు జ‌గ‌న్ న్యాయం చేస్తార‌ని వైసీపీ నాయ‌కులు కూడా అంటున్నారు. ఎటొచ్చీ.. క‌ర‌ణం ఎఫెక్ట్‌తో గ‌తంలో టీడీపీలోను, ఇప్పుడు వైసీపీలోను గ‌ర‌ట‌య్య కుటుంబం ఇబ్బంది ప‌డుతుండ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on October 9, 2020 4:16 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

వరప్రసాదుకి పోలికలు అవసరం లేదు

మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…

50 seconds ago

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

5 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

5 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

5 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

6 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

8 hours ago