ఇటీవల ఢిల్లీ ఆసుపత్రిలో గుండె శస్త్రచికిత్స కోసం చేరిన కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ గురువారం కన్నుమూశారు. ఐదు దశాబ్దాలకు పైగా రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించి అత్యంత వ్యూహాత్మక నేతగా పేరుపొందిన రాంవిలాస్ పాస్వాన్ (74) మృతి చెందారు. ఆయన గత కొన్ని వారాలుగా ఆసుపత్రిలో ఉన్నారు. ఈరాత్రి తుది శ్వాస విడిచారు.
దేశంలో మంచి పేరు సంపాదించిన ప్రసిద్ధ దళిత నాయకులలో ఒకరైన పాశ్వాన్… దాదాపు అన్ని ప్రభుత్వాల్లోనూ 2 దశాబ్దాలుగా కేంద్ర మంత్రిగా కొనసాగుతున్నారు. ఆయన మృతి గురించి కొడుకు చిరాగ్ పాశ్వాన్ ధృవీకరించారు. ‘‘ మిస్ యు పాపా.. నువ్వు ఈ లోకంలో లేవు, కానీ నాతోనే ఉంటావు‘‘ ఆయన కుమారుడు, లోక్ జనశక్తి పార్టీ (ఎల్జెపి) చీఫ్ చిరాగ్ పాస్వాన్ తన నాయకుడి మరణం గురించి ట్వీట్ చేశారు.
“చాలా రోజులుగా నాన్న ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. శనివారం సాయంత్రం కొన్ని ఆకస్మిక పరిణామాల కారణంగా, అర్ధరాత్రి సమయంలో అతని గుండెకు ఆపరేషన్ చేయవలసి వచ్చింది. అవసరమైతే, బహుశా కొన్ని వారాల తరువాత మరొక ఆపరేషన్ చేయాల్సి రావచ్చు. ప్రతిక్షణం నాకు నా కుటుంబానికి అండగా నిలిచినందుకు అందరికీ ధన్యవాదాలు. ” అంటూ గత వారం చిరాగ్ చేసి ట్వీట్ ఇది. చివరకు ఆ శస్త్రచికిత్స విఫలమై తాజాగా పాశ్వాన్ తుది శ్వాస విడిచారు.
భారతదేశం నెలరోజుల్లో రెండో మంత్రిని కోల్పోయింది. అయితే, బీహార్ లో కీలక నేత అయిన పాశ్వాన్ సరిగ్గా ఎన్నికల ముందు మరణించడం అందరినీ విస్మయానికి, దిగ్బ్రాంతికి గురిచేసింది.
This post was last modified on October 8, 2020 9:18 pm
సహజంగా ఏ కేసులో అయినా.. నిందితులు లేదా అనుమానితులను పోలీసులు ప్రశ్నిస్తారు. ముందు మాటలతో.. తర్వాత తమదైన లాఠీ శైలితోనూ…
ఒక ఊరు నుంచి మరో ఊరుకు జాతీయ రహదారి(హైవే)పై ప్రయాణించే సమయంలో టోల్ గేట్లు దాటడం తప్పనిసరి. ఈ టోల్…
నేచురల్ స్టార్ నాని అంటే ఒకప్పుడు బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్లకు కేరాఫ్ అడ్రస్. ఎక్కువగా ఫ్యామిలీ టచ్ ఉన్న…
నాకు డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాడ్ని, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్న వాళ్లకు…
ఇండియాస్ నంబర్ వన్ డైరెక్టర్ రాజమౌళి దగ్గర దర్శకత్వ విభాగంలో పని చేయాలని కాబోయే డైరెక్టర్ కావాలనుకున్న ప్రతి వ్యక్తికీ…
అనుకున్నట్టే ది ప్యారడైజ్ ట్రైలర్ రావడం లేదు. రిలీజ్ డేట్ సెప్టెంబర్ 24 మీద చాలా ఒత్తిడి ఉండటంతో ఇప్పటికిప్పుడు…