ఇటీవల ఢిల్లీ ఆసుపత్రిలో గుండె శస్త్రచికిత్స కోసం చేరిన కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ గురువారం కన్నుమూశారు. ఐదు దశాబ్దాలకు పైగా రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించి అత్యంత వ్యూహాత్మక నేతగా పేరుపొందిన రాంవిలాస్ పాస్వాన్ (74) మృతి చెందారు. ఆయన గత కొన్ని వారాలుగా ఆసుపత్రిలో ఉన్నారు. ఈరాత్రి తుది శ్వాస విడిచారు.
దేశంలో మంచి పేరు సంపాదించిన ప్రసిద్ధ దళిత నాయకులలో ఒకరైన పాశ్వాన్… దాదాపు అన్ని ప్రభుత్వాల్లోనూ 2 దశాబ్దాలుగా కేంద్ర మంత్రిగా కొనసాగుతున్నారు. ఆయన మృతి గురించి కొడుకు చిరాగ్ పాశ్వాన్ ధృవీకరించారు. ‘‘ మిస్ యు పాపా.. నువ్వు ఈ లోకంలో లేవు, కానీ నాతోనే ఉంటావు‘‘ ఆయన కుమారుడు, లోక్ జనశక్తి పార్టీ (ఎల్జెపి) చీఫ్ చిరాగ్ పాస్వాన్ తన నాయకుడి మరణం గురించి ట్వీట్ చేశారు.
“చాలా రోజులుగా నాన్న ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. శనివారం సాయంత్రం కొన్ని ఆకస్మిక పరిణామాల కారణంగా, అర్ధరాత్రి సమయంలో అతని గుండెకు ఆపరేషన్ చేయవలసి వచ్చింది. అవసరమైతే, బహుశా కొన్ని వారాల తరువాత మరొక ఆపరేషన్ చేయాల్సి రావచ్చు. ప్రతిక్షణం నాకు నా కుటుంబానికి అండగా నిలిచినందుకు అందరికీ ధన్యవాదాలు. ” అంటూ గత వారం చిరాగ్ చేసి ట్వీట్ ఇది. చివరకు ఆ శస్త్రచికిత్స విఫలమై తాజాగా పాశ్వాన్ తుది శ్వాస విడిచారు.
భారతదేశం నెలరోజుల్లో రెండో మంత్రిని కోల్పోయింది. అయితే, బీహార్ లో కీలక నేత అయిన పాశ్వాన్ సరిగ్గా ఎన్నికల ముందు మరణించడం అందరినీ విస్మయానికి, దిగ్బ్రాంతికి గురిచేసింది.
This post was last modified on October 8, 2020 9:18 pm
చెన్నై లవ్ స్టోరీ పోస్ట్ రిలీజ్ ప్రమోషన్లలో యూనిట్ సభ్యులు కొందరు వాడిన మాట ఒకటుంది. అదే కిరణ్ అబ్బవరం హ్యాట్రిక్…
ఆ మధ్య జరిగిన లెనిన్ సక్సెస్ మీట్ లో కింగ్ నాగార్జున ఒక మాట అన్నారు. ది ఒడిస్సి లాంటి…
భారత దేశ రాజకీయాల్లో ఎన్నో పార్టీలు పుడుతున్నాయి. ఆ వెంటనే కనుమరుగు అవుతున్నాయి. ఎక్కడో ఒకటి అరా పార్టీలు కొనసాగుతున్నా... అవన్నీ దాదాపుగా…
టాలీవుడ్లో క్యారెక్టర్ రోల్స్ తో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి సురేఖా వాణి. వందల సంఖ్యలో సినిమాలు చేసిన ఆమెకు…
ఈ వారం టాలీవుడ్లో ఒక ఆసక్తికర అరంగేట్రం జరిగింది. ఇండస్ట్రీలో అతి పెద్ద కుటుంబాల్లో ఒకటైన ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి…
వైసీపీలో జగన్ అంటే ప్రాణం పెట్టేవారే ఉన్నారని, ఆయన గీసిన గీత దాటబోరని చెప్పే వారు కనిపిస్తారు. అయితే.. తాజాగా…