Political News

ఆఫీసులోకి అడుగు పెట్టాలంటే భయపడుతున్నాడా ?

తెలుగుదేశంపార్టీ విశాఖపట్నం పార్లమెంటు నియోజకవర్గానికి కొత్తగా అధ్యక్షుడిగా అపాయింట్ అయిన మాజీ ఎంఎల్ఏ పల్లా శ్రీనివాస్ భయపడిపోతున్నారట. విశాఖ నడిబొడ్డున ఉన్న పార్టీ కార్యాలయంలోకి రాకుండా గాజువాకలోని తన కార్యాలయంలోనే ఉంటున్నారట. గాజువాక నుండి గతంలో గెలిచిన పల్లాకు స్వతహాగా ఇంజనీరు కూడా. అందుకే కాస్త వాస్తు విషయాలను కూడా జాగ్రత్తగా చూసుకుంటాడు. నగరం మధ్యలో ఉన్న పార్టీ కార్యాలయానికి వాస్తుదోషం ఉన్న కారణంగా తాను నగరంలోని కార్యాలయంలోకి అడుగుపెట్టేది లేదని చెప్పేశారట.

ఎలాగూ గాజువాకలోని తన కార్యాలయం ఉంది కాబట్టి తనను ఎవరు కలవాలన్నా అక్కడికే రావాలంటు సీనియర్లకు, కార్యకర్తలకు ఇఫ్పటికే చెప్పేశారట. పార్లమెంటు నియోజకవర్గానికి అధ్యక్షుడిగా ఉన్న పల్లా ఎక్కడో గాజువాక కార్యాలయంలో కూర్చుని పార్టీ కార్యక్రమాలు చూస్తానంటే కుదురుతుందా ? ఇదే విషయాన్ని చాలామంది సీనియర్లు అడిగితే ఎవరేమి చెప్పినా తాను మాత్రం నగరంలోని కార్యాలయానికి వచ్చేది లేదంటూ తెగేసి చెబుతున్నారట.

నగరంలోని పార్టీ కార్యాలయానికి బాగా వాస్తుదోషాలున్నట్లు పల్లా మొత్తుకుంటున్నారు. పార్టీకి వీధిపోటు చాలా ఎక్కువగా ఉన్న కారణంగా ఏ కార్యక్రమం పెట్టినా, అందులో ఎవరు బాధ్యతలు నిర్వర్తించినా కలిసి రవాటం లేదని పల్లా బలంగా నమ్ముతున్నారు. అలాగే గతంలో అధ్యక్షులుగా పనిచేసిన ఇద్దరు నేతలు రాజీనామాలు చేయకుండానే పార్టీని వదిలేయటం కూడా పల్లా సెంటిమెంటుగా చూస్తున్నారట. ఇంతకుముందు నగర అధ్యక్షులుగా పనిచేసిన మాజీ ఎంఎల్ఏలు ఎస్ఏ రహ్మాన్, వాసుపల్లి గణేష్ కుమార్ వైసిపిలో చేరిపోయిన విషయాన్ని పల్లా గుర్తు చేస్తున్నారట.

పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మాజీ ముఖ్యమంత్రి, పార్టీ వ్యవస్ధాపకుడు ఎన్టీయార్ విగ్రహం కూడా రాంగ్ ప్లేసులో ఉందని పల్లా చెబుతున్నారట. తాను గనుక నగరంలోని పార్టీ కార్యాలయంలోనే బాధ్యతలు నిర్వర్తించాలంటే ముందు పార్టీ కార్యాలయానికి వాస్తుదోషాలను సరిచేయాల్సిందే అని సీనియర్లకు స్పష్టం చేస్తున్నారట. ప్రతిపక్షంలో ఉన్నపుడు, అందులోను సంక్షోభంలో ఉన్న సమయంలో పార్టీ కార్యాలయానికి వాస్తుదోషాలు సరిచేసేందుకు ఎవరు ముందుకొస్తారు ? వాస్తుదోషాలు సరిచేసే పేరుతో ఒకసారి పనెత్తుకుంటే చాలా ఖర్చవుతుందన్న విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి ప్రస్తుతానికైతే పల్లా కేరాఫ్ గాజువాకే.

This post was last modified on October 9, 2020 4:05 pm

Share

Recent Posts

ఆ నలుగురు… ట్రెండు సృష్టిస్తారా

ఆ నలుగురు అంటే ఏదో రాజేంద్ర ప్రసాద్ సినిమా అనుకునేరు. ఇది దాని గురించి కాదు. ఇప్పుడు ఇండస్ట్రీలో కొత్త…

7 minutes ago

వారణాసి అభిమానులకు కీరవాణి శుభవార్త

మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సగటు తెలుగు సినీ ప్రియులంతా ఎదురు చూస్తున్న క్రేజీ మూవీ వారణాసి. ఆర్ఆర్ఆర్…

4 hours ago

బాల‌య్య, ర‌జినీకో న్యాయం… విజ‌య్‌కో న్యాయ‌మా?

త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి విజ‌య్ నుంచి వ‌చ్చిన చివ‌రి చిత్రం జ‌న‌నాయ‌గ‌న్ మీద అభిమానులు ఎన్నో అంచ‌నాలు పెట్టుకున్నారు. కానీ ఆ…

11 hours ago

కొత్త నిర్మాతకు పెద్ద ఇబ్బందులు

ఇండస్ట్రీలో ఇబ్బందులు, సమస్యలు కేవలం చిన్న నిర్మాతలకే వస్తాయనుకుంటే పొరపాటే. ఎంత చెట్టుకు అంత గాలి తరహాలో ఎవరి కష్టాలు…

13 hours ago

ధనుష్ ఎంత లాజిక్కుతో మాట్లాడాడో

నేషనల్ అవార్డుల మీద గత రెండేళ్లుగా ఎంత చర్చ జరుగుతోందో చూస్తున్నాం. ఒకప్పుడు కళాత్మక విలువలున్న సినిమాలకే ఈ పురస్కారం…

13 hours ago

ఇప్పుడైనా ‘అన్న’తనం చూపించాలి జగన్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దయ, కనికరం, ఆప్యాయత, అభిమానం కలిగిన నేతగా ఆయన అభిమానులు, వైసీపీ…

15 hours ago