Political News

ఆఫీసులోకి అడుగు పెట్టాలంటే భయపడుతున్నాడా ?

తెలుగుదేశంపార్టీ విశాఖపట్నం పార్లమెంటు నియోజకవర్గానికి కొత్తగా అధ్యక్షుడిగా అపాయింట్ అయిన మాజీ ఎంఎల్ఏ పల్లా శ్రీనివాస్ భయపడిపోతున్నారట. విశాఖ నడిబొడ్డున ఉన్న పార్టీ కార్యాలయంలోకి రాకుండా గాజువాకలోని తన కార్యాలయంలోనే ఉంటున్నారట. గాజువాక నుండి గతంలో గెలిచిన పల్లాకు స్వతహాగా ఇంజనీరు కూడా. అందుకే కాస్త వాస్తు విషయాలను కూడా జాగ్రత్తగా చూసుకుంటాడు. నగరం మధ్యలో ఉన్న పార్టీ కార్యాలయానికి వాస్తుదోషం ఉన్న కారణంగా తాను నగరంలోని కార్యాలయంలోకి అడుగుపెట్టేది లేదని చెప్పేశారట.

ఎలాగూ గాజువాకలోని తన కార్యాలయం ఉంది కాబట్టి తనను ఎవరు కలవాలన్నా అక్కడికే రావాలంటు సీనియర్లకు, కార్యకర్తలకు ఇఫ్పటికే చెప్పేశారట. పార్లమెంటు నియోజకవర్గానికి అధ్యక్షుడిగా ఉన్న పల్లా ఎక్కడో గాజువాక కార్యాలయంలో కూర్చుని పార్టీ కార్యక్రమాలు చూస్తానంటే కుదురుతుందా ? ఇదే విషయాన్ని చాలామంది సీనియర్లు అడిగితే ఎవరేమి చెప్పినా తాను మాత్రం నగరంలోని కార్యాలయానికి వచ్చేది లేదంటూ తెగేసి చెబుతున్నారట.

నగరంలోని పార్టీ కార్యాలయానికి బాగా వాస్తుదోషాలున్నట్లు పల్లా మొత్తుకుంటున్నారు. పార్టీకి వీధిపోటు చాలా ఎక్కువగా ఉన్న కారణంగా ఏ కార్యక్రమం పెట్టినా, అందులో ఎవరు బాధ్యతలు నిర్వర్తించినా కలిసి రవాటం లేదని పల్లా బలంగా నమ్ముతున్నారు. అలాగే గతంలో అధ్యక్షులుగా పనిచేసిన ఇద్దరు నేతలు రాజీనామాలు చేయకుండానే పార్టీని వదిలేయటం కూడా పల్లా సెంటిమెంటుగా చూస్తున్నారట. ఇంతకుముందు నగర అధ్యక్షులుగా పనిచేసిన మాజీ ఎంఎల్ఏలు ఎస్ఏ రహ్మాన్, వాసుపల్లి గణేష్ కుమార్ వైసిపిలో చేరిపోయిన విషయాన్ని పల్లా గుర్తు చేస్తున్నారట.

పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మాజీ ముఖ్యమంత్రి, పార్టీ వ్యవస్ధాపకుడు ఎన్టీయార్ విగ్రహం కూడా రాంగ్ ప్లేసులో ఉందని పల్లా చెబుతున్నారట. తాను గనుక నగరంలోని పార్టీ కార్యాలయంలోనే బాధ్యతలు నిర్వర్తించాలంటే ముందు పార్టీ కార్యాలయానికి వాస్తుదోషాలను సరిచేయాల్సిందే అని సీనియర్లకు స్పష్టం చేస్తున్నారట. ప్రతిపక్షంలో ఉన్నపుడు, అందులోను సంక్షోభంలో ఉన్న సమయంలో పార్టీ కార్యాలయానికి వాస్తుదోషాలు సరిచేసేందుకు ఎవరు ముందుకొస్తారు ? వాస్తుదోషాలు సరిచేసే పేరుతో ఒకసారి పనెత్తుకుంటే చాలా ఖర్చవుతుందన్న విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి ప్రస్తుతానికైతే పల్లా కేరాఫ్ గాజువాకే.

This post was last modified on October 9, 2020 4:05 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

విడ‌ద‌ల ర‌జ‌నీపై కేసు పెట్టండి: హైకోర్టు ఆర్డ‌ర్‌

వైసీపీ నాయ‌కురాలు, మాజీ మంత్రి విడ‌ద‌ల ర‌జ‌నీపై కేసు న‌మోదు చేయాల‌ని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసుల‌ను ఆదేశించింది. ఆమెతోపాటు..…

21 minutes ago

కాంగ్రెస్ పార్టీ మీ అయ్య జాగీరా?:తీన్మార్ మ‌ల్ల‌న్న‌

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయ‌కుడు తీన్మార్ మ‌ల్ల‌న్న‌కు ఆ పార్టీ రాష్ట్ర క‌మిటీ నోటీసులు జారీ చేసింది.…

1 hour ago

మళ్లీ అవే డైలాగులు..తీరు మారని జగన్!

అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…

1 hour ago

రిస్కులకు సిద్ధపడుతున్న గోపీచంద్

మాచో స్టార్ గోపీచంద్ బలమైన కంబ్యాక్ కోసం అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. దర్శకుడు శ్రీను వైట్ల విశ్వంతో బ్రేక్…

2 hours ago

ఫిఫా పోస్టులో ‘NTR’.. స్పందించిన తారక్

‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్లుగా ఎదిగిపోయారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఉర్రూతూలగించింది.…

3 hours ago

చాట్ జీపీటీ-డీప్ సీక్‌ల‌కు దూరం: కేంద్రం ఆదేశాలు!

ప్ర‌స్తుతం ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ ప్ర‌పంచం పుంజుకుంటోంది. ప్ర‌ధానంగా ఐటీ సంస్థ‌ల నుంచి ప్ర‌భుత్వ కార్యాల‌యాల వ‌ర‌కు కూడా ఏఐ ఆధారిత…

3 hours ago