మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి 10 రోజులు దాటినా ముఖ్యమంత్రి పీఠంపై మాత్రం పీటముడి వీడలేదు. ఆపద్ధర్మ సీఎం షిండే తనకు మరో చాన్స్ వస్తుందేమోనని ఆశించారు. అయితే, ఈ సారి బీజేపీ ఎక్కువ సీట్లు గెలుచుకోవడంతో ఫడ్నవీస్ ను సీఎం చేయాలని బీజేపీ పెద్దలు భావించారు. ఈ క్రమంలోనే సీఎం సీటుపై హైడ్రామాకు నేటితో తెరపడింది. మహారాష్ట్రకు కాబోయే ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్ పేరు ఖరారైంది. ఫడ్నవీస్ పేరును బీజేపీ కోర్ కమిటీ నిర్ణయించింది.
ముంబైలోని విధాన్ భవన్ లో జరిగిన బీజేపీ ఎమ్మెల్యేల శాసన సభాసక్ష సమావేశంలో బీజేపీ శాసనసభాపక్ష నాయకుడిగా ఫడ్నవీస్ ను ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ఈ నెల 5న ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ముంబైలోని ఆజాద్ మైదానంలో ఈ కార్యక్రమం జరగనుంది. ప్రధాని మోదీతో పాటు ఎన్డీఏ కూటమికి చెందిన పలువురు కీలక నేతలు ఈ కార్యక్రమానికి హాజరుకాబోతున్నారు.
సీఎం పదవితో పాటు హోంమంత్రి, స్పీకర్ పదవులు బీజేపీకి దక్కున్నాయి. ఎన్సీపీ(అజిత్ పవార్) వర్గానికి , శివసేన(ఏక్ నాథ్ షిండే) వర్గాలకు డిప్యూటీ సీఎం పదవులు దక్కుతాయి. మంత్రివర్గంలో 43 మందికి చాన్స్ ఉండగా… 21 బీజేపీ తీసుకోనుంది. శివసేన (షిండే) వర్గం 12, ఎన్సీపీ (అజిత్ పవార్ ) వర్గం 10 తీసుకోనుంది. సీఎంగా ఫడ్నవీస్ ప్రమాణ స్వీకార కార్యక్రమ ఆహ్వాన పత్రం కూడా సర్క్యులేట్ అవుతోంది. అయితే, ఈ వ్యవహారంపై అధికారికంగా పూర్తిస్థాయి ప్రకటన వెలువడాల్సి ఉంది.
This post was last modified on December 4, 2024 1:52 pm
దేవర బ్లాక్ బస్టర్ తర్వాత వార్ 2 విపరీతంగా నిరాశ పరచడంతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల ఆశలన్నీ ప్యాన్ ఇండియా…
తమిళనాడు ముఖ్యమంత్రి, టీవీకే అధిపతి విజయ్ రాజకీయ విమర్శలకు కేంద్రంగా మారారు. ఆయనను కార్నర్ చేస్తూ.. బీజేపీసహా ఇతర పార్టీలు…
ఇంకో రెండు రోజుల్లో దృశ్యం 3 విడుదల కానుంది. ఒరిజినల్ వెర్షన్ తో పాటు తెలుగు డబ్బింగ్ రిలీజ్ కానుండటంతో…
వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి జోగి రమేష్ తన దూకుడును ఏమాత్రం తగ్గించడం లేదు. వాస్తవానికి ఆయన అగ్రిగోల్డ్ కేసులోను…
ఏపీ సీఎం చంద్రబాబు మత్స్యకారుల మనసు దోచుకున్నారు. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో పర్యటించిన ఆయన మత్సకార సేవలో కార్యక్రమంలో…
దేశ రాజకీయాల్లో జాతీయ పార్టీలదే ఆధిపత్యం కనిపిస్తున్నా.. రాష్ట్రాల రాజకీయాలను ప్రభావితం చేసేది మాత్రం ఇప్పటికీ ప్రాంతీయ పార్టీలేనని తాజా…