మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి 10 రోజులు దాటినా ముఖ్యమంత్రి పీఠంపై మాత్రం పీటముడి వీడలేదు. ఆపద్ధర్మ సీఎం షిండే తనకు మరో చాన్స్ వస్తుందేమోనని ఆశించారు. అయితే, ఈ సారి బీజేపీ ఎక్కువ సీట్లు గెలుచుకోవడంతో ఫడ్నవీస్ ను సీఎం చేయాలని బీజేపీ పెద్దలు భావించారు. ఈ క్రమంలోనే సీఎం సీటుపై హైడ్రామాకు నేటితో తెరపడింది. మహారాష్ట్రకు కాబోయే ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్ పేరు ఖరారైంది. ఫడ్నవీస్ పేరును బీజేపీ కోర్ కమిటీ నిర్ణయించింది.
ముంబైలోని విధాన్ భవన్ లో జరిగిన బీజేపీ ఎమ్మెల్యేల శాసన సభాసక్ష సమావేశంలో బీజేపీ శాసనసభాపక్ష నాయకుడిగా ఫడ్నవీస్ ను ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ఈ నెల 5న ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ముంబైలోని ఆజాద్ మైదానంలో ఈ కార్యక్రమం జరగనుంది. ప్రధాని మోదీతో పాటు ఎన్డీఏ కూటమికి చెందిన పలువురు కీలక నేతలు ఈ కార్యక్రమానికి హాజరుకాబోతున్నారు.
సీఎం పదవితో పాటు హోంమంత్రి, స్పీకర్ పదవులు బీజేపీకి దక్కున్నాయి. ఎన్సీపీ(అజిత్ పవార్) వర్గానికి , శివసేన(ఏక్ నాథ్ షిండే) వర్గాలకు డిప్యూటీ సీఎం పదవులు దక్కుతాయి. మంత్రివర్గంలో 43 మందికి చాన్స్ ఉండగా… 21 బీజేపీ తీసుకోనుంది. శివసేన (షిండే) వర్గం 12, ఎన్సీపీ (అజిత్ పవార్ ) వర్గం 10 తీసుకోనుంది. సీఎంగా ఫడ్నవీస్ ప్రమాణ స్వీకార కార్యక్రమ ఆహ్వాన పత్రం కూడా సర్క్యులేట్ అవుతోంది. అయితే, ఈ వ్యవహారంపై అధికారికంగా పూర్తిస్థాయి ప్రకటన వెలువడాల్సి ఉంది.
ఈ మధ్య రిలీజ్ డేట్ ప్రకటించాక ఎంత ప్లాన్డ్ గా పనులు చేసినా చివరి నిమిషం వరకు వాయిదా ఉండదన్న…
మలయాళంలో బ్లాక్ బస్టర్ అవ్వొచ్చేమో కానీ తెలుగులో మాత్రం దృశ్యం 3ని ఫ్లాప్ గానే పరిగణించాలి. తక్కువ బిజినెస్ చేయడం…
మీలాగా మేం ఫామ్ హౌస్లో పడుకోవట్లే - అంటూ తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.. బీఆర్ఎస్ పార్టీపై ఓ…
స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లిలాంటిదే అన్నట్టుగా వైసీపీ నాయకులకు ఎక్కడ ఎలా వ్యవహరించాలో తెలియడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.…
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ కు నిజంగానే షాక్…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్లు.. కూటమి ప్రభుత్వంలో కీలక రోల్ పోషిస్తున్న విషయం తెలిసిందే.…