మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి 10 రోజులు దాటినా ముఖ్యమంత్రి పీఠంపై మాత్రం పీటముడి వీడలేదు. ఆపద్ధర్మ సీఎం షిండే తనకు మరో చాన్స్ వస్తుందేమోనని ఆశించారు. అయితే, ఈ సారి బీజేపీ ఎక్కువ సీట్లు గెలుచుకోవడంతో ఫడ్నవీస్ ను సీఎం చేయాలని బీజేపీ పెద్దలు భావించారు. ఈ క్రమంలోనే సీఎం సీటుపై హైడ్రామాకు నేటితో తెరపడింది. మహారాష్ట్రకు కాబోయే ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్ పేరు ఖరారైంది. ఫడ్నవీస్ పేరును బీజేపీ కోర్ కమిటీ నిర్ణయించింది.
ముంబైలోని విధాన్ భవన్ లో జరిగిన బీజేపీ ఎమ్మెల్యేల శాసన సభాసక్ష సమావేశంలో బీజేపీ శాసనసభాపక్ష నాయకుడిగా ఫడ్నవీస్ ను ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ఈ నెల 5న ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ముంబైలోని ఆజాద్ మైదానంలో ఈ కార్యక్రమం జరగనుంది. ప్రధాని మోదీతో పాటు ఎన్డీఏ కూటమికి చెందిన పలువురు కీలక నేతలు ఈ కార్యక్రమానికి హాజరుకాబోతున్నారు.
సీఎం పదవితో పాటు హోంమంత్రి, స్పీకర్ పదవులు బీజేపీకి దక్కున్నాయి. ఎన్సీపీ(అజిత్ పవార్) వర్గానికి , శివసేన(ఏక్ నాథ్ షిండే) వర్గాలకు డిప్యూటీ సీఎం పదవులు దక్కుతాయి. మంత్రివర్గంలో 43 మందికి చాన్స్ ఉండగా… 21 బీజేపీ తీసుకోనుంది. శివసేన (షిండే) వర్గం 12, ఎన్సీపీ (అజిత్ పవార్ ) వర్గం 10 తీసుకోనుంది. సీఎంగా ఫడ్నవీస్ ప్రమాణ స్వీకార కార్యక్రమ ఆహ్వాన పత్రం కూడా సర్క్యులేట్ అవుతోంది. అయితే, ఈ వ్యవహారంపై అధికారికంగా పూర్తిస్థాయి ప్రకటన వెలువడాల్సి ఉంది.
This post was last modified on December 4, 2024 1:52 pm
గత ఏడాది మలయాళం బ్లాక్ బస్టర్ ప్రేమలు తెలుగులోనూ మంచి విజయం నమోదు చేసుకుంది. ఎస్ఎస్ కార్తికేయ తీసుకున్న ప్రత్యేక…
అంతరిక్షం నుంచి భూమికి తిరిగొచ్చిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ త్వరలోనే భారత్కు రానున్నారని సమాచారం. తొమ్మిది నెలల…
ఐపీఎల్ 2025 సీజన్లో అందరి దృష్టి ఒక చిన్న కుర్రాడిపై నిలిచింది. కేవలం 13 ఏళ్ల వయసులో ఐపీఎల్లో అడుగుపెడుతున్న…
సినిమాలు తగ్గించినా సరే దేవిశ్రీ ప్రసాద్ సంగీతానికి ఉన్న ఫాలోయింగ్ చాలా ప్రత్యేకం. డిసెంబర్లో పుష్ప 2 ది రూల్…
సల్మాన్ ఖాన్ సికిందర్ విడుదల తేదీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ మార్చి 30 వస్తున్నట్టు డిస్ట్రిబ్యూటర్లకు సమాచారం అందిందని…
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో చిక్కుబడిపోయిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ మంగళవారం సురక్షితంగా భూమిపైకి చేరారు. సునీతతో…