Political News

గ‌రం గ‌రంగా గుంటూరు ఎంపీల వ్య‌వ‌హారం!

గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో గుంటూరులోని మూడు కీల‌క పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ.. రెండు చోట్ల వైసీపీ విజ‌యం సాధించింది. న‌ర‌సారావుపేట‌, బాప‌ట్ల నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ నాయ‌కులు, యువ నేత‌లు లావు కృష్ణ‌దేవ‌రాయ‌లు, నందిగం సురేశ్‌లు విజ‌యం సాధించారు. వీరిపై స్థానికంగా ఎంతో బాధ్య‌త ఉంది. పైగా రాజ‌ధాని వివాదం నేప‌థ్యంలో ఇక్క‌డ పార్టీ తిరిగి పుంజుకునేలా.. ప్ర‌స్తుత వ్య‌తిరేక‌త‌ను త‌గ్గించి, మూడు రాజ‌ధానుల‌పై ప్ర‌జ‌లను ఒప్పించే బాధ్య‌త కూడా అంతో ఇంతో ఉంద‌నేది వాస్త‌వం. కానీ, ఇప్పుడు ఈ ఇద్ద‌రి వ్య‌వ‌హారం గ‌రంగరంగా మారింద‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

తాజాగా లావు కృష్ణ‌దేవ‌రాయ‌లు.. సీఎం జ‌గ‌న్‌కు లేఖ రాశారు. ఇదివివాదానికి దారి తీసింది. త‌న‌కు సంబంధం లేని విష‌యంపై ఇలా లేఖ సంధించ‌డం ఏంట‌ని సొంత పార్టీలోనే నాయ‌కులు విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఇటీవ‌ల కేంద్ర ప్ర‌భుత్వం విదేశీ విరాళాలు తీసుకోవ‌డానికి అనుమ‌తుల‌ను మ‌రింత క‌ఠినం చేసింది. విదేశీ విరాళాలు తీసుకుంటూ.. ఉగ్ర‌, మ‌త ప‌ర‌మైన కార్య‌క్ర‌మాలు ప్రోత్స‌హిస్తున్నార‌నే ఉద్దేశంతోను, రాజ‌కీయ పార్టీలు కూడా వినియోగించుకుంటున్నాయ‌నే కార‌ణంగా.. వీటికి కేంద్రం నిబంధ‌న‌లు క‌ఠినం చేసింది. అయితే, ఈ ప్ర‌భావం తిరుమ‌ల క్షేత్రం నిర్వ‌హించే బ‌ర్డ్ ఆసుప‌త్రిపై ప‌డింద‌ని, పేద‌ల‌కు వైద్యం నిలిచిపోయే ప్ర‌మాదం ఉంద‌ని పేర్కొంటూ లావు లేఖ సంధించారు.

ఈ విష‌యంలో జోక్యం చేసుకోవాల‌ని.. కేంద్రానికి ఈ విష‌యం తెలియ‌జేయాల‌ని ఎంపీ లావు కోరారు. అయితే, వాస్త‌వానికి త‌న నియోజ‌క‌వ‌ర్గంలో లేని వ్య‌వ‌హారం.. పైగా టీడీపీ ఈవో వైవీ ఇప్ప‌టికే తిరుమ‌ల విష‌యాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లారు. అయినా.. లావు ఇలా లేఖ రాయ‌డం ఏంట‌నేది వైసీపీ నేత‌ల మాట‌. నియోజ‌క‌వ‌ర్గంలో చేయాల్సిన అభివృద్ధి విష‌యాన్ని ప‌ట్టించుకోకుండా ఇలా చేస్తున్నార‌నే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. మ‌రోప‌క్క‌, బాప‌ట్ల ఎంపీ నందిగం సురేష్ నియోజ‌క‌వ‌ర్గాన్ని వ‌దిలేసి.. సొంత ప‌నులు చేసుకుంటున్నార‌ని, ఢిల్లీలోనే ఉంటున్నార‌ని సొంత‌పార్టీ నాయ‌కులు తిట్టిపోస్తున్నారు.

ఇదిలావుంటే, ఇటీవ‌ల స్థానిక ఎమ్మెల్యే ఉండ‌వ‌ల్లి శ్రీదేవి.. త‌న నియోజ‌క‌వ‌ర్గంలో ఎంపీ వేలు పెడుతున్నారంటూ. సీఎంకు లేఖ రాశారు. త‌న ఆడియో టేపు ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చి వివాదం కావ‌డం వెనుక కీల‌క నాయ‌కులు ఉన్నార‌ని.. ఆమె ఫిర్యాదు చేశారు. మొత్తానికి ఈ ఇద్ద‌రు ఎంపీల వ్య‌వ‌హారం కూడా పార్టీలోనే విమ‌ర్శ‌లు వ‌చ్చేలా చేసింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఈ వివాదం ఎటు మ‌లుపు తిరుగుతుందో చూడాలి.

Satya

Recent Posts

30 దాటాక కూడా రేస్‌లో ఉండాలంటే…

ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…

2 hours ago

మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రితో లోకేష్ భేటీ రీజ‌నేంటి?

మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి, బీజేపీ సీనియ‌ర్ నాయ‌కుడు దేవేంద్ర ఫ‌డ‌ణవీస్‌తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…

3 hours ago

నమ్మకం టన్నుల్లో… రామ్ చరణ్ మాటల్లో

విజయవాడ పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా ముగిసింది. ఏర్పాట్ల దగ్గరి నుంచి అయిపోయే దాకా ఎక్కడా అపశ్రుతి లేకుండా…

4 hours ago

జ‌గ‌న్‌కు క‌విత మ‌ద్ద‌తిస్తున్నారా?

తెలంగాణ నాయ‌కురాలు, తెలంగాణ ర‌క్ష‌ణ సేన‌(టీఆర్ఎస్‌) పార్టీ అధ్య‌క్షురాలు క‌విత తాజాగా చేసిన వ్యాఖ్య‌ల‌పై సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున…

4 hours ago

మస్సా మస్సా… లెక్క సరిపోయింది

పెద్ది నుంచి ఏదైనా బ్యాంగర్ లాంటి కంటెంట్ కావాలని ఎదురు చూస్తున్న అభిమానులకు అది మస్సా మస్సా వీడియో సాంగ్…

5 hours ago

ప‌క్కా మాస్… క‌ల్లు రుచి చూసిన బాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబు.. తాజాగా క‌ల్లు రుచి చూశారు. వాస్త‌వానికి ఆయ‌న ఇలాంటి వాటికి క‌డు దూరంగా ఉంటారు. అయితే..…

5 hours ago