Political News

గ‌రం గ‌రంగా గుంటూరు ఎంపీల వ్య‌వ‌హారం!

గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో గుంటూరులోని మూడు కీల‌క పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ.. రెండు చోట్ల వైసీపీ విజ‌యం సాధించింది. న‌ర‌సారావుపేట‌, బాప‌ట్ల నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ నాయ‌కులు, యువ నేత‌లు లావు కృష్ణ‌దేవ‌రాయ‌లు, నందిగం సురేశ్‌లు విజ‌యం సాధించారు. వీరిపై స్థానికంగా ఎంతో బాధ్య‌త ఉంది. పైగా రాజ‌ధాని వివాదం నేప‌థ్యంలో ఇక్క‌డ పార్టీ తిరిగి పుంజుకునేలా.. ప్ర‌స్తుత వ్య‌తిరేక‌త‌ను త‌గ్గించి, మూడు రాజ‌ధానుల‌పై ప్ర‌జ‌లను ఒప్పించే బాధ్య‌త కూడా అంతో ఇంతో ఉంద‌నేది వాస్త‌వం. కానీ, ఇప్పుడు ఈ ఇద్ద‌రి వ్య‌వ‌హారం గ‌రంగరంగా మారింద‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

తాజాగా లావు కృష్ణ‌దేవ‌రాయ‌లు.. సీఎం జ‌గ‌న్‌కు లేఖ రాశారు. ఇదివివాదానికి దారి తీసింది. త‌న‌కు సంబంధం లేని విష‌యంపై ఇలా లేఖ సంధించ‌డం ఏంట‌ని సొంత పార్టీలోనే నాయ‌కులు విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఇటీవ‌ల కేంద్ర ప్ర‌భుత్వం విదేశీ విరాళాలు తీసుకోవ‌డానికి అనుమ‌తుల‌ను మ‌రింత క‌ఠినం చేసింది. విదేశీ విరాళాలు తీసుకుంటూ.. ఉగ్ర‌, మ‌త ప‌ర‌మైన కార్య‌క్ర‌మాలు ప్రోత్స‌హిస్తున్నార‌నే ఉద్దేశంతోను, రాజ‌కీయ పార్టీలు కూడా వినియోగించుకుంటున్నాయ‌నే కార‌ణంగా.. వీటికి కేంద్రం నిబంధ‌న‌లు క‌ఠినం చేసింది. అయితే, ఈ ప్ర‌భావం తిరుమ‌ల క్షేత్రం నిర్వ‌హించే బ‌ర్డ్ ఆసుప‌త్రిపై ప‌డింద‌ని, పేద‌ల‌కు వైద్యం నిలిచిపోయే ప్ర‌మాదం ఉంద‌ని పేర్కొంటూ లావు లేఖ సంధించారు.

ఈ విష‌యంలో జోక్యం చేసుకోవాల‌ని.. కేంద్రానికి ఈ విష‌యం తెలియ‌జేయాల‌ని ఎంపీ లావు కోరారు. అయితే, వాస్త‌వానికి త‌న నియోజ‌క‌వ‌ర్గంలో లేని వ్య‌వ‌హారం.. పైగా టీడీపీ ఈవో వైవీ ఇప్ప‌టికే తిరుమ‌ల విష‌యాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లారు. అయినా.. లావు ఇలా లేఖ రాయ‌డం ఏంట‌నేది వైసీపీ నేత‌ల మాట‌. నియోజ‌క‌వ‌ర్గంలో చేయాల్సిన అభివృద్ధి విష‌యాన్ని ప‌ట్టించుకోకుండా ఇలా చేస్తున్నార‌నే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. మ‌రోప‌క్క‌, బాప‌ట్ల ఎంపీ నందిగం సురేష్ నియోజ‌క‌వ‌ర్గాన్ని వ‌దిలేసి.. సొంత ప‌నులు చేసుకుంటున్నార‌ని, ఢిల్లీలోనే ఉంటున్నార‌ని సొంత‌పార్టీ నాయ‌కులు తిట్టిపోస్తున్నారు.

ఇదిలావుంటే, ఇటీవ‌ల స్థానిక ఎమ్మెల్యే ఉండ‌వ‌ల్లి శ్రీదేవి.. త‌న నియోజ‌క‌వ‌ర్గంలో ఎంపీ వేలు పెడుతున్నారంటూ. సీఎంకు లేఖ రాశారు. త‌న ఆడియో టేపు ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చి వివాదం కావ‌డం వెనుక కీల‌క నాయ‌కులు ఉన్నార‌ని.. ఆమె ఫిర్యాదు చేశారు. మొత్తానికి ఈ ఇద్ద‌రు ఎంపీల వ్య‌వ‌హారం కూడా పార్టీలోనే విమ‌ర్శ‌లు వ‌చ్చేలా చేసింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఈ వివాదం ఎటు మ‌లుపు తిరుగుతుందో చూడాలి.

This post was last modified on October 9, 2020 2:50 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

12 minutes ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

19 minutes ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

49 minutes ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

2 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

3 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

5 hours ago