గత ఏడాది ఎన్నికల్లో గుంటూరులోని మూడు కీలక పార్లమెంటు నియోజకవర్గాల్లోనూ.. రెండు చోట్ల వైసీపీ విజయం సాధించింది. నరసారావుపేట, బాపట్ల నియోజకవర్గాల్లో వైసీపీ నాయకులు, యువ నేతలు లావు కృష్ణదేవరాయలు, నందిగం సురేశ్లు విజయం సాధించారు. వీరిపై స్థానికంగా ఎంతో బాధ్యత ఉంది. పైగా రాజధాని వివాదం నేపథ్యంలో ఇక్కడ పార్టీ తిరిగి పుంజుకునేలా.. ప్రస్తుత వ్యతిరేకతను తగ్గించి, మూడు రాజధానులపై ప్రజలను ఒప్పించే బాధ్యత కూడా అంతో ఇంతో ఉందనేది వాస్తవం. కానీ, ఇప్పుడు ఈ ఇద్దరి వ్యవహారం గరంగరంగా మారిందనే విమర్శలు వస్తున్నాయి.
తాజాగా లావు కృష్ణదేవరాయలు.. సీఎం జగన్కు లేఖ రాశారు. ఇదివివాదానికి దారి తీసింది. తనకు సంబంధం లేని విషయంపై ఇలా లేఖ సంధించడం ఏంటని సొంత పార్టీలోనే నాయకులు విమర్శలు చేస్తున్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం విదేశీ విరాళాలు తీసుకోవడానికి అనుమతులను మరింత కఠినం చేసింది. విదేశీ విరాళాలు తీసుకుంటూ.. ఉగ్ర, మత పరమైన కార్యక్రమాలు ప్రోత్సహిస్తున్నారనే ఉద్దేశంతోను, రాజకీయ పార్టీలు కూడా వినియోగించుకుంటున్నాయనే కారణంగా.. వీటికి కేంద్రం నిబంధనలు కఠినం చేసింది. అయితే, ఈ ప్రభావం తిరుమల క్షేత్రం నిర్వహించే బర్డ్ ఆసుపత్రిపై పడిందని, పేదలకు వైద్యం నిలిచిపోయే ప్రమాదం ఉందని పేర్కొంటూ లావు లేఖ సంధించారు.
ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని.. కేంద్రానికి ఈ విషయం తెలియజేయాలని ఎంపీ లావు కోరారు. అయితే, వాస్తవానికి తన నియోజకవర్గంలో లేని వ్యవహారం.. పైగా టీడీపీ ఈవో వైవీ ఇప్పటికే తిరుమల విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లారు. అయినా.. లావు ఇలా లేఖ రాయడం ఏంటనేది వైసీపీ నేతల మాట. నియోజకవర్గంలో చేయాల్సిన అభివృద్ధి విషయాన్ని పట్టించుకోకుండా ఇలా చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరోపక్క, బాపట్ల ఎంపీ నందిగం సురేష్ నియోజకవర్గాన్ని వదిలేసి.. సొంత పనులు చేసుకుంటున్నారని, ఢిల్లీలోనే ఉంటున్నారని సొంతపార్టీ నాయకులు తిట్టిపోస్తున్నారు.
ఇదిలావుంటే, ఇటీవల స్థానిక ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి.. తన నియోజకవర్గంలో ఎంపీ వేలు పెడుతున్నారంటూ. సీఎంకు లేఖ రాశారు. తన ఆడియో టేపు ఒకటి బయటకు వచ్చి వివాదం కావడం వెనుక కీలక నాయకులు ఉన్నారని.. ఆమె ఫిర్యాదు చేశారు. మొత్తానికి ఈ ఇద్దరు ఎంపీల వ్యవహారం కూడా పార్టీలోనే విమర్శలు వచ్చేలా చేసిందని అంటున్నారు పరిశీలకులు. ఈ వివాదం ఎటు మలుపు తిరుగుతుందో చూడాలి.
This post was last modified on October 9, 2020 2:50 pm
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…