Political News

గ‌రం గ‌రంగా గుంటూరు ఎంపీల వ్య‌వ‌హారం!

గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో గుంటూరులోని మూడు కీల‌క పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ.. రెండు చోట్ల వైసీపీ విజ‌యం సాధించింది. న‌ర‌సారావుపేట‌, బాప‌ట్ల నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ నాయ‌కులు, యువ నేత‌లు లావు కృష్ణ‌దేవ‌రాయ‌లు, నందిగం సురేశ్‌లు విజ‌యం సాధించారు. వీరిపై స్థానికంగా ఎంతో బాధ్య‌త ఉంది. పైగా రాజ‌ధాని వివాదం నేప‌థ్యంలో ఇక్క‌డ పార్టీ తిరిగి పుంజుకునేలా.. ప్ర‌స్తుత వ్య‌తిరేక‌త‌ను త‌గ్గించి, మూడు రాజ‌ధానుల‌పై ప్ర‌జ‌లను ఒప్పించే బాధ్య‌త కూడా అంతో ఇంతో ఉంద‌నేది వాస్త‌వం. కానీ, ఇప్పుడు ఈ ఇద్ద‌రి వ్య‌వ‌హారం గ‌రంగరంగా మారింద‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

తాజాగా లావు కృష్ణ‌దేవ‌రాయ‌లు.. సీఎం జ‌గ‌న్‌కు లేఖ రాశారు. ఇదివివాదానికి దారి తీసింది. త‌న‌కు సంబంధం లేని విష‌యంపై ఇలా లేఖ సంధించ‌డం ఏంట‌ని సొంత పార్టీలోనే నాయ‌కులు విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఇటీవ‌ల కేంద్ర ప్ర‌భుత్వం విదేశీ విరాళాలు తీసుకోవ‌డానికి అనుమ‌తుల‌ను మ‌రింత క‌ఠినం చేసింది. విదేశీ విరాళాలు తీసుకుంటూ.. ఉగ్ర‌, మ‌త ప‌ర‌మైన కార్య‌క్ర‌మాలు ప్రోత్స‌హిస్తున్నార‌నే ఉద్దేశంతోను, రాజ‌కీయ పార్టీలు కూడా వినియోగించుకుంటున్నాయ‌నే కార‌ణంగా.. వీటికి కేంద్రం నిబంధ‌న‌లు క‌ఠినం చేసింది. అయితే, ఈ ప్ర‌భావం తిరుమ‌ల క్షేత్రం నిర్వ‌హించే బ‌ర్డ్ ఆసుప‌త్రిపై ప‌డింద‌ని, పేద‌ల‌కు వైద్యం నిలిచిపోయే ప్ర‌మాదం ఉంద‌ని పేర్కొంటూ లావు లేఖ సంధించారు.

ఈ విష‌యంలో జోక్యం చేసుకోవాల‌ని.. కేంద్రానికి ఈ విష‌యం తెలియ‌జేయాల‌ని ఎంపీ లావు కోరారు. అయితే, వాస్త‌వానికి త‌న నియోజ‌క‌వ‌ర్గంలో లేని వ్య‌వ‌హారం.. పైగా టీడీపీ ఈవో వైవీ ఇప్ప‌టికే తిరుమ‌ల విష‌యాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లారు. అయినా.. లావు ఇలా లేఖ రాయ‌డం ఏంట‌నేది వైసీపీ నేత‌ల మాట‌. నియోజ‌క‌వ‌ర్గంలో చేయాల్సిన అభివృద్ధి విష‌యాన్ని ప‌ట్టించుకోకుండా ఇలా చేస్తున్నార‌నే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. మ‌రోప‌క్క‌, బాప‌ట్ల ఎంపీ నందిగం సురేష్ నియోజ‌క‌వ‌ర్గాన్ని వ‌దిలేసి.. సొంత ప‌నులు చేసుకుంటున్నార‌ని, ఢిల్లీలోనే ఉంటున్నార‌ని సొంత‌పార్టీ నాయ‌కులు తిట్టిపోస్తున్నారు.

ఇదిలావుంటే, ఇటీవ‌ల స్థానిక ఎమ్మెల్యే ఉండ‌వ‌ల్లి శ్రీదేవి.. త‌న నియోజ‌క‌వ‌ర్గంలో ఎంపీ వేలు పెడుతున్నారంటూ. సీఎంకు లేఖ రాశారు. త‌న ఆడియో టేపు ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చి వివాదం కావ‌డం వెనుక కీల‌క నాయ‌కులు ఉన్నార‌ని.. ఆమె ఫిర్యాదు చేశారు. మొత్తానికి ఈ ఇద్ద‌రు ఎంపీల వ్య‌వ‌హారం కూడా పార్టీలోనే విమ‌ర్శ‌లు వ‌చ్చేలా చేసింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఈ వివాదం ఎటు మ‌లుపు తిరుగుతుందో చూడాలి.

Satya

Recent Posts

పృథ్విరాజ్ టార్గెట్ మిస్ అయ్యిందా

మలయాళ హీరో అయినప్పటికీ సలార్ నుంచి పృథ్విరాజ్ సుకుమారన్ కు మన దగ్గర కూడా ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ నమ్మకంతోనే…

3 hours ago

బాల‌కృష్ణ కూతురు మ‌ళ్లీ చిత‌గ్గొట్టేసింది

సెల‌బ్రెటీల కుటుంబాల్లో కొంద‌రిలో ఎంతో ప్ర‌తిభ ఉన్న‌ప్ప‌టికీ.. అది ఎప్పుడో కానీ బ‌య‌టికి రాదు. ఎప్పుడూ మామూలుగా క‌నిపించే వ్య‌క్తులు..…

9 hours ago

సలార్ ఇవ్వనిది లెనిన్ అందించింది

రిలీజైన రోజు నుంచి వీకెండ్ దాకా చెడుగుడు ఆడేసిన లెనిన్ ఎట్టకేలకు అఖిల్ కెరీర్ లో ఒక హిట్టుని చేర్చేసింది.…

9 hours ago

శేఖ‌ర్ మాస్ట‌ర్ వెర్స‌స్ జానీ మాస్ట‌ర్

టాలీవుడ్ అగ్ర‌శ్రేణి డ్యాన్స్ మాస్ట‌ర్లు ఇద్ద‌రి మ‌ధ్య వివాదం రాజుకుంది. జానీ మాస్ట‌ర్, శేఖ‌ర్ మాస్ట‌ర్ మ‌ధ్య ఘ‌ర్ష‌ణ చోటు…

11 hours ago

కత్తి కొనల మీద ‘ప్యారడైజ్’ పరుగులు

టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…

11 hours ago

‘మంగాపురం’లో ఏదో విషయం ఉంది

ఘట్టమనేని మూడో తరం నుంచి మొదటి వారసుడు జయకృష్ణ తొలి సినిమా శ్రీనివాస మంగాపురం జూలై 30 విడుదలకు రెడీ…

12 hours ago