Political News

ఈరోజు… సాక్షి, నమస్తేతెలంగాణ చూశారా?

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదాల పరిష్కారానికి కేంద్ర మంత్రి సమక్షంలో ఏపీ.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులు వర్చువల్ గా భేటీ కావటం.. దాదాపు రెండు గంటల పాటు సాగిన ఈ సమావేశంలో ఆసక్తికర అంశాలకు కొదవ లేదు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడటం కనిపిస్తుంది. ఎవరికి వారు తమ వాదనల్ని వినిపించటమే కాదు.. ఒకరికొకరు ఏ మాత్రం తగ్గకుండా ఒకరిపై ఒకరు విమర్శలకు వెనుకాడలేదు.

కట్ చేస్తే.. సమావేశం పూర్తి అయ్యింది. రెండు అధికారపక్షాలకు మీడియా సంస్థలు ఉండటం.. వారి కనుసన్నల్లో సాగే పత్రికల్లో ఈ భేటీ గురించి ఎవరెలాంటి కవరేజ్ ఇచ్చారన్నది ఆసక్తికరంగా మారింది. మిగిలిన మీడియాను వదిలేస్తే.. రెండు అధికారపక్షాలకు చెందిన మీడియా సంస్థలు కావటం.. వారిద్దరి వాదనలు ఎలా ఉన్నాయన్నది ఆసక్తికరంగా మారింది. ఈ రోజు ఆ రెండు పేపర్లను చూస్తే.. ఆసక్తికర అంశాలు కనిపించక మానవు.

తెలంగాణ అధికారపక్షానికి చెందిన నమస్తే తెలంగాణ దినపత్రికలో.. అపెక్సులో కేసీఆర్ భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారన్నట్లుగా వార్తలు ఇచ్చేశారు. అంతేకాదు.. సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దూకుడుగా వ్యవహరించటమే కాదు.. ఏపీ అన్యాయాల్ని కడిగేసినట్లుగా వార్తలు వచ్చేశాయి. అంతేకాదు.. కేంద్రం కాని ఏపీ సర్కారును కట్టడి చేయకుంటే తాము కూడా ఇష్టారాజ్యంగా ప్రాజెక్టులు కట్టేస్తామన్న దూకుడును వార్తల్లో ప్రదర్శించటం గమనార్హం.

అదే సమయంలో ఏపీ అధికారపక్షానికి చెందిన సాక్షిలో మాత్రం ఆచితూచి అన్నట్లుగా వార్తలు ఇవ్వటం కనిపించింది. తెలంగాణలో రెండు రాష్ట్రాలు డీపీఆర్ లు ఇవ్వటానికి ఓకే చెప్పిన వైనాన్ని హైలెట్ చేయటమే కాదు.. ఏపీ అక్రమ నిర్మాణాలు ఆపకుంటే బాబ్లీ తరహాలో బ్యారేజీ కడతామన్న కేసీఆర్ హెచ్చరికకు భారీ ప్రాధాన్యత ఇవ్వటం గమనార్హం. సాక్షి తెలంగాణ ఎడిషన్ లో ఇలా వార్తలు ఇచ్చి.. ఏపీ విషయానికి వస్తే.. భోర్డుల పరిధి నోటిఫై చేస్తాం అంటూ నిదానాన్ని ప్రదర్శించటం కనిపిస్తుంది. రెండు అధికారపక్షానికి చెందిన పత్రికలే అయినప్పటికీ.. కీలకమైన వార్తను డీల్ చేసే విషయంలో మాత్రం చెరో దారిని ఎంచుకున్నాయని చెప్పక తప్పదు.

This post was last modified on October 7, 2020 12:47 pm

Share

Recent Posts

అప్పుడు కుటుంబ పేర్లు… ఇప్పుడు వీరుల పేర్లు

భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. ఈ విమానాశ్రయాన్ని జాతికి…

48 minutes ago

హాలీవుడ్ సినిమాలకు మళ్ళీ మంచి రోజులు

ఒకప్పుడు ఇంగ్లీష్ సినిమాలకు మన దేశంలో తెగ క్రేజ్ ఉండేది. జురాసిక్ పార్క్ నుంచి ఇది విపరీతంగా పెరిగిపోయింది. దానికి…

3 hours ago

గండాన్ని దాటిన చెన్నై లవ్ స్టోరీ

గత వారం విడుదలైన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ఫుల్ పాజిటివ్ టాకేమీ తెచ్చుకోలేదు. ప్రిమియర్స్ నుంచే డివైడ్ టాక్ మొదలైంది.…

4 hours ago

మోదీ కాళ్లు కడిగి ఆ నీళ్లు తాగాలని ఉంది: నటుడు

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విష్ణుమూర్తి అవతారంగా ప్రముఖ బాలివుడ్ నటుడు సుదేష్ బెర్రీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో…

4 hours ago

కనకరాజు సీమలో కొరియన్ దెయ్యం

బలమైన కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆశలన్నీ కొరియన్ కనకరాజు మీదే ఉన్నాయి. ఆగస్ట్…

4 hours ago

“కొబ్బరికాయ కొట్టాం… గుమ్మడి కాయ కట్టాం”

ఏపీ దశ దిశలను మార్చేసే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం శనివారం ఉదయం లాంఛనంగా ప్రారంబమైంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ అల్లూరి సీతారామరాజు…

5 hours ago