Political News

ఈరోజు… సాక్షి, నమస్తేతెలంగాణ చూశారా?

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదాల పరిష్కారానికి కేంద్ర మంత్రి సమక్షంలో ఏపీ.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులు వర్చువల్ గా భేటీ కావటం.. దాదాపు రెండు గంటల పాటు సాగిన ఈ సమావేశంలో ఆసక్తికర అంశాలకు కొదవ లేదు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడటం కనిపిస్తుంది. ఎవరికి వారు తమ వాదనల్ని వినిపించటమే కాదు.. ఒకరికొకరు ఏ మాత్రం తగ్గకుండా ఒకరిపై ఒకరు విమర్శలకు వెనుకాడలేదు.

కట్ చేస్తే.. సమావేశం పూర్తి అయ్యింది. రెండు అధికారపక్షాలకు మీడియా సంస్థలు ఉండటం.. వారి కనుసన్నల్లో సాగే పత్రికల్లో ఈ భేటీ గురించి ఎవరెలాంటి కవరేజ్ ఇచ్చారన్నది ఆసక్తికరంగా మారింది. మిగిలిన మీడియాను వదిలేస్తే.. రెండు అధికారపక్షాలకు చెందిన మీడియా సంస్థలు కావటం.. వారిద్దరి వాదనలు ఎలా ఉన్నాయన్నది ఆసక్తికరంగా మారింది. ఈ రోజు ఆ రెండు పేపర్లను చూస్తే.. ఆసక్తికర అంశాలు కనిపించక మానవు.

తెలంగాణ అధికారపక్షానికి చెందిన నమస్తే తెలంగాణ దినపత్రికలో.. అపెక్సులో కేసీఆర్ భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారన్నట్లుగా వార్తలు ఇచ్చేశారు. అంతేకాదు.. సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దూకుడుగా వ్యవహరించటమే కాదు.. ఏపీ అన్యాయాల్ని కడిగేసినట్లుగా వార్తలు వచ్చేశాయి. అంతేకాదు.. కేంద్రం కాని ఏపీ సర్కారును కట్టడి చేయకుంటే తాము కూడా ఇష్టారాజ్యంగా ప్రాజెక్టులు కట్టేస్తామన్న దూకుడును వార్తల్లో ప్రదర్శించటం గమనార్హం.

అదే సమయంలో ఏపీ అధికారపక్షానికి చెందిన సాక్షిలో మాత్రం ఆచితూచి అన్నట్లుగా వార్తలు ఇవ్వటం కనిపించింది. తెలంగాణలో రెండు రాష్ట్రాలు డీపీఆర్ లు ఇవ్వటానికి ఓకే చెప్పిన వైనాన్ని హైలెట్ చేయటమే కాదు.. ఏపీ అక్రమ నిర్మాణాలు ఆపకుంటే బాబ్లీ తరహాలో బ్యారేజీ కడతామన్న కేసీఆర్ హెచ్చరికకు భారీ ప్రాధాన్యత ఇవ్వటం గమనార్హం. సాక్షి తెలంగాణ ఎడిషన్ లో ఇలా వార్తలు ఇచ్చి.. ఏపీ విషయానికి వస్తే.. భోర్డుల పరిధి నోటిఫై చేస్తాం అంటూ నిదానాన్ని ప్రదర్శించటం కనిపిస్తుంది. రెండు అధికారపక్షానికి చెందిన పత్రికలే అయినప్పటికీ.. కీలకమైన వార్తను డీల్ చేసే విషయంలో మాత్రం చెరో దారిని ఎంచుకున్నాయని చెప్పక తప్పదు.

This post was last modified on October 7, 2020 12:47 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

తమన్నా రాశిఖన్నా ‘బాక్’ రిపోర్ట్

ఈ ఏడాది డబ్బింగ్ సినిమాలు కొన్ని బాగానే వర్కౌట్ చేసుకున్న నేపథ్యంలో బాక్ అరణ్‌మనై 4 మీద కాస్తో కూస్తో…

2 mins ago

వరలక్ష్మి ‘శబరి’ ఎలా ఉంది

తమిళ నటే అయినప్పటికీ తెలుగులోనూ పలు బ్లాక్ బస్టర్లలో పాలు పంచుకున్న వరలక్ష్మి శరత్ కుమార్ కు మంచి ఫాలోయింగ్…

28 mins ago

గెలిస్తే ఎంపీ .. ఓడితే గవర్నర్ !

ఇదేదో బంపర్ అఫర్ లా ఉందే అని ఆశ్చర్యపోతున్నాారా ? అందరూ అదే అనుకుంటున్నారు. హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి…

32 mins ago

ఆ పార్టీలో అందరూ కాబోయే మంత్రులే !

భారతీయ జనతా పార్టీ ఈ ఎన్నికల్లో అబ్ కీ బార్ .. చార్ సౌ పార్ నినాదంతో దేశంలో ఎన్నికల…

2 hours ago

‘కొండా’నే వణికిస్తున్న నంబర్ 5 !

చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…

13 hours ago

రోజాకు రంగు ప‌డుతోంది..

ద‌ర్శ‌కుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో న‌టించిన రోజా.. రంగుప‌డుద్ది అనే డైలాగుతో అల‌రించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…

14 hours ago