Political News

ఇలా అయితే ఎలా జగన్?

వైసీపీకి ద‌శ‌-దిశ కొర‌వ‌డిందా? అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాల‌కు హాజ‌రు కాకుండా డుమ్మా కొట్టిన ఆ పార్టీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్‌..తన పార్టీ ఎమ్మెల్యేల‌ను కూడా వెళ్ల‌కుండా అడ్డుకున్నారు. క‌నీసం మీడియా ముందుకు వ‌చ్చేందుకు కూడా వారిని అంగీక‌రించ‌లేద‌ని పార్టీలోనే అంత‌ర్గ‌త చ‌ర్చ సాగుతోంది.

దీంతో ప‌ది రోజుల పాటు జ‌రిగిన అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాల‌పై వైసీపీకి ఉన్న జ‌గ‌న్ మిన‌హా 10 మంది ఎమ్మెల్యేలు నోరు విప్ప‌లేదు. క‌నీసం స‌మావేశాల గురించి కూడా ఎక్క‌డా మాట్లాడ‌లేదు. ఇది పార్టీకి, వ్య‌క్తిగ‌తంగా జ‌గ‌న్‌కు కూడా భారీ మైన‌స్ అయిపోయింది.

ఇక‌, ఇప్పుడు సోమ‌వారం నుంచి పార్ల‌మెంటు స‌మావేశాలు ప్రారంభం అవుతున్నాయి. ఈ ఏడాది జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ పార్టీకి న‌లుగురు ఎంపీలు ద‌క్కారు. క‌డ‌ప నుంచి అవినాష్‌రెడ్డి, అర‌కు నుంచి చెట్టి త‌నూజారాణి, తిరుప‌తి నుంచి మ‌ద్దెల గురుమూర్తి, రాజంపేట నుంచి పీవీ మిథున్‌రెడ్డి విజ‌యంసాధించారు.

వీరిలో చెట్టి త‌నూజారాణి మిన‌హా మిగిలిన వారు వ‌రుస‌గా విజ‌యం ద‌క్కించుకున్నారు. మ‌రి సోమ‌వారం నుంచి ప్రారంభ‌మ‌య్యే స‌మావేశాల్లో వీరు ఏయే అంశాల‌పై మాట్లాడాలి? ఏయే అంశాల‌ను స‌భ‌లో ప్ర‌స్తావించాల‌నే విష‌యాన్ని జ‌గ‌న్ చెప్ప‌లేదు. క‌నీసం పార్ల‌మెంట‌రీ పార్టీ నాయ‌కుల‌తో స‌మావేశం కూడా పెట్టలేదు.

మ‌రోవైపు రాజ్య‌స‌భ‌లోనూ 9 మంది స‌భ్యులు ఉన్నారు. ఇద్ద‌రు మాత్ర‌మే పార్టీ మారారు. మోపిదేవి వెంక‌ట‌ర‌మ‌ణ‌, బీద మ‌స్తాన్ రావు యాద‌వ్‌లు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. మిగిలిన 9 మంది వైసీపీలోనే ఉన్నారు. అంటే మొత్తంగా 13 మంది ఎంపీలు వైసీపీకి ఉన్నారు.

తాజాగా ప్రారంభం కానున్న శీతాకాల స‌మావేశాల్లో వీరు ఎలా వ్య‌వ‌హ‌రించాల‌నే విష‌యాన్ని జ‌గ‌న్ బ్రీఫ్ చేయ‌లేదు. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు కానీ, పార్టీ స‌మ‌స్య‌లు కానీ.. ఆయ‌న ప్ర‌స్తావించ‌లేదు. ఈ ప‌నిని వ‌దిలేసి బెంగ‌ళూరుకు వెళ్లిపోయారు. ఇదిలావుంటే.. టీడీపీ అధినేత చంద్ర‌బాబు మాత్రం త‌న‌కున్న 15 మంది పార్ల‌మెంటు స‌భ్యుల‌తోనూ.. శ‌నివార‌మే మీటింగ్ పెట్టారు.

లోక్‌స‌భ‌లో ఎలా వ్య‌వ‌హ‌రించాలో ఏయే అంశాల‌ను ప్ర‌స్తావించాలో తేల్చి చెప్పారు. అదానీ.. జ‌గ‌న్.. లంచాల అంశాల‌ను ప్ర‌స్తావించాల‌ని, పోల‌వ‌రం నిధులు, అమ‌రావ‌తి నిధులు, వెనుక‌బ‌డిన జిల్లాల‌కు నిధులు త్వ‌ర‌గా వ‌చ్చేలా పార్ల‌మెంటులో ప్ర‌శ్నించాల‌ని దిశానిర్దేశం చేశారు. ఇక‌, జ‌న‌సేన అధినేత త‌న‌కు ఉన్న ఇద్ద‌రు ఎంపీలు బాల‌శౌరి, శ్రీనివాస్‌ల‌తో భేటీ అయ్యారు. వారికి కూడా ఆయ‌న దిశానిర్దేశం చేశారు.

అయితే.. ఎటొచ్చీ.. జ‌గ‌న్ మాత్రం త‌న పార్టీ ఎంపీల‌కు ఎలాంటి దిశానిర్దేశం చేయ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఇదిలావుంటే, పార్ల‌మెంటులో అదానీ-లంచాల వ్య‌వ‌హారం, అమెరికాలో కేసుల వ్య‌వ‌హారం పై ప్ర‌తిప‌క్షాలు నిల‌దీయ‌నున్నాయి. ఈ క్ర‌మంలో జ‌గ‌న్‌కు ఇచ్చిన లంచాల వ్య‌వ‌హారం కూడా పార్ల‌మెంటును కుదిపేయ‌నుంది.

This post was last modified on November 25, 2024 11:16 am

Share
Show comments
Published by
Satya
Tags: Feature

Recent Posts

బూతులు తిట్టటం ట్రంప్ తోనే ఆరంభం కాలేదు బాస్

నాగరిక సమాజంలో మర్యాద అన్నది ప్రాథమికం. నిత్యం నాగరిత గురించి భారీ ఎత్తున లెక్చర్లు ఇచ్చే అమెరికన్ల తీరుకు భిన్నంగా…

9 minutes ago

పవన్ ను తిట్టిన ద్వారంపూడి ఇప్పుడు టార్గెట్ అయ్యారా?

ఉమ్మ‌డి తూర్పు గోదావ‌రి జిల్లా కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్ర‌శేఖ‌ర‌రెడ్డికి ఎర్త్ పెడుతున్నారా?... ఆయ‌న ప్రాభ‌వాన్ని.. వైభ‌వాన్ని…

27 minutes ago

రైటర్ గారు… చేదుగా ఉన్నా నిజమే చెప్పారు

రచయిత బివిఎస్ రవి ఒక్కోసారి బాగా ఓపెన్ అయిపోతారు. ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తారు. తాజాగా మా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో…

2 hours ago

పేర్ని పాకులాట‌.. ఇమేజ్ కోస‌మేనా.. ?

పేర్ని నాని. వైసీపీ కీల‌క నాయ‌కుడు, మాజీ మంత్రి. గ‌త ఎన్నిక‌ల్లో ఆయ‌న పోటీ నుంచి త‌ప్పుకొని వారసుడు కిట్టుకు…

3 hours ago

అవును… కళ్యాణ్ రామ్ సరసన ఆమెనే

అనిల్ రావిపూడి సినిమాలో ఛాన్స్ అంటే తెలుగులో అంతకుమించిన బంపరాఫర్ లేదన్నట్లే. హిట్ మెషీన్‌గా పేరు తెచ్చుకున్న అనిల్.. ఇప్పటిదాకా…

5 hours ago

పో* వెబ్ సైట్లో ఫొటో… జాన్వి షాక్

ఏఐని వాడుకుని ఇప్పుడు హీరోయిన్ల మార్ఫింగ్ ఫొటోలు, వీడియోలతో సోషల్ మీడియా జనాలు ఎలా రెచ్చిపోతున్నారో.. ఇంటర్నెట్ ఎంత విశృంఖలంగా తయారైందో చూస్తూనే…

5 hours ago