Political News

వైసిపిలో గన్నవరం హీట్ పెరిగిపోతోందా ?

అధికార పార్టీ వైసిపిలో గన్నవరం రాజకీయాల హీట్ పెరిగిపోతోంది. మామూలుగా ప్రశంతాంగా ఉండే నియోజకవర్గంలో ఎంఎల్ఏ వల్లభేనేని వంశీ వైసీపీ చేరడంతో హీట్ పెరిగిపోతోందనే ఆరోపణలు కూడా పెరిగిపోతున్నాయి. టీడీపీ తరపున మొన్నటి ఎన్నికల్లో గెలిచిన వంశీ చంద్రబాబునాయుడుపై తిరుగుబాటు చేశారు. తిరుగుబాటు తర్వాత వైసిపికి దగ్గరైపోయారు. ఎప్పుడైతే వైసిపికి వంశీ దగ్గరైపోయారో వెంటనే అధికారపార్టీలో రాజకీయాలు మొదలైపోయాయి. దాంతో వంశీ కేంద్రంగా అధికారపార్టీలో రోజురోజుకు వివాదాలు పెరిగిపోతున్నాయి.

వంశీ ఎంటర్ కాకముందు వైసిపిలో దుట్టా రామచంద్రరావు, యార్లగడ్డ వెంకట్రావు వర్గాలుండేవి. ఇద్దరు నేతల మధ్య పెద్ద సఖ్యత లేకపోయినా గొడవలు పడేంత శతృత్వం కూడా లేదు. అందులోను చాలా కాలం తర్వాత దుట్టా యాక్టివ్ అయ్యారు కాబట్టి గ్రూపులు పెద్దగా బయటపడకుండానే పార్టీ కార్యక్రమాలు జరిగిపోతున్నాయి. ఈ నేపధ్యంలోనే వంశీ వైసిపికి దగ్గరగా జరగటంతో ముందుగా యార్లగడ్డ అలర్టయ్యారు. వంశీ పార్టీలోకి చేర్చుకోవటాన్ని అప్పట్లో తీవ్రంగా వ్యతిరేకించారు. దాంతో ఈ పంచాయితీ జగన్మోహన్ రెడ్డి దగ్గరకు చేరింది. జగన్ తో భేటి తర్వాత యార్లగడ్డకు ఆప్కాబ్ ఛైర్మన్ పోస్టు దక్కటంతో మళ్ళీ యార్లగడ్డ ఎక్కడా మాట్లాడలేదు.

ఎప్పుడైతే యార్లగడ్డ సైలెంట్ అయిపోయారో అప్పటి నుండో దుట్టా సీన్ లోకి ఎంటరైపోయారు. దుట్టా యాక్టివ్ అయిన దగ్గర నుండి వంశీపై బాగా రైజ్ అయిపోతున్నారు. ఇదే సమయంలో శనివారం భావులపాడు మండలంలోని కాకులపాడు గ్రమాంలో రైతుభరోసా కేంద్రం శంకుస్ధాపన సందర్భంగా వంశీ-దుట్టా వర్గీయుల మధ్య పెద్ద గొడవైంది. ఇదే సమయంలో తన పుట్టిన రోజు సందర్భంగా నియోజకవర్టంలోని నున్నలో భారీ ర్యాలి తీసిన యార్లగడ్డ వంశీపై మండిపోయారు. దాంతో వంశీకి వ్యతిరేకంగా యార్లగడ్డ-దుట్టా వర్గాలు ఏకమైపోయాయా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.

గన్నవరం నియోజకవర్గంలోని గొడవలన్నీ చివరకు జగన్ దృష్టికి వెళ్ళాయి. అయితే ఢిల్లీ వెళ్ళే బిజీలో ఉన్న జగన్ వీటిపై దృష్టి పెట్టలేదు. ఢిల్లీ నుండి తిరిగొచ్చిన తర్వాత ఈ పంచాయితీ గురించి ఆలోచించే అవకాశం ఉంది. ఈలోగా జిల్లా ఇన్చార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమక్షంలో పంచాయితీ మొదలైంది. వంశీ-యార్లగడ్డ-దుట్టా పంచాయితీతో పార్టీ జనాల ముందు పలుచనైపోయిందన్నది వాస్తవం. ఈ వివాదానికి జగన్ ఎంత తొందరగా ముగింపు పలకక పోతే వంశీతో పాటు పార్టీ కూడా పలుచనైపోయవటం ఖాయం.

This post was last modified on October 6, 2020 1:05 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

3 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

3 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

4 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

5 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

6 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

8 hours ago