ఈనెల 8వ తేదీన జరగాల్సిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం మళ్ళీ వాయిదాపడింది. ప్రతి నెలలో రెండుసార్లు మంత్రివర్గ సమావేశాలు జరగాలని జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు. ఈ నిర్ణయానికి తగ్గట్లుగానే గడచిన 16 మాసాలుగా క్యాబినెట్ మీటింగ్ లు జరుగుతున్న విషయం అందరు చూస్తున్నదే. కానీ సెప్టెంబర్ లో జరగాల్సిన రెండో సమావేశం మాత్రం ఇప్పటికి వాయిదాల మీద వాయిదాలు పడుతోంది. పోయిన నెలలో రెండో క్యాబినెట్ మీటింగ్ 25వ తేదీన జరగాల్సుంది. అయితే అనివార్య కారణాల వల్ల అక్టోబర్ 1వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి.
సరే అక్టోబర్ 1వ తేదీన సమావేశం జరుగుతుంది కదా అని అనుకుంటే చివరి నిముషంలో దాన్ని కూడా వాయిదే వేశారు. సెప్టెంబర్ 30వ తేదీన ఈ విషయాన్ని ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. అయితే అక్టోబర్ 8వ తేదీకి క్యాబినెట్ సమావేశం వాయిదా వేస్తున్నట్లు అప్పట్లో ప్రకటించాయి. అయితే తాజాగా అక్టోబర్ 8వ తేదీన జరగాల్సిన సమావేశం కూడా వాయిదా పడినట్లు ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. జగన్ ఢిల్లీ పర్యటన కారణంగా క్యాబినెట్ సమావేశం వాయిదా పడిందని కూడా అనుకునేందుకు లేదు. ఎందుకంటే ఈరోజు అంటే మంగళవారం ప్రధానమంత్రితో భేటి తర్వాత జగన్ తిరిగి రాత్రికల్లా అమరావతికి తిరిగొచ్చేస్తారు.
ముఖ్యమంత్రి అధికారిక షెడ్యూల్ ప్రకారమే 8వ తేదీన క్యాబినెట్ సమావేశం జరపటానికి ఎటువంటి ఇబ్బందీ లేదు. అయినా సమావేశాన్ని వాయిదా వేయటం గమనార్హం. ఇప్పటికే మూడుసార్లు వాయిదాపడిన క్యాబినెట్ సమావేశం మళ్ళీ ఎప్పుడు జరుగుతుందో మాత్రం ప్రకటించలేదు. నిజానికి నెలలో రెండుసార్లు క్యాబినెట్ సమావేశం జరిపాల్సిన అవసరమైతే లేదనే చెప్పాలి. నెలలో ఒకసారి క్యాబినెట్ సమావేశం జరిపితే అందుకు అవసరమైన సబ్జెక్టులు ఉంటాయి. అదే ప్రతి 15 రోజులకు ఓ సమావేశం అంటే చర్చించేందుకు అసలు సబ్జెక్టులే ఉండవు. పైగా మంత్రులకు కూడా బొత్తిగా ఆసక్తి తగ్గిపోతుంది. ఇందుకనే గతంలో ముఖ్యమంత్రులుగా ఎవరున్నా నెలకు ఒకసారి మాత్రమే క్యాబినెట్ సమావేశం నిర్వహించేవారు.
This post was last modified on October 6, 2020 12:23 pm
ఎవరు ఔనన్నా కాదన్నా అఖండ తాండవం 2 బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న వైనం స్పష్టం. కొన్ని ఏరియాల్లో డీసెంట్ గా…
నిన్న జరిగిన రాజా సాబ్ సాంగ్ లాంచ్ ఈవెంట్ తర్వాత హీరోయిన్ నిధి అగర్వాల్ పట్ల అభిమానులు ప్రవర్తించిన తీరు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పుడు టాలీవుడ్ టాప్ స్టార్లలో ఒకడు. మెగాస్టార్ చిరంజీవి బ్రేక్ తీసుకున్నాక నంబర్ వన్ స్థానం…
కెరీర్లో ఎన్నడూ లేని విధంగా సుదీర్ఘ విరామం తీసుకున్న మంచు మనోజ్.. ఈ ఏడాదే రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.…
ఒకప్పుడు మలయాళ ఫిలిం ఇండస్ట్రీ టాప్ హీరోల్లో ఒకడిగా ఒక వెలుగు వెలిగాడు దిలీప్. మోహన్ లాల్, మమ్ముట్టిల తర్వాత…
‘పవన్ కల్యాణ్ డిఫరెంట్ ఫీల్డ్ నుంచి వచ్చారు. స్ట్రగుల్ అవుతున్నారు. అయినా బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తున్నారు’’ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు…