ఈనెల 8వ తేదీన జరగాల్సిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం మళ్ళీ వాయిదాపడింది. ప్రతి నెలలో రెండుసార్లు మంత్రివర్గ సమావేశాలు జరగాలని జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు. ఈ నిర్ణయానికి తగ్గట్లుగానే గడచిన 16 మాసాలుగా క్యాబినెట్ మీటింగ్ లు జరుగుతున్న విషయం అందరు చూస్తున్నదే. కానీ సెప్టెంబర్ లో జరగాల్సిన రెండో సమావేశం మాత్రం ఇప్పటికి వాయిదాల మీద వాయిదాలు పడుతోంది. పోయిన నెలలో రెండో క్యాబినెట్ మీటింగ్ 25వ తేదీన జరగాల్సుంది. అయితే అనివార్య కారణాల వల్ల అక్టోబర్ 1వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి.
సరే అక్టోబర్ 1వ తేదీన సమావేశం జరుగుతుంది కదా అని అనుకుంటే చివరి నిముషంలో దాన్ని కూడా వాయిదే వేశారు. సెప్టెంబర్ 30వ తేదీన ఈ విషయాన్ని ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. అయితే అక్టోబర్ 8వ తేదీకి క్యాబినెట్ సమావేశం వాయిదా వేస్తున్నట్లు అప్పట్లో ప్రకటించాయి. అయితే తాజాగా అక్టోబర్ 8వ తేదీన జరగాల్సిన సమావేశం కూడా వాయిదా పడినట్లు ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. జగన్ ఢిల్లీ పర్యటన కారణంగా క్యాబినెట్ సమావేశం వాయిదా పడిందని కూడా అనుకునేందుకు లేదు. ఎందుకంటే ఈరోజు అంటే మంగళవారం ప్రధానమంత్రితో భేటి తర్వాత జగన్ తిరిగి రాత్రికల్లా అమరావతికి తిరిగొచ్చేస్తారు.
ముఖ్యమంత్రి అధికారిక షెడ్యూల్ ప్రకారమే 8వ తేదీన క్యాబినెట్ సమావేశం జరపటానికి ఎటువంటి ఇబ్బందీ లేదు. అయినా సమావేశాన్ని వాయిదా వేయటం గమనార్హం. ఇప్పటికే మూడుసార్లు వాయిదాపడిన క్యాబినెట్ సమావేశం మళ్ళీ ఎప్పుడు జరుగుతుందో మాత్రం ప్రకటించలేదు. నిజానికి నెలలో రెండుసార్లు క్యాబినెట్ సమావేశం జరిపాల్సిన అవసరమైతే లేదనే చెప్పాలి. నెలలో ఒకసారి క్యాబినెట్ సమావేశం జరిపితే అందుకు అవసరమైన సబ్జెక్టులు ఉంటాయి. అదే ప్రతి 15 రోజులకు ఓ సమావేశం అంటే చర్చించేందుకు అసలు సబ్జెక్టులే ఉండవు. పైగా మంత్రులకు కూడా బొత్తిగా ఆసక్తి తగ్గిపోతుంది. ఇందుకనే గతంలో ముఖ్యమంత్రులుగా ఎవరున్నా నెలకు ఒకసారి మాత్రమే క్యాబినెట్ సమావేశం నిర్వహించేవారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్.. తన వ్యూహాన్ని దాదాపు తేల్చేశారు. రాజకీయంగా తనకు ఉన్న లక్ష్యాన్ని కూడా వివరించారు. దేశాన్ని…
ఇప్పుడంతా అప్ డేటెడ్ వెర్షన్లే వినిపిస్తున్నాయి. వ్యవహారికంతో పాటుగా పాలిటిక్స్ లోనూ నయా తరం వచ్చేసింది. ఆ ఫలితమే జన్…
మెగా డీఎస్సీ పరీక్షలు జరిగి దాదాపు ఏడాది అవుతోంది. సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఉద్యోగాల్లో చేరి ఆరు నెలలు దాటిపోయింది.…
కొన్ని నెలల క్రితం అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి ఒక ప్రకటన వెలువడింది. 2027 సంక్రాంతికి థియేటర్లను బ్లాస్ట్ చేయబోతున్నాం అనే…
గత ఏడాది పవన్ కళ్యాణ్ ఓజితో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. కెరీర్ లో మొదటిసారి మూడు వందల కోట్ల క్లబ్బులోకి…
సీనియర్లలో ఎక్కువ వేగంగా సినిమాలు చేస్తున్న హీరోల్లో మొదటి స్థానం బాలకృష్ణకే ఇవ్వాలి. ఎందుకంటే భోళాశంకర్ తర్వాత చిరంజీవి ఏకంగా…