ఈనెల 8వ తేదీన జరగాల్సిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం మళ్ళీ వాయిదాపడింది. ప్రతి నెలలో రెండుసార్లు మంత్రివర్గ సమావేశాలు జరగాలని జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు. ఈ నిర్ణయానికి తగ్గట్లుగానే గడచిన 16 మాసాలుగా క్యాబినెట్ మీటింగ్ లు జరుగుతున్న విషయం అందరు చూస్తున్నదే. కానీ సెప్టెంబర్ లో జరగాల్సిన రెండో సమావేశం మాత్రం ఇప్పటికి వాయిదాల మీద వాయిదాలు పడుతోంది. పోయిన నెలలో రెండో క్యాబినెట్ మీటింగ్ 25వ తేదీన జరగాల్సుంది. అయితే అనివార్య కారణాల వల్ల అక్టోబర్ 1వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి.
సరే అక్టోబర్ 1వ తేదీన సమావేశం జరుగుతుంది కదా అని అనుకుంటే చివరి నిముషంలో దాన్ని కూడా వాయిదే వేశారు. సెప్టెంబర్ 30వ తేదీన ఈ విషయాన్ని ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. అయితే అక్టోబర్ 8వ తేదీకి క్యాబినెట్ సమావేశం వాయిదా వేస్తున్నట్లు అప్పట్లో ప్రకటించాయి. అయితే తాజాగా అక్టోబర్ 8వ తేదీన జరగాల్సిన సమావేశం కూడా వాయిదా పడినట్లు ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. జగన్ ఢిల్లీ పర్యటన కారణంగా క్యాబినెట్ సమావేశం వాయిదా పడిందని కూడా అనుకునేందుకు లేదు. ఎందుకంటే ఈరోజు అంటే మంగళవారం ప్రధానమంత్రితో భేటి తర్వాత జగన్ తిరిగి రాత్రికల్లా అమరావతికి తిరిగొచ్చేస్తారు.
ముఖ్యమంత్రి అధికారిక షెడ్యూల్ ప్రకారమే 8వ తేదీన క్యాబినెట్ సమావేశం జరపటానికి ఎటువంటి ఇబ్బందీ లేదు. అయినా సమావేశాన్ని వాయిదా వేయటం గమనార్హం. ఇప్పటికే మూడుసార్లు వాయిదాపడిన క్యాబినెట్ సమావేశం మళ్ళీ ఎప్పుడు జరుగుతుందో మాత్రం ప్రకటించలేదు. నిజానికి నెలలో రెండుసార్లు క్యాబినెట్ సమావేశం జరిపాల్సిన అవసరమైతే లేదనే చెప్పాలి. నెలలో ఒకసారి క్యాబినెట్ సమావేశం జరిపితే అందుకు అవసరమైన సబ్జెక్టులు ఉంటాయి. అదే ప్రతి 15 రోజులకు ఓ సమావేశం అంటే చర్చించేందుకు అసలు సబ్జెక్టులే ఉండవు. పైగా మంత్రులకు కూడా బొత్తిగా ఆసక్తి తగ్గిపోతుంది. ఇందుకనే గతంలో ముఖ్యమంత్రులుగా ఎవరున్నా నెలకు ఒకసారి మాత్రమే క్యాబినెట్ సమావేశం నిర్వహించేవారు.
This post was last modified on October 6, 2020 12:23 pm
అల్లరి నరేష్ కొత్త సినిమా ఆల్కహాల్ టీజర్ వచ్చి అయిదు నెలలు దాటేసింది. దాంట్లో ప్రకటించిన విడుదల తేదీ జనవరి…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కేవలం హీరోయిజం ఉన్న పాత్రలే చేస్తానని ఎప్పుడూ కట్టుబడరు. అందుకే నాలుగు…
టాలీవుడ్లో మంచి అనుబంధం ఉన్న అగ్ర నిర్మాతల్లో దిల్ రాజు, నాగవంశీలది ఒకటి. ఇద్దరికి బిజినెస్ పరంగా గట్టి బంధమే…
ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి కుటుంబాన్ని సంతోషంలో ముంచెత్తే పరిణామం చోటుచేసుకుంది. చిరు తనయుడు రామ్ చరణ్ కవల పిల్లలకు తండ్రి…
రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు.. ఈ వార్త నిజం కావడానికి దశాబ్దంన్నర పాటు ఎదురు చూడాల్సి వచ్చింది అభిమానులు. వీరి…
రామ్ గోపాల్ వర్మ సత్యతో స్టార్ ఆర్టిస్టుగా మారిపోయిన మనోజ్ బాజ్ పాయ్ తెలుగులోనూ హ్యాపీ, ప్రేమకథ, కొమరం పులి…