వైసీపీ ఎమ్మెల్యేలకు వాయిస్ లేకుండా పోయిందా? ఎక్కడా వారు కనిపించకపోవడానికి తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయమే కారణమా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. టీడీపీ విపక్షంలో ఉన్నప్పు డు.. ఎమ్మెల్యేలు.. సభకు వెళ్లి ప్రభుత్వాన్ని నిలదీసేవారు. ఆ తర్వాత.. వారే.. బయటకు వచ్చి.. మీడియా ముందు నిప్పులు చెరిగేవారు. దీంతో టీడీపీ సభ్యుల వ్యవహారం ప్రజల మధ్య చర్చకు వచ్చేది. వారు ఏం చేస్తున్నారో ప్రజలకు తెలిసేది. మీడియాలో కూడా వచ్చేది.
మరి వైసీపీ ఎమ్మెల్యేలు ఏమయ్యారు? అనేది చూస్తే.. ఎవరికి వారు నిమిత్త మాత్రులుగా ఉండిపోయారు. నిజానికి బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఇవి ప్రారంభమై కూడా పది రోజులు అయ్యాయి. ఈ పది రోజుల కాలంలో సభకు వెళ్లలేదు సరే. అధినేత గీసిన గీత దాటలేదు అనుకుందాం. కానీ, మీడియా ముందుకు అయినా రావాలి కదా? అంటే.. ఎక్కడా వారు కనిపించడం లేదు. ఒక్కరంటే ఒక్కరు కూడా మీడియా ముందుకు రాలేదు. కనీసం సభల్లో జరుగుతున్న వ్యవహారాల గురించి కూడా స్పందించలేదు.
ఒక్క జగన్ మాత్రమే ఇంటి నుంచి మీడియాతో మాట్లాడుతున్నారు. అంతకుమించి ఆయన కూడా ఏమీ చేయడం లేదు. ప్రతి విషయాన్ని విమర్శించాలని ప్రయత్నిస్తున్నా.. ఎదురు దాడే కనిపిస్తోంది. ఇదిలావుంటే.. మిగిలిన 10 మంది ఎమ్మెల్యేలైనా మీడియా ముందుకు వచ్చి.. వాయిస్ వినిపించాలి కదా? అంటే మౌనమే సమాధానంగా ఉంది. కనీసం వారి వారి నియోజకవర్గాల్లోనూ మీడియాతో మాట్లాడడం లేదు.
దీనిని బట్టి పార్టీ హైకమాండే వారిని నియంత్రించిందా? లేక.. వారే నియంత్రణకు గురయ్యారా? అనేది ప్రశ్న. ఎందుకంటే.. సమావేశాలకు వెళ్లపోయినా.. ప్రజలు ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారనే అంశంపై నిశితంగా చూస్తారు. తమ సమస్యలపై ఎలా స్పందిస్తారోనని ఎదురు చూస్తారు. కానీ, వైసీపీ లో ఉన్న 10 మంది ఎమ్మెల్యేలు కూడా మౌనంగా ఉన్నారు. నిజానికి ఇప్పుడు పీఏసీ సహా ఇతర పదవుల విషయం చర్చకు వచ్చింది కాబట్టి పెద్దిరెడ్డి వంటివారి పేర్లు వినిపిస్తున్నాయి. లేకపోతే.. ఇన్ని మాసాలుగా వారి అజా ఎక్కడుందో కూడా తెలియడంలేదు.
This post was last modified on November 23, 2024 1:01 pm
పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…