Political News

ఆ ప‌దిమంది ఎమ‌య్యారు… వాయిస్ లేకుండా పోయిందా?

వైసీపీ ఎమ్మెల్యేల‌కు వాయిస్ లేకుండా పోయిందా? ఎక్క‌డా వారు క‌నిపించ‌క‌పోవ‌డానికి తాడేప‌ల్లిలోని కేంద్ర కార్యాల‌య‌మే కార‌ణ‌మా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. టీడీపీ విప‌క్షంలో ఉన్న‌ప్పు డు.. ఎమ్మెల్యేలు.. స‌భ‌కు వెళ్లి ప్ర‌భుత్వాన్ని నిల‌దీసేవారు. ఆ త‌ర్వాత‌.. వారే.. బ‌య‌ట‌కు వ‌చ్చి.. మీడియా ముందు నిప్పులు చెరిగేవారు. దీంతో టీడీపీ స‌భ్యుల వ్య‌వ‌హారం ప్ర‌జ‌ల మ‌ధ్య చ‌ర్చ‌కు వ‌చ్చేది. వారు ఏం చేస్తున్నారో ప్ర‌జ‌ల‌కు తెలిసేది. మీడియాలో కూడా వ‌చ్చేది.

మ‌రి వైసీపీ ఎమ్మెల్యేలు ఏమ‌య్యారు? అనేది చూస్తే.. ఎవ‌రికి వారు నిమిత్త మాత్రులుగా ఉండిపోయారు. నిజానికి బ‌డ్జెట్ స‌మావేశాలు జ‌రుగుతున్నాయి. ఇవి ప్రారంభ‌మై కూడా ప‌ది రోజులు అయ్యాయి. ఈ ప‌ది రోజుల కాలంలో స‌భ‌కు వెళ్లలేదు స‌రే. అధినేత గీసిన గీత దాట‌లేదు అనుకుందాం. కానీ, మీడియా ముందుకు అయినా రావాలి క‌దా? అంటే.. ఎక్క‌డా వారు క‌నిపించ‌డం లేదు. ఒక్క‌రంటే ఒక్క‌రు కూడా మీడియా ముందుకు రాలేదు. క‌నీసం స‌భ‌ల్లో జ‌రుగుతున్న వ్య‌వ‌హారాల గురించి కూడా స్పందించ‌లేదు.

ఒక్క జ‌గ‌న్ మాత్ర‌మే ఇంటి నుంచి మీడియాతో మాట్లాడుతున్నారు. అంత‌కుమించి ఆయ‌న కూడా ఏమీ చేయ‌డం లేదు. ప్ర‌తి విష‌యాన్ని విమ‌ర్శించాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నా.. ఎదురు దాడే క‌నిపిస్తోంది. ఇదిలావుంటే.. మిగిలిన 10 మంది ఎమ్మెల్యేలైనా మీడియా ముందుకు వ‌చ్చి.. వాయిస్ వినిపించాలి క‌దా? అంటే మౌన‌మే స‌మాధానంగా ఉంది. క‌నీసం వారి వారి నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ మీడియాతో మాట్లాడ‌డం లేదు.

దీనిని బట్టి పార్టీ హైక‌మాండే వారిని నియంత్రించిందా? లేక‌.. వారే నియంత్ర‌ణ‌కు గుర‌య్యారా? అనేది ప్ర‌శ్న‌. ఎందుకంటే.. స‌మావేశాల‌కు వెళ్ల‌పోయినా.. ప్ర‌జ‌లు ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నార‌నే అంశంపై నిశితంగా చూస్తారు. త‌మ స‌మ‌స్య‌ల‌పై ఎలా స్పందిస్తారోన‌ని ఎదురు చూస్తారు. కానీ, వైసీపీ లో ఉన్న 10 మంది ఎమ్మెల్యేలు కూడా మౌనంగా ఉన్నారు. నిజానికి ఇప్పుడు పీఏసీ స‌హా ఇత‌ర ప‌ద‌వుల విష‌యం చ‌ర్చ‌కు వ‌చ్చింది కాబ‌ట్టి పెద్దిరెడ్డి వంటివారి పేర్లు వినిపిస్తున్నాయి. లేక‌పోతే.. ఇన్ని మాసాలుగా వారి అజా ఎక్క‌డుందో కూడా తెలియ‌డంలేదు.

This post was last modified on November 23, 2024 1:01 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రావిపుడి రామాయణం తీస్తే?

వరస బ్లాక్ బస్టర్లతో విజయాలను వదలని విక్రమార్కుడిలా దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి నెక్స్ట్ వెంకటేష్ - కళ్యాణ్ రామ్…

7 minutes ago

`గూగుల్‌`కు కొబ్బ‌రికాయ కొట్టేస్తున్నారు!

ఏపీలో కీల‌క ఘ‌ట్టానికి కూట‌మి ప్ర‌భుత్వం తెరదీయ‌నుంది. `గూగుల్ డేటా` కేంద్రానికి కొబ్బ‌రికాయ కొట్టేందుకు సిద్ధ‌మైంది. గ‌త ఏడాది ఈ…

30 minutes ago

మాస్ మసాలా వదలని నాగశౌర్య

రంగబలి తర్వాత నాగశౌర్య తెరమీద కనిపించి రెండేళ్లు దాటిపోయింది. వరస డిజాస్టర్లతో మార్కెట్ డ్యామేజ్ అయిన టైంలో సరైన కంబ్యాక్…

50 minutes ago

కేంద్రంలో పవన్ పట్టు పిఠాపురానికి వరం

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను గెలిపించుకున్న పిఠాపురం ప్రజలు... ఇప్పుడు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలోని దాదాపుగా అన్ని…

1 hour ago

జోష్ సినిమా ఆడదని ముందే తెలుసా?

టాలీవుడ్లో పెద్ద కుటుంబాల నుంచి వచ్చిన యువ కథానాయకుల్లో అత్యంత ఆడంబరంగా జరిగిన అరంగేట్రం అక్కినేని నాగచైతన్యదే అని చెప్పొచ్చు. టాలీవుడ్లో నంబర్…

1 hour ago

9 మందికి పోలీసులకు ఉరిశిక్ష… సంచలన తీర్పు

తమిళనాడులోని:సాతాంకుళం లాకప్ డెత్ కేసులో మదురైలోని ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2020లో…

2 hours ago