Political News

మ‌ఠాల‌ను మార్చేశారు.. జ‌గ‌న్ ఐడియా ఏంటి?

వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. గ‌తంలో మ‌ఠానికి వెళ్లిన విష‌యం తెలిసిందే. విశాఖ‌ప‌ట్నంలోని శార‌దా పీఠానికి వెళ్లి ప్ర‌త్యేక పూజ‌లు.. హోమాలు చేశారు. చేయించారు కూడా. 2019 ఎన్నిక‌ల‌కు ముందు జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి కావాలంటూ.. శార‌దా పీఠాధిప‌తి స్వ‌రూపానందేంద్ర స్వామి ప్ర‌త్యేక హోమాలు చేశారు. అదేస‌మయంలో జ‌గ‌న్‌ను ఆశీర్వ‌దించారు కూడా. జ‌గ‌న్ కూడా త‌న పాద‌యాత్ర స‌మ‌యంలోనూ.. సీఎం అయ్యాక కూడా ప‌లు మార్లు శార‌దా పీఠానికి వెళ్లి స్వామి ఆశీస్సులు తీసుకున్నారు.

ఇది అంద‌రికీ తెలిసిందే. ఈ క్ర‌మంలోనే ఆయ‌న అధికారంలో ఉన్న‌స‌మ‌యంలో శార‌దా పీఠానికి పెద్ద ఎత్తున ల‌బ్ధి చేకూర్చార‌న్న వాద‌న కూడా ఉంది. ఇటు విశాఖ‌లోనూ.. అటు తిరుమ‌ల‌లోనూ మ‌ఠానికి భూములు కేటాయించారు. లీజులు కూడా ఇచ్చారు. తాజాగా కూట‌మి స‌ర్కారు వీటిని ర‌ద్దు చేసింది. అంతేకాదు.. స‌భ‌లోనూ గురు ద‌క్షిణ ఇచ్చారంటూ.. జ‌గ‌న్‌ను కూట‌మి పార్టీల ఎంపీలు, మంత్రులు ఏకేశారు. ఇక‌, ఇంత జ‌రిగినా శార‌దా పీఠం నుంచి ఎలాంటి ప్ర‌క‌ట‌న‌లూ రాలేదు.

క‌ట్ చేస్తే.. శార‌దా పీఠానికి తాను భూములు అప్ప‌నంగా కేటాయించానంటూ.. కూట‌మి మంత్రులు విమ ర్శ‌లు చేసినా.. జ‌గ‌న్ స్పందించ‌లేదు. పైగా.. ఆయ‌న మ‌ఠాన్ని మార్చేయ‌డం ఇప్పుడు ఆస‌క్తిగా మారింది. నిన్న మొన్న‌టి వ‌ర‌కు అధికారంలో ఉండ‌గా.. ఆయ‌న శార‌దా పీఠానికి వెళ్లారు. స్వ‌రూపానందేంద్ర‌ను పూజించారు. ఇక‌, ఇప్పుడు ఆ మ‌ఠంపై ఆరోప‌ణ‌లు రాగానే.. జ‌గ‌న్ జెండా మార్చేసిన‌ట్టు మ‌ఠాన్ని మార్చేయ‌డం రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌కు దారితీసింది.

తాజాగా ఆయ‌న క‌ర్ణాట‌క‌లోని శృంగేరీ జ‌గ‌ద్గురు భార‌తీ తీర్థ మ‌హాస్వామి ఉత్త‌రాధికారిగా ఉన్న విదుశేఖ‌ర స్వామిని క‌లుసుకున్నారు. విదుశేఖ‌ర స్వామి.. విజ‌య‌వాడ‌కు వ‌చ్చారు. ఈ విష‌యం తెలుసుకున్న జ‌గ‌న్‌.. ఆఘ‌మేఘాల‌పై స్వామిని క‌లుసుకుని.. దాదాపు రెండు గంట‌ల పాటు చ‌ర్చ‌లు జ‌రిపారు. మ‌రి ఆయ‌న ఏం మాట్లాడారో తెలియదు కానీ.. ఈ చ‌ర్చ‌ల‌కు మాత్రం ప్రాధాన్యం ఏర్ప‌డింది. క‌ర్ణాట‌క‌లోని శృంగేరీ మ‌ఠానికి.. కేంద్రంలోని బీజేపీ పెద్ద‌ల‌కు మ‌ధ్య అవినాభావ సంబంధం ఉన్న విష‌యం తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్ నేరుగా వెళ్లి విదుశేఖ‌ర‌స్వామిని క‌లుసుకుని రెండు గంట‌లు చ‌ర్చించ‌డం ఆస‌క్తిగా మారింది. పైగా ఆయ‌న అసెంబ్లీకి వెళ్ల‌కుండా.. మ‌ఠాధిప‌తుల‌ను క‌లుసుకోవ‌డం మ‌రింత చిత్రంగా ఉందని అంటున్నారు ప‌రిశీల‌కులు. దీనివెనుక ఏం జ‌రిగింది? రాజ‌కీయ ప్ర‌యోజ‌నాలు ఏంటి? అనేది త్వ‌ర‌లో వెలుగు చూసే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

This post was last modified on November 21, 2024 10:50 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

బ్లాక్ బస్టర్ పాటలకు పెన్ను పెట్టకుండా ఎలా?

వేటూరి, సిరివెన్నెల లాంటి దిగ్గజ గేయ రచయితలు వెళ్ళిపోయాక తెలుగు సినీ పాటల స్థాయి తగ్గిపోయిందని సాహితీ అభిమానులు బాధ…

53 minutes ago

పవన్… ‘ఒక్కరోజు విలేజ్’ పిలుపు ఫలించేనా?

నెల‌లో ఒక్క‌రోజు గ్రామీణ ప్రాంతాల‌కు రావాలని.. ఇక్క‌డి వారికి వైద్య సేవ‌లు అందించాల‌ని డాక్ట‌ర్ల‌కు ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్…

5 hours ago

బాబీ గారు… ప్రేక్షకులు ఎప్పుడైనా రైటే

భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…

10 hours ago

‘ఇవేవీ తెలియకుండా జగన్ సీఎం ఎలా అయ్యాడో’

వైసీపీ అధినేత జగన్‌పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…

11 hours ago

అఫీషియల్: తెలంగాణ ఎన్నికల్లో జనసేన పోటీ

తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…

11 hours ago

‘నువ్వు బ‌జారోడివి కాదు’… అనిల్ మీమ్ పంచ్

సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయ‌డంలో తెలుగు వాళ్ల‌ను మించిన వాళ్లు ఇంకెవ్వ‌రూ ఉండ‌రంటే అతిశ‌యోక్తి కాదు. కొన్ని మీమ్స్…

12 hours ago