Political News

మ‌ఠాల‌ను మార్చేశారు.. జ‌గ‌న్ ఐడియా ఏంటి?

వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. గ‌తంలో మ‌ఠానికి వెళ్లిన విష‌యం తెలిసిందే. విశాఖ‌ప‌ట్నంలోని శార‌దా పీఠానికి వెళ్లి ప్ర‌త్యేక పూజ‌లు.. హోమాలు చేశారు. చేయించారు కూడా. 2019 ఎన్నిక‌ల‌కు ముందు జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి కావాలంటూ.. శార‌దా పీఠాధిప‌తి స్వ‌రూపానందేంద్ర స్వామి ప్ర‌త్యేక హోమాలు చేశారు. అదేస‌మయంలో జ‌గ‌న్‌ను ఆశీర్వ‌దించారు కూడా. జ‌గ‌న్ కూడా త‌న పాద‌యాత్ర స‌మ‌యంలోనూ.. సీఎం అయ్యాక కూడా ప‌లు మార్లు శార‌దా పీఠానికి వెళ్లి స్వామి ఆశీస్సులు తీసుకున్నారు.

ఇది అంద‌రికీ తెలిసిందే. ఈ క్ర‌మంలోనే ఆయ‌న అధికారంలో ఉన్న‌స‌మ‌యంలో శార‌దా పీఠానికి పెద్ద ఎత్తున ల‌బ్ధి చేకూర్చార‌న్న వాద‌న కూడా ఉంది. ఇటు విశాఖ‌లోనూ.. అటు తిరుమ‌ల‌లోనూ మ‌ఠానికి భూములు కేటాయించారు. లీజులు కూడా ఇచ్చారు. తాజాగా కూట‌మి స‌ర్కారు వీటిని ర‌ద్దు చేసింది. అంతేకాదు.. స‌భ‌లోనూ గురు ద‌క్షిణ ఇచ్చారంటూ.. జ‌గ‌న్‌ను కూట‌మి పార్టీల ఎంపీలు, మంత్రులు ఏకేశారు. ఇక‌, ఇంత జ‌రిగినా శార‌దా పీఠం నుంచి ఎలాంటి ప్ర‌క‌ట‌న‌లూ రాలేదు.

క‌ట్ చేస్తే.. శార‌దా పీఠానికి తాను భూములు అప్ప‌నంగా కేటాయించానంటూ.. కూట‌మి మంత్రులు విమ ర్శ‌లు చేసినా.. జ‌గ‌న్ స్పందించ‌లేదు. పైగా.. ఆయ‌న మ‌ఠాన్ని మార్చేయ‌డం ఇప్పుడు ఆస‌క్తిగా మారింది. నిన్న మొన్న‌టి వ‌ర‌కు అధికారంలో ఉండ‌గా.. ఆయ‌న శార‌దా పీఠానికి వెళ్లారు. స్వ‌రూపానందేంద్ర‌ను పూజించారు. ఇక‌, ఇప్పుడు ఆ మ‌ఠంపై ఆరోప‌ణ‌లు రాగానే.. జ‌గ‌న్ జెండా మార్చేసిన‌ట్టు మ‌ఠాన్ని మార్చేయ‌డం రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌కు దారితీసింది.

తాజాగా ఆయ‌న క‌ర్ణాట‌క‌లోని శృంగేరీ జ‌గ‌ద్గురు భార‌తీ తీర్థ మ‌హాస్వామి ఉత్త‌రాధికారిగా ఉన్న విదుశేఖ‌ర స్వామిని క‌లుసుకున్నారు. విదుశేఖ‌ర స్వామి.. విజ‌య‌వాడ‌కు వ‌చ్చారు. ఈ విష‌యం తెలుసుకున్న జ‌గ‌న్‌.. ఆఘ‌మేఘాల‌పై స్వామిని క‌లుసుకుని.. దాదాపు రెండు గంట‌ల పాటు చ‌ర్చ‌లు జ‌రిపారు. మ‌రి ఆయ‌న ఏం మాట్లాడారో తెలియదు కానీ.. ఈ చ‌ర్చ‌ల‌కు మాత్రం ప్రాధాన్యం ఏర్ప‌డింది. క‌ర్ణాట‌క‌లోని శృంగేరీ మ‌ఠానికి.. కేంద్రంలోని బీజేపీ పెద్ద‌ల‌కు మ‌ధ్య అవినాభావ సంబంధం ఉన్న విష‌యం తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్ నేరుగా వెళ్లి విదుశేఖ‌ర‌స్వామిని క‌లుసుకుని రెండు గంట‌లు చ‌ర్చించ‌డం ఆస‌క్తిగా మారింది. పైగా ఆయ‌న అసెంబ్లీకి వెళ్ల‌కుండా.. మ‌ఠాధిప‌తుల‌ను క‌లుసుకోవ‌డం మ‌రింత చిత్రంగా ఉందని అంటున్నారు ప‌రిశీల‌కులు. దీనివెనుక ఏం జ‌రిగింది? రాజ‌కీయ ప్ర‌యోజ‌నాలు ఏంటి? అనేది త్వ‌ర‌లో వెలుగు చూసే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

This post was last modified on November 21, 2024 10:50 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

దురంధ‌ర్ ఇప్పుడు… పవన్ ఎప్పుడో!

దురంధ‌ర్‌.. చాలా ఏళ్ల త‌ర్వాత భార‌తీయ సినిమాలో బాలీవుడ్ త‌లెత్తుకునేలా చేసిన సినిమా. గ‌త ఏడాది ఛావా, సైయారా సినిమాలు…

2 hours ago

జ‌న‌నాయ‌గ‌న్ సంక్షోభం… నోరు విప్పిన విజ‌య్

త‌మిళంలో కొన్నేళ్లుగా నంబ‌ర్ వ‌న్ హీరోగా కొన‌సాగుతున్న విజ‌య్.. పూర్తి స్థాయి రాజ‌కీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నిక‌ల బ‌రిలోకి దిగే…

12 hours ago

బిగ్ బ్రేకింగ్: అంబటి రాంబాబు అరెస్ట్!

తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…

12 hours ago

ఆఖరి పోరులో కివీస్‌ను చిత్తు చేసిన టీమిండియా!

న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…

12 hours ago

అంబటికి సినిమా చూపిస్తామన్న పెమ్మసాని

తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…

14 hours ago

సిట్ నోటీసులను లాజిక్ తో కొట్టిన కేసీఆర్

ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్‌ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…

15 hours ago