Political News

జ‌గ‌న్ ఫార్ములా..: వైసీపీలో ఎనిమిది బంతులు!!

వైసీపీలో కొత్త చ‌ర్చ‌, ర‌చ్చ తెర‌మీదికి వ‌చ్చింది. వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్ చెప్పిన ఫార్ములా.. ‘ఒక బంతిని ఎంత గ‌ట్టిగా అదిమి పెట్టి కొడితే.. అది అంతే బ‌లంగా ఎదురొస్తుంది’ ఇప్పుడు వైసీపీలోనూ వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. ప్ర‌స్తుతం న‌లుగురు కొత్త ముఖాల‌తోపాటు.. రెండోసారి ఎన్నికైన ఎమ్మెల్యేలు వైసీపీ ఎనిమిది మంది వ‌ర‌కు ఉన్నారు. ఇక‌, మిగిలిన వారిలో జ‌గ‌న్‌, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వంటివారు ఉన్నారు. సో.. వీరిద్ద‌రు ముగ్గురిని ప‌క్క‌న పెడితే.. మిగిలిన ఎనిమిది మంది.. బంతుల మాదిరిగా రియాక్ట్ అయ్యే అవ‌కాశం ఉంద‌ని.. తాజాగా అసెంబ్లీ లాబీల్లో కూట‌మి పార్టీల ఎమ్మెల్యేల మ‌ధ్య చ‌ర్చ‌కు రావ‌డం గ‌మ‌నార్హం.

“వాస్త‌వానికి ఒక పార్టీ టికెట్ ఇచ్చిన త‌ర్వాత‌.. ఆ పార్టీ స‌భ్యుడిగా ఉండ‌డం వ‌ర‌కు త‌ప్పులేదు. అయితే.. నియంతృత్వాన్ని మాత్రం స‌ద‌రు స‌భ్యుడు పాటించాల్సిన అవ‌స‌రం లేదు” అని మ‌హారాష్ట్రలో 2021లో చోటు చేసుకున్న రాజ‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో సుప్రీంకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. అప్ప‌ట్లో శివ‌సేన చీలిపోయి.. ఏక్‌నాథ్ షిండే సీఎం కావ‌డం.. ఆయ‌న వెంట 20 మందికిపైగా ఎమ్మెల్యేలు బ‌య‌ట‌కు రావ‌డం తెలిసిందే. ఈ క్ర‌మంలో శివ‌సేన అప్ప‌టి చీఫ్ .. సుప్రీంకోర్టును ఆశ్ర‌యించి.. శివ‌సేన లెజిస్లేచ‌ర్ పార్టీ నాయ‌కుడిగా తాను గీసిన గీత దాటారంటూ వాద‌న‌లు వినిపించారు. అయితే.. ఈ వాద‌న‌ను కోర్టు కొట్టి వేసింది.

టికెట్ ఇవ్వ‌డం వ‌ర‌కు ఉన్న స్వ‌తంత్రం.. స‌ద‌రు అభ్య‌ర్థిని స‌భ‌కు వెళ్ల‌కుండా అడ్డుకోజాల‌ద‌ని ధ‌ర్మాస‌నం వ్యాఖ్యానించింది. ఇప్పుడు ఈ తీర్పు+ జ‌గ‌న్ చెప్పిన బంతి ఫార్ములా వెర‌సి.. వైసీపీలో 8 మంది ఎమ్మెల్యేలు.. యూట‌ర్న్ తీసుకుంటార‌న్న‌ది కూట‌మి ఎమ్మెల్యేల మ‌ధ్య జ‌రుగుతున్న చ‌ర్చ‌. అంటే.. స‌భ‌కు రావాల‌ని భావిస్తున్న వైసీపీ ఎమ్మెల్యేలు.. జ‌గ‌న్ అణిచి వేత‌ను ఇక‌, భ‌రించ‌లేర‌ని.. త‌మ‌కు కూడా వ్య‌క్తిత్వం ఉంద‌న్న భావ‌న‌తో ఉన్నార‌ని.. కూట‌మి పార్టీల ఎమ్మెల్యేలు గుస‌గుస‌లాడుతు న్నారు. ఈ క్ర‌మంలో జ‌గ‌న్ ను కాద‌ని వారు స‌భ‌కు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని.. దీనికి న్యాయ ర‌క్ష‌ణ కూడా ఉంది కాబ‌ట్టి వారిని ఆప‌డం క‌ష్ట‌మేన‌ని వ్యాఖ్యానిస్తున్నారు.

అంతేకాదు.. జ‌గ‌న్ చెప్పిన బంతి ఫార్ములా(ఎంత బ‌లంగా అదిమి పెడితే అంతే బ‌లంగా ఎగురుతుంది) ప్ర‌కారం.. వైసీపీ ఎమ్మెల్యేల‌ను ఎంత నియంతృత్వ ధోర‌ణితో అణిచేస్తే.. అంతే వారిలో తిరుగు బాటు వ‌స్తుంద‌ని కూడా అంచ‌నా వేస్తున్నారు. వారు జ‌గ‌న్‌కు సానుకూలంగా ఉన్నా.. ప్ర‌జ‌లకు రేపు ఎమ్మెల్యేలు స‌మాధానం చెప్పాల్సి ఉంటుంద‌ని.. అందుకే వారు ఏక్షణంలో అయినానిర్ణ‌యం తీసుకునే ఛాన్స్ ఉంద‌ని కూట‌మి పార్టీల ఎమ్మెల్యేలు లాబీల్లో వ్యాఖ్యానిస్తుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

This post was last modified on November 19, 2024 9:56 am

Share

Recent Posts

బ్రేకప్ బాధ నుంచి బ‌య‌ట‌ప‌డ్డ‌ట్లేనా?

క‌థానాయిక‌గా మ‌ల‌యాళంలో ప‌రిచ‌యం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవ‌కాశాలు అందుకున్న అమ్మాయి అనుప‌మ ప‌ర‌మేశ్వ‌రన్. ఆమె కెరీర్లో ఎక్కువ…

1 hour ago

ఎయిర్ పోర్టు లేకపోతే పిల్లనివ్వరా..?

వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…

2 hours ago

శర్వానంద్ రిలీజులకు కొత్త చిక్కుముడి

శర్వానంద్ ఈ ఏడాది నాలుగు నెలల గ్యాప్ లో రెండు సినిమాలు ఇచ్చాడు. నారి నారి నడుమ మురారి విపరీతమైన…

2 hours ago

ఊర్మిళను పెళ్లాడిన వర్మ?

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కెరీర్ పతాక స్థాయిలో ఉన్నపుడు ఆయనకు, కథానాయికలకు మధ్య లింకులు పెడుతూ అనేక వార్తలు వచ్చాయి. అందులో ఎక్కువ చర్చనీయాంశం…

2 hours ago

భోగాపురం క్రెడిట్ కోసం వైసీపీ తంటాలు…

వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు ఏపీ ప్ర‌జ‌లు థ్యాంక్స్ చెబుతున్నారంటూ.. ఆ పార్టీ సోష‌ల్ మీడియా ఊద‌ర గొడుతోంది. అంతేకాదు.. గ‌త…

3 hours ago

స్పైడర్ మ్యాన్ సక్సెస్… ఏ పాఠం నేర్చుకోవాలి

సూపర్ స్టార్ కృష్ణ సోదరులు, సీనియర్ నిర్మాత ఆదిశేషగిరిరావు ఇవాళ జరిగిన శ్రీనివాస మంగాపురం ఈవెంట్ లో ఒక మాట…

3 hours ago