Political News

జ‌గ‌న్ ఫార్ములా..: వైసీపీలో ఎనిమిది బంతులు!!

వైసీపీలో కొత్త చ‌ర్చ‌, ర‌చ్చ తెర‌మీదికి వ‌చ్చింది. వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్ చెప్పిన ఫార్ములా.. ‘ఒక బంతిని ఎంత గ‌ట్టిగా అదిమి పెట్టి కొడితే.. అది అంతే బ‌లంగా ఎదురొస్తుంది’ ఇప్పుడు వైసీపీలోనూ వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. ప్ర‌స్తుతం న‌లుగురు కొత్త ముఖాల‌తోపాటు.. రెండోసారి ఎన్నికైన ఎమ్మెల్యేలు వైసీపీ ఎనిమిది మంది వ‌ర‌కు ఉన్నారు. ఇక‌, మిగిలిన వారిలో జ‌గ‌న్‌, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వంటివారు ఉన్నారు. సో.. వీరిద్ద‌రు ముగ్గురిని ప‌క్క‌న పెడితే.. మిగిలిన ఎనిమిది మంది.. బంతుల మాదిరిగా రియాక్ట్ అయ్యే అవ‌కాశం ఉంద‌ని.. తాజాగా అసెంబ్లీ లాబీల్లో కూట‌మి పార్టీల ఎమ్మెల్యేల మ‌ధ్య చ‌ర్చ‌కు రావ‌డం గ‌మ‌నార్హం.

“వాస్త‌వానికి ఒక పార్టీ టికెట్ ఇచ్చిన త‌ర్వాత‌.. ఆ పార్టీ స‌భ్యుడిగా ఉండ‌డం వ‌ర‌కు త‌ప్పులేదు. అయితే.. నియంతృత్వాన్ని మాత్రం స‌ద‌రు స‌భ్యుడు పాటించాల్సిన అవ‌స‌రం లేదు” అని మ‌హారాష్ట్రలో 2021లో చోటు చేసుకున్న రాజ‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో సుప్రీంకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. అప్ప‌ట్లో శివ‌సేన చీలిపోయి.. ఏక్‌నాథ్ షిండే సీఎం కావ‌డం.. ఆయ‌న వెంట 20 మందికిపైగా ఎమ్మెల్యేలు బ‌య‌ట‌కు రావ‌డం తెలిసిందే. ఈ క్ర‌మంలో శివ‌సేన అప్ప‌టి చీఫ్ .. సుప్రీంకోర్టును ఆశ్ర‌యించి.. శివ‌సేన లెజిస్లేచ‌ర్ పార్టీ నాయ‌కుడిగా తాను గీసిన గీత దాటారంటూ వాద‌న‌లు వినిపించారు. అయితే.. ఈ వాద‌న‌ను కోర్టు కొట్టి వేసింది.

టికెట్ ఇవ్వ‌డం వ‌ర‌కు ఉన్న స్వ‌తంత్రం.. స‌ద‌రు అభ్య‌ర్థిని స‌భ‌కు వెళ్ల‌కుండా అడ్డుకోజాల‌ద‌ని ధ‌ర్మాస‌నం వ్యాఖ్యానించింది. ఇప్పుడు ఈ తీర్పు+ జ‌గ‌న్ చెప్పిన బంతి ఫార్ములా వెర‌సి.. వైసీపీలో 8 మంది ఎమ్మెల్యేలు.. యూట‌ర్న్ తీసుకుంటార‌న్న‌ది కూట‌మి ఎమ్మెల్యేల మ‌ధ్య జ‌రుగుతున్న చ‌ర్చ‌. అంటే.. స‌భ‌కు రావాల‌ని భావిస్తున్న వైసీపీ ఎమ్మెల్యేలు.. జ‌గ‌న్ అణిచి వేత‌ను ఇక‌, భ‌రించ‌లేర‌ని.. త‌మ‌కు కూడా వ్య‌క్తిత్వం ఉంద‌న్న భావ‌న‌తో ఉన్నార‌ని.. కూట‌మి పార్టీల ఎమ్మెల్యేలు గుస‌గుస‌లాడుతు న్నారు. ఈ క్ర‌మంలో జ‌గ‌న్ ను కాద‌ని వారు స‌భ‌కు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని.. దీనికి న్యాయ ర‌క్ష‌ణ కూడా ఉంది కాబ‌ట్టి వారిని ఆప‌డం క‌ష్ట‌మేన‌ని వ్యాఖ్యానిస్తున్నారు.

అంతేకాదు.. జ‌గ‌న్ చెప్పిన బంతి ఫార్ములా(ఎంత బ‌లంగా అదిమి పెడితే అంతే బ‌లంగా ఎగురుతుంది) ప్ర‌కారం.. వైసీపీ ఎమ్మెల్యేల‌ను ఎంత నియంతృత్వ ధోర‌ణితో అణిచేస్తే.. అంతే వారిలో తిరుగు బాటు వ‌స్తుంద‌ని కూడా అంచ‌నా వేస్తున్నారు. వారు జ‌గ‌న్‌కు సానుకూలంగా ఉన్నా.. ప్ర‌జ‌లకు రేపు ఎమ్మెల్యేలు స‌మాధానం చెప్పాల్సి ఉంటుంద‌ని.. అందుకే వారు ఏక్షణంలో అయినానిర్ణ‌యం తీసుకునే ఛాన్స్ ఉంద‌ని కూట‌మి పార్టీల ఎమ్మెల్యేలు లాబీల్లో వ్యాఖ్యానిస్తుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

This post was last modified on November 19, 2024 9:56 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

21 ప‌ద‌వులు.. 60 వేల ద‌రఖాస్తులు..

కూట‌మి ప్ర‌భుత్వం ఏర్పాటులో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించిన అనేక మందికి స‌ర్కారు ఏర్ప‌డిన త‌ర్వాత‌.. నామినేటెడ్ ప‌ద‌వుల‌తో సంతృప్తి క‌లిగిస్తున్నారు. ఎన్ని…

4 hours ago

జగన్ కు సాయిరెడ్డి తలనొప్పి మొదలైనట్టే!

వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఇప్పుడు వరుసగా కష్టాలు మొదలైపోతున్నాయి. మొన్నటి సార్వత్రిక…

4 hours ago

వైసీపీకి భారీ దెబ్బ‌.. ‘గుంటూరు’ పాయే!

ఏపీ ప్ర‌తిప‌క్ష పార్టీ(ప్ర‌ధాన కాదు) వైసీపీకి తాజాగా భారీ ఎదురు దెబ్బ త‌గిలింది. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో 2021లో అతి…

6 hours ago

కిరణ్ అబ్బవరం… తెలివే తెలివి

కిరణ్ అబ్బవరం ఫ్లాప్ స్ట్రీక్‌కు బ్రేక్ వేసిన సినిమా.. క. గత ఏడాది దీపావళికి విడుదలైన ఈ చిత్రం సూపర్…

7 hours ago

తోలు తీస్తా: సోష‌ల్ మీడియాకు రేవంత్ వార్నింగ్‌

సోష‌ల్ మీడియాలో ఇష్టానుసారం పోస్టులు పెట్టే సంస్కృతి పెరిగిపోతోంద‌ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇలాంటి వారి విష‌యంలో…

7 hours ago

పవన్ క్లారిటీతో వివాదం సద్దుమణిగినట్టేనా?

త్రిభాషా విధానాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై రచ్చ రాజుకున్న సంగతి తెలిసిందే. జనసేన…

8 hours ago