అమలాపురం మాజీ ఎంపీ.. సీనియర్ నాయకుడు, ఎస్సీ నేత.. జీవీ హర్షకుమార్ రాజకీయాలపై మళ్లీ చర్చ ప్రారంభమైంది. పొలిటికల్ సర్కిళ్లలో మరోసారి ఆయన చర్చ నీయాంశంగా మారారు. ఒకప్పుడు కాంగ్రెస్ టికెట్పై అమలాపురం నుంచి రెండు సార్లు విజయం సాధించారు హర్షకుమార్. 2004, 2009 ఎన్నికల్లో ఆయన ఎంపీగా విజయం సాదించారు. అప్పటి కీలక నాయకుడు వైఎస్కు అనుంగు అనుచరుడిగా కూడా హర్షకుమార్ పేరు తెచ్చుకున్నారు. తర్వాత.. రాష్ట్ర విభజన ఎఫెక్ట్ తో కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన ఆయన అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి స్థాపించిన జై సమైక్యాంధ్ర పార్టీలో చేరారు.
ఆ పార్టీ తరఫున 2014లో అమలాపురం పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేశారు. నిజానికి సిట్టింగ్ ఎంపీగా ఉన్న హర్షకుమార్.. విజయం సాధించాలని అందరూ అనుకున్నారు. పైగా సమైక్య ఉద్యమం జరుగుతున్న నేపథ్యంలో ఆయనకు అనుకూలంగా ఇక్కడ ఓట్లు కూడా పడతాయని అనుకున్నారు. కానీ, కేవలం 9 వేల ఓట్లు మాత్రమే వచ్చి డిపాజిట్ కూడా దక్కించుకోలేక పోయారు. ఇక, జై సమైక్యాంధ్ర పార్టీ కూడా పూర్తిగా ఎత్తేయడంతో హర్షకుమార్.. సైలెంట్ అయ్యారు. తర్వాత కాలంలో టీడీపీకి దగ్గరయ్యేందుకు ప్రయత్నించారని స్థానికంగా ప్రచారం సాగింది.
కానీ, దీనికన్నా ముందుగా వైసీపీ నుంచి హర్షకుమార్కు ఆహ్వానం అందింది. కానీ, ఆయన దూకుడుతో వైసీపీ నాయకులు వెనక్కి తగ్గారు. ఆ తర్వాత.. టీడీపీకి చేరువైన హర్షకుమార్.. గత ఏడాది ఎన్నికల్లో అమలాపురం టికెట్ను ఆశించారు. కానీ, చంద్రబాబు ఈ టికెట్ను దివంగత స్పీకర్ మోహనచంద్ర బాలయోగి కుమారుడికి ఇచ్చి.. సహకరించాలని కోరారు. ప్రభుత్వం ఏర్పడ్డాక.. మీకు న్యాయం చేస్తామన్నారు. కానీ, హర్షకుమార్ మాత్రం.. దీనికి ససేమిరా అన్నారు. ఈ క్రమంలో అటు వైసీపీకి, ఇటు టీడీపీకి కూడా దూరంగానే ఉన్నారు.
వాస్తవానికి ఆయనను చేర్చుకుని, ఆయనను ఇముడ్చుకునే అవకాశం ప్రాంతీయ పార్టీలకు లేకే ఆయా పార్టీలు దూరం పెట్టాయని అంటారు పరిశీలకులు. ఇక, ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్లోకి వెళ్తానని ఆయన ప్రకటించారు. నిజానికి ఇప్పుడున్న పరిస్థితిలో కాంగ్రెస్కు నాయకులు కావాలి. పైగా ఘర్ వాపసీ మంత్రాన్ని పఠిస్తున్న నేపథ్యంలో హర్షకుమార్ వంటి కీలక నాయకులు, ఫైర్ బ్రాండ్లు చాలా అవసరం ఉంది. అయితే, హర్షకుమార్ తాను తిరిగి కాంగ్రెస్లోకి వెళ్తానని ప్రకటించి 24 గంటలు గడిచినా.. ఆ పార్టీ నుంచి సానుకూల స్పందన రాకపోవడం గమనార్హం. ఏదేమైనా.. హర్షకుమార్ ఆలోచించి అడుగులు వేయాలని అంటున్నారు అమలాపురం ప్రజలు.
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…