Political News

అటల్ టన్నెల్ వల్ల రాబోయే మార్పు ఏంటి?

ప్రధానమంత్రి నరేంద్రమోడి ప్రారంభించిన అటల్ టన్నెల్ వల్ల సైన్యానికి చాలా ఉపయోగాలున్నాయి. హిమాచల్ ప్రదేశ్ లోని రోహ్ తంగ్ పాస్ వైపు నుండి మోడి సొరంగంలో ప్రయాణించారు. టన్నెల్ దక్షిణ ముఖద్వారం హిమాచల్ ప్రదేశ్ లో ఉంటే ఉత్తర ముఖద్వారం లడ్డాఖ్ లో ఉంది. ఈ రెండింటి మధ్య కొండలను తొలిచి 9.02 కిలోమీటర్ల టన్నెల్ నిర్మించటంతో ప్రస్తుతం ప్రపంచం మొత్తం మీద ఇదే అతిపొడవైన టన్నెల్ గా రికార్డులోకి ఎక్కింది. సముద్ర మట్టానికి 10,340 అడుగుల ఎత్తున టన్నెల్ నిర్మాణం జరిగింది. బయటగాలి వేగం, ఆక్సిజన్ లెవల్స్ లాంటివి తెలిపే ఏర్పాట్లు కూడా టన్నెల్లో చేశారు. అలాగే కమ్యూనికేషన్ కోసం ప్రతి అర్ధ కిలోమీటర్ కు ఓ ల్యాండ్ ఫోన్ను కూడా ఏర్పాటు చేశారు. టన్నెల్ నిర్మాణం జరగకముందు పై రెండు ప్రాంతాల మధ్య ప్రయాణం చేయాలంటే సైనికులతో పాటు మామూలు జనాలు కూడా నానా అవస్థలు పడేవారు.

ఇంతకుముందు రోహ్ తంగ్ పాస్-లడ్డాఖ్-లేహ్ మధ్య ప్రయాణించాలంటే కొండలను చుట్టుకుని, సరస్సులను దాటుకుని దాదాపు ఏడుగంటలు పట్టేది. అలాంటిది పై ప్రాంతాల మధ్య ఉన్న కొండలను తొలిచి అత్యంతాధునిక పరిజ్ఞాన్ని ఉపయోగించి టన్నెల్ ను నిర్మించారు. బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బిఆర్వో) నిపుణులు ఈ టన్నెల్ నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు. మొన్నటి వరకు పై ప్రాంతాల మధ్య ఉన్న రోడ్డులో ప్రయాణించాలంటే ఏడాది మొత్తం కేవలం నాలుగు నెలలు మాత్రమే సాధ్యమయ్యేది. శీతాకాలం వచ్చినా వర్షకాలంలోను పై రోడ్డును ప్రభుత్వం మూసేసేది. ఎందుకంటే శీతాకాలంలో అయినా వర్షాకాలంలో అయినా మంచు తుఫానులు, విపరీతమైన మంచు కురవటంతో ప్రయాణం సాధ్యమయ్యేది కాదు. అలాగే వర్షాకలంలో కూడా కొండచరియలు జారిపడటం వల్ల కూడా ప్రయాణం ప్రమాదకరంగా ఉండేది.

మామూలు జనాలైతే తమ ప్రయాణాలను వాయిదా వేసుకునే వారు. కానీ సైనికులకు అలా కుదరదు. పై రోడ్డు మార్గం సైనికావసరాలకు చాలా వ్యూహాత్మక ప్రాంతం. హిమాలయాల్లో కాపలా కాసే సైన్యానికి ఏడాది పొడవునా ఆయుధాలు, ఆహారం, టెంట్లు తదితర అవసరాలను సరఫరా చేస్తునే ఉండాలి. కొన్నిసార్లు హెలికాప్టర్లలో సరఫరా చేయగలిగినా అన్నీ సార్లు కుదిరేది కాదు. అందుకనే ప్రధానమంత్రిగా వాజ్ పేయి ఉన్నపుడు ఈ టన్నెల్ నిర్మాణానికి శ్రీకారుం చుట్టారు. తర్వాత యూపీఏ ప్రభుత్వంలో కూడా పనులు జరిగాయి. 2014లో మోడి ప్రధానమంత్రి అయిన తర్వాత పనుల్లో ఒక్కసారిగా వేగం అందుకుంది.

మొత్తం మీద పై ప్రాంతాల్లోని జనాలకు మాత్రమే కాకుండా సైన్యానికి ఈ టన్నెల్ ఎంతో ఉపయోగం. టన్నెల్ నిర్మాణం వల్ల ప్రయాణంలో 7 గంటలు, 45 కిలోమీటర్లు కలిసి వస్తుంది. టన్నెల్ నిర్మాణం వల్ల ప్రయాణించాల్సిన దూరం, సమయం కలిసి రావటమే కాకుండా ఏడాదిలో ఒక్కరోజు కూడా మంచు, భారీ వర్షాల వల్ల రోడ్డును మూసేయాల్సిన అవసరం ఉండదు. ఇది సైన్యానికి చాలా ఉపయోగపడుతుంది. మనదేశం ఇటువంటి ఏర్పాట్లను యుద్ధ ప్రాతిపదికన చేసుకుంటున్న కారణంగానే డ్రాగన్, పాకిస్ధాన్ దేశాలకు కడుపులో మంటలు పుడుతున్నాయి. మనపై అకారణంగా ఈర్ష్యకు కూడా ఇటువంటివే కారణాలవుతున్నాయి. ముందు ముందు ఇంకెంతగా మండిపోతాయో చూడాలంటే కొద్దికాలం వెయిట్ చేయాల్సిందే.

This post was last modified on October 4, 2020 12:12 pm

Share
Show comments
Published by
Satya
Tags: Atal Tunnel

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

3 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

3 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

4 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

5 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

6 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

8 hours ago