ఎస్సీ వర్గీకరణకు సంబంధించి టీడీపీ కూటమి ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. సుప్రీంకోర్టు తీర్పు ను అనుసరించి.. దేశవ్యాప్తంగా ఎస్సీల రిజర్వేషన్కు సంబంధించి వర్గీకరణ చేయాల్సి ఉంది. ఇప్పటికే తెలంగాణలో ఈ వర్గీకరణను ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. దీనికి సంబంధించి కమిటీ కూడా వేశారు. ఇక, ఏపీ విషయానికి వస్తే.. అనేక కోణాల్లో దీనిపై చర్చలు చేస్తూనే ఉన్నారు. తెలంగాణకు, ఏపీకి మధ్య కొన్ని వ్యత్యాసాలు ఉండడంతో ఇది సంక్లిష్టంగా మారింది.
కూటమి పార్టీల మధ్య ఈ విషయంపై పలు దఫాలుగా చర్చలు జరిగాయి. చివరకు ఈ విషయంలో ప్రధాన పాత్రను టీడీపీకే అప్పగించడంతో సీఎం చంద్రబాబు ఎస్సీ వర్గీకరణపై దృష్టి పెట్టారు. జిల్లాల వారీగా ఎస్సీ వర్గీకరణ చేయాలని నిర్ణయించారు. తద్వారా.. ఎలాంటి సమస్య ఉండబోదని భావిస్తున్నారు. రాష్ట్రంలో ఎస్సీ జనాభాను పరిశీలిస్తే.. ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క విధంగా పరిస్థితి ఉంది. కొన్ని జిల్లాల్లో మాల లు ఎక్కువగా ఉన్నారు. మరికొన్న ఇజిల్లాల్లో మాదిగలు ఎక్కువగా ఉన్నారు.
ఈ నేపథ్యంలో ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణను రాష్ట్ర వ్యాప్తంగా ఒకే విధంగా అమలు చేస్తే.. ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. దీంతో సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన వెసులుబాటు మేరకు రిజర్వేషన్ వర్గీకరణ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు.. సంబంధిత ఎస్సీ ఎమ్మెల్యేలు, మంత్రులతోనూ సీఎం చంద్రబాబు దీనిపై చర్చలు పూర్తి చేశారు. రాష్ట్రాన్ని ఒక యూనిట్గా కాకుండా.. జిల్లాను ఒక యూనిట్గా తీసుకుని ముందుకు సాగడం మంచిదని నిర్ణయించారు.
తద్వారా.. మాలలు ఎక్కువగా ఉన్న చోట్ల వారికి అనుకూలంగా.,.. మాదిగలు ఎక్కువగా ఉన్న జిల్లాల్లో వారికి అనుకూలంగా రిజర్వేషన్ వర్గీకరణ చేయనున్నారు. అయితే.. రాష్ట్రాన్ని యూనిట్ గా తీసుకుని.. గతంలో ఉన్న రిజర్వేషన్లనే అమలు చేయనున్నారు. జిల్లాలస్థాయిలో మాత్రం మాదిగలకు, మాలలకు ఈ వర్గీకరణ ద్వారా అన్యాయం జరగకుండా చూడాలన్నది కీలక ఉద్దేశం. మొత్తానికిఇది సక్సెస్ అయితే.. పెద్ద ప్రయోజనం జరగనుంది.
This post was last modified on November 8, 2024 6:44 pm
సుప్రీంకోర్టులో రోజు వారీగా అనేక కేసులు విచారణకు వస్తాయి. న్యాయశాస్త్రంలో లబ్ధప్రతిష్టులైన అనేక మంది న్యాయవాదులు వాదనలు వినిపిస్తారు. ఇది…
బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కి విపరీతమైన ఫ్రీ పబ్లిసిటీ జరుగుతుంది. అదేంటో ఆమె సినిమాల వల్ల వచ్చిన పాపులారిటీ…
ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…
తెలుగు సినిమాలో పరిగెత్తడంలోనూ ప్రత్యేక స్టాండర్డ్ సెట్ చేసిన ఏకైక హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. అతని రన్నింగ్…
ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా అవతరించిన దురంధర్ తాజాగా ఓటిటిలో వచ్చాక కొత్త డిబేట్ మొదలయ్యింది. ఇంతకన్నా…
విపరీతమైన ప్రి రిలీజ్ హైప్ వల్ల వసూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాతకు లాభం అందించి ఉండచ్చు.…