ఎస్సీ వర్గీకరణకు సంబంధించి టీడీపీ కూటమి ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. సుప్రీంకోర్టు తీర్పు ను అనుసరించి.. దేశవ్యాప్తంగా ఎస్సీల రిజర్వేషన్కు సంబంధించి వర్గీకరణ చేయాల్సి ఉంది. ఇప్పటికే తెలంగాణలో ఈ వర్గీకరణను ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. దీనికి సంబంధించి కమిటీ కూడా వేశారు. ఇక, ఏపీ విషయానికి వస్తే.. అనేక కోణాల్లో దీనిపై చర్చలు చేస్తూనే ఉన్నారు. తెలంగాణకు, ఏపీకి మధ్య కొన్ని వ్యత్యాసాలు ఉండడంతో ఇది సంక్లిష్టంగా మారింది.
కూటమి పార్టీల మధ్య ఈ విషయంపై పలు దఫాలుగా చర్చలు జరిగాయి. చివరకు ఈ విషయంలో ప్రధాన పాత్రను టీడీపీకే అప్పగించడంతో సీఎం చంద్రబాబు ఎస్సీ వర్గీకరణపై దృష్టి పెట్టారు. జిల్లాల వారీగా ఎస్సీ వర్గీకరణ చేయాలని నిర్ణయించారు. తద్వారా.. ఎలాంటి సమస్య ఉండబోదని భావిస్తున్నారు. రాష్ట్రంలో ఎస్సీ జనాభాను పరిశీలిస్తే.. ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క విధంగా పరిస్థితి ఉంది. కొన్ని జిల్లాల్లో మాల లు ఎక్కువగా ఉన్నారు. మరికొన్న ఇజిల్లాల్లో మాదిగలు ఎక్కువగా ఉన్నారు.
ఈ నేపథ్యంలో ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణను రాష్ట్ర వ్యాప్తంగా ఒకే విధంగా అమలు చేస్తే.. ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. దీంతో సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన వెసులుబాటు మేరకు రిజర్వేషన్ వర్గీకరణ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు.. సంబంధిత ఎస్సీ ఎమ్మెల్యేలు, మంత్రులతోనూ సీఎం చంద్రబాబు దీనిపై చర్చలు పూర్తి చేశారు. రాష్ట్రాన్ని ఒక యూనిట్గా కాకుండా.. జిల్లాను ఒక యూనిట్గా తీసుకుని ముందుకు సాగడం మంచిదని నిర్ణయించారు.
తద్వారా.. మాలలు ఎక్కువగా ఉన్న చోట్ల వారికి అనుకూలంగా.,.. మాదిగలు ఎక్కువగా ఉన్న జిల్లాల్లో వారికి అనుకూలంగా రిజర్వేషన్ వర్గీకరణ చేయనున్నారు. అయితే.. రాష్ట్రాన్ని యూనిట్ గా తీసుకుని.. గతంలో ఉన్న రిజర్వేషన్లనే అమలు చేయనున్నారు. జిల్లాలస్థాయిలో మాత్రం మాదిగలకు, మాలలకు ఈ వర్గీకరణ ద్వారా అన్యాయం జరగకుండా చూడాలన్నది కీలక ఉద్దేశం. మొత్తానికిఇది సక్సెస్ అయితే.. పెద్ద ప్రయోజనం జరగనుంది.
This post was last modified on November 8, 2024 6:44 pm
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…