Political News

రోజాకు పోటిగా మరో పవర్ సెంటర్ ?

ఫైర్ బ్రాండు నగిరి ఎంఎల్ఏకు పోటిగా నియోజకవర్గంలో మరో పవర్ సెంటర్ మొదలవుతోందా ? క్షేత్రస్ధయిలో జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే పార్టీలో ఇదే అనుమానాలు పెరుగుతున్నాయి. నగిరి మున్సిపల్ మాజీ ఛైర్ పర్సన్ గా పనిచేసిన కేజే శాంతికి తొందరలో కీలక పదవి దక్కనున్నట్లు సమాచారం. శాంతి భర్త కేజే కుమార్ కూడా మున్సిపల్ ఛైర్మన్ గా పనిచేసిన నేతే. వీళ్ళకు నియోజకవర్గంలో మంచి పట్టుంది. ఒకపుడు ఎంఎల్ఏ రోజాతో మంచి సఖ్యతగా ఉన్న ఈ కుటుంబం కొంతకాలంగా పూర్తి వ్యతిరేకంగా పనిచేస్తోంది. కుమార్ దంపతులు, రోజా మధ్య సంబంధాలు ప్రస్తుతం ఉప్పు-నిప్పుగా ఉందన్న విషయం అందరికీ తెలిసిందే.

ఇటువంటి శాంతికి బీసీ కార్పొరేషన్ల ఛైర్మన్ నియామకాల్లో భాగంగా ఓ కార్పొరేషన్ ఛైర్ పర్సన్ పదవి దక్కనున్నట్లు సమాచారం. ప్రభుత్వం నియమించనున్న 56 కార్పొరేషన్లలో ఈడిగ కార్పొరేషన్ కూడా ఒకటి. ఈడిగ కార్పొరేషన్ కు ఛైర్ పర్సన్ గా శాంతి నియామకం దాదాపు ఫైనల్ అయిపోయినట్లే అని పార్టీలో ప్రచారం జరుగుతోంది. కుమార్, శాంతి దంపతులకు పార్టీలో కానీ ప్రభుత్వంలో కాని ఎటువంటి పదవులు రాకూడదన్నది రోజా ఆలోచన. అయితే రోజాకు సంబంధం లేకుండానే శాంతి పేరు జగన్మోహన్ రెడ్డి ఫైనల్ చేసినట్లు తెలిసింది.

జిల్లాలో నెలకొన్న రాజకీయ పరిస్దితుల కారణంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈడిగ కార్పొరేషన్ ఛైర్ పర్సన్ గా శాంతిని నియమించాలని సిఫారసు చేశారట. పెద్దిరెడ్డికి ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి మద్దతుగా నిలిచారట. ఎందుకంటే రోజాకు వీళ్ళద్దరితో ఏమాత్రం పడటం లేదు. ఏదన్నా సమావేశాల్లో కలిసినపుడు, సమయం వచ్చినపుడు అందరు కలిసినట్లే ఉంటారు. కానీ లోలోపల మాత్రం వీళ్ళల్లో ఒకళ్ళంటే మరొకళ్ళకు పడటం లేదన్న విషయం పార్టీలో అందరికీ తెలుసు.

ఇందులో భాగంగానే పెద్దిరెడ్డి, నారాయణస్వామితో రోజాకు ఏమాత్రం పడటం లేదు. అందుకనే నగిరి నియోజకవర్గంలో వీళ్ళని పిలిచి కేజే కుమార్ దంపతులు కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుంటారు. వీళ్ళ కార్యక్రమాలకు రోజాకు ఆహ్వానం కూడా ఉండదు. రోజాతో పై ఇద్దరికి పడదు కాబట్టి కేజే దంపుతులు ఏర్పాటు చేసే కార్యక్రమాలకు వీళ్ళు కూడా హాజరవుతుంటారు. దీంతో కేజే కుటుంబానికి పార్టీలో మరో బలమైన వర్గం తయారైంది.

ఒకవైపు రోజా తన మద్దతుదారులతో పార్టీ కార్యక్రమాల్లో దూసుకుపోతోంది. ఇదే సమయంలో కేజే దంపతులు కూడా తమ కార్యక్రమాల్లో స్పీడుగా ఉంటున్నారు. అంటే నియోజకవర్గంలో పార్టీలోనే రెండు బలమైన వర్గాలున్న విషయం స్పష్టమైపోయింది. ఇటువంటి నేపధ్యంలోనే శాంతికి కొర్పొరేషన్ ఛైర్ పర్సన్ పదవి దక్కితే రోజాకు ప్రత్యామ్నాయంగా మరో పవర్ సెంటర్ ఏర్పాటవ్వటం ఖాయమే. మరి దీన్ని ఎంఎల్ఏ ఎలా ఎదుర్కొంటారో చూడాల్సిందే.

This post was last modified on October 3, 2020 2:23 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఏపీలో హోటల్స్… ఇబ్బంది లేనట్టేనా?

వంటగ్యాస్ కొరత కారణంగా దేశవ్యాప్తంగా చిన్న హోటళ్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. హోటళ్లకు సరఫరా అయ్యే కమర్షియల్ సిలిండర్ల పంపిణీని…

2 hours ago

డైరెక్ట‌ర్ హైప్ ఇస్తుంటే… నాగ్ ఫ్యాన్స్‌కు టెన్ష‌న్‌

టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున వ‌రుస‌గా త‌మిళ న‌టులు, టెక్నీషియ‌న్ల‌తో ప‌ని చేస్తున్నాడు. గ‌త ఏడాది ధ‌నుష్‌తో క‌లిసి…

5 hours ago

వార్ ఎఫెక్ట్: ఇక హైదరాబాద్ వంతు!

అక్కడెక్కడో ఇరాన్ - ఇజ్రాయెల్, అమెరికాలు యుద్దం చేసుకుంటే.. వారికి వేలాది కిలోమీటర్ల ఇవతల ఉన్న బెంగళూరులోని టిఫిన్ సెంటర్లు..…

6 hours ago

బ్యాండ్ మ్రోగిస్తున్న మేళం సరిపోవడం లేదా

నిర్మాత కోన వెంకట్ బ్యాండ్ మేళంని చాలా సీరియస్ గా తీసుకున్న వైనం ప్రమోషన్లలో కనిపిస్తోంది. కోర్ట్ జంట హర్ష్…

6 hours ago

రవితేజను అవమానించిన నిర్మాత ఎవరు?

సినీ రంగంలో ఎప్పుడు ఎవరి రాత మారుతుందో తెలియదు. నటులుగా చిన్న చిన్న పాత్రలు చేసిన వాళ్లు.. రైటర్లుగా, అసిస్టెంట్…

7 hours ago

ఆమిర్ ప్లాన్ వర్కవుట్ అవుతుందా?

పదేళ్ల ముందు ‘దంగల్’ మూవీతో ఇండస్ట్రీ హిట్ ఇచ్చాడు బాలీవుడ్ సూపర్ స్టార్. ఇప్పటికీ ఇండియాస్ హైయెస్ట్ గ్రాసింగ్ మూవీ…

11 hours ago