Political News

తెలంగాణలో మద్యం ధరలు పైపైకి… పద్ధతి మార్చిన ప్రభుత్వం!

ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న మద్యం ధరలకు సమానంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా మద్యం ధరలు పెరగనున్నట్లు సంకేతాలు అందుతున్నాయి. త్వరలోనే బీరు పై రూ.20, లిక్కర్ క్వార్టర్‌ పై రూ.20 నుంచి రూ.70 వరకు ధర పెంపు చేసే అవకాశం ఉన్నట్టు అధికార వర్గాలు తెలియజేశాయి. మద్యం ధరలు పెరగడం వల్ల ప్రతి నెల రూ.1000 కోట్ల వరకు అదనపు ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

ఈ ఆర్థిక సంవత్సరంలో ఎక్సైజ్‌ శాఖ ద్వారా ప్రభుత్వం వ్యాట్‌, ఎక్సైజ్‌ డ్యూటీల రూపంలో రూ.36 వేల కోట్లకు పైగా ఆదాయం రాబట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. మొదటి ఆరు నెలల్లో ఎక్సైజ్‌ శాఖకు ఎక్సైజ్‌ డ్యూటీ ద్వారా రూ.9,493 కోట్లు, వ్యాట్‌ ద్వారా రూ.8,040 కోట్లు వచ్చాయని లెక్కలు చెబుతున్నాయి. అంటే, మొత్తం రూ.17,533 కోట్ల ఆదాయం నమోదు అయ్యింది. మిగతా ఆరు నెలల్లో కూడా ఇదే విధంగా ఆదాయం వస్తే, ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఆదాయం రూ.35,000 కోట్లకు మించకపోవచ్చని అంచనా వేస్తున్నారు.

గత కొంతకాలంగా ఎక్సైజ్‌ శాఖ ద్వారా రాష్ట్రానికి ఆశించినంత ఆదాయం రావడం లేదు. అదనంగా, గుడుంబా మరియు అక్రమ మద్యం తయారీ, సరఫరా, విక్రయాలు పెరిగాయని అధికారులు తెలిపారు. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ఈ సర్వేలో గత ఏడాదితో పోలిస్తే రెట్టింపు కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా అక్రమ మద్యం వ్యాపారం గణనీయంగా పెరిగినట్లు సూచిస్తోంది. ఇక ప్రభుత్వం ఎక్సైజ్‌ శాఖను గుడుంబా వ్యాపారాన్ని అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

This post was last modified on November 1, 2024 12:02 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కేంద్రంలో పవన్ పట్టు పిఠాపురానికి వరం

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను గెలిపించుకున్న పిఠాపురం ప్రజలు... ఇప్పుడు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలోని దాదాపుగా అన్ని…

42 seconds ago

జోష్ సినిమా ఆడదని ముందే తెలుసా?

టాలీవుడ్లో పెద్ద కుటుంబాల నుంచి వచ్చిన యువ కథానాయకుల్లో అత్యంత ఆడంబరంగా జరిగిన అరంగేట్రం అక్కినేని నాగచైతన్యదే అని చెప్పొచ్చు. టాలీవుడ్లో నంబర్…

3 minutes ago

9 మందికి పోలీసులకు ఉరిశిక్ష… సంచలన తీర్పు

తమిళనాడులోని:సాతాంకుళం లాకప్ డెత్ కేసులో మదురైలోని ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2020లో…

52 minutes ago

బూతులు తిట్టటం ట్రంప్ తోనే ఆరంభం కాలేదు

నాగరిక సమాజంలో మర్యాద అన్నది ప్రాథమికం. నిత్యం నాగరిత గురించి భారీ ఎత్తున లెక్చర్లు ఇచ్చే అమెరికన్ల తీరుకు భిన్నంగా…

2 hours ago

పవన్ ను తిట్టిన ద్వారంపూడి ఇప్పుడు టార్గెట్ అయ్యారా?

ఉమ్మ‌డి తూర్పు గోదావ‌రి జిల్లా కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్ర‌శేఖ‌ర‌రెడ్డికి ఎర్త్ పెడుతున్నారా?... ఆయ‌న ప్రాభ‌వాన్ని.. వైభ‌వాన్ని…

2 hours ago

రైటర్ గారు… చేదుగా ఉన్నా నిజమే చెప్పారు

రచయిత బివిఎస్ రవి ఒక్కోసారి బాగా ఓపెన్ అయిపోతారు. ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తారు. తాజాగా మా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో…

4 hours ago