ఆంధ్రప్రదేశ్లో ఉన్న మద్యం ధరలకు సమానంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా మద్యం ధరలు పెరగనున్నట్లు సంకేతాలు అందుతున్నాయి. త్వరలోనే బీరు పై రూ.20, లిక్కర్ క్వార్టర్ పై రూ.20 నుంచి రూ.70 వరకు ధర పెంపు చేసే అవకాశం ఉన్నట్టు అధికార వర్గాలు తెలియజేశాయి. మద్యం ధరలు పెరగడం వల్ల ప్రతి నెల రూ.1000 కోట్ల వరకు అదనపు ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
ఈ ఆర్థిక సంవత్సరంలో ఎక్సైజ్ శాఖ ద్వారా ప్రభుత్వం వ్యాట్, ఎక్సైజ్ డ్యూటీల రూపంలో రూ.36 వేల కోట్లకు పైగా ఆదాయం రాబట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. మొదటి ఆరు నెలల్లో ఎక్సైజ్ శాఖకు ఎక్సైజ్ డ్యూటీ ద్వారా రూ.9,493 కోట్లు, వ్యాట్ ద్వారా రూ.8,040 కోట్లు వచ్చాయని లెక్కలు చెబుతున్నాయి. అంటే, మొత్తం రూ.17,533 కోట్ల ఆదాయం నమోదు అయ్యింది. మిగతా ఆరు నెలల్లో కూడా ఇదే విధంగా ఆదాయం వస్తే, ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఆదాయం రూ.35,000 కోట్లకు మించకపోవచ్చని అంచనా వేస్తున్నారు.
గత కొంతకాలంగా ఎక్సైజ్ శాఖ ద్వారా రాష్ట్రానికి ఆశించినంత ఆదాయం రావడం లేదు. అదనంగా, గుడుంబా మరియు అక్రమ మద్యం తయారీ, సరఫరా, విక్రయాలు పెరిగాయని అధికారులు తెలిపారు. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ఈ సర్వేలో గత ఏడాదితో పోలిస్తే రెట్టింపు కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా అక్రమ మద్యం వ్యాపారం గణనీయంగా పెరిగినట్లు సూచిస్తోంది. ఇక ప్రభుత్వం ఎక్సైజ్ శాఖను గుడుంబా వ్యాపారాన్ని అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
This post was last modified on November 1, 2024 12:02 pm
గ్లామర్ షో చేయకుండా నటననే నమ్ముకుని హీరోయిన్ గా నెగ్గుకురావడం చాలా కష్టం. రెగ్యులర్ పాత్రలకు దూరంగా ఉంటానంటే కెరీర్…
హైదరాబాద్, బెంగళూరు ఎయిర్పోర్టుల్లో సీన్ చూస్తే గందరగోళంగా ఉంది. ప్యాసింజర్లు గంటల తరబడి వెయిట్ చేస్తున్నారు, ఇండిగో కౌంటర్ల ముందు…
ఏపీ సీఎం చంద్రబాబు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ లపై వైసీపీ అధినేత జగన్…
కోలీవుడ్ లో నిన్నటిదాకా ఎక్కువ వినిపించిన పేరు అనిరుధ్ రవిచందర్. అయితే కూలితో సహా తన వరస సినిమాలు ఆశించిన…
తెలుగు రాష్ట్రంలో మరో చెల్లి తన రాజకీయ ప్రస్తానాన్ని మొదలు పెట్టింది. వంగవీటి మోహనరంగా వర్ధంతి సందర్భంగా డిసెంబరు 26న…
టాలీవుడ్ మోస్ట్ సక్సెస్ ఫుల్ కాంబినేషన్ నుంచి వస్తున్న అఖండ 2 తాండవం కౌంట్ డౌన్ రోజుల నుంచి గంటల్లోకి…