ఆంధ్రప్రదేశ్లో ఉన్న మద్యం ధరలకు సమానంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా మద్యం ధరలు పెరగనున్నట్లు సంకేతాలు అందుతున్నాయి. త్వరలోనే బీరు పై రూ.20, లిక్కర్ క్వార్టర్ పై రూ.20 నుంచి రూ.70 వరకు ధర పెంపు చేసే అవకాశం ఉన్నట్టు అధికార వర్గాలు తెలియజేశాయి. మద్యం ధరలు పెరగడం వల్ల ప్రతి నెల రూ.1000 కోట్ల వరకు అదనపు ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
ఈ ఆర్థిక సంవత్సరంలో ఎక్సైజ్ శాఖ ద్వారా ప్రభుత్వం వ్యాట్, ఎక్సైజ్ డ్యూటీల రూపంలో రూ.36 వేల కోట్లకు పైగా ఆదాయం రాబట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. మొదటి ఆరు నెలల్లో ఎక్సైజ్ శాఖకు ఎక్సైజ్ డ్యూటీ ద్వారా రూ.9,493 కోట్లు, వ్యాట్ ద్వారా రూ.8,040 కోట్లు వచ్చాయని లెక్కలు చెబుతున్నాయి. అంటే, మొత్తం రూ.17,533 కోట్ల ఆదాయం నమోదు అయ్యింది. మిగతా ఆరు నెలల్లో కూడా ఇదే విధంగా ఆదాయం వస్తే, ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఆదాయం రూ.35,000 కోట్లకు మించకపోవచ్చని అంచనా వేస్తున్నారు.
గత కొంతకాలంగా ఎక్సైజ్ శాఖ ద్వారా రాష్ట్రానికి ఆశించినంత ఆదాయం రావడం లేదు. అదనంగా, గుడుంబా మరియు అక్రమ మద్యం తయారీ, సరఫరా, విక్రయాలు పెరిగాయని అధికారులు తెలిపారు. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ఈ సర్వేలో గత ఏడాదితో పోలిస్తే రెట్టింపు కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా అక్రమ మద్యం వ్యాపారం గణనీయంగా పెరిగినట్లు సూచిస్తోంది. ఇక ప్రభుత్వం ఎక్సైజ్ శాఖను గుడుంబా వ్యాపారాన్ని అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…
సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…
మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…
తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…
ఏపీలో ప్రతిపక్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయకులు చీలిపోవడమో.. లేక కూటమిలోని ఓ పార్టీలో చేరిపోవడమో…