ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుకు బాగానే సెగ తగులుతున్నట్టుగా ఉంది. దీంతో ఆయన సరిచేసే ప్రక్రియను ముమ్మరం చేశారు. ముఖ్యంగా మూడు విషయాల్లో చంద్రబాబుకు ఇబ్బందులు వస్తున్నాయి. అది కూడా ఒక్క మద్యం విషయంలోనే కావడం గమనార్హం. దీంతో వెంటనే అలెర్ట్ అయిన చంద్రబాబు చర్యలకు దిగారు. అసలు రాష్ట్రంలో ప్రభుత్వ మద్యం విధానాన్ని రద్దు చేసి.. ప్రైవేటు మద్యం విధానాన్ని తీసుకువచ్చిన తర్వాత.. అనేక ఆరోపణలకు వేదిగా ఈ నూతన మద్యం విధానం నిలబడింది. ప్రధానంగా తమ్ముళ్ల ప్రమేయం ఎక్కువగా ఉండడం గమనార్హం.
పదే పదే ఈ విషయంపై చంద్రబాబు తమ్ముళ్లను హెచ్చరించారు. మద్యం విషయంలో జోక్యం చేసుకోవద్దని కూడా చెప్పారు. అయినా.. తమ్ముళ్లు వినిపించుకోలేదు. దీనికితోడు.. వ్యాపారం ప్రారంభించి.. పట్టుమని పది రోజులు కూడా కాకముందే.. తణుకు, తుని తదితర నియోజకవర్గాల్లో బెల్టు షాపులు తెరమీదికి రావడం మరో ఇబ్బందిగా మారింది. ఇలా వెలుగు చూడగానే.. అలా సోషల్ మీడియాలో ఈ బెల్టు షాపులపై పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. పలుపత్రికల్లోనూ కథనాలు కూడా వచ్చాయి. ఈ పరిణామం సర్కారుకు సెగ పెట్టేలా తయారైంది.
ఇక, గుంటూరు, విజయవాడ, విశాఖ, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో మద్యం ధరలు ఆకాశానికి ఎగబాకాయి. సర్కారు ముందుగానే చెప్పినట్టు మద్యం బాటిళ్లను ఎంఆర్పీకి విక్రయించాల్సి ఉన్నా.. స్థానికంగా ఉన్న రాజకీయ వివాదాలు.. నేతల జోక్యంతో పెరిగిపోయిన వాటాల కారణంగా.. క్వార్టర్ బాటిల్పై 10-15 రూపాయలు అదనంగా తీసుకుంటున్నారు. ఇక, ఫుల్లు బాటిల్పై 40-50 రూపాయలు(రౌండ్గా ఏది ఎక్కువ ఉంటే అది. ఉదాహరణకు 260 ఉంటే 40 కలిపి.. 300) తీసుకుంటున్నారు. దీంతో సోషల్ మీడియాలో మందు బాబులు ఆధారాలతో సహా చూపించి నానా రచ్చ చేస్తున్నారు.
ఈ పరిణామాలు క్షేత్రస్థాయిలో ఎలా ఉన్నా.. సర్కారుకు మాత్రం సెగ పెంచుతున్నాయి. అంటే.. బెల్టు షాపులు ఒకవైపు, ఎంఆర్ పీ కంటే ఎక్కువగా విక్రయించడం మరోవైపు, తమ్ముళ్ల వాటాలు ఇంకోవైపు.. ఇలా మూడు రకాలుగా నూతన మద్యం పాలసీ.. నానా కష్టాలు పడుతోంది. దీనిపై స్పందించిన చంద్రబాబు తాజాగా కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎంఆర్ పీ కంటే ఎక్కువకు అమ్మితే దుకాణ దారులపైనే చర్యలు తీసుకునే అధికారులు ఇచ్చారు. రూ.5 లక్షల జరిమానా విధించాలన్నారు. ఇక, వాటాలు అడిగినట్టు తేలిన తమ్ముళ్లపై పార్టీపరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు. మరి ఈ చర్యలు ఏమేరకు.. సక్సెస్ అవుతాయో చూడాలి.
This post was last modified on October 29, 2024 3:23 pm
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…