Political News

బాబుకు సెగ త‌గులుతోంది.. స‌రిచేస్తున్నారు..!

ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు బాగానే సెగ త‌గులుతున్న‌ట్టుగా ఉంది. దీంతో ఆయ‌న స‌రిచేసే ప్ర‌క్రియ‌ను ముమ్మ‌రం చేశారు. ముఖ్యంగా మూడు విష‌యాల్లో చంద్ర‌బాబుకు ఇబ్బందులు వ‌స్తున్నాయి. అది కూడా ఒక్క మ‌ద్యం విష‌యంలోనే కావ‌డం గ‌మ‌నార్హం. దీంతో వెంట‌నే అలెర్ట్ అయిన చంద్ర‌బాబు చ‌ర్య‌ల‌కు దిగారు. అస‌లు రాష్ట్రంలో ప్ర‌భుత్వ మ‌ద్యం విధానాన్ని ర‌ద్దు చేసి.. ప్రైవేటు మ‌ద్యం విధానాన్ని తీసుకువ‌చ్చిన త‌ర్వాత‌.. అనేక ఆరోప‌ణ‌ల‌కు వేదిగా ఈ నూత‌న మ‌ద్యం విధానం నిల‌బ‌డింది. ప్ర‌ధానంగా త‌మ్ముళ్ల ప్ర‌మేయం ఎక్కువ‌గా ఉండ‌డం గ‌మ‌నార్హం.

ప‌దే ప‌దే ఈ విష‌యంపై చంద్ర‌బాబు త‌మ్ముళ్ల‌ను హెచ్చ‌రించారు. మ‌ద్యం విష‌యంలో జోక్యం చేసుకోవ‌ద్ద‌ని కూడా చెప్పారు. అయినా.. త‌మ్ముళ్లు వినిపించుకోలేదు. దీనికితోడు.. వ్యాపారం ప్రారంభించి.. ప‌ట్టుమ‌ని ప‌ది రోజులు కూడా కాక‌ముందే.. త‌ణుకు, తుని త‌దితర నియోజ‌క‌వ‌ర్గాల్లో బెల్టు షాపులు తెర‌మీదికి రావ‌డం మ‌రో ఇబ్బందిగా మారింది. ఇలా వెలుగు చూడ‌గానే.. అలా సోష‌ల్ మీడియాలో ఈ బెల్టు షాపుల‌పై పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రిగింది. ప‌లుప‌త్రిక‌ల్లోనూ క‌థ‌నాలు కూడా వ‌చ్చాయి. ఈ ప‌రిణామం స‌ర్కారుకు సెగ పెట్టేలా త‌యారైంది.

ఇక‌, గుంటూరు, విజ‌య‌వాడ‌, విశాఖ‌, అనంత‌పురం, క‌ర్నూలు జిల్లాల్లో మ‌ద్యం ధ‌ర‌లు ఆకాశానికి ఎగ‌బాకాయి. స‌ర్కారు ముందుగానే చెప్పిన‌ట్టు మ‌ద్యం బాటిళ్ల‌ను ఎంఆర్‌పీకి విక్ర‌యించాల్సి ఉన్నా.. స్థానికంగా ఉన్న రాజ‌కీయ వివాదాలు.. నేత‌ల జోక్యంతో పెరిగిపోయిన వాటాల కార‌ణంగా.. క్వార్ట‌ర్ బాటిల్‌పై 10-15 రూపాయ‌లు అద‌నంగా తీసుకుంటున్నారు. ఇక‌, ఫుల్లు బాటిల్‌పై 40-50 రూపాయ‌లు(రౌండ్‌గా ఏది ఎక్కువ ఉంటే అది. ఉదాహ‌ర‌ణ‌కు 260 ఉంటే 40 క‌లిపి.. 300) తీసుకుంటున్నారు. దీంతో సోష‌ల్ మీడియాలో మందు బాబులు ఆధారాల‌తో స‌హా చూపించి నానా ర‌చ్చ చేస్తున్నారు.

ఈ ప‌రిణామాలు క్షేత్ర‌స్థాయిలో ఎలా ఉన్నా.. స‌ర్కారుకు మాత్రం సెగ పెంచుతున్నాయి. అంటే.. బెల్టు షాపులు ఒక‌వైపు, ఎంఆర్ పీ కంటే ఎక్కువ‌గా విక్ర‌యించ‌డం మ‌రోవైపు, త‌మ్ముళ్ల వాటాలు ఇంకోవైపు.. ఇలా మూడు ర‌కాలుగా నూత‌న మ‌ద్యం పాల‌సీ.. నానా క‌ష్టాలు ప‌డుతోంది. దీనిపై స్పందించిన చంద్ర‌బాబు తాజాగా కీల‌క ఆదేశాలు జారీ చేశారు. ఎంఆర్ పీ కంటే ఎక్కువ‌కు అమ్మితే దుకాణ దారుల‌పైనే చ‌ర్య‌లు తీసుకునే అధికారులు ఇచ్చారు. రూ.5 ల‌క్ష‌ల జ‌రిమానా విధించాల‌న్నారు. ఇక‌, వాటాలు అడిగిన‌ట్టు తేలిన త‌మ్ముళ్ల‌పై పార్టీప‌రంగా చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించారు. మ‌రి ఈ చ‌ర్య‌లు ఏమేర‌కు.. స‌క్సెస్ అవుతాయో చూడాలి.

Satya

Recent Posts

చరణ్ పాప్ కార్న్ పాయింట్ – ఒప్పుకోవాల్సిన లాజిక్కేనా

ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో డిబేట్ ఒకటుంది. జనం మునుపటిలా థియేటర్లకు ఎక్కువ సంఖ్యలో ఎందుకు రావడం లేదనేది అందులో మెయిన్…

2 hours ago

షిరిడీ సాయి ఆలయాలకు ‘శ్రీవాణి’ నగదు అవసరం లేదా?

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తుల నుంచి భారీ సంఖ్యలో విరాళాలు అందుతున్నాయి. ఈ నిధులతో…

2 hours ago

మార్కెట్ వెలుగుతోంది చూడు లెనిన్

ఇంకో పద్దెనిమిది రోజుల్లో లెనిన్ విడుదల. అక్కినేని అభిమానులు బాగా ఎగ్ జైట్మెంట్ తో ఉన్నారు. ఇప్పటికే పలు వాయిదాలు…

4 hours ago

యూకేలో కొత్త ప్రధాని.. భారత విద్యార్థులపై ప్రభావం ఉంటుందా?

అభివృద్ధి చెందిన దేశాల్లో రాజకీయ స్థిరత్వం ఎక్కువగా ఉంటుందని భావిస్తారు. కానీ గత పదేళ్లుగా యునైటెడ్ కింగ్‌డమ్ పరిస్థితి మాత్రం…

6 hours ago

భాగ్యశ్రీ మాటతో… మళ్ళీ రామ్ ట్రేండింగ్

టాలీవుడ్ స్టార్ రామ్ పోతినేని, యంగ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే మధ్య ప్రేమాయణం నడుస్తోందంటూ గతంలోనే సోషల్ మీడియాలో చాలా…

7 hours ago

పవన్ చెప్పిందేమిటి?… వీరు చేస్తున్నదేమిటీ?

రాజకీయాల్లో విమర్శలు… వాటికి ప్రతి విమర్శలు సర్వసాధారణమే. అయితే విమర్శల పేరిట అసభ్య పదజాలం వాడటం సరికాదు.. ప్రతి విమర్శల…

8 hours ago