ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుకు బాగానే సెగ తగులుతున్నట్టుగా ఉంది. దీంతో ఆయన సరిచేసే ప్రక్రియను ముమ్మరం చేశారు. ముఖ్యంగా మూడు విషయాల్లో చంద్రబాబుకు ఇబ్బందులు వస్తున్నాయి. అది కూడా ఒక్క మద్యం విషయంలోనే కావడం గమనార్హం. దీంతో వెంటనే అలెర్ట్ అయిన చంద్రబాబు చర్యలకు దిగారు. అసలు రాష్ట్రంలో ప్రభుత్వ మద్యం విధానాన్ని రద్దు చేసి.. ప్రైవేటు మద్యం విధానాన్ని తీసుకువచ్చిన తర్వాత.. అనేక ఆరోపణలకు వేదిగా ఈ నూతన మద్యం విధానం నిలబడింది. ప్రధానంగా తమ్ముళ్ల ప్రమేయం ఎక్కువగా ఉండడం గమనార్హం.
పదే పదే ఈ విషయంపై చంద్రబాబు తమ్ముళ్లను హెచ్చరించారు. మద్యం విషయంలో జోక్యం చేసుకోవద్దని కూడా చెప్పారు. అయినా.. తమ్ముళ్లు వినిపించుకోలేదు. దీనికితోడు.. వ్యాపారం ప్రారంభించి.. పట్టుమని పది రోజులు కూడా కాకముందే.. తణుకు, తుని తదితర నియోజకవర్గాల్లో బెల్టు షాపులు తెరమీదికి రావడం మరో ఇబ్బందిగా మారింది. ఇలా వెలుగు చూడగానే.. అలా సోషల్ మీడియాలో ఈ బెల్టు షాపులపై పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. పలుపత్రికల్లోనూ కథనాలు కూడా వచ్చాయి. ఈ పరిణామం సర్కారుకు సెగ పెట్టేలా తయారైంది.
ఇక, గుంటూరు, విజయవాడ, విశాఖ, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో మద్యం ధరలు ఆకాశానికి ఎగబాకాయి. సర్కారు ముందుగానే చెప్పినట్టు మద్యం బాటిళ్లను ఎంఆర్పీకి విక్రయించాల్సి ఉన్నా.. స్థానికంగా ఉన్న రాజకీయ వివాదాలు.. నేతల జోక్యంతో పెరిగిపోయిన వాటాల కారణంగా.. క్వార్టర్ బాటిల్పై 10-15 రూపాయలు అదనంగా తీసుకుంటున్నారు. ఇక, ఫుల్లు బాటిల్పై 40-50 రూపాయలు(రౌండ్గా ఏది ఎక్కువ ఉంటే అది. ఉదాహరణకు 260 ఉంటే 40 కలిపి.. 300) తీసుకుంటున్నారు. దీంతో సోషల్ మీడియాలో మందు బాబులు ఆధారాలతో సహా చూపించి నానా రచ్చ చేస్తున్నారు.
ఈ పరిణామాలు క్షేత్రస్థాయిలో ఎలా ఉన్నా.. సర్కారుకు మాత్రం సెగ పెంచుతున్నాయి. అంటే.. బెల్టు షాపులు ఒకవైపు, ఎంఆర్ పీ కంటే ఎక్కువగా విక్రయించడం మరోవైపు, తమ్ముళ్ల వాటాలు ఇంకోవైపు.. ఇలా మూడు రకాలుగా నూతన మద్యం పాలసీ.. నానా కష్టాలు పడుతోంది. దీనిపై స్పందించిన చంద్రబాబు తాజాగా కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎంఆర్ పీ కంటే ఎక్కువకు అమ్మితే దుకాణ దారులపైనే చర్యలు తీసుకునే అధికారులు ఇచ్చారు. రూ.5 లక్షల జరిమానా విధించాలన్నారు. ఇక, వాటాలు అడిగినట్టు తేలిన తమ్ముళ్లపై పార్టీపరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు. మరి ఈ చర్యలు ఏమేరకు.. సక్సెస్ అవుతాయో చూడాలి.
This post was last modified on October 29, 2024 3:23 pm
తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల పరిస్థితి అసలేం బాగోలేదు. హౌస్ ఫుల్ బోర్డులకు బూజు పడుతోంది. టికెట్లన్నీ అమ్ముడుపోయాయని గర్వంగా చెప్పుకునే…
https://youtu.be/COhEUjI-GEk?si=vlcLiVU0tytCMihG ఎంఆర్పీ సినిమా టీజర్ విడుదలై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రముఖ నిర్మాత సాహు గారపాటి చేతుల మీదుగా…
జూన్ నెలకు వాయిదా వేసుకున్న పెద్ది చివరి ఘట్టంకు వచ్చేసింది. ఐటెం సాంగ్ తీస్తే గుమ్మడికాయ కొట్టొచ్చు. దర్శకుడు బుచ్చిబాబు…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర రావు(90) ఇక లేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో సతమతం అవుతున్న నాదెండ్ల…
వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ఇక జైలు ఊచలు లెక్కపెట్టక తప్పేలా లేదు. ఎందుకంటే...తన వద్ద డ్రైవర్ గా పనిచేస్తున్న సుబ్రహ్మణ్యం అనే…
ప్రస్తుతం మంచి ఊపులో షూటింగ్ జరుపుకుంటున్న బాలకృష్ణ - గోపీచంద్ మలినేని మూవీలో ముందు తీసుకున్న హీరోయిన్ నయనతార. ఇది…