Political News

బాబుకు సెగ త‌గులుతోంది.. స‌రిచేస్తున్నారు..!

ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు బాగానే సెగ త‌గులుతున్న‌ట్టుగా ఉంది. దీంతో ఆయ‌న స‌రిచేసే ప్ర‌క్రియ‌ను ముమ్మ‌రం చేశారు. ముఖ్యంగా మూడు విష‌యాల్లో చంద్ర‌బాబుకు ఇబ్బందులు వ‌స్తున్నాయి. అది కూడా ఒక్క మ‌ద్యం విష‌యంలోనే కావ‌డం గ‌మ‌నార్హం. దీంతో వెంట‌నే అలెర్ట్ అయిన చంద్ర‌బాబు చ‌ర్య‌ల‌కు దిగారు. అస‌లు రాష్ట్రంలో ప్ర‌భుత్వ మ‌ద్యం విధానాన్ని ర‌ద్దు చేసి.. ప్రైవేటు మ‌ద్యం విధానాన్ని తీసుకువ‌చ్చిన త‌ర్వాత‌.. అనేక ఆరోప‌ణ‌ల‌కు వేదిగా ఈ నూత‌న మ‌ద్యం విధానం నిల‌బ‌డింది. ప్ర‌ధానంగా త‌మ్ముళ్ల ప్ర‌మేయం ఎక్కువ‌గా ఉండ‌డం గ‌మ‌నార్హం.

ప‌దే ప‌దే ఈ విష‌యంపై చంద్ర‌బాబు త‌మ్ముళ్ల‌ను హెచ్చ‌రించారు. మ‌ద్యం విష‌యంలో జోక్యం చేసుకోవ‌ద్ద‌ని కూడా చెప్పారు. అయినా.. త‌మ్ముళ్లు వినిపించుకోలేదు. దీనికితోడు.. వ్యాపారం ప్రారంభించి.. ప‌ట్టుమ‌ని ప‌ది రోజులు కూడా కాక‌ముందే.. త‌ణుకు, తుని త‌దితర నియోజ‌క‌వ‌ర్గాల్లో బెల్టు షాపులు తెర‌మీదికి రావ‌డం మ‌రో ఇబ్బందిగా మారింది. ఇలా వెలుగు చూడ‌గానే.. అలా సోష‌ల్ మీడియాలో ఈ బెల్టు షాపుల‌పై పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రిగింది. ప‌లుప‌త్రిక‌ల్లోనూ క‌థ‌నాలు కూడా వ‌చ్చాయి. ఈ ప‌రిణామం స‌ర్కారుకు సెగ పెట్టేలా త‌యారైంది.

ఇక‌, గుంటూరు, విజ‌య‌వాడ‌, విశాఖ‌, అనంత‌పురం, క‌ర్నూలు జిల్లాల్లో మ‌ద్యం ధ‌ర‌లు ఆకాశానికి ఎగ‌బాకాయి. స‌ర్కారు ముందుగానే చెప్పిన‌ట్టు మ‌ద్యం బాటిళ్ల‌ను ఎంఆర్‌పీకి విక్ర‌యించాల్సి ఉన్నా.. స్థానికంగా ఉన్న రాజ‌కీయ వివాదాలు.. నేత‌ల జోక్యంతో పెరిగిపోయిన వాటాల కార‌ణంగా.. క్వార్ట‌ర్ బాటిల్‌పై 10-15 రూపాయ‌లు అద‌నంగా తీసుకుంటున్నారు. ఇక‌, ఫుల్లు బాటిల్‌పై 40-50 రూపాయ‌లు(రౌండ్‌గా ఏది ఎక్కువ ఉంటే అది. ఉదాహ‌ర‌ణ‌కు 260 ఉంటే 40 క‌లిపి.. 300) తీసుకుంటున్నారు. దీంతో సోష‌ల్ మీడియాలో మందు బాబులు ఆధారాల‌తో స‌హా చూపించి నానా ర‌చ్చ చేస్తున్నారు.

ఈ ప‌రిణామాలు క్షేత్ర‌స్థాయిలో ఎలా ఉన్నా.. స‌ర్కారుకు మాత్రం సెగ పెంచుతున్నాయి. అంటే.. బెల్టు షాపులు ఒక‌వైపు, ఎంఆర్ పీ కంటే ఎక్కువ‌గా విక్ర‌యించ‌డం మ‌రోవైపు, త‌మ్ముళ్ల వాటాలు ఇంకోవైపు.. ఇలా మూడు ర‌కాలుగా నూత‌న మ‌ద్యం పాల‌సీ.. నానా క‌ష్టాలు ప‌డుతోంది. దీనిపై స్పందించిన చంద్ర‌బాబు తాజాగా కీల‌క ఆదేశాలు జారీ చేశారు. ఎంఆర్ పీ కంటే ఎక్కువ‌కు అమ్మితే దుకాణ దారుల‌పైనే చ‌ర్య‌లు తీసుకునే అధికారులు ఇచ్చారు. రూ.5 ల‌క్ష‌ల జ‌రిమానా విధించాల‌న్నారు. ఇక‌, వాటాలు అడిగిన‌ట్టు తేలిన త‌మ్ముళ్ల‌పై పార్టీప‌రంగా చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించారు. మ‌రి ఈ చ‌ర్య‌లు ఏమేర‌కు.. స‌క్సెస్ అవుతాయో చూడాలి.

This post was last modified on October 29, 2024 3:23 pm

Share
Show comments

Recent Posts

ఇరాన్ పై యుద్ధం… ట్రంప్ కొంప ముంచుతుందా?

ఇరాన్‌తో యుద్ధం విష‌యంలో అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా?  నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…

44 minutes ago

‘కల్కి’పై విమర్శలకు కట్టుబడి ఉన్న లిరిసిస్ట్

ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…

53 minutes ago

ఎన్నిక‌ల క‌మిష‌నర్‌ను తొలగించడానికి తీర్మానమా?

దేశంలో గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా ప‌లు కీల‌క అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్ర‌ధాని పైనే గ‌త ఐదేళ్ల‌లో…

4 hours ago

చంద్రబాబు 3సీ ఫార్ములా… ఇది కలెక్టర్ల కోసమే

ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…

5 hours ago

థియేటర్ అనుభూతికి ‘సబ్ టైటిల్స్’ దెబ్బ

మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…

6 hours ago

సెలబ్రెటీ పెళ్లిళ్లు.. హడావుడి తగ్గించాలా?

పెళ్లి అనేది జీవితంలో ఒక్కసారే వచ్చే ఘట్టం. దాన్ని ఘనంగా చేసుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. ప్రతి కుటుంబంలోనూ పెళ్లిని…

6 hours ago