Political News

బాబుకు సెగ త‌గులుతోంది.. స‌రిచేస్తున్నారు..!

ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు బాగానే సెగ త‌గులుతున్న‌ట్టుగా ఉంది. దీంతో ఆయ‌న స‌రిచేసే ప్ర‌క్రియ‌ను ముమ్మ‌రం చేశారు. ముఖ్యంగా మూడు విష‌యాల్లో చంద్ర‌బాబుకు ఇబ్బందులు వ‌స్తున్నాయి. అది కూడా ఒక్క మ‌ద్యం విష‌యంలోనే కావ‌డం గ‌మ‌నార్హం. దీంతో వెంట‌నే అలెర్ట్ అయిన చంద్ర‌బాబు చ‌ర్య‌ల‌కు దిగారు. అస‌లు రాష్ట్రంలో ప్ర‌భుత్వ మ‌ద్యం విధానాన్ని ర‌ద్దు చేసి.. ప్రైవేటు మ‌ద్యం విధానాన్ని తీసుకువ‌చ్చిన త‌ర్వాత‌.. అనేక ఆరోప‌ణ‌ల‌కు వేదిగా ఈ నూత‌న మ‌ద్యం విధానం నిల‌బ‌డింది. ప్ర‌ధానంగా త‌మ్ముళ్ల ప్ర‌మేయం ఎక్కువ‌గా ఉండ‌డం గ‌మ‌నార్హం.

ప‌దే ప‌దే ఈ విష‌యంపై చంద్ర‌బాబు త‌మ్ముళ్ల‌ను హెచ్చ‌రించారు. మ‌ద్యం విష‌యంలో జోక్యం చేసుకోవ‌ద్ద‌ని కూడా చెప్పారు. అయినా.. త‌మ్ముళ్లు వినిపించుకోలేదు. దీనికితోడు.. వ్యాపారం ప్రారంభించి.. ప‌ట్టుమ‌ని ప‌ది రోజులు కూడా కాక‌ముందే.. త‌ణుకు, తుని త‌దితర నియోజ‌క‌వ‌ర్గాల్లో బెల్టు షాపులు తెర‌మీదికి రావ‌డం మ‌రో ఇబ్బందిగా మారింది. ఇలా వెలుగు చూడ‌గానే.. అలా సోష‌ల్ మీడియాలో ఈ బెల్టు షాపుల‌పై పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రిగింది. ప‌లుప‌త్రిక‌ల్లోనూ క‌థ‌నాలు కూడా వ‌చ్చాయి. ఈ ప‌రిణామం స‌ర్కారుకు సెగ పెట్టేలా త‌యారైంది.

ఇక‌, గుంటూరు, విజ‌య‌వాడ‌, విశాఖ‌, అనంత‌పురం, క‌ర్నూలు జిల్లాల్లో మ‌ద్యం ధ‌ర‌లు ఆకాశానికి ఎగ‌బాకాయి. స‌ర్కారు ముందుగానే చెప్పిన‌ట్టు మ‌ద్యం బాటిళ్ల‌ను ఎంఆర్‌పీకి విక్ర‌యించాల్సి ఉన్నా.. స్థానికంగా ఉన్న రాజ‌కీయ వివాదాలు.. నేత‌ల జోక్యంతో పెరిగిపోయిన వాటాల కార‌ణంగా.. క్వార్ట‌ర్ బాటిల్‌పై 10-15 రూపాయ‌లు అద‌నంగా తీసుకుంటున్నారు. ఇక‌, ఫుల్లు బాటిల్‌పై 40-50 రూపాయ‌లు(రౌండ్‌గా ఏది ఎక్కువ ఉంటే అది. ఉదాహ‌ర‌ణ‌కు 260 ఉంటే 40 క‌లిపి.. 300) తీసుకుంటున్నారు. దీంతో సోష‌ల్ మీడియాలో మందు బాబులు ఆధారాల‌తో స‌హా చూపించి నానా ర‌చ్చ చేస్తున్నారు.

ఈ ప‌రిణామాలు క్షేత్ర‌స్థాయిలో ఎలా ఉన్నా.. స‌ర్కారుకు మాత్రం సెగ పెంచుతున్నాయి. అంటే.. బెల్టు షాపులు ఒక‌వైపు, ఎంఆర్ పీ కంటే ఎక్కువ‌గా విక్ర‌యించ‌డం మ‌రోవైపు, త‌మ్ముళ్ల వాటాలు ఇంకోవైపు.. ఇలా మూడు ర‌కాలుగా నూత‌న మ‌ద్యం పాల‌సీ.. నానా క‌ష్టాలు ప‌డుతోంది. దీనిపై స్పందించిన చంద్ర‌బాబు తాజాగా కీల‌క ఆదేశాలు జారీ చేశారు. ఎంఆర్ పీ కంటే ఎక్కువ‌కు అమ్మితే దుకాణ దారుల‌పైనే చ‌ర్య‌లు తీసుకునే అధికారులు ఇచ్చారు. రూ.5 ల‌క్ష‌ల జ‌రిమానా విధించాల‌న్నారు. ఇక‌, వాటాలు అడిగిన‌ట్టు తేలిన త‌మ్ముళ్ల‌పై పార్టీప‌రంగా చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించారు. మ‌రి ఈ చ‌ర్య‌లు ఏమేర‌కు.. స‌క్సెస్ అవుతాయో చూడాలి.

This post was last modified on October 29, 2024 3:23 pm

Share
Show comments

Recent Posts

వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు కౌంట్ డౌన్?

వైసీపీ ఎమ్మెల్సీ అనంత సత్య ఉదయ భాస్కర్ (అనంతబాబు) డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసుపై శుక్రవారం సుప్రీంకోర్టు లో విచారణ…

2 hours ago

ధనుష్‌ను ఆకాశానికెత్తేసిన మృణాల్

తమిళ స్టార్ హీరో ధనుష్, బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ మధ్య బంధం గురించి గత కొన్ని నెలలుగా ఎంత…

2 hours ago

తారక్, ప్రభాస్ ఇద్దరూ పునుగుల పిచ్చోళ్లే

టాలీవుడ్లో భోజన ప్రియులుగా కొందరు హీరోలకు పేరుంది. అందులో జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్‌ల పేర్లు ముందు వరుసలో ఉంటాయి. తనకు…

2 hours ago

దురంధర్ హీరోకి విచిత్రమైన పరిస్థితి

బాలీవుడ్ అతి పెద్ద బ్లాక్ బస్టర్ సాధించిన హీరో రణ్వీర్ సింగ్ విచిత్రమైన పరిస్థితిలో ఉన్నాడు. దురంధర్ 2 తర్వాత…

3 hours ago

తెలుగు రాష్ట్రాలకూ ‘సర్’ వచ్చేస్తున్నారు..

ఇరు తెలుగు రాష్ట్రాలకు 'సర్' వస్తున్నారు.. దేశవ్యాప్తంగా ఓటరు జాబితాలను సమగ్రంగా పరిశీలించేందుకు భారత ఎన్నికల సంఘం ‘స్పెషల్ ఇంటెన్సివ్…

3 hours ago

ఓటమి చూడని జట్లతో భారత్ అసలైన ఫైట్

టీ20 వరల్డ్ కప్ 2026 లీగ్ దశ ముగిసి అసలైన మజా మొదలవ్వబోతోంది. ఈసారి సూపర్ 8 గ్రూపులు ఫైనల్…

4 hours ago