Political News

బాబుకు సెగ త‌గులుతోంది.. స‌రిచేస్తున్నారు..!

ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు బాగానే సెగ త‌గులుతున్న‌ట్టుగా ఉంది. దీంతో ఆయ‌న స‌రిచేసే ప్ర‌క్రియ‌ను ముమ్మ‌రం చేశారు. ముఖ్యంగా మూడు విష‌యాల్లో చంద్ర‌బాబుకు ఇబ్బందులు వ‌స్తున్నాయి. అది కూడా ఒక్క మ‌ద్యం విష‌యంలోనే కావ‌డం గ‌మ‌నార్హం. దీంతో వెంట‌నే అలెర్ట్ అయిన చంద్ర‌బాబు చ‌ర్య‌ల‌కు దిగారు. అస‌లు రాష్ట్రంలో ప్ర‌భుత్వ మ‌ద్యం విధానాన్ని ర‌ద్దు చేసి.. ప్రైవేటు మ‌ద్యం విధానాన్ని తీసుకువ‌చ్చిన త‌ర్వాత‌.. అనేక ఆరోప‌ణ‌ల‌కు వేదిగా ఈ నూత‌న మ‌ద్యం విధానం నిల‌బ‌డింది. ప్ర‌ధానంగా త‌మ్ముళ్ల ప్ర‌మేయం ఎక్కువ‌గా ఉండ‌డం గ‌మ‌నార్హం.

ప‌దే ప‌దే ఈ విష‌యంపై చంద్ర‌బాబు త‌మ్ముళ్ల‌ను హెచ్చ‌రించారు. మ‌ద్యం విష‌యంలో జోక్యం చేసుకోవ‌ద్ద‌ని కూడా చెప్పారు. అయినా.. త‌మ్ముళ్లు వినిపించుకోలేదు. దీనికితోడు.. వ్యాపారం ప్రారంభించి.. ప‌ట్టుమ‌ని ప‌ది రోజులు కూడా కాక‌ముందే.. త‌ణుకు, తుని త‌దితర నియోజ‌క‌వ‌ర్గాల్లో బెల్టు షాపులు తెర‌మీదికి రావ‌డం మ‌రో ఇబ్బందిగా మారింది. ఇలా వెలుగు చూడ‌గానే.. అలా సోష‌ల్ మీడియాలో ఈ బెల్టు షాపుల‌పై పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రిగింది. ప‌లుప‌త్రిక‌ల్లోనూ క‌థ‌నాలు కూడా వ‌చ్చాయి. ఈ ప‌రిణామం స‌ర్కారుకు సెగ పెట్టేలా త‌యారైంది.

ఇక‌, గుంటూరు, విజ‌య‌వాడ‌, విశాఖ‌, అనంత‌పురం, క‌ర్నూలు జిల్లాల్లో మ‌ద్యం ధ‌ర‌లు ఆకాశానికి ఎగ‌బాకాయి. స‌ర్కారు ముందుగానే చెప్పిన‌ట్టు మ‌ద్యం బాటిళ్ల‌ను ఎంఆర్‌పీకి విక్ర‌యించాల్సి ఉన్నా.. స్థానికంగా ఉన్న రాజ‌కీయ వివాదాలు.. నేత‌ల జోక్యంతో పెరిగిపోయిన వాటాల కార‌ణంగా.. క్వార్ట‌ర్ బాటిల్‌పై 10-15 రూపాయ‌లు అద‌నంగా తీసుకుంటున్నారు. ఇక‌, ఫుల్లు బాటిల్‌పై 40-50 రూపాయ‌లు(రౌండ్‌గా ఏది ఎక్కువ ఉంటే అది. ఉదాహ‌ర‌ణ‌కు 260 ఉంటే 40 క‌లిపి.. 300) తీసుకుంటున్నారు. దీంతో సోష‌ల్ మీడియాలో మందు బాబులు ఆధారాల‌తో స‌హా చూపించి నానా ర‌చ్చ చేస్తున్నారు.

ఈ ప‌రిణామాలు క్షేత్ర‌స్థాయిలో ఎలా ఉన్నా.. స‌ర్కారుకు మాత్రం సెగ పెంచుతున్నాయి. అంటే.. బెల్టు షాపులు ఒక‌వైపు, ఎంఆర్ పీ కంటే ఎక్కువ‌గా విక్ర‌యించ‌డం మ‌రోవైపు, త‌మ్ముళ్ల వాటాలు ఇంకోవైపు.. ఇలా మూడు ర‌కాలుగా నూత‌న మ‌ద్యం పాల‌సీ.. నానా క‌ష్టాలు ప‌డుతోంది. దీనిపై స్పందించిన చంద్ర‌బాబు తాజాగా కీల‌క ఆదేశాలు జారీ చేశారు. ఎంఆర్ పీ కంటే ఎక్కువ‌కు అమ్మితే దుకాణ దారుల‌పైనే చ‌ర్య‌లు తీసుకునే అధికారులు ఇచ్చారు. రూ.5 ల‌క్ష‌ల జ‌రిమానా విధించాల‌న్నారు. ఇక‌, వాటాలు అడిగిన‌ట్టు తేలిన త‌మ్ముళ్ల‌పై పార్టీప‌రంగా చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించారు. మ‌రి ఈ చ‌ర్య‌లు ఏమేర‌కు.. స‌క్సెస్ అవుతాయో చూడాలి.

This post was last modified on October 29, 2024 3:23 pm

Share
Show comments

Recent Posts

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

1 hour ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

2 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

3 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

4 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

4 hours ago

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

6 hours ago