వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త ట్రెండ్ అమల్లోకి తీసుకొచ్చింది. చంద్రబాబునాయుడు అధికారంలో ఉన్నంత కాలం జరిగిన పార్టీ ఫిరాయింపులు అందరికీ తెలిసిందే. అప్పట్లో వైసిపి తరపున గెలిచిన 23 మంది ఎంఎల్ఏలు, ముగ్గురు ఎంపిలను నేరుగా తెలుగుదేశంపార్టీలోకి లాగేసుకున్నారు. ఈ విషయంలో అప్పట్లో వైసిపి ఎంత గగ్గోలు పెట్టిందో అందరు చూసిందే. కాలం ఐదేళ్ళు గడిచేసరికి సీన్ రివర్సయిపోయింది. జగన్మోహన్ రెడ్డి కూడా అదే పని చేస్తున్నారు. అయితే, కాస్త మార్పులు చేసి అమలు చేస్తున్నారు.
వైసీపీ అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలో టీడీపీ ఎంఎల్ఏలను ఎవరినీ నేరుగా వైసిపిలోకి చేర్చుకోలేదు. కాకపోతే తెలుగుదేశంపార్టీలో తిరుగుబాటు లేవదీసిన ఎంఎల్ఏలు పార్టీకి రాజీనామాలు చేయటం లేకపోతే సస్పెండ్ అయిన తర్వాత వైసిపికి మద్దతుగా నిలబడుతున్నారు. మొదటగా గన్నవరం ఎంఎల్ఏ వల్లభనేని వంశీ పార్టీ నుండి సస్పెండ్ అయ్యారు. దాంతో అయన వైసీపీకి మద్దతుగా నిలబడ్డారు. తర్వాత గుంటూరు పశ్చిమ ఎంఎల్ఏ మద్దాలి గిరిధర్ కూడా ఇదే దారిలో టీడీపీలో నుండి బయటకు వచ్చేశారు.
తర్వాత వంతు చీరాల ఎంఎల్ఏ కరణం బలరామ్. అయితే ఇక్కడే కొద్దిమార్పులు జరిగాయి. ఆయన నేరుగా వైసీపీతో చేతులు కలపకుండా తన కొడుకు వెంకటేష్ తో పాటు మద్దతుదారులను మాత్రం వైసిపిలోకి తోసారు. అంటే పరోక్షంగా కరణం కూడా వైసీపీలో చేరిపోయినట్లే. ఇదే రూటులో తర్వాత వైజాగ్ ఎంఎల్ఏ వాసుపల్లి గణేష్ కుమార్ నడిచారు. ఈయన కూడా తాను అధికారపార్టీలో చేరకుండా తన కొడుకు, మద్దతుదారులను పార్టీలోకి పంపారు. తర్వాత జరిగిన పరిణామాల్లో తాను కూడా వైసీపీలో చేరినట్లు ఆయనే ప్రకటించుకున్నారులేండి.
ఇపుడు మరో ఎంఎల్ఏ గంటా శ్రీనివాసరావు వంతొచ్చింది. ఈనెల 3వ తేదీ అంటే శనివారం నాడు తన కొడుకు రవితేజను వైసిపిలోకి జాయిన్ చేస్తున్నట్లు సమాచారం. అసలు గంటాయే వైసిపిలో చేరాలని తెగ ప్రయత్నాలు చేశారు. కానీ ఎప్పటికప్పుడు ఏవో అవాంతరాలు ఎదురవుతుండటంతో చేరిక వాయిదాపడుతోంది. ఈ ప్రయత్నాలతో లాభం లేదనుకున్నట్లున్నాడు గంటా. అందుకనే ముందుగా తన కొడుకును పార్టీలోకి పంపుతున్నారు. ఇందుకు జగన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.
అమరావతిలో ఇప్పటికే ఇందుకు ఏర్పాట్లు కూడా అయిపోయాయట. కొడుకు వైసిపిలో చేరిపోతే తర్వాత తాను కూడా అధికారపార్టీలోకి చేరిపోవటం పెద్ద కష్టం కాదన్నది గంటా ఆలోచనగా అర్ధమవుతోంది. అంటే ముందు వారసులను అధికారపార్టీలోకి పంపేస్తే తర్వాత తాము కూడా ఫాలో అవ్వచ్చన్నదే కొత్త ట్రెండుగా కనబడుతోంది.
This post was last modified on October 2, 2020 2:52 pm
శాండల్ వుడ్ హీరో ఉపేంద్ర ఎంత టిపికల్ గా ఆలోచిస్తారో తొంభై దశకంలో సినిమాలు చూసిన వాళ్లకు బాగా తెలుసు.…
ఏపీలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు కూటమి ప్రభుత్వం వేగం పెంచింది. ఇటీవల ఉపాధ్యాయ నియామకాలను పూర్తి చేసిన ప్రభుత్వం, ఇప్పుడు…
నాలుగు గంటల విచారణలో అన్నీ ముక్తసరి సమాధానాలే..! కొన్నిటికి మౌనం, మరికొన్నిటికి తెలియదు అంటూ దాటవేత.. విచారణలో ఇదీ సీఐడీ…
తెలుగు సినీ ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న అరంగేట్రాల్లో అకీరా నందన్ది ఒకటి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్…
తెలంగాణ బిజెపిని దారిలో పెట్టాలని, నాయకుల మధ్య ఐక్యత ఉండాలని, రాజకీయంగా దూకుడు పెంచాలని కచ్చితంగా నాలుగు రోజుల కిందట…
అనిల్ రావిపూడిని టాలీవుడ్లో అందరూ హిట్ మెషీన్ అంటారు. దర్శక ధీరుడు రాజమౌళి తర్వాత అపజయం లేకుండా కెరీర్ను సాగిస్తున్న…