వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త ట్రెండ్ అమల్లోకి తీసుకొచ్చింది. చంద్రబాబునాయుడు అధికారంలో ఉన్నంత కాలం జరిగిన పార్టీ ఫిరాయింపులు అందరికీ తెలిసిందే. అప్పట్లో వైసిపి తరపున గెలిచిన 23 మంది ఎంఎల్ఏలు, ముగ్గురు ఎంపిలను నేరుగా తెలుగుదేశంపార్టీలోకి లాగేసుకున్నారు. ఈ విషయంలో అప్పట్లో వైసిపి ఎంత గగ్గోలు పెట్టిందో అందరు చూసిందే. కాలం ఐదేళ్ళు గడిచేసరికి సీన్ రివర్సయిపోయింది. జగన్మోహన్ రెడ్డి కూడా అదే పని చేస్తున్నారు. అయితే, కాస్త మార్పులు చేసి అమలు చేస్తున్నారు.
వైసీపీ అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలో టీడీపీ ఎంఎల్ఏలను ఎవరినీ నేరుగా వైసిపిలోకి చేర్చుకోలేదు. కాకపోతే తెలుగుదేశంపార్టీలో తిరుగుబాటు లేవదీసిన ఎంఎల్ఏలు పార్టీకి రాజీనామాలు చేయటం లేకపోతే సస్పెండ్ అయిన తర్వాత వైసిపికి మద్దతుగా నిలబడుతున్నారు. మొదటగా గన్నవరం ఎంఎల్ఏ వల్లభనేని వంశీ పార్టీ నుండి సస్పెండ్ అయ్యారు. దాంతో అయన వైసీపీకి మద్దతుగా నిలబడ్డారు. తర్వాత గుంటూరు పశ్చిమ ఎంఎల్ఏ మద్దాలి గిరిధర్ కూడా ఇదే దారిలో టీడీపీలో నుండి బయటకు వచ్చేశారు.
తర్వాత వంతు చీరాల ఎంఎల్ఏ కరణం బలరామ్. అయితే ఇక్కడే కొద్దిమార్పులు జరిగాయి. ఆయన నేరుగా వైసీపీతో చేతులు కలపకుండా తన కొడుకు వెంకటేష్ తో పాటు మద్దతుదారులను మాత్రం వైసిపిలోకి తోసారు. అంటే పరోక్షంగా కరణం కూడా వైసీపీలో చేరిపోయినట్లే. ఇదే రూటులో తర్వాత వైజాగ్ ఎంఎల్ఏ వాసుపల్లి గణేష్ కుమార్ నడిచారు. ఈయన కూడా తాను అధికారపార్టీలో చేరకుండా తన కొడుకు, మద్దతుదారులను పార్టీలోకి పంపారు. తర్వాత జరిగిన పరిణామాల్లో తాను కూడా వైసీపీలో చేరినట్లు ఆయనే ప్రకటించుకున్నారులేండి.
ఇపుడు మరో ఎంఎల్ఏ గంటా శ్రీనివాసరావు వంతొచ్చింది. ఈనెల 3వ తేదీ అంటే శనివారం నాడు తన కొడుకు రవితేజను వైసిపిలోకి జాయిన్ చేస్తున్నట్లు సమాచారం. అసలు గంటాయే వైసిపిలో చేరాలని తెగ ప్రయత్నాలు చేశారు. కానీ ఎప్పటికప్పుడు ఏవో అవాంతరాలు ఎదురవుతుండటంతో చేరిక వాయిదాపడుతోంది. ఈ ప్రయత్నాలతో లాభం లేదనుకున్నట్లున్నాడు గంటా. అందుకనే ముందుగా తన కొడుకును పార్టీలోకి పంపుతున్నారు. ఇందుకు జగన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.
అమరావతిలో ఇప్పటికే ఇందుకు ఏర్పాట్లు కూడా అయిపోయాయట. కొడుకు వైసిపిలో చేరిపోతే తర్వాత తాను కూడా అధికారపార్టీలోకి చేరిపోవటం పెద్ద కష్టం కాదన్నది గంటా ఆలోచనగా అర్ధమవుతోంది. అంటే ముందు వారసులను అధికారపార్టీలోకి పంపేస్తే తర్వాత తాము కూడా ఫాలో అవ్వచ్చన్నదే కొత్త ట్రెండుగా కనబడుతోంది.
This post was last modified on October 2, 2020 2:52 pm
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నుంచి వచ్చిన చివరి చిత్రం జననాయగన్ మీద అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఆ…
ఇండస్ట్రీలో ఇబ్బందులు, సమస్యలు కేవలం చిన్న నిర్మాతలకే వస్తాయనుకుంటే పొరపాటే. ఎంత చెట్టుకు అంత గాలి తరహాలో ఎవరి కష్టాలు…
మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సగటు తెలుగు సినీ ప్రియులంతా ఎదురు చూస్తున్న క్రేజీ మూవీ వారణాసి. ఆర్ఆర్ఆర్…
నేషనల్ అవార్డుల మీద గత రెండేళ్లుగా ఎంత చర్చ జరుగుతోందో చూస్తున్నాం. ఒకప్పుడు కళాత్మక విలువలున్న సినిమాలకే ఈ పురస్కారం…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దయ, కనికరం, ఆప్యాయత, అభిమానం కలిగిన నేతగా ఆయన అభిమానులు, వైసీపీ…
సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి ఎంత మద్దతు ఉన్నా సుధీర్ బాబు పెద్ద స్థాయికి వెళ్లలేకపోతున్నాడు. వరస ఫెయిల్యూర్స్…