Political News

కొత్త ట్రెండ్ .. కొడుక్కి జండా… తండ్రికి ఎంట్రీ

వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త ట్రెండ్ అమల్లోకి తీసుకొచ్చింది. చంద్రబాబునాయుడు అధికారంలో ఉన్నంత కాలం జరిగిన పార్టీ ఫిరాయింపులు అందరికీ తెలిసిందే. అప్పట్లో వైసిపి తరపున గెలిచిన 23 మంది ఎంఎల్ఏలు, ముగ్గురు ఎంపిలను నేరుగా తెలుగుదేశంపార్టీలోకి లాగేసుకున్నారు. ఈ విషయంలో అప్పట్లో వైసిపి ఎంత గగ్గోలు పెట్టిందో అందరు చూసిందే. కాలం ఐదేళ్ళు గడిచేసరికి సీన్ రివర్సయిపోయింది. జగన్మోహన్ రెడ్డి కూడా అదే పని చేస్తున్నారు. అయితే, కాస్త మార్పులు చేసి అమలు చేస్తున్నారు.

వైసీపీ అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలో టీడీపీ ఎంఎల్ఏలను ఎవరినీ నేరుగా వైసిపిలోకి చేర్చుకోలేదు. కాకపోతే తెలుగుదేశంపార్టీలో తిరుగుబాటు లేవదీసిన ఎంఎల్ఏలు పార్టీకి రాజీనామాలు చేయటం లేకపోతే సస్పెండ్ అయిన తర్వాత వైసిపికి మద్దతుగా నిలబడుతున్నారు. మొదటగా గన్నవరం ఎంఎల్ఏ వల్లభనేని వంశీ పార్టీ నుండి సస్పెండ్ అయ్యారు. దాంతో అయన వైసీపీకి మద్దతుగా నిలబడ్డారు. తర్వాత గుంటూరు పశ్చిమ ఎంఎల్ఏ మద్దాలి గిరిధర్ కూడా ఇదే దారిలో టీడీపీలో నుండి బయటకు వచ్చేశారు.

తర్వాత వంతు చీరాల ఎంఎల్ఏ కరణం బలరామ్. అయితే ఇక్కడే కొద్దిమార్పులు జరిగాయి. ఆయన నేరుగా వైసీపీతో చేతులు కలపకుండా తన కొడుకు వెంకటేష్ తో పాటు మద్దతుదారులను మాత్రం వైసిపిలోకి తోసారు. అంటే పరోక్షంగా కరణం కూడా వైసీపీలో చేరిపోయినట్లే. ఇదే రూటులో తర్వాత వైజాగ్ ఎంఎల్ఏ వాసుపల్లి గణేష్ కుమార్ నడిచారు. ఈయన కూడా తాను అధికారపార్టీలో చేరకుండా తన కొడుకు, మద్దతుదారులను పార్టీలోకి పంపారు. తర్వాత జరిగిన పరిణామాల్లో తాను కూడా వైసీపీలో చేరినట్లు ఆయనే ప్రకటించుకున్నారులేండి.

ఇపుడు మరో ఎంఎల్ఏ గంటా శ్రీనివాసరావు వంతొచ్చింది. ఈనెల 3వ తేదీ అంటే శనివారం నాడు తన కొడుకు రవితేజను వైసిపిలోకి జాయిన్ చేస్తున్నట్లు సమాచారం. అసలు గంటాయే వైసిపిలో చేరాలని తెగ ప్రయత్నాలు చేశారు. కానీ ఎప్పటికప్పుడు ఏవో అవాంతరాలు ఎదురవుతుండటంతో చేరిక వాయిదాపడుతోంది. ఈ ప్రయత్నాలతో లాభం లేదనుకున్నట్లున్నాడు గంటా. అందుకనే ముందుగా తన కొడుకును పార్టీలోకి పంపుతున్నారు. ఇందుకు జగన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.

అమరావతిలో ఇప్పటికే ఇందుకు ఏర్పాట్లు కూడా అయిపోయాయట. కొడుకు వైసిపిలో చేరిపోతే తర్వాత తాను కూడా అధికారపార్టీలోకి చేరిపోవటం పెద్ద కష్టం కాదన్నది గంటా ఆలోచనగా అర్ధమవుతోంది. అంటే ముందు వారసులను అధికారపార్టీలోకి పంపేస్తే తర్వాత తాము కూడా ఫాలో అవ్వచ్చన్నదే కొత్త ట్రెండుగా కనబడుతోంది.

This post was last modified on October 2, 2020 2:52 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

4 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

4 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

6 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

6 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

7 hours ago

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

8 hours ago