Political News

కొత్త ట్రెండ్ .. కొడుక్కి జండా… తండ్రికి ఎంట్రీ

వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త ట్రెండ్ అమల్లోకి తీసుకొచ్చింది. చంద్రబాబునాయుడు అధికారంలో ఉన్నంత కాలం జరిగిన పార్టీ ఫిరాయింపులు అందరికీ తెలిసిందే. అప్పట్లో వైసిపి తరపున గెలిచిన 23 మంది ఎంఎల్ఏలు, ముగ్గురు ఎంపిలను నేరుగా తెలుగుదేశంపార్టీలోకి లాగేసుకున్నారు. ఈ విషయంలో అప్పట్లో వైసిపి ఎంత గగ్గోలు పెట్టిందో అందరు చూసిందే. కాలం ఐదేళ్ళు గడిచేసరికి సీన్ రివర్సయిపోయింది. జగన్మోహన్ రెడ్డి కూడా అదే పని చేస్తున్నారు. అయితే, కాస్త మార్పులు చేసి అమలు చేస్తున్నారు.

వైసీపీ అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలో టీడీపీ ఎంఎల్ఏలను ఎవరినీ నేరుగా వైసిపిలోకి చేర్చుకోలేదు. కాకపోతే తెలుగుదేశంపార్టీలో తిరుగుబాటు లేవదీసిన ఎంఎల్ఏలు పార్టీకి రాజీనామాలు చేయటం లేకపోతే సస్పెండ్ అయిన తర్వాత వైసిపికి మద్దతుగా నిలబడుతున్నారు. మొదటగా గన్నవరం ఎంఎల్ఏ వల్లభనేని వంశీ పార్టీ నుండి సస్పెండ్ అయ్యారు. దాంతో అయన వైసీపీకి మద్దతుగా నిలబడ్డారు. తర్వాత గుంటూరు పశ్చిమ ఎంఎల్ఏ మద్దాలి గిరిధర్ కూడా ఇదే దారిలో టీడీపీలో నుండి బయటకు వచ్చేశారు.

తర్వాత వంతు చీరాల ఎంఎల్ఏ కరణం బలరామ్. అయితే ఇక్కడే కొద్దిమార్పులు జరిగాయి. ఆయన నేరుగా వైసీపీతో చేతులు కలపకుండా తన కొడుకు వెంకటేష్ తో పాటు మద్దతుదారులను మాత్రం వైసిపిలోకి తోసారు. అంటే పరోక్షంగా కరణం కూడా వైసీపీలో చేరిపోయినట్లే. ఇదే రూటులో తర్వాత వైజాగ్ ఎంఎల్ఏ వాసుపల్లి గణేష్ కుమార్ నడిచారు. ఈయన కూడా తాను అధికారపార్టీలో చేరకుండా తన కొడుకు, మద్దతుదారులను పార్టీలోకి పంపారు. తర్వాత జరిగిన పరిణామాల్లో తాను కూడా వైసీపీలో చేరినట్లు ఆయనే ప్రకటించుకున్నారులేండి.

ఇపుడు మరో ఎంఎల్ఏ గంటా శ్రీనివాసరావు వంతొచ్చింది. ఈనెల 3వ తేదీ అంటే శనివారం నాడు తన కొడుకు రవితేజను వైసిపిలోకి జాయిన్ చేస్తున్నట్లు సమాచారం. అసలు గంటాయే వైసిపిలో చేరాలని తెగ ప్రయత్నాలు చేశారు. కానీ ఎప్పటికప్పుడు ఏవో అవాంతరాలు ఎదురవుతుండటంతో చేరిక వాయిదాపడుతోంది. ఈ ప్రయత్నాలతో లాభం లేదనుకున్నట్లున్నాడు గంటా. అందుకనే ముందుగా తన కొడుకును పార్టీలోకి పంపుతున్నారు. ఇందుకు జగన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.

అమరావతిలో ఇప్పటికే ఇందుకు ఏర్పాట్లు కూడా అయిపోయాయట. కొడుకు వైసిపిలో చేరిపోతే తర్వాత తాను కూడా అధికారపార్టీలోకి చేరిపోవటం పెద్ద కష్టం కాదన్నది గంటా ఆలోచనగా అర్ధమవుతోంది. అంటే ముందు వారసులను అధికారపార్టీలోకి పంపేస్తే తర్వాత తాము కూడా ఫాలో అవ్వచ్చన్నదే కొత్త ట్రెండుగా కనబడుతోంది.

This post was last modified on October 2, 2020 2:52 pm

Share

Recent Posts

కార్తీ అర్జెంటుగా అప్‌డేట్ కావాల్సిందే

మంచి నటన, చలాకీతనం, అందం అన్నీ ఉన్నా కార్తీ విషయంలో జరుగుతున్న పరిణామాలు అభిమానులను తెగ కలవరపెడుతున్నాయి. సరైన హిట్…

31 minutes ago

వైసీపీకి `విశాఖ` ఆశ‌లు గ‌ల్లంతే.. !

విశాఖ‌ప‌ట్నంలో జ‌ర‌గ‌నున్న కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో వైసీపీ ఆశ‌లు గ‌ల్లంత‌వుతున్నాయి. గ‌తంలో ఉన్న ప‌ట్టు.. ఇప్పుడు లేక‌పోవ‌డం.. గ‌తంలో సాయిరెడ్డి వంటి…

33 minutes ago

సుహాస్ వాడకం ఇలా ఉండాలి

టాలెంట్ ఎంత ఉన్నా సక్సెస్ విషయంలో పోరాడుతూనే ఉన్న హీరోల్లో సుహాస్ ఒకడు. కలర్ ఫోటోకు జాతీయ అవార్డు వచ్చినా…

2 hours ago

పహల్గామ్‌పై బ్రిక్స్ ఒక్క మాట.. చైనా కూడా ఒప్పుకుంది!

పహల్గామ్ ఉగ్రదాడి విషయంలో భారత్‌కు అంతర్జాతీయ వేదికపై కీలక మద్దతు లభించింది. ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సులో ఆమోదించిన న్యూఢిల్లీ…

3 hours ago

గుంటూరు మేయర్ సీటు ఎవరికి

రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మక స్థానాల్లో గుంటూరు మేయర్ స్థానం ఒకటి. విజయవాడ, గుంటూరు కార్పొరేషన్లు అమరావతి రాజధాని పరిసరాల్లో ఉండటంతో…

3 hours ago

వైసీపీ ఇలా చేస్తే.. విజ‌య‌వాడ మొత్తం టీడీపీదే..!

వ్యూహాల క‌లిమి.. నాయ‌కుల చెలిమి ఏ పార్టీకైనా అత్యంత అవ‌స‌రం. ఈ విష‌యంలో వైసీపీ చేస్తున్న వ్వ‌వ‌హారం.. పార్టీని దుంప‌నాశ‌నం…

3 hours ago