Political News

చంద్రబాబు తో ఏకీభవించని కేటీఆర్

తెలుగుదేశం పార్టీ అధినేత‌, ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుకు, బీఆర్ఎస్ పార్టీ ర‌థ‌సార‌థి, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కు ఉప్పు-నిప్పు అన్నట్లుగా ప‌రిస్థితులు మారిపోయిన విష‌యం గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించ‌నక్క‌ర్లేదు.

ఈ ఇద్ద‌రు నేత‌లు ఇరు రాష్ట్రాల సీఎంలుగా ఉండ‌గా ఆ పార్టీ నేత‌లు సైతం అదే రీతిలో స్పందించే వారు. ఇందులో గులాబీ ద‌ళ‌ప‌తి కేసీఆర్ త‌న‌యుడు, బీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ టాప్ లో ఉండేవారు.

అయితే, తెలంగాణ‌లో అధికారం కోల్పోయిన త‌ర్వాత కూడా ఇప్ప‌టికీ అదే త‌ర‌హా కామెంట్ల‌ను కేటీఆర్ ఏపీ సీఎం చంద్ర‌బాబుపై చేస్తుండ‌టం ఆస‌క్తిక‌ర‌మ‌ని తాజా ప‌రిణామాల‌పై ప‌లువురు కామెంట్ చేస్తున్నారు.

హైద‌రాబాద్‌లో ఓ మీడియా సంస్థ నిర్వహించిన కార్య‌క్ర‌మంలో పాల్గొన్న కేటీఆర్ పలు ఆస‌క్తికర‌ వ్యాఖ్యలు చేశారు. త‌మ పార్టీ గురించి, తెలంగాణ‌లో ప్ర‌స్తుత ప‌రిపాల‌న గురించి, ఏపీ దేశ రాజ‌కీయాల గురించి సైతం కేటీఆర్ స్పందించారు.

కాంగ్రెస్‌ 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని నమ్మబలికి 300 రోజులైనా ఒక్క హామీని కూడా అమలు చేయలేదని దుయ్యబట్టారు. తమ ప్రభుత్వం కాంగ్రెస్‌, బీజేపీల కన్నా గొప్పగా పనిచేసిందని తెలిపారు.

అయితే, పదేళ్లు పాలించిన ప్రభుత్వంపై సహజంగా ఉండే వ్యతిరేకతే తమకూ ఎదురైందని, దీనికి తోడు సోషల్‌మీడియాలో అదేపనిగా విమర్శలు వెల్లువెత్తింద‌ని కేటీఆర్ అన్నారు. ఎన్నికల్లో ఓటమి కారణాలపై సమీక్షించుకున్నామని కేటీఆర్ పేర్కొంటూ ప్రజలు మరోసారి కేసీఆర్‌కు ముఖ్యమంత్రిగా పనిచేసే అవకాశం ఇస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇటీవ‌ల నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌పై ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు చేసిన కామెంట్ల‌ను కేటీఆర్ త‌ప్పుప‌ట్టారు. పార్లమెంట్‌ నియోజకవర్గాల పునర్విభజన విషయంలో జనాభా ప్రాతిపదికను పరిగణనలోకి తీసుకోవటం అసంబద్ధమైన విధానమని కేటీఆర్‌ పేర్కొన్నారు. జనాభాను పెంచుకోవాలనే విధంగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు.

ప్రస్తుత జనాభాకు తగ్గట్టుగా మౌలిక వసతులే లేని పరిస్థితి ఉన్నదని, ముందుగా వాటిని కల్పించడంపై ప్రభుత్వాలు దృష్టి సారించాలని సూచించారు. జనాభా నియంత్రణపై దక్షిణ భారతదేశానికి స్పష్టమైన అవగాహన ఉన్నదని చెప్పారు. జనాభా తగ్గించుకుని క్రమశిక్షణ పాటించిన దక్షిణాది రాష్ర్టాలకు డీలిమిటేషన్‌ పేరుతో నష్టం చేయడం అన్యాయమని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పై సైతం బీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్ కేటీఆర్‌ ఆస‌క్తిక‌ర కామెంట్లు చేశారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష నేతల ఫోన్‌లను కూడా రేవంత్‌రెడ్డి ట్యాప్‌ చేయిస్తున్నారని ఆరోపించారు. ‘ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి దమ్ముంటే రాష్ట్రంలో మంత్రుల ఫోన్లు.. మా ఫోన్లు ట్యాప్‌ చేయటం లేదని చెప్పాలి.. కెమెరాల ముందు ఓపెన్‌గా లైడిటెక్టర్‌ పరీక్షకు రావాలి’ అని కేటీఆర్‌ సవాల్‌ విసిరారు. రేవంత్‌కు దమ్మూ ధైర్యం ఉంటే తన సవాల్‌ను స్వీకరించి ఫోన్లు ట్యాప్‌ చేయటం లేదని చెప్పాలని డిమాండ్‌ చేశారు.

This post was last modified on October 26, 2024 7:59 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

బిగ్ బాస్-9‌లో ఇతనే పెద్ద సర్ప్రైజ్

ఆరంభ సీజన్లతో పోలిస్తే ‘బిగ్ బాస్’ షోకు ఇప్పుడు ఆదరణ కొంచెం తగ్గిన మాట వాస్తవం. ఒకప్పట్లా సోషల్ మీడియాలో…

33 minutes ago

‘అఖండ’ బాంబు… ఎవరిపై పడుతుందో?

దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్‌ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…

4 hours ago

అప్పటినుండి నేతలు అందరూ జనాల్లో తిరగాల్సిందే

వ‌చ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వ‌స్తున్నాన‌ని.. త‌న‌తో పాటు 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో నాయ‌కులు కూడా ప్ర‌జ‌ల‌ను క‌లుసుకోవాల‌ని…

4 hours ago

హ‌ద్దులు దాటేసిన ష‌ర్మిల‌… మైలేజీ కోస‌మేనా?

రాజ‌కీయాల్లో విమ‌ర్శ‌లు చేయొచ్చు. ప్ర‌తివిమ‌ర్శ‌లు కూడా ఎదుర్కొన‌చ్చు. కానీ, ప్ర‌తి విష‌యంలోనూ కొన్ని హ‌ద్దులు ఉంటాయి. ఎంత రాజ‌కీయ పార్టీకి…

5 hours ago

కూటమి పొత్తుపై ఉండవ‌ల్లికి డౌట‌ట‌… ఈ విష‌యాలు తెలీదా?

ఏపీలో బీజేపీ-టీడీపీ-జ‌న‌సేన పొత్తు పెట్టుకుని గ‌త 2024 ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికి 17 మాసాలుగా ఈ…

7 hours ago

కార్తి… అన్న‌గారిని భ‌లే వాడుకున్నాడే

తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఎంతో ఇష్ట‌మైన త‌మిళ స్టార్ ద్వ‌యం సూర్య‌, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద క‌మ‌ర్షియ‌ల్ హిట్ లేక…

7 hours ago