Political News

చంద్రబాబు తో ఏకీభవించని కేటీఆర్

తెలుగుదేశం పార్టీ అధినేత‌, ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుకు, బీఆర్ఎస్ పార్టీ ర‌థ‌సార‌థి, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కు ఉప్పు-నిప్పు అన్నట్లుగా ప‌రిస్థితులు మారిపోయిన విష‌యం గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించ‌నక్క‌ర్లేదు.

ఈ ఇద్ద‌రు నేత‌లు ఇరు రాష్ట్రాల సీఎంలుగా ఉండ‌గా ఆ పార్టీ నేత‌లు సైతం అదే రీతిలో స్పందించే వారు. ఇందులో గులాబీ ద‌ళ‌ప‌తి కేసీఆర్ త‌న‌యుడు, బీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ టాప్ లో ఉండేవారు.

అయితే, తెలంగాణ‌లో అధికారం కోల్పోయిన త‌ర్వాత కూడా ఇప్ప‌టికీ అదే త‌ర‌హా కామెంట్ల‌ను కేటీఆర్ ఏపీ సీఎం చంద్ర‌బాబుపై చేస్తుండ‌టం ఆస‌క్తిక‌ర‌మ‌ని తాజా ప‌రిణామాల‌పై ప‌లువురు కామెంట్ చేస్తున్నారు.

హైద‌రాబాద్‌లో ఓ మీడియా సంస్థ నిర్వహించిన కార్య‌క్ర‌మంలో పాల్గొన్న కేటీఆర్ పలు ఆస‌క్తికర‌ వ్యాఖ్యలు చేశారు. త‌మ పార్టీ గురించి, తెలంగాణ‌లో ప్ర‌స్తుత ప‌రిపాల‌న గురించి, ఏపీ దేశ రాజ‌కీయాల గురించి సైతం కేటీఆర్ స్పందించారు.

కాంగ్రెస్‌ 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని నమ్మబలికి 300 రోజులైనా ఒక్క హామీని కూడా అమలు చేయలేదని దుయ్యబట్టారు. తమ ప్రభుత్వం కాంగ్రెస్‌, బీజేపీల కన్నా గొప్పగా పనిచేసిందని తెలిపారు.

అయితే, పదేళ్లు పాలించిన ప్రభుత్వంపై సహజంగా ఉండే వ్యతిరేకతే తమకూ ఎదురైందని, దీనికి తోడు సోషల్‌మీడియాలో అదేపనిగా విమర్శలు వెల్లువెత్తింద‌ని కేటీఆర్ అన్నారు. ఎన్నికల్లో ఓటమి కారణాలపై సమీక్షించుకున్నామని కేటీఆర్ పేర్కొంటూ ప్రజలు మరోసారి కేసీఆర్‌కు ముఖ్యమంత్రిగా పనిచేసే అవకాశం ఇస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇటీవ‌ల నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌పై ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు చేసిన కామెంట్ల‌ను కేటీఆర్ త‌ప్పుప‌ట్టారు. పార్లమెంట్‌ నియోజకవర్గాల పునర్విభజన విషయంలో జనాభా ప్రాతిపదికను పరిగణనలోకి తీసుకోవటం అసంబద్ధమైన విధానమని కేటీఆర్‌ పేర్కొన్నారు. జనాభాను పెంచుకోవాలనే విధంగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు.

ప్రస్తుత జనాభాకు తగ్గట్టుగా మౌలిక వసతులే లేని పరిస్థితి ఉన్నదని, ముందుగా వాటిని కల్పించడంపై ప్రభుత్వాలు దృష్టి సారించాలని సూచించారు. జనాభా నియంత్రణపై దక్షిణ భారతదేశానికి స్పష్టమైన అవగాహన ఉన్నదని చెప్పారు. జనాభా తగ్గించుకుని క్రమశిక్షణ పాటించిన దక్షిణాది రాష్ర్టాలకు డీలిమిటేషన్‌ పేరుతో నష్టం చేయడం అన్యాయమని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పై సైతం బీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్ కేటీఆర్‌ ఆస‌క్తిక‌ర కామెంట్లు చేశారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష నేతల ఫోన్‌లను కూడా రేవంత్‌రెడ్డి ట్యాప్‌ చేయిస్తున్నారని ఆరోపించారు. ‘ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి దమ్ముంటే రాష్ట్రంలో మంత్రుల ఫోన్లు.. మా ఫోన్లు ట్యాప్‌ చేయటం లేదని చెప్పాలి.. కెమెరాల ముందు ఓపెన్‌గా లైడిటెక్టర్‌ పరీక్షకు రావాలి’ అని కేటీఆర్‌ సవాల్‌ విసిరారు. రేవంత్‌కు దమ్మూ ధైర్యం ఉంటే తన సవాల్‌ను స్వీకరించి ఫోన్లు ట్యాప్‌ చేయటం లేదని చెప్పాలని డిమాండ్‌ చేశారు.

This post was last modified on October 26, 2024 7:59 pm

Share

Recent Posts

పార్టీ అధిష్టానానికే బోండా ఉమ సవాల్?

ముద్రగడ పద్మనాభం సంతాప సభకు హాజరైన అంశంపై టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా…

39 minutes ago

పాతిక రోజుల్లో ఇరుముడి… ఏదీ సందడి

మాస్ మహారాజా రవితేజ ఇరుముడి మీద మంచి బజ్ ఉంది. గత కొన్ని సినిమాలు ఎంత ఫ్లాప్ అయినా దీని…

3 hours ago

విజ‌య్ స‌రైన‌ సినిమా చేసుంటే…

త‌మిళ సినిమాల్లో నంబ‌ర్ వ‌న్ స్థాయిలో ఉంటూ రాజ‌కీయాల వైపు అడుగులేసిన విజ‌య్ సినీ రంగాన్ని ఖాళీ చేస్తూ చేసిన…

5 hours ago

సెకండాఫ్ జాగ్రత్త పడి ఉంటే కల్ట్ క్లాసిక్ అయ్యేది

మూడు రోజుల క్రితం విడుదలైన చెన్నై లవ్ స్టోరీ మొదటి వీకెండ్ ఘనంగా ముగిసింది. ఊహించిన దానికన్నా వసూళ్లు ఎక్కువే…

5 hours ago

ఆ నలుగురు… ట్రెండు సృష్టిస్తారా

ఆ నలుగురు అంటే ఏదో రాజేంద్ర ప్రసాద్ సినిమా అనుకునేరు. ఇది దాని గురించి కాదు. ఇప్పుడు ఇండస్ట్రీలో కొత్త…

6 hours ago

వారణాసి అభిమానులకు కీరవాణి శుభవార్త

మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సగటు తెలుగు సినీ ప్రియులంతా ఎదురు చూస్తున్న క్రేజీ మూవీ వారణాసి. ఆర్ఆర్ఆర్…

9 hours ago