వైసీపీ కార్యకర్త, గుంటూరు జిల్లా పట్టాభిపురం పోలీసుల రికార్డులో రౌడీ షీటర్గా నమోదైన బోరుగడ్డ అనిల్ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించనున్నారు. ఈ ఏడాది జరిగిన ఎన్నికల అనంతరం.. ఫలితాలపై సోషల్ మీడియాలో తీవ్ర వ్యాఖ్యలు చేయడంతోపాటు.. ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేస్తూ.. చేసిన దారుణ వ్యాఖ్యల నేపథ్యంలో జూన్ 1న గుంటూరు పోలీసులు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే బుధవారం ఆయనను గుంటూరుజిల్లా అమరావతి రోడ్డులోని నివాసంలో అరెస్టు చేశారు.
తాజాగా గురువారం ఆయనను గుంటూరు ఐదో అడిషనల్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. సుదీర్ఘ వాదనల అనంతరం .. రాత్రి ఏడు గంటల సమయంలో 14 రోజుల రిమాండ్ విధిస్తూ.. న్యాయాధికారి తీర్పు చెప్పారు. దీంతో రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించనున్నారు. అక్కడ అనిల్ను సాధార ఖైదీగా ట్రీట్ చేయాలని న్యాయాధికారి ఆదేశించడంతో జనరల్ బ్యారెక్లోనే అనిల్ను ఉంచనున్నారు.
అయితే.. ఎన్నికల సంఘం ఫిర్యాదు సహా.. గుంటూరు జిల్లాకు చెందిన కర్లపూడి బాబు అనే వ్యక్తిని అనిల్ 50 లక్షల రూపాయలు డిమాండ్ చేసినట్టు కూడా కేసు నమోదైంది. ఈ కేసులోనూ అరెస్టు చేసినట్టు పోలీసులు చెబుతున్నారు. మొత్తంగా ఈ రెండు కేసులను కలిపి విచారించిన కోర్టు అనిల్ను రాజమండ్రి జైలుకు తరలించడం గమనార్హం. ఇక, వైసీపీ హయాంలో అనిల్ రెచ్చిపోయిన విధానం అంతా ఇంతా కాదు. సోషల్ మీడియాలో తీవ్ర పదజాలంతో ప్రస్తుత ముఖ్యమంత్రి, అప్పటి విపక్ష నేత చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు.
జగన్ ఆదేశిస్తే.. పావుగంటలో వైసీపీ అసమ్మతి నేత కోటం రెడ్డి శ్రీధర్రెడ్డిని నెల్లూరు నడిరోడ్డుపైనే తంతానని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక, పవన్, చంద్రబాబు కుటుంబ సభ్యులను తీవ్రంగా దూషించేవారు. ఎవరైనా కామెంట్లు చేస్తే వారిని కూడా బెదిరించేవారు. ఎంబీఏ చదివానని అది కూడా లండన్లో పూర్తి చేసుకున్నానని చెప్పుకొన్న అనిల్.. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు నోటికి, చేతికి కూడా పని చెప్పిన సందర్భాలు ఉన్నాయి.
This post was last modified on October 17, 2024 10:38 pm
తెలంగాణలో ఆక్రమ కట్టడాలకు సింహ స్వప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమ మాటంటే హైడ్రాకు…
వైసీపీ నేత, ఫైర్ బ్రాండ్ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్ ఫ్యామిలీలో కోడలు చేసిన ఆరోపణలు పెను కుదుపునకు…
సినిమాల్లో రాజకీయ అంశాలు పెట్టాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితులున్నాయి ప్రస్తుతం. తమ నాయకుల మీద పొలిటికల్ కౌంటర్లు వేస్తే…
జన నాయకుడు సినిమా ఎలా ఉందనేది మళ్ళీ చెప్పనవసరం లేదు. విజయ్ ఇమేజ్ పుణ్యమాని రెండు వందల కోట్లు దాటేసింది…
ఏపీలో గత 2 మాసాల కిందటి వరకు తీవ్రస్థాయిలో చర్చనీయాంశం అయిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, ఉండి నియోజకవర్గం…
ప్రజలు, శాంతియుతంగా నిరసన చేస్తున్నవారిని కొట్టే హక్కు పోలీసులకు ఉందా? అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఇలా అయితే.. దేశం మొత్తం…