Movie News

వీరమల్లు క్రిష్.. అనుష్క తరువాత ఎవరితో?

టాలీవుడ్ లో సక్సెస్ ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా మంచి గుర్తింపు సంపాదించుకున్న దర్శకులతో క్రిష్ ఒకరు. అతనికి ఎంత పెద్ద ఫ్లాప్ ఎదురైనా కూడా వెంటనే కథ వినేందుకు అగ్ర హీరోలు కూడా సిద్ధంగా ఉంటారు. అందుకు కారణం క్రిష్ కథలలో సామాజిక అంశాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే స్టార్స్ వారి టాలెంట్ ను మరింత కొత్తగా చూపేందుకు స్కోప్ ఉంటుంది.

గమ్యం, వేదం, కృష్ణం వందే జగద్గురుమ్, గౌతమీ పుత్ర శతకర్ణి లాంటి సినిమాలతో క్రిష్ దర్శకుడిగా తానేంటో నిరూపించుకున్నాడు. ఎన్టీఆర్ బయోపిక్, కొండపొలం డిజాస్టర్స్ అయినప్పటికీ మళ్ళీ వెంటనే పవన్ తో ఛాన్స్ అందుకోవడం విశేషం. అయితే పవన్ కళ్యాణ్ తో హరిహర వీరమల్లు సినిమాను సగానికి పైగా ఫినిష్ చేసినప్పటికీ షూటింగ్ చివరి దశలో బయటకు రావాల్సి వచ్చింది. 

ఆ విషయంలో క్రిష్ పై రకరకాల గాసిప్స్ వచ్చినప్పటికీ టైమ్ వృధా చేయకుండా వెంటనే అనుష్కతో ఘాటీ అనే సినిమా స్టార్ట్ చేశాడు.. ఈ సినిమా పనులు కూడా చివరి దశకు చేరుకున్నాయి. అయితే అనుష్క తరువాత క్రిష్ ఎవరితో వర్క్ చేస్తాడు అనేది ఇంకా ఫైనల్ కాలేదు. లేటెస్ట్ టాక్ ప్రకారం ఒక మీడియం రేంజ్ హీరోతోనే సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. 

ఆ లిస్టులో విజయ్ దేవరకొండ, రామ్ పోతినేని లాంటి హీరోలు ఉన్నారట. కథలు అయితే సిద్ధంగా ఉంచుకున్న క్రిష్ ఘాటీ రిలీజ్ లోపే ఒకరిని ఫైనల్ చేసి అఫీషియల్ గా క్లారిటీ ఇవ్వాలని ఫిక్స్ అయ్యాడు. అసలే కమర్షియల్ గా హిట్ చూసి చాలా కాలమైంది కాబట్టి వీలైనంత త్వరగా కొత్త ప్రాజెక్టుని ఫిక్స్ చేసుకోవాలని క్రిష్ అడుగులు వేస్తున్నారు. మరి ఆయనకు ఏ హీరో సెట్టవుతారో చూడాలి.

This post was last modified on October 13, 2024 1:14 pm

Share
Show comments
Published by
Tharun

Recent Posts

రష్యా అధ్యక్షుడికి గోంగూర, ఆవకాయ తినిపించిన మోదీ

వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…

27 minutes ago

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

2 hours ago

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

2 hours ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

3 hours ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

5 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

8 hours ago