Movie News

వీరమల్లు క్రిష్.. అనుష్క తరువాత ఎవరితో?

టాలీవుడ్ లో సక్సెస్ ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా మంచి గుర్తింపు సంపాదించుకున్న దర్శకులతో క్రిష్ ఒకరు. అతనికి ఎంత పెద్ద ఫ్లాప్ ఎదురైనా కూడా వెంటనే కథ వినేందుకు అగ్ర హీరోలు కూడా సిద్ధంగా ఉంటారు. అందుకు కారణం క్రిష్ కథలలో సామాజిక అంశాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే స్టార్స్ వారి టాలెంట్ ను మరింత కొత్తగా చూపేందుకు స్కోప్ ఉంటుంది.

గమ్యం, వేదం, కృష్ణం వందే జగద్గురుమ్, గౌతమీ పుత్ర శతకర్ణి లాంటి సినిమాలతో క్రిష్ దర్శకుడిగా తానేంటో నిరూపించుకున్నాడు. ఎన్టీఆర్ బయోపిక్, కొండపొలం డిజాస్టర్స్ అయినప్పటికీ మళ్ళీ వెంటనే పవన్ తో ఛాన్స్ అందుకోవడం విశేషం. అయితే పవన్ కళ్యాణ్ తో హరిహర వీరమల్లు సినిమాను సగానికి పైగా ఫినిష్ చేసినప్పటికీ షూటింగ్ చివరి దశలో బయటకు రావాల్సి వచ్చింది. 

ఆ విషయంలో క్రిష్ పై రకరకాల గాసిప్స్ వచ్చినప్పటికీ టైమ్ వృధా చేయకుండా వెంటనే అనుష్కతో ఘాటీ అనే సినిమా స్టార్ట్ చేశాడు.. ఈ సినిమా పనులు కూడా చివరి దశకు చేరుకున్నాయి. అయితే అనుష్క తరువాత క్రిష్ ఎవరితో వర్క్ చేస్తాడు అనేది ఇంకా ఫైనల్ కాలేదు. లేటెస్ట్ టాక్ ప్రకారం ఒక మీడియం రేంజ్ హీరోతోనే సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. 

ఆ లిస్టులో విజయ్ దేవరకొండ, రామ్ పోతినేని లాంటి హీరోలు ఉన్నారట. కథలు అయితే సిద్ధంగా ఉంచుకున్న క్రిష్ ఘాటీ రిలీజ్ లోపే ఒకరిని ఫైనల్ చేసి అఫీషియల్ గా క్లారిటీ ఇవ్వాలని ఫిక్స్ అయ్యాడు. అసలే కమర్షియల్ గా హిట్ చూసి చాలా కాలమైంది కాబట్టి వీలైనంత త్వరగా కొత్త ప్రాజెక్టుని ఫిక్స్ చేసుకోవాలని క్రిష్ అడుగులు వేస్తున్నారు. మరి ఆయనకు ఏ హీరో సెట్టవుతారో చూడాలి.

This post was last modified on October 13, 2024 1:14 pm

Share

Recent Posts

రోమియో ఫిక్సయ్యాడు… ఓజి లేటవుతాడు

నాని ది ప్యారడైజ్ షూటింగ్ చివరి ఘట్టానికి వచ్చేసింది. ఇంకో వారం పది రోజుల్లో గుమ్మడికాయ కొట్టేలా ఉన్నారు. కీర్తి…

3 hours ago

ఉత్త‌రాదిన మోడీ ఇమేజ్‌కు యూత్ చెక్ పెడుతున్నారా?

దేశ‌వ్యాప్తంగా ప్ర‌స్తుతం ఉన్న ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. ఉత్త‌రాది రాష్ట్రాల్లో ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ ఇమేజ్‌కు యువ‌త పెద్ద ఎత్తున…

3 hours ago

మంగాపురం కుర్రాడికి మంగళవారం పాఠం

సూపర్ స్టార్ కృష్ణ మనవడు జయకృష్ణ డెబ్యూ ఫలితం తేలిపోయింది. కుర్రాడి నటనకు కాసిన్ని ప్రశంసలు దక్కినప్పటికీ కంటెంట్ పరంగా…

3 hours ago

అప్పుడు ఒప్పు.. ఇప్పుడు తప్పు.. ఇదేం న్యాయం జగన్?

త్వ‌ర‌లోనే ఏపీలో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు తెర‌దీయ‌నున్నారు. సెప్టెంబ‌రు-అక్టోబ‌రు మ‌ధ్య మునిసిపాలిటీ… న‌వంబ‌రు-డిసెంబ‌రు మ‌ధ్య కార్పోరేష‌న్లు, జ‌న‌వ‌రిలో పంచాయ‌తీ ఎన్నిక‌లు…

3 hours ago

సెలెక్టర్లకు షమీ కనపడడం లేదా?

శ్రీలంకతో జరగబోయే రెండు టెస్టుల సిరీస్ నుంచి బుమ్రా గాయం కారణంగా తప్పుకున్నాడు. అయితే అతని స్థానంలో సీనియర్ బౌలర్…

4 hours ago

మార్క్ మామా… మోదీజీకి సారీ చెప్పాల్సిందే

ప్రధాని నరేంద్ర మోదీ వీడియోను ఫేస్‌బుక్ నుంచి తొలగించిన వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. సోషల్ మీడియా దిగ్గజం మెటా…

5 hours ago