లాక్ డౌన్ తర్వాత సినిమా షూటింగ్స్ నెమ్మదిగా మొదలు పెట్టారు కానీ అవుట్ డోర్ వెళ్లి చేయడానికి నిర్మాతలు సంకోచిస్తున్నారు. విదేశాల్లో షూటింగ్స్ పెట్టుకున్న వాళ్ళైతే అంత త్వరగా ముందుకు కదలడం లేదు. అలా విదేశాలలో షూటింగ్ ప్లాన్ చేసుకున్న సినిమాలు అన్నిటికీ ప్రభాస్ సినిమా రాధే శ్యామ్ మార్గదర్శిగా మారింది.
ఈ చిత్రం బృందం ఇప్పటికే ఇటలీ బయలుదేరి వెళ్లారు. అక్కడ ముందుగా పద్నాలుగు రోజుల క్వారంటైన్ లో వుండి, అనంతరం షూటింగ్ మొదలు పెడతారు. అక్కడ షూటింగ్ చేసుకోవడానికి ఏమైనా ఇబ్బందులుంటాయా, దానికి చేయాల్సిన ప్రాసెస్ ఏమిటి వగైరా అన్నీ రాధే శ్యామ్ బృందం నుంచి తెలుసుకుని వచ్చే నెలలో అక్కడకు వెళ్లాలని చాలా మంది నిర్మాతలు ఎదురు చూస్తున్నారు.
రాధే శ్యామ్ షూట్ కనుక ఏ సమస్య లేకుండా జరిగిపోతే యూరప్ లో షూట్ ప్లాన్ చేసిన సినిమాలు ఒక్కోటిగా ఫ్లైట్ ఎక్కుతాయి. ఒకవేళ ఈ సినిమా షూటింగ్ కి ఇబ్బందులు వచ్చాయని తెలిస్తే మాత్రం అవన్నీ డ్రాప్ అవుతాయి. అందుకే ఈ సినిమా షూటింగ్ కోసం ఇప్పుడు యావత్ తెలుగు చిత్ర పరిశ్రమ ఎదురు చూస్తోందంటే అతిశయోక్తి కాదు.
This post was last modified on October 1, 2020 10:38 am
ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…
నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలకు కేరళలో తీవ్రనిరసన సెగ తగులుతోంది. రాహుల్-ప్రియాంక.. కేరళ మిమ్మల్ని క్షమించదు.…
నిజమేనండోయ్… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏదైనా మాట ఇచ్చారంటే దానిని నెరవేర్చి తీరతారు. ఇందుకు…
కేంద్ర హోం శాఖ సహాయం మంత్రి బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి…
తెలంగాణలో సింగిల్ స్క్రీన్లను నడిపించే ఎగ్జిబిటర్లకు, నిర్మాతలకు మధ్య పీటముడి గట్టిగానే బిగుసుకునేలా కనిపిస్తోంది. అద్దె విధానం పక్కన పెట్టి…