మాస్ పోలీస్ గా సింగంని పరిచయం చేసింది కోలీవుడ్ హీరో సూర్య, దర్శకుడు హరినే అయినప్పటికీ దాన్ని విజయవంతంగా సీక్వెల్స్ రూపంలో ముందుకు తీసుకెళ్తున్నది మాత్రం బాలీవుడ్ డైరెక్టర్ రోహిత్ శెట్టినే. ఈ ఫ్రాంచైజ్ లో వస్తున్న కొత్త మూవీ సింగం అగైన్ ఈ నెలాఖరు దీపావళి పండగ సందర్భంగా విడుదల కాబోతోంది. ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే మొదటిసారి అయిదు నిమిషాలకు అతి దగ్గరగా ఉన్న ట్రైలర్ గా ముంబై మీడియా అభివర్ణిస్తోంది. అంతేకాదు హిందీలోనే అతి పెద్ద మల్టీస్టారర్స్ లో ఒకటిగా దీని స్థానం ప్రత్యేకంగా ఉంటుందని భారీ అంచనాలు రేపుతున్నారు.
మాములుగా పోలీస్ స్టోరీలు ఒకే టెంప్లేట్ లో వెళ్తాయి. చిన్న చిన్న మార్పులు తప్పించి అంకుశం నుంచి సింగం దాకా అన్నింటిలో ఇదే వరస. అందుకే రోహిత్ శెట్టి ఈసారి తెలివిగా రామాయణాన్ని స్ఫూర్తిగా తీసుకుని కథను రాసుకున్నాడు. సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అయిన సింగం ఇందులో రాముడు. భార్య కరీనా కపూర్ సీతాదేవి. ఎక్కడో శ్రీలంకలో ఉండే విలన్ అర్జున్ కపూర్ రావణుడు. ఓసారి ఆమెను ఎత్తుకెళ్లిపోతాడు. మధ్యలో సాయం కోసం హనుమంతుడు అలియాస్ రణ్వీర్ సింగ్ ఎంట్రీ ఇస్తాడు. లక్ష్మణుడిగా టైగర్ శ్రోఫ్, గరుత్మంతుడి షేడ్ లో అక్షయ్ కుమార్ తో పాటు బోనస్ గా లేడీ సింగం దీపికా పదుకునే ఉంటుంది.
వీళ్ళందరూ కలిసి సీతను కాపాడుకోవడంతో పాటు శత్రు సంహారం ఎలా చేశారనే పాయింట్ మీద సింగం నడుస్తుంది. ఎప్పటిలాగే నమ్మశక్యం కానీ యాక్షన్ ఎపిసోడ్లు, ఛేజింగులు, బాంబ్ బ్లాస్టులు, వాహనాల హంగామా ఒకటా రెండా ఈసారి రోహిత్ శెట్టి మాములు మసాలా దట్టించలేదు. నార్త్ ట్రేడ్ విశ్లేషణ ప్రకారం స్త్రీ 2కి మూడింతల ఎక్కువ ఓపెనింగ్ తో పాటు జవాన్, పఠాన్ రికార్డులను సులభంగా బద్దలు కొట్టే స్థాయిలో సింగం అగైన్ అరాచకం సృష్టించడం ఖాయమంటున్నారు. కంటెంట్ అయితే సాలిడ్ గా అనిపిస్తోంది. మాస్ కి కనక కనెక్ట్ అయితే మాత్రం సింగల్ స్క్రీన్లలో రికార్డుల పాతరే.
This post was last modified on October 7, 2024 6:05 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…