ప్రభాస్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, చిరంజీవి, రామ్ చరణ్.. ఇలా ఇప్పటికే చాలామంది టాప్ స్టార్లతో సినిమాలు చేశాడు కొరటాల శివ. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్తో కూడా ఇప్పటికే సినిమా చేయాల్సింది. కానీ వీళ్లిద్దరి కాంబినేషన్లో అనౌన్స్ అయిన సినిమా ఎందుకో ఆగిపోయింది. కాన్సెప్ట్ పోస్టర్ కూడా లాంచ్ చేసిన సినిమా ముందుకు కదలకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఆ చిత్రం స్థానంలోనే ‘దేవర’ వచ్చింది.
ఐతే బన్నీతో ఇప్పుడు క్యాన్సిల్ అయిన సినిమా సంగతెలా ఉన్నప్పటికీ.. తమ కలయికలో ఒక సినిమా కచ్చితంగా వస్తుందని అంటున్నాడు కొరటాల శివ. తన తొలి చిత్రం ‘మిర్చి’ని బన్నీ కుటుంబ సమేతంగా చూసి చాలా ఎంజాయ్ చేశాడని.. అప్పట్నుంచి తనతో సినిమా చేయాలని అనుకుంటున్నాడని.. తాను కూడా ఆసక్తిగానే ఉన్నానని.. కానీ కొన్ని కారణాల వల్ల సినిమా కుదరలేదని.. కానీ త్వరలో తమ కలయికలో సినిమా ఉంటుందని చెప్పాడు కొరటాల.
ఇక ‘దేవర’ మూవీని బయటి వ్యక్తులు చాలామంది చూశారని.. సినిమా గురించి అలా అన్నారని, ఇలా అన్నారని సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాలను కొరటాల ఖండించాడు. బయటి వ్యక్తులు ఎవ్వరూ సినిమా చూడలేదని ఆయన స్పష్టం చేశారు. తాను, ఎన్టీఆర్ కలిసి మూడుసార్లు సినిమా చూశామన్నారు. అలాగే తాను విడిగా రెండుసార్లు, తారక్ ప్రత్యేకంగా ఇంకోసారి సినిమా చూశామన్నారు. ఆయా సందర్భాల్లో తమతో పాటు కుటుంబ సభ్యులు, యూనిట్ సభ్యులు మాత్రమే ఉన్నారని.. తమ అందరికీ సినిమా నచ్చిందని.. అక్కడ సినిమా చూసిన వాళ్లు అందరూ ఓపెన్గా తమ అభిప్రాయం చెప్పేవాళ్లే అని కొరటాల తెలిపాడు.
తారక్కు కూడా సినిమా ఎంతో నచ్చిందని.. ఆయనకు ఏదైనా నచ్చకపోతే మొహంలోనే తెలిసిపోతుందని.. ఏదీ దాచుకునే మనస్తత్వం తనది కాదని కొరటాల అన్నాడు. తమకు నచ్చినట్లే ప్రేక్షకులకు కూడా ఈ సినిమా నచ్చుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశాడు.
This post was last modified on September 26, 2024 7:39 pm
మెగాస్టార్ చిరంజీవి ఒకప్పుడు లెక్కలేసుకుని సినిమాలు చేసేవారు. కానీ ఈ మధ్య ఆయన తీరు మారిపోయింది. ఇమేజ్ ఛట్రం నుంచి…
సందీప్ రెడ్డి వంగా.. ఏదైనా మాట్లాడితే ఆ మాటను చుట్టూ తిప్పే రకం కాదు. రోమాంచకం ట్రైలర్ ఈవెంట్లో స్పిరిట్,…
అమెరికా వెళ్లాలనుకునే వారికి షాకింగ్ న్యూస్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా ఎంబసీలు, కాన్సులేట్లలో వీసా అపాయింట్మెంట్లను తాత్కాలికంగా నిలిపివేసినట్లు తాజా…
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కోదాడ మండలం ద్వారకుంట వద్ద ఆగి ఉన్న లారీని ప్రైవేట్ ట్రావెల్స్…
మొత్తం మీద కాంగ్రెస్ అధిష్టానం స్పందించింది. కొండా సురేఖ కూతురు సుస్మిత మొదలుపెట్టిన వివాదానికి ఫుల్ స్థాప్ పెట్టడానికి రంగం…
స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే ఓటమిని అంగీకరిస్తున్నట్లుంది వైసీపీ అధినేత జగన్ తీరు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీకి…