ప్రభాస్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, చిరంజీవి, రామ్ చరణ్.. ఇలా ఇప్పటికే చాలామంది టాప్ స్టార్లతో సినిమాలు చేశాడు కొరటాల శివ. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్తో కూడా ఇప్పటికే సినిమా చేయాల్సింది. కానీ వీళ్లిద్దరి కాంబినేషన్లో అనౌన్స్ అయిన సినిమా ఎందుకో ఆగిపోయింది. కాన్సెప్ట్ పోస్టర్ కూడా లాంచ్ చేసిన సినిమా ముందుకు కదలకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఆ చిత్రం స్థానంలోనే ‘దేవర’ వచ్చింది.
ఐతే బన్నీతో ఇప్పుడు క్యాన్సిల్ అయిన సినిమా సంగతెలా ఉన్నప్పటికీ.. తమ కలయికలో ఒక సినిమా కచ్చితంగా వస్తుందని అంటున్నాడు కొరటాల శివ. తన తొలి చిత్రం ‘మిర్చి’ని బన్నీ కుటుంబ సమేతంగా చూసి చాలా ఎంజాయ్ చేశాడని.. అప్పట్నుంచి తనతో సినిమా చేయాలని అనుకుంటున్నాడని.. తాను కూడా ఆసక్తిగానే ఉన్నానని.. కానీ కొన్ని కారణాల వల్ల సినిమా కుదరలేదని.. కానీ త్వరలో తమ కలయికలో సినిమా ఉంటుందని చెప్పాడు కొరటాల.
ఇక ‘దేవర’ మూవీని బయటి వ్యక్తులు చాలామంది చూశారని.. సినిమా గురించి అలా అన్నారని, ఇలా అన్నారని సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాలను కొరటాల ఖండించాడు. బయటి వ్యక్తులు ఎవ్వరూ సినిమా చూడలేదని ఆయన స్పష్టం చేశారు. తాను, ఎన్టీఆర్ కలిసి మూడుసార్లు సినిమా చూశామన్నారు. అలాగే తాను విడిగా రెండుసార్లు, తారక్ ప్రత్యేకంగా ఇంకోసారి సినిమా చూశామన్నారు. ఆయా సందర్భాల్లో తమతో పాటు కుటుంబ సభ్యులు, యూనిట్ సభ్యులు మాత్రమే ఉన్నారని.. తమ అందరికీ సినిమా నచ్చిందని.. అక్కడ సినిమా చూసిన వాళ్లు అందరూ ఓపెన్గా తమ అభిప్రాయం చెప్పేవాళ్లే అని కొరటాల తెలిపాడు.
తారక్కు కూడా సినిమా ఎంతో నచ్చిందని.. ఆయనకు ఏదైనా నచ్చకపోతే మొహంలోనే తెలిసిపోతుందని.. ఏదీ దాచుకునే మనస్తత్వం తనది కాదని కొరటాల అన్నాడు. తమకు నచ్చినట్లే ప్రేక్షకులకు కూడా ఈ సినిమా నచ్చుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశాడు.
This post was last modified on September 26, 2024 7:39 pm
రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…
సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…
ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సుమారు రూ. 2…
సెన్సార్ చిక్కుల్లో పడి నానా యాతన పడ్డ సినిమాల్లో జన నాయకుడుకి మోక్షం దక్కలేదు కానీ పరాశక్తి సంకెళ్లు తెంచుకుంది.…
వైసీపీ అధినేత జగన్ మారుతాడేమో, ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరుగుతుందేమో అని కూటమి నాయకులు పలుసార్లు భావిస్తూ వచ్చారు. అందుకే…
వైసీపీ అధినేత జగన్పై సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ పాలనతో రాష్ట్రం పూర్తిగా విధ్వంసమైందని అన్నారు.…