మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను.. ఇలా వరుసగా తొలి నాలుగు చిత్రాలతో బ్లాక్బస్టర్లు అందుకున్నాడు కొరటాల శివ. దీంతో మెగాస్టార్ చిరంజీవితో చేసిన ‘ఆచార్య’ మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ ఆ చిత్రంతో కొరటాల తీవ్ర నిరాశకు గురి చేశాడు. అయినా తన మీద జూనియర్ ఎన్టీఆర్ నమ్మకం పెట్టాడు. భారీ బడ్జెట్లో ‘దేవర’ తెరకెక్కింది. ఈ చిత్రం వచ్చే శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఇప్పుడు విడుదల కాబోయేది ‘దేవర పార్ట్-1’ మాత్రమే. దీనికి కొనసాగింపుగా ఇంకో సినిమా ఉంది. దాని స్టేటస్ ఏంటో తెలియదు. ‘దేవర-1’ తేడా కొడితే తప్ప పార్ట్-2 కచ్చితంగా ఉంటుంది. కాబట్టి ‘దేవర-1’ తర్వాత కొరటాల సెకండ్ పార్ట్ మీదే దృష్టిపెట్టబోతున్నాడని అందరికీ తెలుసు. ఇలాంటి టైంలో కొరటాల కొత్త సినిమా గురించి వేరే కబురు ఒకటి బయటికి వచ్చింది. అతను ప్రభాస్ సినిమా కోసం స్క్రిప్టు రెడీ చేస్తున్నాడన్నది ఆ కబురు.
ఓ పెద్ద సినిమా విడుదల కాబోతుంటే దాని దర్శకుడి తర్వాతి సినిమా గురించి కూడా చర్చ జరగడం మామూలే. కానీ కొరటాల నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి మొన్నటిదాకా చర్చ లేదు. కానీ ఇప్పుడు ప్రభాస్ కోసం అతను ఓ కథ రెడీ చేస్తున్నాడని.. ఓ పెద్ద నిర్మాణ సంస్థే ఆ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తుందని ఓ వార్త హల్చల్ చేస్తోంది.
తనకు ‘మిర్చి’ మరపు రాని హిట్ ఇచ్చిన కొరటాలతో మరో సినిమా చేయడానికి ప్రభాస్ సుముఖంగానే ఉండొచ్చు. కానీ అతడికి కొన్నేళ్ల పాటు ఖాళీ లేదు. రాజాసాబ్, హను రాఘవపూడి సినిమా, సలార్-2, కల్కి-2, స్పిరిట్.. ఇలా తను పెద్ద లైనప్పే ఉంది. కాబట్టి కొరటాల కథ రెడీ చేసినా వచ్చే రెండు మూడేళ్లలో తనకు డేట్లు ఇచ్చే అవకాశం లేదు. మరోవైపు కొరటాల కూడా ‘దేవర-2’ను వదిలేసి ఇంకో సినిమా మీదికి వెళ్తాడా అన్నది డౌటే. ఐతే ‘దేవర’కు కొంచెం హైప్ పెంచడానికి ఉద్దేశపూర్వకంగానే ఈ లీక్స్ ఇచ్చారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి సోషల్ మీడియాలో.
This post was last modified on September 22, 2024 11:29 am
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…
కూటమి నాయకులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక రాజకీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానికరం`` అంటూ..…