తమిళ హీరో ధనుష్ కేవలం ప్రతిభావంతుడైన నటుడు మాత్రమే.. తనలో మంచి అభిరుచి ఉన్న దర్శకుడు, కథా రచయిత, లిరిసిస్ట్, సింగర్ కూడా ఉన్నారు. ఈ విభాగాలన్నింట్లో అతను టాలెంట్ చూపించాడు. ‘పవర్ పాండి’ అనే సినిమాతో దర్శకుడిగా శుభారంభం చేసిన అతను.. ఇటీవలే ‘రాయన్’ మూవీతో పెద్ద హిట్ కొట్టాడు.
ఈ ఊపులో ధనుష్ దర్శకుడిగా కొత్త సినిమాను అనౌన్స్ చేశాడు. ఆ సినిమా పేరు.. ఇడ్లి కడై (ఇడ్లి కొట్టు) కావడం విశేషం. ఇందులోనూ ధనుషే హీరో. తన సొంత స్క్రిప్టుతో డైరెక్షన్ కూడా చేస్తున్నాడు. ఈ సినిమా ప్రి లుక్ పొయెటిగ్గా కనిపిస్తోంది. ఆర్టిస్టులు ఎవరినీ చూపించకుండా తెల్లవారుజామున ఓ ఇడ్లి కొట్టును చూపించారు. ఇది చూస్తే ఈసారి ధనుష్ ఏదో ప్రయోగం చేయబోతున్నట్లే కనిపిస్తోంది.
డాన్ ఫిలిమ్స్ అనే కొత్త నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తోంది. దర్శకుడిగా ధనుష్ తొలి సినిమా ‘పవర్ పాండి’ అందరినీ ఆశ్చర్యపరిచింది. మిడిలేజ్డ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిన రాజ్ కిరణ్ను ప్రధాన పెట్టి హృద్యమైన సినిమా తీశాడు ధనుష్. అందులో ఆ పాత్రను యుక్త వయసులో ఉన్నపుడు తనే కనిపించాడు. రెండో సినిమాలో తనే హీరోగా నటిస్తూ ఫుల్ మాస్ చూపించాడు. ఈ సినిమా తమిళంలో కమర్షియల్గా కూడా పెద్ద సక్సెస్ అయింది.
ఇప్పుడు ధనుష్ దర్శకుడిగా పూర్తి భిన్నమైన దారిలో పయనించేట్లే కనిపిస్తున్నాడు. పేరు, ప్రి లుక్ చూస్తే అతను ‘కాకా ముట్టై’ తరహా అవార్డ్ మూవీ ఏమైనా ట్రై చేస్తున్నాడా అనిపిస్తోంది. ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదలవుతుంది. ప్రస్తుతం ధనుష్ తెలుగు, తమిళ భాషల్లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘కుబేర’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో అక్కినేని నాగార్జున ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు.
This post was last modified on September 20, 2024 4:09 pm
బీహార్.. జాతీయ రాజకీయాల్లో మరోమారు పతాక శీర్షికలకు ఎక్కేసింది. నిన్నటిదాకా బీజేపీ, జేడీయూ మైత్రి... జేడియూ చీఫ్ నితీశ్ కుమార్ నుంచి పాలనా…
నమ్మలేక పోతున్నారా… అయినా ఇది నిజం. తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే గంటల తరబడి వేచి చూడాల్సి వస్తుందన్న సంగతి అందరికీ…
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ కు ఇటీవల ఎక్కడ లేని ప్రాచుర్యం లభించింది. నీట్ పేపర్ లీకేజి కి…
గతంలో బ్రహ్మానందం, బాబు మోహన్ లాంటి కమెడియన్స్ ఉన్నప్పుడు వాళ్ళ కోసమే విడిగా కామెడీ ఎపిసోడ్స్ రాసేవాళ్ళు. మెయిన్ రైటర్స్…
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుల జాబితా తీస్తే.. అందులో పైవరుసలో ఉండే ఆర్టిస్టుల్లో మోహన్ బాబు ఒకరు.…
ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొత్త ప్రస్థానం మొదలైపోయింది. నిన్నటిదాకా రాజకీయ వ్యూహకర్తగా, ఓ రాజకీయ పార్టీకి అధినేతగా…