తమిళ హీరో ధనుష్ కేవలం ప్రతిభావంతుడైన నటుడు మాత్రమే.. తనలో మంచి అభిరుచి ఉన్న దర్శకుడు, కథా రచయిత, లిరిసిస్ట్, సింగర్ కూడా ఉన్నారు. ఈ విభాగాలన్నింట్లో అతను టాలెంట్ చూపించాడు. ‘పవర్ పాండి’ అనే సినిమాతో దర్శకుడిగా శుభారంభం చేసిన అతను.. ఇటీవలే ‘రాయన్’ మూవీతో పెద్ద హిట్ కొట్టాడు.
ఈ ఊపులో ధనుష్ దర్శకుడిగా కొత్త సినిమాను అనౌన్స్ చేశాడు. ఆ సినిమా పేరు.. ఇడ్లి కడై (ఇడ్లి కొట్టు) కావడం విశేషం. ఇందులోనూ ధనుషే హీరో. తన సొంత స్క్రిప్టుతో డైరెక్షన్ కూడా చేస్తున్నాడు. ఈ సినిమా ప్రి లుక్ పొయెటిగ్గా కనిపిస్తోంది. ఆర్టిస్టులు ఎవరినీ చూపించకుండా తెల్లవారుజామున ఓ ఇడ్లి కొట్టును చూపించారు. ఇది చూస్తే ఈసారి ధనుష్ ఏదో ప్రయోగం చేయబోతున్నట్లే కనిపిస్తోంది.
డాన్ ఫిలిమ్స్ అనే కొత్త నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తోంది. దర్శకుడిగా ధనుష్ తొలి సినిమా ‘పవర్ పాండి’ అందరినీ ఆశ్చర్యపరిచింది. మిడిలేజ్డ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిన రాజ్ కిరణ్ను ప్రధాన పెట్టి హృద్యమైన సినిమా తీశాడు ధనుష్. అందులో ఆ పాత్రను యుక్త వయసులో ఉన్నపుడు తనే కనిపించాడు. రెండో సినిమాలో తనే హీరోగా నటిస్తూ ఫుల్ మాస్ చూపించాడు. ఈ సినిమా తమిళంలో కమర్షియల్గా కూడా పెద్ద సక్సెస్ అయింది.
ఇప్పుడు ధనుష్ దర్శకుడిగా పూర్తి భిన్నమైన దారిలో పయనించేట్లే కనిపిస్తున్నాడు. పేరు, ప్రి లుక్ చూస్తే అతను ‘కాకా ముట్టై’ తరహా అవార్డ్ మూవీ ఏమైనా ట్రై చేస్తున్నాడా అనిపిస్తోంది. ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదలవుతుంది. ప్రస్తుతం ధనుష్ తెలుగు, తమిళ భాషల్లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘కుబేర’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో అక్కినేని నాగార్జున ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు.
ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ 'మై వాపస్ ఆవుంగా'కు తొలి రోజు రివ్యూలు ఏమంత ఆశాజనకంగా లేవు. పబ్లిక్ టాక్…
సాయిధరమ్ తేజ్ హీరోగా రెండేళ్ల ముందు మొదలైన సినిమా.. సంబరాల యేటిగట్టు. తన మార్కెట్ స్థాయికి మించి పెద్ద బడ్జెట్లో…
పెద్ది మొదటి రెండు వారాలు బాగా సందడి చేసి కలెక్షన్ల వర్షం కురిపించాక మళ్ళీ దాన్ని కొనసాగించే సినిమా ఏది…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’యే చివరి చిత్రం అవుతుందనే అంచనాలు కలిగాయి ఒక దశలో.…
తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు, యువ ఉద్యోగుల మరణ వార్తలు అమెరికా నుంచి వరుసగా వస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. రోడ్డు…
వైసీపీ ఆధ్వర్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కోనసీమలో ఆదివారం నిర్వహించిన కాపుల సభలో మాజీ మంత్రి, ఉత్తరాంధ్రకు చెందిన బొత్స…