తమిళ హీరో ధనుష్ కేవలం ప్రతిభావంతుడైన నటుడు మాత్రమే.. తనలో మంచి అభిరుచి ఉన్న దర్శకుడు, కథా రచయిత, లిరిసిస్ట్, సింగర్ కూడా ఉన్నారు. ఈ విభాగాలన్నింట్లో అతను టాలెంట్ చూపించాడు. ‘పవర్ పాండి’ అనే సినిమాతో దర్శకుడిగా శుభారంభం చేసిన అతను.. ఇటీవలే ‘రాయన్’ మూవీతో పెద్ద హిట్ కొట్టాడు.
ఈ ఊపులో ధనుష్ దర్శకుడిగా కొత్త సినిమాను అనౌన్స్ చేశాడు. ఆ సినిమా పేరు.. ఇడ్లి కడై (ఇడ్లి కొట్టు) కావడం విశేషం. ఇందులోనూ ధనుషే హీరో. తన సొంత స్క్రిప్టుతో డైరెక్షన్ కూడా చేస్తున్నాడు. ఈ సినిమా ప్రి లుక్ పొయెటిగ్గా కనిపిస్తోంది. ఆర్టిస్టులు ఎవరినీ చూపించకుండా తెల్లవారుజామున ఓ ఇడ్లి కొట్టును చూపించారు. ఇది చూస్తే ఈసారి ధనుష్ ఏదో ప్రయోగం చేయబోతున్నట్లే కనిపిస్తోంది.
డాన్ ఫిలిమ్స్ అనే కొత్త నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తోంది. దర్శకుడిగా ధనుష్ తొలి సినిమా ‘పవర్ పాండి’ అందరినీ ఆశ్చర్యపరిచింది. మిడిలేజ్డ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిన రాజ్ కిరణ్ను ప్రధాన పెట్టి హృద్యమైన సినిమా తీశాడు ధనుష్. అందులో ఆ పాత్రను యుక్త వయసులో ఉన్నపుడు తనే కనిపించాడు. రెండో సినిమాలో తనే హీరోగా నటిస్తూ ఫుల్ మాస్ చూపించాడు. ఈ సినిమా తమిళంలో కమర్షియల్గా కూడా పెద్ద సక్సెస్ అయింది.
ఇప్పుడు ధనుష్ దర్శకుడిగా పూర్తి భిన్నమైన దారిలో పయనించేట్లే కనిపిస్తున్నాడు. పేరు, ప్రి లుక్ చూస్తే అతను ‘కాకా ముట్టై’ తరహా అవార్డ్ మూవీ ఏమైనా ట్రై చేస్తున్నాడా అనిపిస్తోంది. ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదలవుతుంది. ప్రస్తుతం ధనుష్ తెలుగు, తమిళ భాషల్లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘కుబేర’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో అక్కినేని నాగార్జున ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు.
This post was last modified on September 20, 2024 4:09 pm
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…