మామూలుగా యాంకర్లంటే అమ్మాయిలే. వారికే క్రేజ్, ఫాలోయింగ్ ఉంటాయి. మేల్ యాంకర్లను ఎవరూ పెద్దగా పట్టించుకోరు. వారికి ఫాలోయింగ్ అంతంతమాత్రమే. చేసే ప్రోగ్రాంలు కూడా తక్కువే. మెజారిటీ ప్రోగ్రాంలను నడిపించేది లేడీ యాంకర్లే. ఐతే వాళ్లకు నిలిచి.. తెలుగు మేల్ యాంకర్లలో ఎవరూ అందుకోని స్థాయిని చేరుకున్న వ్యక్తి ప్రదీప్. గడసరి అత్త సొగసరి కోడలు ప్రోగ్రాంతో మొదలుపెట్టి.. తన వాక్చాతుర్యంతో, హాస్య చతురతతో, చలాకీతనంతో ఎన్నో ప్రోగ్రాంలను సూపర్ సక్సెస్ చేసిన ఘనత ప్రదీప్ది. కొంచెం టచ్లో ఉంటే చెబుతాను, ఢీ లాంటి ప్రోగ్రాంలతో అతడి పాపులారిటీ మరింత పెరిగింది. ఈ పాపులారిటీని ఉపయోగించుకుని ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ అనే సినిమాతో హీరోగానూ అరంగేట్రం చేశాడు ప్రదీప్. అది విడుదలకు కూడా సిద్ధమైంది.
యాంకరింగ్ను పక్కన పెడితే.. సోషల్ మీడియాలో ప్రదీప్ గురించి ఎప్పుడూ చర్చల్లో ఉండే అంశం.. అతడి పెళ్లి. ఫలానా అమ్మాయితో ప్రేమలో ఉన్నాడట.. ఈ అమ్మాయితో పెళ్లట అని తరచుగా రూమర్లు పుడుతుంటాయి. హీరోయిన్ల ఎఫైర్ల గురించి మాట్లాడుకున్నట్లు ప్రదీప్ పెళ్లి గురించి కూడా నెటిజన్లు తరచుగా చర్చిస్తుంటారు. ఐతే ఇప్పటిదాకా ఆ వార్తలేవీ నిజం కాలేదు. ఇప్పుడు మాత్రం ప్రదీప్ పెళ్లి ఫిక్సయినట్లు గట్టిగా ప్రచారం జరుగుతోంది. రాయలసీమకు చెందిన ఒక రాజకీయ నేత కూతురితో ప్రదీప్కు పెళ్లి నిశ్చయం అయినట్లు చెబుతున్నారు. ఆ అమ్మాయి కూడా రాజకీయాల్లో ఉందని.. ఆమెకు ప్రదీప్ అంటే ఇష్టమని.. అటు నుంచే ప్రపోజల్ రావడంతో ప్రదీప్ ఫ్యామిలీ ఈ పెళ్లికి ఒప్పేసుకుందని అంటున్నారు. అతి త్వరలోనే ప్రదీప్ పెళ్లి గురించి అధికారిక ప్రకటన వస్తుందని.. కొన్ని నెలల్లోనే పెళ్లి కూడా ఉంటుందని అంటున్నారు. చూడాలి మరి ఈ వార్త ఎంత వరకు నిజమో?
This post was last modified on September 29, 2020 9:38 pm
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజనీపై కేసు నమోదు చేయాలని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసులను ఆదేశించింది. ఆమెతోపాటు..…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయకుడు తీన్మార్ మల్లన్నకు ఆ పార్టీ రాష్ట్ర కమిటీ నోటీసులు జారీ చేసింది.…
అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…
మాచో స్టార్ గోపీచంద్ బలమైన కంబ్యాక్ కోసం అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. దర్శకుడు శ్రీను వైట్ల విశ్వంతో బ్రేక్…
‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్లుగా ఎదిగిపోయారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఉర్రూతూలగించింది.…