మామూలుగా యాంకర్లంటే అమ్మాయిలే. వారికే క్రేజ్, ఫాలోయింగ్ ఉంటాయి. మేల్ యాంకర్లను ఎవరూ పెద్దగా పట్టించుకోరు. వారికి ఫాలోయింగ్ అంతంతమాత్రమే. చేసే ప్రోగ్రాంలు కూడా తక్కువే. మెజారిటీ ప్రోగ్రాంలను నడిపించేది లేడీ యాంకర్లే. ఐతే వాళ్లకు నిలిచి.. తెలుగు మేల్ యాంకర్లలో ఎవరూ అందుకోని స్థాయిని చేరుకున్న వ్యక్తి ప్రదీప్. గడసరి అత్త సొగసరి కోడలు ప్రోగ్రాంతో మొదలుపెట్టి.. తన వాక్చాతుర్యంతో, హాస్య చతురతతో, చలాకీతనంతో ఎన్నో ప్రోగ్రాంలను సూపర్ సక్సెస్ చేసిన ఘనత ప్రదీప్ది. కొంచెం టచ్లో ఉంటే చెబుతాను, ఢీ లాంటి ప్రోగ్రాంలతో అతడి పాపులారిటీ మరింత పెరిగింది. ఈ పాపులారిటీని ఉపయోగించుకుని ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ అనే సినిమాతో హీరోగానూ అరంగేట్రం చేశాడు ప్రదీప్. అది విడుదలకు కూడా సిద్ధమైంది.
యాంకరింగ్ను పక్కన పెడితే.. సోషల్ మీడియాలో ప్రదీప్ గురించి ఎప్పుడూ చర్చల్లో ఉండే అంశం.. అతడి పెళ్లి. ఫలానా అమ్మాయితో ప్రేమలో ఉన్నాడట.. ఈ అమ్మాయితో పెళ్లట అని తరచుగా రూమర్లు పుడుతుంటాయి. హీరోయిన్ల ఎఫైర్ల గురించి మాట్లాడుకున్నట్లు ప్రదీప్ పెళ్లి గురించి కూడా నెటిజన్లు తరచుగా చర్చిస్తుంటారు. ఐతే ఇప్పటిదాకా ఆ వార్తలేవీ నిజం కాలేదు. ఇప్పుడు మాత్రం ప్రదీప్ పెళ్లి ఫిక్సయినట్లు గట్టిగా ప్రచారం జరుగుతోంది. రాయలసీమకు చెందిన ఒక రాజకీయ నేత కూతురితో ప్రదీప్కు పెళ్లి నిశ్చయం అయినట్లు చెబుతున్నారు. ఆ అమ్మాయి కూడా రాజకీయాల్లో ఉందని.. ఆమెకు ప్రదీప్ అంటే ఇష్టమని.. అటు నుంచే ప్రపోజల్ రావడంతో ప్రదీప్ ఫ్యామిలీ ఈ పెళ్లికి ఒప్పేసుకుందని అంటున్నారు. అతి త్వరలోనే ప్రదీప్ పెళ్లి గురించి అధికారిక ప్రకటన వస్తుందని.. కొన్ని నెలల్లోనే పెళ్లి కూడా ఉంటుందని అంటున్నారు. చూడాలి మరి ఈ వార్త ఎంత వరకు నిజమో?
This post was last modified on September 29, 2020 9:38 pm
మాస్ రాజా రవితేజ సరైన హిట్టు కొట్టి చాలా కాలం అయిపోయింది. కరోనా కాలంలో వచ్చిన క్రాక్ మూవీనే రవితేజకు…
రేపు విడుదల కాబోతున్న అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి మొదటి టికెట్ ని రామ్ చరణ్ కొన్న వీడియో బయటికొచ్చాక…
థియేటర్లో ఆడిన ఎంత పెద్ద హిట్ సినిమాలనైనా టికెట్లు కొని చూడని ప్రేక్షకులు బోలెడు ఉంటారు. వాళ్లకు ఒకప్పుడు శాటిలైట్…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో పాటు ఆయన పెద్ద అన్నయ్య, మెగాస్టార్ చిరంజీవి దంపతులు…
వైసీపీ కీలక నేత, హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో…
ఆ పోలీసు అధికారులందరికీ చెబుతున్నా…వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వారిని బట్టలూడదీసి నిలబెడతా అంటూ మాజీ సీఎం జగన్ చేసిన…