మామూలుగా యాంకర్లంటే అమ్మాయిలే. వారికే క్రేజ్, ఫాలోయింగ్ ఉంటాయి. మేల్ యాంకర్లను ఎవరూ పెద్దగా పట్టించుకోరు. వారికి ఫాలోయింగ్ అంతంతమాత్రమే. చేసే ప్రోగ్రాంలు కూడా తక్కువే. మెజారిటీ ప్రోగ్రాంలను నడిపించేది లేడీ యాంకర్లే. ఐతే వాళ్లకు నిలిచి.. తెలుగు మేల్ యాంకర్లలో ఎవరూ అందుకోని స్థాయిని చేరుకున్న వ్యక్తి ప్రదీప్. గడసరి అత్త సొగసరి కోడలు ప్రోగ్రాంతో మొదలుపెట్టి.. తన వాక్చాతుర్యంతో, హాస్య చతురతతో, చలాకీతనంతో ఎన్నో ప్రోగ్రాంలను సూపర్ సక్సెస్ చేసిన ఘనత ప్రదీప్ది. కొంచెం టచ్లో ఉంటే చెబుతాను, ఢీ లాంటి ప్రోగ్రాంలతో అతడి పాపులారిటీ మరింత పెరిగింది. ఈ పాపులారిటీని ఉపయోగించుకుని ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ అనే సినిమాతో హీరోగానూ అరంగేట్రం చేశాడు ప్రదీప్. అది విడుదలకు కూడా సిద్ధమైంది.
యాంకరింగ్ను పక్కన పెడితే.. సోషల్ మీడియాలో ప్రదీప్ గురించి ఎప్పుడూ చర్చల్లో ఉండే అంశం.. అతడి పెళ్లి. ఫలానా అమ్మాయితో ప్రేమలో ఉన్నాడట.. ఈ అమ్మాయితో పెళ్లట అని తరచుగా రూమర్లు పుడుతుంటాయి. హీరోయిన్ల ఎఫైర్ల గురించి మాట్లాడుకున్నట్లు ప్రదీప్ పెళ్లి గురించి కూడా నెటిజన్లు తరచుగా చర్చిస్తుంటారు. ఐతే ఇప్పటిదాకా ఆ వార్తలేవీ నిజం కాలేదు. ఇప్పుడు మాత్రం ప్రదీప్ పెళ్లి ఫిక్సయినట్లు గట్టిగా ప్రచారం జరుగుతోంది. రాయలసీమకు చెందిన ఒక రాజకీయ నేత కూతురితో ప్రదీప్కు పెళ్లి నిశ్చయం అయినట్లు చెబుతున్నారు. ఆ అమ్మాయి కూడా రాజకీయాల్లో ఉందని.. ఆమెకు ప్రదీప్ అంటే ఇష్టమని.. అటు నుంచే ప్రపోజల్ రావడంతో ప్రదీప్ ఫ్యామిలీ ఈ పెళ్లికి ఒప్పేసుకుందని అంటున్నారు. అతి త్వరలోనే ప్రదీప్ పెళ్లి గురించి అధికారిక ప్రకటన వస్తుందని.. కొన్ని నెలల్లోనే పెళ్లి కూడా ఉంటుందని అంటున్నారు. చూడాలి మరి ఈ వార్త ఎంత వరకు నిజమో?
విజయవాడలో కనిపించకుండా పోయిన గాదె సాయికృష్ణ వ్యవహారం అంతకంతకూ జఠిలంగా మారుతోంది. సాయికృష్ణ బతికి లేడని, అతడిని పోలీసులే అంతమొందించారని…
తప్పు చేసిన నేతలు ఎప్పటికైనా ప్రజాగ్రహానికి గురి కావాల్సి వస్తుందని చెప్పడానికి పల్నాడు జిల్లాలో జరిగిన ఈ ఘటన ఉదాహరణగా…
మా ఇంటి బంగారం అడ్వాన్స్ బుకింగ్స్ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తున్నాయి. నిజానికి మూడేళ్ళ గ్యాప్ తర్వాత ఒక హీరోయిన్ ఫిమేల్…
ఏపీ డిప్యూటీ స్పీకర్, మాజీ ఎంపీ.. ప్రస్తుత ఉండి శాసనసభ్యుడు రఘురామకృష్ణరాజును కస్టడీలో టార్చర్ చేసిన కేసులో హైకోర్టు సంచలన…
ఏపీ డిప్యూటీ సీఎం.. జనసేన అధినేత పవన్ కల్యాణ్పై కేసు పెట్టాలని.. ఆయన వల్ల తెలంగాణ ప్రజలు మనోవేదనకు గురవుతున్నారని…
2019 ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతున్న తరుణంలో వైసీపీ నేతల నోట జాబ్ కేలండర్ అన్న మాట గట్టిగా వినిపించింది.…