ఈ మధ్య కాలంలో తమిళ టైటిల్స్ ని యధాతథంగా ఉంచేసి తెలుగులో డబ్బింగ్ చేయడం పరిపాటిగా మారింది. తలైవి, వలిమైతో మొదలుపెట్టి నిన్నటి తంగలాన్ వరకు ఇదే వరస. ప్యాన్ ఇండియా బాషల కోసం ఒకే పేరు ఉండాలనేది కేవలం సమర్ధించుకోవడానికి వాడుకునే ఆయుధం. నాని సరిపోదా శనివారంని తమిళ, మలయాళ, హిందీ ఆడియన్స్ కోసం సూర్యాస్ సాటర్డే అని పెట్టారు. గతంలో అన్నాతేని టాలీవుడ్ కి పెద్దన్నగా మార్చారు. జైలర్ లాంటి యునానిమస్ ఇంగ్లీష్ టైటిల్ ఉంటే ఎలాంటి ఇబ్బంది లేదు కానీ ఇప్పుడు వేట్టయన్ కి కనీసం వేటగాడులాంటి పేరైనా పెట్టొచ్చుగా.
మాస్ ఆడియన్స్ సంగతి పక్కనపెడితే ఉన్నత చదువులున్న ప్రేక్షకుల్లో తమిళ బాష రాని వాళ్ళు లక్షలు, కోట్లలో ఉంటారు. వాళ్ళకే అర్థం కానప్పుడు ఇక సగటు జనాల గురించి చెప్పేది ఏముంది. క్యాప్షన్ గా ఒక ఇంగ్లీష్ లైన్ పెట్టి చేతులు దులిపేసుకుంటే సరిపోదుగా. బాలీవుడ్ ఈ ట్రెండ్ పాటించడం లేదు. వరుణ్ ధావన్ భేడియాని తోడేలుగా అనువదించారు. ఆడినా ఆడకపోయినా భాషకిచ్చే గౌరవం అది. కానీ తమిళ డబ్బింగులు మాత్రం మరీ అన్యాయంగా ప్రవర్తిస్తూ టైటిల్ చివర ‘న్’ ఉంటే చాలు అదే పెట్టేస్తున్నారు.
ఏది ఏమైనా ఇది ఎంత మాత్రం సమర్ధనీయమైన పోకడ కాదు. ఒకవేళ అన్ని లాంగ్వేజెస్ లో ఒకే పేరు ఉండాలనుకున్నప్పుడు ఆర్ఆర్ఆర్ లాంటివి పెట్టుకోవడం ఉత్తమం. ఎలాంటి ఇబ్బంది లేదు. అంతేతప్ప అర్థం కానీ ఒరిజినల్ వెర్షన్ టైటిల్ నే కొనసాగించడం సబబు కాదు. క్రమంగా ఈ పోకడని అలవాటు చేయడం వల్ల తెలుగు బాషా ప్రేమికులు సైతం ఇదో సమస్యే కాదన్నట్టు ఊరుకుంటున్నారు. ఎక్కడిదాకో ఎందుకు ఇండియన్ 2ని మన దగ్గర భారతీయుడు 2 అని ఎందుకు అన్నారు. ఏతావాతా తేలేదేమంటే నిజంగా మార్చాలని ఉంటే అవకాశం ఉంది కానీ కావాలనే వాడుకోవడం లేదు.
This post was last modified on September 17, 2024 3:14 pm
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…
నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…
దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…