ఈ మధ్య కాలంలో తమిళ టైటిల్స్ ని యధాతథంగా ఉంచేసి తెలుగులో డబ్బింగ్ చేయడం పరిపాటిగా మారింది. తలైవి, వలిమైతో మొదలుపెట్టి నిన్నటి తంగలాన్ వరకు ఇదే వరస. ప్యాన్ ఇండియా బాషల కోసం ఒకే పేరు ఉండాలనేది కేవలం సమర్ధించుకోవడానికి వాడుకునే ఆయుధం. నాని సరిపోదా శనివారంని తమిళ, మలయాళ, హిందీ ఆడియన్స్ కోసం సూర్యాస్ సాటర్డే అని పెట్టారు. గతంలో అన్నాతేని టాలీవుడ్ కి పెద్దన్నగా మార్చారు. జైలర్ లాంటి యునానిమస్ ఇంగ్లీష్ టైటిల్ ఉంటే ఎలాంటి ఇబ్బంది లేదు కానీ ఇప్పుడు వేట్టయన్ కి కనీసం వేటగాడులాంటి పేరైనా పెట్టొచ్చుగా.
మాస్ ఆడియన్స్ సంగతి పక్కనపెడితే ఉన్నత చదువులున్న ప్రేక్షకుల్లో తమిళ బాష రాని వాళ్ళు లక్షలు, కోట్లలో ఉంటారు. వాళ్ళకే అర్థం కానప్పుడు ఇక సగటు జనాల గురించి చెప్పేది ఏముంది. క్యాప్షన్ గా ఒక ఇంగ్లీష్ లైన్ పెట్టి చేతులు దులిపేసుకుంటే సరిపోదుగా. బాలీవుడ్ ఈ ట్రెండ్ పాటించడం లేదు. వరుణ్ ధావన్ భేడియాని తోడేలుగా అనువదించారు. ఆడినా ఆడకపోయినా భాషకిచ్చే గౌరవం అది. కానీ తమిళ డబ్బింగులు మాత్రం మరీ అన్యాయంగా ప్రవర్తిస్తూ టైటిల్ చివర ‘న్’ ఉంటే చాలు అదే పెట్టేస్తున్నారు.
ఏది ఏమైనా ఇది ఎంత మాత్రం సమర్ధనీయమైన పోకడ కాదు. ఒకవేళ అన్ని లాంగ్వేజెస్ లో ఒకే పేరు ఉండాలనుకున్నప్పుడు ఆర్ఆర్ఆర్ లాంటివి పెట్టుకోవడం ఉత్తమం. ఎలాంటి ఇబ్బంది లేదు. అంతేతప్ప అర్థం కానీ ఒరిజినల్ వెర్షన్ టైటిల్ నే కొనసాగించడం సబబు కాదు. క్రమంగా ఈ పోకడని అలవాటు చేయడం వల్ల తెలుగు బాషా ప్రేమికులు సైతం ఇదో సమస్యే కాదన్నట్టు ఊరుకుంటున్నారు. ఎక్కడిదాకో ఎందుకు ఇండియన్ 2ని మన దగ్గర భారతీయుడు 2 అని ఎందుకు అన్నారు. ఏతావాతా తేలేదేమంటే నిజంగా మార్చాలని ఉంటే అవకాశం ఉంది కానీ కావాలనే వాడుకోవడం లేదు.
This post was last modified on September 17, 2024 3:14 pm
కొంతమంది కొన్నిసార్లు ఇట్టే ఫేమస్ అయిపోతారు. సాదాసీదా జీవితాలే అయినప్పటికీ.. ఓవర్ నైట్ సెలబ్రిటీగా మారిపోతుంటారు. అలాంటి కోవలోకే వస్తారు…
హైదరాబాద్ రూపురేఖలు మారిపోతున్నాయి. గతానికి భిన్నంగా దేశంలోని మెట్రోపాలిటిన్ నగరాల్లో కొన్నింటిని మించిపోయిన భాగ్యనగరి.. మరికొన్ని మహానగరాల దూకుడుకు ఏ…
ఏపీలో మహిళలకు ముఖ్యమంత్రి చంద్రబాబు దీపావళి బొనాంజా ప్రకటించారు. ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల సమయంలో ఇచ్చిన…
తిరుమల శ్రీవారి పవిత్ర ప్రసాదం లడ్డూపై సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు.. రాజకీయంగా మంటపుట్టించాయి. చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ…
రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన రెండు కీలక వ్యవస్థలను ప్రభుత్వ శాఖల్లో కలిపేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జగన్ హయాంలో…
ఒక అపార్టుమెంట్ లోని పార్కింగ్ వద్ద చోటు చేసుకున్న పంచాయితీ ఏకంగా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వరకు వెళ్లటం…