జయం రవి తమిళంలో చెప్పుకోదగ్గ స్టారే అయినప్పటికీ తెలుగులో మార్కెట్ లేదు. పొన్నియిన్ సెల్వన్ లో టైటిల్ రోల్ పోషించాక మనకు కాస్త దగ్గరయ్యాడు. నిన్న తన భార్య ఆర్తితో విడిపోతున్నానని చెబుతూ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ సంచలనం రేపిన సంగతి తెలిసిందే.
18 సంవత్సరాలుగా కలిసి ఉంటున్న జీవిత భాగస్వామితో తప్పనిసరి పరిస్థితుల్లో విడాకులు తీసుకోక తప్పడం లేదని చెప్పడం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే కోలీవుడ్ లో ఈ జంటకు మంచి పేరుంది. క్యూట్ కపుల్ గా పలు సందర్భాల్లో మీడియాలో హైలైట్ అవుతూ వచ్చింది.
ఇప్పుడో కొత్త ట్విస్టు వచ్చింది. జయం రవి భార్య ఆర్తి అసలు తనకు ఈ విషయమే తెలియదని, తనకు, పిల్లలకు చెప్పకుండా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం బాధ కలిగించిందని, భర్తతో మాట్లాడేందుకు కొంతకాలంగా ప్రయత్నిస్తున్నా సాధ్యపడటం లేదని పేర్కొంటూ ఒక సుదీర్ఘమైన మెసేజ్ పోస్ట్ చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
నన్ను తప్పుగా చూపించడం అన్యాయమంటూ కొన్ని మీడియా సంస్థలు, ఫ్యాన్స్ అసోసియేషన్లు ట్విట్టర్ లో బురద జల్లడాన్ని ఇన్ డైరెక్ట్ గా ప్రస్తావించింది. మీ ప్రేమ చూపించండి తప్ప మా గోప్యతని బజారుకీడ్చవద్దంటూ విజ్ఞప్తి చేసింది.
దీనికి జయం రవి ఎలా స్పందిస్తాడో కానీ ఆర్తి ఇలా చేయడం మాత్రం పెద్ద షాకే. జయం రవి పేరుకి తమిళ హీరో అయినా అతని కుటుంబానికి టాలీవుడ్ తో చాలా బంధం ఉంది. తండ్రి ఎడిటర్ మోహన్ ఒకప్పుడు హిట్లర్, మామగారు, బావ బావమరిది లాంటి బ్లాక్ బస్టర్స్ నిర్మించాడు.
అన్నయ్య మోహన్ రాజా డైరెక్టర్ గా డెబ్యూ చేసింది హనుమాన్ జంక్షన్ తో. మొన్న ఏడాది చిరంజీవి గాడ్ ఫాదర్ తో దర్శకుడిగా రీ ఎంట్రీ ఇచ్చాడు. రామ్ చరణ్ ధృవ ఒరిజినల్ వెర్షన్ తీసింది కూడా ఈయనే. మొత్తానికి పొన్నియిన్ సెల్వన్ గా తెరమీద చెలరేగిన జయం రవికి రియల్ లైఫ్ లో మాత్రం మలుపులు ఎదురవుతున్నాయి.
This post was last modified on September 11, 2024 12:21 pm
వచ్చే ఎన్నికల్లోనూ కూటమి విజయం సాధిస్తుందన్న బలమైన సంకేతాలు వస్తున్నాయి. నాయకులు చెప్పడమే కాదు.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న కొన్ని ఆన్లైన్…
ఒకపక్క ఇరుముడి విరగాడేస్తోంది. వీకెండ్ టికెట్లు దొరక్క అల్లాడిపోతున్న ప్రేక్షకులు లక్షల్లో ఉన్నారు. ఇచ్చిన థియేటర్లు సరిపోక వేరే సినిమాలవి…
నిన్న హైదరాబాద్ లో జరిగిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సౌండ్ బార్ల మీద కూర్చున్న…
సోషల్ మీడియా రాను రాను మరీ సెన్సిటివ్ గా, టాక్సిక్ గా మారిపోతోంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ…
రాయ్ పూర్ లోని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పరీక్షా పేపర్ లీకేజి వ్యవహారం ఇప్పుడు…
పార్టీలు బలంగా ఉండాలంటే.. సమాజంలోని పలు వర్గాల మద్దతు అవసరం. నాయకులు, అధినేతలు ఎంత బలంగా ఉన్నా.. సమాజంలోని వర్గాలు…